ఎల్‌ఐసీ నుంచి కొత్త ఎండోమెంట్ పాలసీ | lic introduce New endowment policy | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ నుంచి కొత్త ఎండోమెంట్ పాలసీ

Published Wed, Dec 10 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

ఎల్‌ఐసీ నుంచి కొత్త ఎండోమెంట్ పాలసీ

ఎల్‌ఐసీ నుంచి కొత్త ఎండోమెంట్ పాలసీ

ప్రభుత్వరంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కొత్త ఎండోమెంట్ పాలసీని ప్రవేశపెట్టింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కొత్త ఎండోమెంట్ పాలసీని ప్రవేశపెట్టింది. ‘లిమిటెడ్ పీరియడ్ ఎండోమెంట్ ప్లాన్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకానికి పరిమిత కాలానికి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ పాలసీ 12, 16, 21 ఏళ్ల కాలపరిమితిలో లభిస్తోంది. పాలసీదారుని అవసరానికి అనుగుణంగా ఇందులో ఒక కాలపరిమితిని ఎంచుకుంటే ప్రీమియంను 8 లేదా 9 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించే కాలపరిమితిని పాలసీదారుడే నిర్ణయించుకోవచ్చు. కనీస బీమా మొత్తాన్ని రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. ఆపైన రూ. 10,000 గుణిజాల్లో గరిష్టంగా ఎంత మొత్తమైనా తీసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 62 ఏళ్లలోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.

ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 21 ఏళ్లకు పాలసీ తీసుకొని ప్రీమియం చెల్లించే కాలపరిమితిని 8 ఏళ్లుగా ఎంచుకుంటే రూ. 3 లక్షల పాలసీకి రూ. 23,865, అదే తొమ్మిదేళ్లు ఎంచుకుంటే రూ.21,795లు చెల్లించాల్సి ఉంటుంది. తొమ్మిదేళ్లలో సుమారు రూ. 1.96 లక్షలు ప్రీమియం కింద చెల్లిస్తే పాలసీ కాలపరిమితి తర్వాత కనిష్టంగా నాలుగు శాతం రాబడి ప్రకారం చూస్తే సుమారుగా రూ. 3 లక్షలు, అదే గరిష్టంగా 8 శాతం రాబడి ప్రకారం చూస్తే రూ. 5.30 లక్షలు వచ్చే అవకాశం ఉంది. తక్కువ కాలం ప్రీమియం చెల్లించి దీర్ఘకాలం బీమా రక్షణ కావాలనుకునే వారికి ఈ పాలసీ అనువుగా ఉంటుందని ఎల్‌ఐసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రధాన పాలసీకి కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా యాక్సిడెంటల్ బెనిఫిట్, టర్మ్ అష్యూరెన్స్ రైడర్లను పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement