
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ రెండు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు ఆమోదం తెలిపింది. దేవీ సీ ఫుడ్స్, ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ ఐపీఓలకు పచ్చజెండా ఊపటంతో ఈ ఏడాది సెబీ ఆమోదం పొందిన ఐపీఓల సంఖ్య 18కు చేరింది.
దేవీ సీఫుడ్స్: విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.900 కోట్ల రేంజ్లో ఉండొచ్చు. ఐపీఓలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు కొంత వాటా షేర్లను విక్రయిస్తారు. 1992లో ఆరంభమైన ఈ కంపెనీ సీఫుడ్ను (ముఖ్యంగా రొయ్యలు) ఎగుమతి చేస్తోంది.
ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.500 కోట్లని అంచనా. ఐపీఓలో భాగంగా 76.65 లక్షల షేర్లను ఆపర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఆఫర్ చేయనున్నది. 1970లో ప్రారంభమైన ఈ కంపెనీ ఆహార పదార్ధాలు, ప్లాస్టిక్స్, రబ్బర్లు, పెయింట్స్, ఇంక్లు, కాస్మోటిక్స్, కోటింగ్స్, ల్యూబ్స్ తదితర ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలను తయారు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment