భారత జీడీపీకి ‘మహిళా’ మెరుపు! | Boost to the economy with womans | Sakshi
Sakshi News home page

భారత జీడీపీకి ‘మహిళా’ మెరుపు!

Jan 22 2018 12:44 AM | Updated on Jan 22 2018 12:44 AM

Boost to the economy with womans - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో పని ప్రదేశాల్లో పురుషులతో సమానంగా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచితే అది ఆ దేశ జీడీపీని 27 శాతం అధికం చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ చీఫ్‌ క్రిస్టీన్‌ లగార్డ్, నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌ అన్నారు. దావోస్‌లో సోమవారం ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వీరు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

మహిళలపై వివక్షకు, వేధింపులకు కాలం చెల్లిందన్నారు. మహిళల సాధికారత ఈ ఏడాది సదస్సులో ప్రధాన అంశంగా ఉండనుంది. మహిళల పట్ల గౌరవ భావం, అపార అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని వీరు పేర్కొన్నారు.

ఈ ఏడాది సదస్సులో సుమారు 3,000 మంది ప్రముఖులు పాల్గొంటుండగా, అందులో 21% మహిళలే. వీరిలో లగార్డ్, సోల్‌బెర్గ్‌తోపాటు మన దేశానికి చెందిన మహిళా ఉద్యమకర్త చేతన సిన్హా కూడా ఉన్నారు. అలాగే, మన దేశ ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా అనేకమంది దిగ్గజాలు సదస్సుకు హాజరవుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement