3 నైట్స్‌/4 డేస్‌... ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ | IRCTC Offers 3 Nights/4 Days Tour Package Starting At Rs 5400 | Sakshi
Sakshi News home page

3 నైట్స్‌/4 డేస్‌... ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ

Published Wed, Apr 25 2018 5:06 PM | Last Updated on Wed, Apr 25 2018 5:06 PM

IRCTC Offers 3 Nights/4 Days Tour Package Starting At Rs 5400 - Sakshi

కాచిగుడ : తిరుమల తిరుపతి వెంకటేశుని దర్శించుకోవాలని చాలా మందికి ఎంతో ఆశగా ఉంటుంది. ఈ దేవుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌ నుంచి వెంకటేశుని దర్శించుకోవడానికి వెళ్లాలనుకునే వారికి దేశీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ఓ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ ప్రకటించింది. కాచిగుడా నుంచి రూ.5400 ప్రారంభ ధరకు నాలుగు రోజుల టూర్‌ ప్యాకేజీ ప్రారంభమవుతుందని ట్వీట్‌ ద్వారా తెలియజేసింది. బాలాజి దేవస్థానంతో పాటు ఆ పక్కనే దగ్గరిలో ఉన్న కాణిపాక వినాయక దేవాలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వంటివి ఈ ప్యాకేజీలో భాగంగా దర్శించుకుని రావచ్చట. మూడు రోజులు, నాలుగు రోజులు కలిగిన ఈ టూర్‌ ప్యాకేజీ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ‘వెంకటాద్రి’ పేరుతో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ టూర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలిపింది.  
‘వెంకటాద్రి’ టూర్‌ ప్యాకేజీ వివరాలు...

  • ఈ టూర్‌ ప్యాకేజీలో కవర్‌ చేసే గమ్యస్థలం తిరుపతి.
  • ట్రైన్‌, రోడ్డు మార్గన ప్రయాణానికి ఈ ప్యాకేజీ వర్తిస్తుంది.
  • ప్రతి శుక్రవారం రాత్రి 8.05లకు కాచిగుడ రైల్వే స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరుతుంది.
  • 3 ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ టిక్కెట్లు ఈ ఆఫర్‌ కింద అందుబాటులో ఉంటాయి.
  • స్టాండర్డ్‌ క్లాస్‌ కింద ఒక్కో వ్యక్తి ఈ టూర్‌ ఖర్చు రూ.5750 అవుతుంది. కంపోర్ట్‌ క్లాస్‌ కింద టూర్‌ ఖర్చు ఒక్కో వ్యక్తికి రూ.9038 అవుతుంది. 
  • యాత్రికులు/పర్యాటకులందరూ కూడా తమ వెంట ఒరిజినల్‌ ఐడీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్‌ ఐడీ కార్డులు చూపించకపోతే, టీటీడీ సిబ్బంది భక్తులను వెంకటేశుడి దర్శనానికి అనుమతించరు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement