వర్చువల్‌ ఐడీలతో ఇక మొబైల్‌ కనెక్షన్‌ | Mobile connection with virtual IDs | Sakshi
Sakshi News home page

వర్చువల్‌ ఐడీలతో ఇక మొబైల్‌ కనెక్షన్‌

Jun 14 2018 12:38 AM | Updated on Jun 14 2018 12:38 AM

Mobile connection with virtual IDs - Sakshi

న్యూఢిల్లీ: కస్టమర్ల ఆధార్‌ నంబర్‌ స్థానంలో వర్చువల్‌ ఐడీల స్వీకరణకు వీలుగా తమ వ్యవస్థలను మెరుగుపరచుకోవాలని ప్రభుత్వం టెలికం కంపెనీలకు సూచించింది. అలాగే, పరిమిత కేవైసీ యంత్రాంగానికి మళ్లాలని కోరింది. జూలై 1 నుంచి నూతన వర్చువల్‌ ఐడీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. ఆధార్‌ నంబర్‌కు బదులు ఆధార్‌కు సంబంధించిన వర్చువల్‌ ఐడీలను కస్టమర్లు చెబితే సరిపోతుంది.

ఓ వ్యక్తి ఆధార్‌ నంబర్‌కు 16 అంకెల ర్యాండమ్‌ నంబర్‌ను కేటాయిస్తారు. ఆధార్‌ రూపంలో వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం దీన్ని ఆచరణలోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో టెల్కోలు ఆధార్‌ ఈకేవైసీ ధ్రువీకరణ స్థానంలో నూతన వర్చువల్‌ ఐడీ, పరిమిత ఈ–కేవైసీ ఆధారంగా కొత్త కనెక్షన్ల జారీ, చందాదారుల రీవెరిఫికేషన్‌కు అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement