IPOs
-
ఈ వారం 2 ఐపీవోలు.. 10 లిస్టింగ్లు
ఈ వారం రెండు కొత్త ఐపీవోలు ప్రారంభం కానుండగా, మెయిన్బోర్డ్, ఎస్ఎంఈ విభాగంలో కలిపి 10 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ కానున్నాయి. మెయిన్ బోర్డ్లో 17న అజాక్స్ ఇంజనీరింగ్, 19న హెక్సావేర్ టెక్నాలజీస్, 21న క్వాలిటీ పవర్ లిస్ట్ కానున్నాయి. ఎస్ఎంఈ కంపెనీ హెచ్పీ టెలికామ్ ఐపీవో 20న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ధర రూ.108. ప్రమోటర్లే 34.28 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో యాపిల్ ఉత్పత్తులను ఈ సంస్థ పంపిణీ చేస్తుంటుంది. సివిల్ కన్స్ట్రక్షన్ కార్యకలాపాల్లోని బీజాసాన్ ఎక్స్ప్లోటెక్ అనే మరో ఎస్ఎంఈ ఐపీవో 21న మొదలు కానుంది. 34.24 లక్షల తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో కంపెనీ రూ.60 కోట్లు సమీకరించాలనుకుంటోంది. -
లాభాల ‘ఆఫర్లు’.. క్యూకట్టిన ఇన్వెస్టర్లు
సరిగ్గా మూడేళ్ల తదుపరి మళ్లీ ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. భారీ లాభాలతో కళకళలాడాయి. ఈ క్యాలండర్ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను (IPO) చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ (Record) కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్స్థాయిలో క్యూకట్టారు. ఫలితంగా లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలవగా.. 17 మాత్రం నష్టాలతో ముగిశాయి.వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ మరుగున పడింది. ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీస్థాయిలో పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, సులభతర లావాదేవీల నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో అధిక శాతం కంపెనీలు లాభాలతో లిస్టయ్యి ఇన్వెస్టర్ల ఆసక్తిని మరింత పెంచాయి.వెరసి కొత్త ఏడాది (2025)లోనూ మరిన్ని కొత్త రికార్డులకు వీలున్నట్లు మార్కెట్నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క ఎస్ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది!భారీ ఇష్యూల తీరిలా... 2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai IPO)రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా భారీ ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ (Swiggy IPO) రూ. 11,327 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజినీర్స్, బీఎల్ఎస్ ఈసర్వీసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి.మరింత స్పీడ్ డిసెంబర్ చివరి వారంలో స్పీడ్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల ప్యాకేజింగ్ మెషినరీ తయారీ కంపెనీ మమతా మెషినరీ లిస్టింగ్లో ఇష్యూ ధర రూ.243తో పోలిస్తే 147% ప్రీమియంతో రూ.600 వద్ద నమోదైంది. రూ.630 వద్ద ముగిసింది. ఈ బాటలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఎంఏ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇష్యూ ధర రూ.283తో పోలిస్తే 39% అధికంగా రూ.393 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 61% ఎగసి రూ.457 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 47% లాభంతో రూ.415 వద్ద స్థిరపడింది.విద్యుత్ ప్రసారం, పంపిణీల ఈపీసీ కంపెనీ ట్రాన్స్రైల్ లైటింగ్ షేరు ఇష్యూ ధరరూ.432తో పోలిస్తే 35% ప్రీమియంతో రూ.585 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 40% ఎగసి రూ.604 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 28% లాభంతో రూ.553 వద్ద ముగిసింది. విభిన్న యార్న్ తయారీ సనాతన్ టెక్స్టైల్స్ ఇష్యూ ధర రూ.321తో పోలిస్తే 31% అధికంగా రూ.419 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 31% పెరిగి రూ.423 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 21% లాభంతో రూ.389 వద్ద స్థిరపడింది.వాటర్ ప్రాజెక్టుల కంపెనీ కంకార్డ్ ఎన్విరో ఇష్యూ ధర రూ.701తో పోలిస్తే 19% అధికంగా రూ.832 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 23% ఎగసి రూ.860 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 18% లాభంతో రూ.828 వద్ద స్థిరపడింది. సోమవారం(30న) వెంటివ్ హాస్పిటాలిటీ, సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్, కారారో ఇండియా లిస్ట్కానుండగా.. 31న యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ నమోదుకానుంది. -
ఐపీవో బూమ్!
స్టాక్ మార్కెట్లో ఐపీఓలు దుమ్ముదులిపేస్తున్నాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్నాయి. కేవలం లిస్టింగ్ మాత్రమే కాదు బంపర్ లాభాలతో ఇన్వెస్టర్లను రారమ్మని ఊరిస్తున్నాయి. ఈ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్ స్థాయిలో క్యూ కట్టారు. వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ బ్రేక్ అయింది.ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూసినప్పటికీ ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సెన్సెక్స్ (బీఎస్ఈ) తొలిసారి సెపె్టంబర్ 27న 85,978 పాయింట్లకు చేరగా.. నిఫ్టీ (ఎన్ఎస్ఈ) 26,277ను తాకింది. ఈ బాటలో ఐపీవో మార్కెట్ మరింత కళకళలాడింది. ప్రధాన విభాగంలో ఏకంగా 91 కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగాయి. తద్వారా మొత్తం రూ. 1,60,500 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇందుకు ఆరి్థక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీగా పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, లావాదేవీల సులభతర నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో పలు ఐపీవోలకు గరిష్ట స్థాయిలో బిడ్డింగ్ లభించగా.. లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలిచాయి. 17 మాత్రమే నష్టాలతో ముగిశాయి. భారీ ఇష్యూల తీరిలా... 2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ రూ. 11,327 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజనీర్స్, బీఎల్ఎస్ ఈసరీ్వసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి. వచ్చే ఏడాదీ మెరుపుల్... సెబీకి దాఖలైన 89 కంపెనీల ఐపీవో దరఖాస్తుల ప్రకారం 2025లో రూ. 2.5 లక్షల కోట్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా. వీటిలో ఇప్పటికే 34 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. ఈ జాబితాలో రిలయన్స్ జియో, ఎన్ఎస్ఈ ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా, టాటా క్యాపిటల్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్తోపాటు ఫ్లిప్కార్ట్, హీరో ఫిన్కార్ప్, ఎన్ఎస్డీఎల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, కెనరా రోబెకో, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ వంటివి . దీంతో కొత్త ఏడాది ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయనే ఆసక్తి నెలకొంది!సగటు పరిమాణం అప్...ఈ ఏడాది చిన్న, మధ్యతరహా, భారీ కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగాయి. దీంతో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,700 కోట్లను దాటింది. 2023లో ఇది కేవలం రూ. 867 కోట్లుగా నమోదైంది. ఏడాది చివరి నెల (డిసెంబర్)లోనూ 15 కంపెనీలు ఐపీవోలకు రాగా.. సెకండరీ మార్కెట్లో నికర అమ్మకందారులుగా నిలుస్తూనే విదేశీ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కట్టడం విశేషం! ఈ నెల 24 వరకూ ముగిసిన 90 ఇష్యూల ద్వారా అన్లిస్టెడ్ కంపెనీలు రూ.1.6 లక్షల కోట్లను సమీకరించాయి.సోమవారం (23న) ప్రారంభమైన యూనిమెక్ ఏరోస్పేస్ మరో రూ. 500 కోట్లు అందుకోనుంది. గతేడాది (2023)లో 57 కంపెనీలు రూ. 49,436 కోట్లు మాత్రమే సమీకరించాయి. ఈ బాటలో మరోపక్క ఎస్ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది! -
పబ్లిక్ ఆఫర్ల వెల్లువ!
న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఏడు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇష్యూల ద్వారా కంపెనీలు దాదాపు రూ. 12,000 కోట్లు సమీకరించనున్నాయి. సెబీ ఆమోదం పొందిన వాటిల్లో ఈకామ్ ఎక్స్ప్రెస్, స్మార్ట్వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్, ట్రూఆల్ట్ బయోఎనర్జీ, ఇంట్రర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ (ఐజీఐ), కెరారో ఇండియా, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. ఇవి ఈ ఏడాది ఆగస్టు–సెపె్టంబర్ మధ్య తమ ముసాయిదా పత్రాలను సమరి్పంచగా, నవంబర్ 26–29 మధ్య సెబీ.. అబ్జర్వేషన్లను జారీ చేసింది. సెబీ పరిభాషలో అబ్జర్వేషన్ల ను ఐపీవో ప్రతిపాదనకు ఆమోదంగా పరిగణిస్తారు. ఐజీఐ.. 4,000 కోట్లుఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవో ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం రూ. 1,250 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్లో భాగమైన ప్రమోటరు, బీసీపీ ఆసియా టూ టాప్కో రూ. 2,750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. సహజసిద్ధమైన వజ్రాలు, ల్యాబ్లో రూపొందించిన వజ్రాలు మొదలైన వాటికి సరి్టఫికేషన్ సేవలను ఐజీఐ అందిస్తోంది. ఇతర కంపెనీల వివరాలు.. ⇒ గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈకామ్ ఎక్స్ప్రెస్ రూ. 1,284.50 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు..ఇతర షేర్హోల్డర్లు రూ. 1,315.50 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. ⇒ బ్లాక్స్టోన్ గ్రూప్, పంచశీల్ రియల్టీ సంస్థల జాయింట్ వెంచర్ అయిన వెంటివ్ హాస్పిటాలిటీ ప్రతిపాదిత ఐపీవో పూర్తిగా కొత్త షేర్ల జారీ రూపంలో ఉండనుంది. సంస్థకు భారత్, మాల్దీవుల్లో బిజినెస్, లీజర్ విభాగాల్లో ఆతిథ్య రంగ లగ్జరీ అసెట్స్ ఉన్నాయి. వెంటివ్లో పంచశీల్కు 60 శాతం, బ్లాక్స్టోన్కు మిగతా 40 శాతం వాటాలు ఉన్నాయి. ⇒ స్మార్ట్వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్ కొత్తగా షేర్ల జారీ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించనుండగా, ప్రమోటర్లు 67.59 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. ⇒ కెరారో ఇండియా రూ. 1,812 కోట్లు సమీకరించేందుకు ఐపీవో తలపెట్టింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం సెల్లింగ్ షేర్హోల్డరయిన కెరారో ఇంటర్నేషనల్ సంస్థ.. తమ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది. కెరారో ఇండియా 1997లో ఏర్పాటైంది. ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, యాక్సిల్స్ తయారీతో కార్యకలాపాలు ప్రారంభించింది. ⇒ బయోఫ్యుయెల్ తయారీ దిగ్గజం ట్రూఆల్ట్ బయోఎనర్జీ ప్రతిపాదిత ఐపీవో ఇటు కొత్త షేర్ల జారీ, అటు ఓఎఫ్ఎస్ రూపంలో ఉండనుంది. రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు 36 లక్షల షేర్లను విక్రయించనున్నారు. బెంగళూరుకు చెందిన ట్రూఆల్ట్ బయోఎనర్జీ ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది.రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 1,400 కిలోలీటర్లుగా ఉంది⇒ ఎని్వరాన్మెంటల్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ తలపెట్టిన ఇష్యూలో భాగంగా రూ. 192.3 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. ప్రమోటర్లు, ఇన్వెస్టరు.. ఓఎఫ్ఎస్ కింద 51.94 లక్షల షేర్లను విక్రయించనున్నారు. 2025లో జెప్టో ఐపీవో...క్విక్కామర్స్ దిగ్గజం జెప్టో వచ్చే ఏడాది (2025) పబ్లిక్ ఇష్యూకి వచ్చే వీలున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్ పాలిచా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల 35 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,950 కోట్లు) సమీకరణతో జెప్టో పూర్తిస్థాయిలో దేశీ కంపెనీగా ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు సమకూర్చడం దీనికి కారణమని తెలియజేశారు. కంపెనీ నికర లాభాలు ఆర్జించే బాటలో సాగుతున్నట్లు వెల్లడించారు. క్విక్కామర్స్ విధానాలు సంప్రదాయ కిరాణా స్టోర్ల వృద్ధిని దెబ్బతీస్తున్నట్లు వెలువడుతున్న ఆరోపణలను కొట్టిపారేశారు. -
ఐపీవోలు.. అదే స్పీడ్
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతూనే ఉన్నాయి. వచ్చే నెల(డిసెంబర్)లో 10 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా ఉమ్మడిగా రూ. 20,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. ఈ జాబితాలో సూపర్మార్ట్ దిగ్గజం విశాల్ మెగా మార్ట్తోపాటు.. బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న డైమండ్ గ్రేడింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ జెమ్మలాజికల్ ఇన్స్టిట్యూట్(ఇండియా), విద్యారుణాలందించే ఎన్బీఎఫ్సీ అవాన్సే ఫైనాన్షియల్ సరీ్వసెస్, టీపీజీ క్యాపిటల్ సంస్థ సాయి లైఫ్ సైన్సెస్, ఆసుపత్రుల చైన్ పారస్ హెల్త్కేర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డీఏఎం క్యాపిటల్ అడ్వయిజర్స్, డయాగ్నోస్టిక్ చైన్ సురక్షా, ప్యాకేజింగ్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ మమతా మెషినరీ, ట్రాన్స్రైల్ లైటింగ్ ఉన్నాయి.వివిధ రంగాలు, విభిన్న పరిమాణంలో కంపెనీలు నిధుల సమీకరణ బాటలో సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలు స్టాక్ మార్కెట్లో సానుకూల సెంటిమెంటుకు తెరతీయనున్నట్లు ఆన్లైన్ బ్రోకరేజీ ట్రేడ్జినీ సీవోవో త్రివేష్.డి. అభిప్రాయపడ్డారు. దీంతో ప్రైమరీ మార్కెట్ మరింత కళకళలాడే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ ఏడాది(2024) ఐపీవోలకు అత్యంత ప్రోత్సాహకరంగా సాగినప్పటికీ ఇటీవల కొంతమేర ప్రతికూల ధోరణి నెలకొన్నట్లు తెలియజేశారు. ఇష్యూల వివరాలు విశాల్ మెగా మార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రమోటర్ సమయత్ సరీ్వసెస్ ఎల్ఎల్పీ వాటాను విక్రయించనుంది. ఇక జెమ్మలాజికల్ ఇన్స్టిట్యూట్ రూ. 4,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. దీనిలో భాగంగా రూ. 1,250 కోట్లు తాజా ఈక్విటీ జారీసహా.. రూ. 2,750 కోట్ల విలువైన షేర్లను బ్లాక్స్టోన్ సంస్థ, ప్రమోటర్ బీసీపీ ఏషియా–2 టాప్కో పీటీఈ ఆఫర్ చేయనుంది. కాగా.. వార్బర్గ్ పింకస్ సంస్థ ఒలివ్ వైన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేసిన అవాన్సే ఫైనాన్షియల్ రూ. 3,500 కోట్లు సమీకరించనుంది. తాజా ఈక్విటీ ద్వారా రూ. 1,000 కోట్లు, ప్రస్తుత వాటాదారుల షేర్ల విక్రయం ద్వారా రూ. 2,500 కోట్లు అందుకోనుంది. ఈక్విటీ నిధులను మూలధన పటిష్టతకు వెచి్చంచనుంది. రికార్డ్ సమీకరణ ఈ ఏడాది ఇప్పటికే 75 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. ఇది రికార్డ్ కాగా.. జాబితాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్రెయిన్బీస్ సొల్యూషన్స్(ఫస్ట్క్రై), ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ చేరాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా గతేడాది(2023)లో 57 కంపెనీలు రూ. 49,436 కోట్లు సమకూర్చుకున్నాయి. సుమారు 236 కంపెనీలు 2021–25 మధ్య కాలంలో ఐపీవోలకు వచ్చాయి. సగటున 27 శాతం లిస్టింగ్ లాభాలను అందించడం గమనార్హం.సురక్ష: రూ. 420–441 సమీకృత డయాగ్నోస్టిక్ చైన్ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూ శుక్రవారం(29న) ప్రారంభంకానుంది. డిసెంబర్ 3న ముగియనున్న ఇష్యూకి రూ. 420–441 ధరల శ్రేణిని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు 1,91,89,330 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 846 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే ఈక్విటీ జారీ లేనందున ఇష్యూ ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు లభించబోవు. -
4 ఐపీవోలకు సెబీ ఓకే.. లిస్ట్లో హైదరాబాదీ కంపెనీ
న్యూఢిల్లీ: దాదాపు రూ. 3,000 కోట్ల సమీకరణకు సంబంధించి నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయి లైఫ్ సైన్సెస్, రూబికాన్ రీసెర్చ్, సనాతన్ టెక్స్టైల్స్, మెటల్మ్యాన్ ఆటో వీటిలో ఉన్నాయి. ఇవి జూలై–ఆగస్టు మధ్యకాలంలో తమ ముసాయిదా ఐపీవో పత్రాలను సెబీకి సమర్పించాయి. అక్టోబర్ 31న సెబీ ఆమోదం లభించింది.హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రమోటరు, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు, ఇతరత్రా షేర్హోల్డర్లు 6.15 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 600 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపునకు, మిగతా నిధులను కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు .. ఔషధాల ఫార్ములేషన్ కంపెనీ రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 585 కోట్లు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్ విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్కు రూబీకాన్ రీసెర్చ్లో 57 శాతం పైగా వాటాలు ఉన్నాయి. ఐపీవో నిధుల్లో రూ. 310 కోట్ల మొత్తాన్ని, రుణాల చెల్లింపు కోసం, మిగతాది ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం రూబీకాన్ వినియోగించుకోనుంది.మరోవైపు, సనాతన్ టెక్స్టైల్స్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 300 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నాయి. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 210 కోట్ల మొత్తాన్ని .. అనుబంధ సంస్థ సనాతన్ పాలీకాట్కి సంబంధించి దీర్ఘకాలిక మూలధన అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే రూ. 175 కోట్లను రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించుకోనుంది.అటు మెటల్మ్యాన్ ఆటో సంస్థ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ విధానంలో ప్రమోటర్లు 1.26 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 25 కోట్ల మొత్తాన్ని మధ్యప్రదేశ్లోని పిథంపూర్లో 2వ యూనిట్లో యంత్రపరికరాల కొనుగోలు తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. -
మెగా ఐపీఓ వేవ్!
స్టాక్ మార్కెట్లో బుల్ రంకెల నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 62 కంపెనీలు దాదాపు రూ.64,513 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాయి. ఇందులో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 6,550 కోట్లు), ఫస్ట్క్రై (రూ. 4,194 కోట్లు), ఓలా ఎలక్ట్రిక్ (రూ.6,146 కోట్లు), డిజిట్ ఇన్సూరెన్స్ (2,165 కోట్లు) తదితర దిగ్గజాలున్నాయి. గతేడాది మొత్తంమీద 57 కంపెనీలు కలిపి రూ.49,436 కోట్ల నిధులను మార్కెట్ నుంచి దక్కించుకున్నాయి. దీంతో పోలిస్తే ఈ ఏడాది 29 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, మరో 75 కంపెనీలు రూ.1.5 లక్షల కోట్ల నిధుల వేట కోసం ఆవురావురుమంటూ వేచిచూస్తున్నాయి. ఇందులో 23 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీకి ఇప్పటికే సెబీ ఇప్పటికే ఓకే చెప్పగా... తాజాగా విశాల్ మెగామార్ట్, ఆక్మే సోలార్, మమతా మెషినరీకి కూడా ఆమోదం లభించింది. సెబీ లైన్ క్లియర్ చేసిన ఐపీఓల విలువ దాదాపు రూ.72,000 కోట్లు! మిగా 53 కంపెనీలు రూ.78 వేల కోట్ల నిధుల సమీకరణ బాటలో ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. కాగా, రూ. 1,19,882 కోట్ల నిధుల సమీకరణతో 2021 ఏడాది అత్యధిక ఐపీఓల రికార్డును దక్కించుకుంది. మార్కెట్ రికార్డు పరుగుల నేపథ్యంలో మూడేళ్ల తర్వాత పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆమోదం లభించినవి డిసెంబర్లోపు గనుక ఐపీఓలను పూర్తి చేసుకుంటే 2024 గత రికార్డును బ్రేక్ చేసే చాన్సుంది!! -
ఈ వారం ఐపీఓల ఇన్వెస్టర్లకు పండగే
-
దిగ్గజ ఐపీవోలకు ఓకే.. సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హెల్త్కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీలూ 2023 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. రూ. 5,500 కోట్లకు రెడీ ఐపీవో ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రూ. 5,500 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధులలో అత్యధిక శాతాన్ని సామర్థ్య విస్తరణ, సెల్ తయారీ ప్లాంట్, ఆర్అండ్డీపై పెట్టుబడులకు వినియోగించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. రూ. 1,226 కోట్లు సెల్ తయారీ యూనిట్కు, రూ. 1,600 కోట్లు ఆర్అండ్డీకి, మరో రూ. 800 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. ఇక బెయిన్ క్యాపిటల్కు పెట్టుబడులున్న ఎమ్క్యూర్ ఫార్మా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.ఆఫీసర్స్ చాయిస్ @ రూ. 267–281 ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 267–281 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,000 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయాలి. -
Tata Group: ఇన్వెస్టర్లకు పండగే.. టాటా గ్రూప్ నుంచి వరుస ఐపీఓలు
-
IPOs in 2024: కోట్లు కురిపిస్తాయా? కొత్త ఏడాదిలో ఊరిస్తున్న ఐపీవోలు ఇవే..
ఈ ఏడాది మరికొన్ని రోజల్లో ముగిసిపోతోంది. కొత్త ఏడాది కోసం ప్రతిఒక్కరూ నూతన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సామాన్యులే కాదు మార్కెట్ వర్గాలు, మదుపర్లు, కంపెనీలు కొత్త సంవత్సరంపై ‘కోట్ల’ ఆశలు పెట్టుకున్నాయి. నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, భారతీయ ప్రైమరీ మార్కెట్లు 2023లో మొత్తంగా విజయాన్ని సాధించాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులు 2022 సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు ఎక్కువగానే మార్కెట్కి వచ్చాయి. 2023లో మొత్తంగా 57 ఇష్యూలు క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. అంతకుముందు ఏడాది కంటే ఇవి 40 పెరిగాయి. అయితే సేకరించిన మొత్తం నిధులు మాత్రం గతేడాది కంటే 17 శాతం తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీవోలలో సేకరించిన తాజా మూలధనం వాటా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రానున్న ఏడాదిలో రూ. 28,440 కోట్ల విలువైన ఇష్యూలు పబ్లిక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్స్చేంజ్ డేటా, నివేదికలు, మార్కెట్ ఊహాగానాల ఆధారంగా 2024లో అత్యధికంగా ఎదురుచూస్తున్న ఐపీవోలు ఇవే.. ఓలా ఎలక్ట్రిక్ : 700 నుంచి 800 మిలియన్ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సఫలమైతే కంపెనీ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఫోన్పే: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్పే 2024-2025లో ఐపీవో కోసం చూస్తోంది. వాల్మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్ల మూలధనాన్ని అందుకున్న అనంతరం దీని విలువ 12 బిలియన్ డాలర్లకు చేరింది. ఐపీవో ద్వారా 2 బిలియన్ డాలర్ల మేర నిధులు సేకరించాలని భావిస్తోంది. ఆకాష్: బైజూస్ అనుబంధ సంస్థ అయిన ఎడ్టెక్ మేజర్ 2024 మధ్య నాటికి ఐపీవోకి రావాలని యోచిస్తోంది. బైజూస్ కొన్న ఆకాష్ ఆదాయంలో మూడు రెట్లు పెరుగుదల కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,000 కోట్ల ఆదాయం, రూ.900 కోట్ల ఎబీటాకి చేరుకుంటుందని అంచనా. ఓయో రూమ్స్: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐపీవో ఇది. కంపెనీ రుణాల చెల్లింపుపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో చాలా ఆలస్యమైంది. ఇప్పటికే ఐపీవో కోసం దాఖలు చేసినప్పటికీ తర్వాత తన పబ్లిక్ లిస్టింగ్ ఇష్యూ పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించి మళ్లీ ఫైల్ చేసింది. ఫార్మ్ ఈజీ: టాటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఇటీవల రైట్స్ ఇష్యూలో రూ.3,950 కోట్లకు పైగా సమీకరించింది. ఈ పనితీరు ఇలాగే కొనసాగితే పబ్లిక్ ఇష్యూకి వస్తుందని భావిస్తున్నారు. మొబీక్విక్: డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్తో కలిసి సుమారు 84 మిలియన్ డాలర్ల సేకరించే లక్ష్యంతో ఐపీవో వస్తోంది. గతంలోనే ఐపీవో రావాలని భావించినా ఆ ప్రణాళికలను వాయిదా వేసుకుని ఇప్పుడు 2024లో లిస్టింగ్కు వస్తోంది. పేయూ ఇండియా: ఇది కూడా 2024 ద్వితీయార్ధం నాటికి ఐపీవోకి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రోసస్ యాజమాన్యంలో పేయూ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశ కార్యకలాపాల ద్వారా 211 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్విగ్గీ: ఫుడ్ డెలివరీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీ అయిన స్విగ్గీ 2024లో పబ్లిక్కి వచ్చే అవకాశం ఉంది. 10.7 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ పబ్లిక్ మార్కెట్లలోకి దూసుకుపోతే, జొమాటో తర్వాత అలా చేసిన రెండవ ఫుడ్ అగ్రిగేటర్ అవుతుంది. -
రికార్డు స్థాయిల్లో స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలకు చేరడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఇదే వారంలో 11 కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన తరుణంలో మార్కెట్ వర్గాలు పబ్లిక్ ఇష్యూలపై కన్నేయోచ్చు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘అధిక వాల్యుయేషన్లు, ఎల్నినో ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక మందగమనం పరిణామాల నేపథ్యంలో స్వల్ప కాలం పాటు స్టాక్ సూచీలు రికార్డు స్థాయిల వద్ద స్థిరీకరణకు లోనవచ్చు. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 21,700 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,000 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లు స్థిరీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21500 – 21600 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సానుకూలతలు, ఫెడ్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన అమలు యోచన, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు నమోదు నేపథ్యంలో గతవారం సూచీలు 2.32% ర్యాలీ చేశాయి. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయం, యరోజోన్ నవంబర్ ద్రవ్యల్బోణ డేటా డిసెంబర్ 19న(మంగళవారం) విడుదల కానున్నాయి. అదే రోజున భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సలి్టంగ్ సంస్థ యాక్సెంచర్ ఆర్థిక సంవత్సరం 2024 తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. జపాన్ నవంబర్ వాణిజ్య లోటు, బ్రిటన్ నవంబర్ ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్ అక్టోబర్ కరెంట్ ఖాతా, అమెరికా నవంబర్ గృహ అమ్మకాలు బుధవారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రస్తుత సంవత్సరపు మూడో క్వార్టర్ జీడీపీ డేటా గురువారం వెలువడుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ ద్రవ్యోల్బణం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్ క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల అవుతాయి. కీలక ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు మార్కెట్ వర్గాలు అప్రమత్తత వహించే వీలుంది. ప్రథమార్థంలో రూ.29,700 కోట్ల కొనుగోళ్లు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్ ప్రథమార్థంలో రూ.27,000 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘మూడు ప్రధాన రాష్ట్రాల్లో అధికార పార్టీ బీజేపీ గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే అంచనాలు, మెరుగైన ఆర్థిక వృద్ధి, మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ సరళతర ద్రవ్య విధాన అమలు యోచనలు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లను ప్రోత్సహించాయి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీప్ హెడ్ విజయకుమార్ తెలిపారు. ముఖ్యంగా ఐటీ, ఇన్ఫ్రా, పారిశ్రామిక రంగాల షేర్లను కొనుగోళ్లు చేశారు. రానున్న రోజుల్లో లాభాల స్వీకరణకు పాల్పడొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 12 పబ్లిక్ ఇష్యూలు 8 లిస్టింగులు ఈ వారంలో ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు 12 కంపెనీలు తొలి పబ్లిక్ ఆఫర్కు రానున్నాయి. ఇందులో ప్రధాన విభాగం(8 కంపెనీలు)తో పాటు చిన్న మధ్య తరహా స్థాయి(4 కంపెనీలు) విభాగానికి చెందినవి ఉన్నాయి. ముత్తూట్ మైక్రో ఫిన్, మోతీసన్స్ జ్యువెలర్స్, సురజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీఓలు సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తాయి. హ్యాపి ఫోర్జ్, ఆర్బీజెడ్ జ్యువెలర్స్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఐపీఓలు డిసెంబర్ 19–21 మధ్య జరగునున్నాయి. అజాద్ ఇంజనీరింగ్స్ పబ్లిక్ ఇష్యూ 20–22 తేదీల్లో, ఇన్నోవా క్యాప్ట్యాబ్ ఐపీఓ 21–26 తేదీల్లో జరగనుంది. ఎస్ఎంఈ విభాగం నుంచి సహారా మారిటైం, శాంతి స్పిన్టెక్స్, ఎలక్ట్రో ఫోర్స్, ట్రిడెంట్ టెక్ల్యాబ్లు కంపెనీలు ఐపీఓకు సిద్ధమయ్యాయి. డోమ్స్ ఇండస్ట్రీస్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీల షేర్లు బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐనాక్స్ ఇండియా లిస్టింగ్ గురువారం ఉంది. చిన్న మధ్య తరహా స్థాయి విభాగం నుంచి 5 కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. -
IPO: పబ్లిక్ ఇష్యూల జోరు! 5 కంపెనీలు.. రూ. 4,200 కోట్లు
న్యూఢిల్లీ: మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఈ వారం ఏకంగా ఐదు కంపెనీలు ఇన్షీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇండియా షెల్టర్ ఫైనాన్స్, డోమ్స్ ఇండస్ట్రీస్, ఐనాక్స్ ఇండియా, మోతిసన్స్ జ్యుయలర్స్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి సుమారు రూ. 4,200 కోట్ల పైచిలుకు సమీకరించనున్నాయి. గత నెల 10 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు విజయవంతమైన నేపథ్యంలో తాజా ఐపీవోలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా గ్రూప్ నుంచి 2004 తర్వాత (టీసీఎస్) దాదాపు ఇరవై ఏళ్లకు వచ్చిన టాటా టెక్నాలజీస్ ఇష్యూకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ఆఖరు వరకు మొత్తం మీద 44 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 35,000 కోట్లు సమీకరించాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు, లిస్టింగ్ లాభాలు పటిష్టంగా ఉండటం వంటి అంశాల కారణంగా గత కొద్ది వారాలుగా ఐపీవో మార్కెట్ బాగా సందడిగా ఉందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్ రావు చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా పాలనపరమైన స్థిరత్వాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు, తద్వారా మార్కెట్కు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఐపీవోలు ఇవీ.. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ (ఐఎస్ఎఫ్), డోమ్స్ ఇండస్ట్రీస్ ఇష్యూలు డిసెంబర్ 13–15 మధ్య ఉండనున్నాయి. ఇవి రెండూ చెరి రూ. 1,200 కోట్లు సమీకరించనున్నాయి. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కొత్తగా రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. షేరు ధర శ్రేణి రూ. 469–493గా ఉండనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. మరోవైపు, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, రూ. 850 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనుంది. ఐపీవో ధర శ్రేణి రూ. 750–790గా ఉంటుంది. క్రయోజెనిక్ స్టోరేజ్ ట్యాంకుల తయారీ సంస్థ ఐనాక్స్ సీవీఏ పూర్తిగా ఓఎఫ్ఎస్ కింద 2.21 కోట్ల షేర్లను విక్రయించి రూ. 1,459 కోట్లు సమీకరించనుంది. షేరు ధర శ్రేణి రూ. 627– 660గా ఉంటుంది. నిధులను కంపెనీతో పాటు అనుబంధ సంస్థలైన ఎకార్డ్ ఎస్టేట్స్, ఐకానిక్ ప్రాపర్టీ డెవలపర్స్, స్కైలైన్ రియల్టీ రుణాల చెల్లింపునకు, స్థల సమీకరణ మొదలైన అవసరాలకు వినియోగించుకోనుంది. ఐనాక్స్ ఇ ష్యూ డిసెంబర్ 14న ప్రారంభమై 18న ముగుస్తుంది. 17 ఏళ్ల క్రితం ఐనాక్స్ లీజర్ (మలీ్టప్లెక్స్ విభాగం) ఐపీవోకి వచ్చాక ఐనాక్స్ గ్రూ ప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రా వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఐనాక్స్ లీజర్.. పీవీఆర్ గ్రూప్లో భాగంగా ఉంది. 1992లో ఏ ర్పాటైన కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలోరూ. 980 కోట్ల ఆదాయంపై రూ. 152 కోట్ల నికర మార్జిన్ నమోదు చేసింది. మూడు ప్లాంట్లు ఉండగా, నాలుగో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మోతీసన్స్ జ్యుయలర్స్ 2.74 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను జారీ కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు ఇష్యూలు డిసెంబర్ 18న ప్రారంభమై 20న ముగుస్తాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడులు, రుణాల చెల్లింపు మొదలైన అవసరాల కోసం ఈ సంస్థలు వినియోగించుకోనున్నాయి. -
IPOs: మరో రికార్డ్ దిశగా.. 28 కంపెనీలు.. రూ.38 వేల కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) లోనూ ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. తొలి అర్ధభాగం (ఏప్రిల్–సెప్టెంబర్) లో 31 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకురాగా.. ద్వితీయార్థంలోనూ 28 కంపెనీలు నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. తద్వారా రూ.38,000 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికలు ప్రకటించాయి. వివరాలు చూద్దాం.. ముంబై: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఐపీవోల ద్వారా 31 కంపెనీలు రూ. 26,300 కోట్లు సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. సెకండాఫ్లో మరింత అధికంగా నిధుల సమీకరణకు తెరలేవనుంది. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం మరో 41 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. తద్వారా ఏకంగా రూ. 44,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. నిజానికి గతేడాది(2022–23) తొలి అర్ధభాగంతో పోలిస్తే ఇష్యూలు 14 నుంచి 31కు జంప్ చేసినప్పటికీ నిధుల సమీకరణ రూ. 35,456 కోట్ల నుంచి రూ. 26,300 కోట్లకు తగ్గింది. లిస్టింగ్ సన్నాహాలలో ఉన్న మొత్తం 69 కంపెనీలలో మూడు కొత్తతరం సాంకేతిక సంస్థలుకాగా.. ఉమ్మడిగా రూ. 12,000 కోట్ల సమీకరణపై కన్నేసినట్లు ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా వెల్లడించారు. గతంలో జోరుగా ఈ ఏడాది తొలి అర్ధభాగం(సెప్టెంబర్)లో న్యూటెక్ సంస్థ యాత్రా మాత్రమే లిస్టయ్యింది. రూ.775 కోట్లు సమీకరించింది. అయితే గతేడాది దిగ్గజాలు పేటీఎమ్, జొమాటో, నైకా లిస్ట్కావడం గమనార్హం! ప్రస్తుతం మార్కెట్లు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ద్వితీయార్థంలో పలు కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు హాల్దియా అభిప్రాయపడ్డారు. సుమారు రెండు దశాబ్దాల తదుపరి టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ లిస్ట్కానుంది. ఇంతక్రితం 2004లో బాంబే హౌస్ కంపెనీ.. ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకి వచ్చిన విషయం విదితమే. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ కంపెనీ టాటా టెక్నాలజీస్ హై ఎండ్ టెక్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఆటోమోటివ్ ఈఆర్అండ్డీ సర్వీసులు సమకూర్చుతున్న కంపెనీ ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ టాటా మోటార్స్ 8.11 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నట్లు అంచనా. ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్లలోనే అత్యధికంగా 21 కంపెనీలు ఐపీవోలు చేపట్టాయి. వీటిలో మ్యాన్కైండ్ ఫార్మా రూ.4,326 కోట్లు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.2,800 కోట్లు, ఆర్ఆర్ కేబుల్ రూ.1,964 కోట్లు సమీకరించాయి. అతితక్కువగా ప్లాజా వైర్స్ రూ. 67 కోట్లు అందుకుంది. ఓయో భారీగా ఆతిథ్య రంగ సేవలందించే ఓయో రూముల బ్రాండ్ కంపెనీ ఒరావెల్ స్టేస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 8,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ బాటలో టాటా టెక్నాలజీస్, జేఎన్కే ఇండియా, డోమ్ ఇండస్ట్రీస్, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, ఈప్యాక్ డ్యురబుల్స్, బీఎల్ఎస్ ఈ సర్వీసెస్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సెల్లో వరల్డ్, ఆర్కే స్వామి, ఫ్లెయిర్ రైటింగ్ ప్రొడక్ట్స్, గో డిజిట్ ఇన్సూరెన్స్, క్రెడో బ్రాండ్ మార్కెటింగ్ తదితరాలున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ పేర్కొంది. -
ఐపీవోకు మూడు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్లిస్టెడ్ కంపెనీలకు జోష్నిస్తున్నాయి. దీంతో తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇండో ఫామ్ ఎక్విప్మెంట్, విభోర్ స్టీల్ ట్యూబ్స్, సరస్వతీ శారీ డిపో.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. తద్వారా నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు అనుమతిని కోరుతున్నాయి. ఇండో ఫామ్ ఐపీవోలో భాగంగా ఇండో ఫామ్ ఎక్విప్మెంట్ 1.05 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 35 లక్షల షేర్లను సైతం కంపెనీ ప్రమోటర్ రణ్బీర్ సింగ్ ఖడ్వాలియా విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పిక్ అండ్ క్యారీ క్రేన్ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు పెట్టుబడులుగా వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, ఎన్బీఎఫ్సీ అనుబంధ సంస్థ బరోటా ఫైనాన్స్కు మూలధనాన్ని సమకూర్చేందుకు సైతం వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా ట్రాక్టర్లు, పిక్ అండ్ క్యారీ క్రేన్లతోపాటు ఇతర వ్యవసాయ సంబంధ పరికరాలను తయారు చేస్తోంది. విభోర్ స్టీల్ వివిధ భారీ ఇంజినీరింగ్ పరిశ్రమల్లో వినియోగించే స్టీల్ పైపులు, ట్యూబుల తయారీ, ఎగుమతుల కంపెనీ విభోర్ స్టీల్ ట్యూబ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 66.47 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. నిధులను వర్కింగ్ క్యాపిటల్సహా.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. సరస్వతీ శారీ మహిళా దుస్తుల టోకు మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించే సరస్వతీ శారీ డిపో ఐపీవోలో భాగంగా 72.45 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వీటికి జతగా మరో 35.55 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. చీరలతోపాటు కుర్తీ, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాలు తదితర మహిళా దుస్తుల హోల్సేల్ బిజినెస్నూ కంపెనీ నిర్వహిస్తోంది. -
ఐపీవోల జోరు
ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టవుతున్నాయి. పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో ఇష్యూలు విజయవంతంకావడంతోపాటు.. పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంటార్ స్పేస్ ఐపీవో బుధవారం ప్రారంభంకానుండగా.. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇష్యూ ముగియనుంది. మరోవైపు మరో రెండు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఎస్ఈ ఎమర్జ్లో.. కోవర్కింగ్ కార్యాలయ సంస్థ కాంటార్ స్పేస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 93 ధరను ప్రకటించింది. బుధవారం(27న) ప్రారంభంకానున్న ఇష్యూ అక్టోబర్ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా 16.8 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 15.62 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్కానుంది. ఇష్యూ నిధులను కొత్త వర్కింగ్ కేంద్రాల అద్దె డిపాజిట్ల చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2018లో ఏర్పాటైన కంపెనీ 46,000 చదరపు అడుగులకుపైగా వర్కింగ్ స్పేస్లను నిర్వహిస్తోంది. థానే, పుణే, బీకేసీలలో 1,200 సీట్లను కలిగి ఉంది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మౌలిక సదుపాయాల రంగ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోకు రెండో రోజు మంగళవారానికల్లా 2.13 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 13,62,83,186 షేర్లను ఆఫర్ చేయగా.. 29,02,18,698 షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 3.7 రెట్లు, రిటైలర్లు 4.5 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 55 శాతమే బిడ్స్ లభించాయి. షేరుకి రూ. 113–119 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం ద్వారా రూ. 1,260 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ నిధుల్లో ప్రధానంగా రూ. 800 కోట్లు రుణ చెల్లింపులు, ఎల్పీజీ టెర్మినల్ ప్రాజెక్టు పెట్టుబడులకు రూ. 866 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రెండు కంపెనీలు రెడీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు రెండు కంపెనీలను అనుమతించింది. ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లాజిస్టిక్స్ సంస్థ వెస్టర్న్ క్యారియర్స్(ఇండియా) లిమిటెడ్ నిధుల సమీకరణకు సెబీ గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో కోసం ఈ ఏడాది మే, జూన్లలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఫిన్కేర్ ఎస్ఎఫ్బీ ఐపీవోలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.7 కోట్ల షేర్లను ప్రమోటర్సహా ఇతర ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 పెట్టుబడులకు కేటాయించనుంది. ఇక వెస్టర్న్ క్యారియర్స్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ఇష్యూలో భాగంగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 93.29 లక్షల షేర్లను ప్రమోటర్ రాజేంద్ర సేథియా ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వాప్కోస్ వెనకడుగు కన్సల్టెన్సీ, ఈపీసీ, కన్స్ట్రక్షన్ సర్వి సుల పీఎస్యూ.. వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూని విరమించుకుంది. ప్రభుత్వం వాటా విక్రయించే యోచనలో ఉన్న కంపెనీ ఐపీవో చేపట్టేందుకు గతేడాది సెప్టెంబర్ 26న సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఈ నెల 21న ఇష్యూని విరమించుకున్నట్లు సెబీకి నివేదించింది. అయితే ఇందుకు కారణాలు తెలియరాలేదు. ఇష్యూలో భాగంగా తొలుత ప్రమోటర్ అయిన ప్రభుత్వం 3,25,00,000 షేర్లను విక్రయించాలని భావించింది. జల్ శక్తి నియంత్రణలోకి కంపెనీ 2021–22లో రూ. 2,798 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 69 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
వైభవ్ జెమ్స్, కంకార్డ్ బయోటెక్ ఐపీవోలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: విశాఖపట్టణం కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్తోపాటు రేర్ ఎంటర్ప్రైజెస్కు పెట్టుబడులున్న కంకార్డ్ బయోటెక్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆగస్ట్లో కంకార్డ్, సెప్టెంబర్లో వైభవ్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. ఇతర వివరాలు చూద్దాం.. వైభవ్ జెమ్స్ బంగారు ఆభరణాల విక్రేత వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 210 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ గ్రంధి భారత మల్లికా రత్న కుమారి(హెచ్యూఎఫ్) 43 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 12 కోట్లను 8 కొత్త షోరూముల ఏర్పాటుకు వినియోగించనుంది. రెండేళ్లపాటు ఇన్వెంటరీ కొనుగోలుకి మరో రూ. 160 కోట్లు కేటాయించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వెచ్చించనుంది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలను కంపెనీ విక్రయిస్తోంది. అంతేకాకుండా విశేష బ్రాండు ద్వారా ప్రీమియం జ్యువెలరీని అందిస్తోంది. కంకార్డ్ బయోటెక్ ఫెర్మంటేషన్ ఆధారిత బయోఫార్మాస్యూటికల్ ఏపీఐల తయారీ కంపెనీ కంకార్డ్ బయోటెక్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా పీఈ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్కు చెందిన హెలిక్స్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ రూ. 2.09 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంకార్డ్లో దివంగత రాకేశ్ జున్జున్వాలా, ఆయన భార్య రేఖ ఏర్పాటు చేసిన రేర్ ఎంటర్ప్రైజెస్కు సైతం పెట్టుబడులున్నాయి. కంపెనీ ప్రధానంగా అంకాలజీ, యాంటీఫంగల్, యాంటీబాక్టీరియల్ తదితర ప్రత్యేక విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గుజరాత్లో మూడు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 2022 మార్చికల్లా కంపెనీ 56 బ్రాండ్లతో 65 ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిలో 22 ఏపీఐలు, 43 ఫార్ములేషన్లు ఉన్నాయి. వీటికి అదనంగా వివిధ దేశాలలో 120 డీఎంఎఫ్లను దాఖలు చేసింది.వైభవ్ జెమ్స్ ఐపీవోకు ఓకేకంకార్డ్ బయోటెక్కూ సెబీ అనుమతి -
ఆర్కియన్ కెమ్ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: స్పెషాలిటీ మెరైన్ రసాయనాల తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. రూ. 386–407 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 32 రెట్లు అధిక స్పందన లభించింది. కంపెనీ 1.99 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 64.31 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల నుంచి 49 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 15 రెట్లు అధికంగా బిడ్స్ లభించగా.. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 10 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. 11న ముగిసిన ఇష్యూ ద్వారా రూ. 1,462 కోట్లకుపైగా సమకూర్చుకుంది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 658 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 805 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.61 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయించారు. తాజా ఈక్విటీ నిధులను కంపెనీ జారీ ఎన్సీడీల చెల్లింపునకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా బ్రోమైన్, ఇండస్ట్రియల్ సాల్ట్, పొటాష్ సల్ఫేట్ తయారీతోపాటు, ఎగుమతులను సైతం చేపడుతోంది. -
మళ్లీ ఐపీవోల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నప్పటికీ కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ 8 కంపెనీలు ఐపీవో బాట పట్టగా.. తాజాగా రెండు కంపెనీలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో మూడు సంస్థలు లిస్టింగ్కు సన్నాహాలు ప్రారంభించాయి. ఇందుకు అనుగుణంగా సెబీ వద్ద ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిక్ ఇష్యూ ఆలోచనకు స్వస్తి పలుకుతున్నట్లు స్టెరిలైట్ పవర్, ముక్కా ప్రొటీన్ పేర్కొనడం గమనార్హం. వివరాలు చూద్దాం.. డెల్టాటెక్ రెడీ రియల్ మనీ గేమింగ్ విభాగంలో తొలి దశలోనే కార్యకలాపాలు విస్తరించిన డెల్టాటెక్ గేమింగ్కు తాజాగా సెబీ నుంచి అనుమతి లభించింది. మే నెలలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను లిస్టెడ్ ప్రమోటర్ సంస్థ డెల్టా కార్ప్ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 150 కోట్లను బిజినెస్ విస్తరణకు వినియోగించనుంది. మరో రూ. 50 కోట్లు టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేటాయించనుంది. ప్రిస్టీన్.. సై ప్రధానంగా రైల్ రవాణా నెట్వర్క్కు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయ సర్వీసులందించే ప్రిస్టీన్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిస్టింగ్ కోసం జూన్లో సెబీని ఆశ్రయించింది. తాజాగా ఇందుకు అనుమతి లభించింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 2 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, కంపెనీలోని ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ కంటెయినర్, నాన్కంటెయినర్ తదితర వివిధ రైల్, రోడ్ రవాణా సంబంధ వివిధ సర్వీసులు అందిస్తోంది. ఎయిరాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 750 కోట్లు సమీకరించేందుకు అనుమతించమంటూ ఎయిరాక్స్ టెక్నాలజీస్ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ప్రమోటర్లు సంజయ్ భరత్కుమార్ జైస్వాల్(రూ. 525 కోట్లు), ఆషిమా సంజయ్ జైస్వాల్(రూ. 225 కోట్లు) విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. కంపెనీ ప్రధానంగా పీఎస్ఏ ఆక్సిజన్ జనరేటర్లను తయారు చేస్తోంది. ప్రయివేటరంగ పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ మార్కెట్లో కంపెనీ 50–55 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2022 మార్చికల్లా దేశీయంగా దాదాపు 872 స్థాపిత పీఎస్ఏ ఆక్సిజన్ జనరేటర్లు నిర్వహణలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీకి అనువైన మెషీనరీ, విడిభాగాలు రూపొందించే కాన్పూర్ కంపెనీ.. లోహియా కార్ప్ ఐపీవో చేపట్టేందుకు సెబీని ఆశ్రయించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా దాదాపు 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, శాక్స్ తయారు చేసేందుకు వీలైన మెషీనరీని ప్రధానంగా రూపొందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో 2,000 మంది కస్టమర్ల బేస్ను కలిగి ఉంది. గతేడాది(2021–22)లో ఆదాయం రూ. 1,334 కోట్ల నుంచి రూ. 2,237 కోట్లకు జంప్ చేసింది. నికర లాభం రూ. 119 కోట్ల నుంచి రూ. 161 కోట్లకు ఎగసింది. ఐకియో ఐపీవోకు లెడ్ లైటింగ్ సొల్యూషన్స్ అందించే ఐకియో లైటింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 237 కోట్లు సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్కు, కొత్త యూని ట్ ఏర్పాటుకు వినియోగించనుంది. మరో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. కంపెనీ నాలుగు తయారీ యూనిట్లను కలిగి ఉంది. స్టెరిలైట్ పవర్ గతేడాది(2021) ఆగస్ట్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసిన ప్రయివేట్ రంగ కంపెనీ స్టెరిలైట్ పవర్ సందిగ్ధంలో పడింది. రూ. 1,250 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసిన కంపెనీ ప్రస్తుత ఆటుపోట్ల పరిస్థితుల్లో ఇష్యూ చేపట్టడం సరికాదని భావిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఐపీవోను వాయిదా వేసేందుకు నిర్ణయించుకున్నట్లు విద్యుత్ ప్రసారం, మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ తాజాగా వెల్లడించింది. వెరసి ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకోనున్నట్లు తెలియజేసింది. అయితే మార్కెట్లు కుదురుకుంటే భవిష్యత్లో సెబీకి తిరిగి ప్రాథమిక పత్రాలను దాఖలు చేయనున్నట్లు వివరించింది. ముక్కా ప్రొటీన్ ఈ ఏడాది మార్చిలో సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన ముక్కా ప్రొటీన్ వెనకడుగు వేసింది. తాజాగా ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. చేపల ఆహారం, చేప నూనె, ఆక్వా, పౌల్ట్రీ రంగాలలో ఫీడ్గా వినియోగించే ఫిష్ సొల్యూబ్ పేస్ట్ తదితరాలను కంపెనీ ప్రధానంగా తయారు చేస్తోంది. సబ్బుల తయారీ, లెదర్, పెయింట్ల పరిశ్రమల్లోనూ కంపెనీ ప్రొడక్టులను ఉపయోగిస్తారు. -
28 ఐపీవోలు .. రూ. 45,000 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)ల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచ్చింది. వీటిలో 11 సంస్థలు ఇప్పటికే రూ. 33,254 కోట్లు సమీకరించాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్దే (రూ. 20,557 కోట్లు) ఉంది. ఏప్రిల్–మే నెలల్లోనే చాలా సంస్థలు ఐపీవోకి వచ్చాయి. మే తర్వాత పబ్లిక్ ఇష్యూలు పూర్తిగా నిల్చిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో తగిన సమయం కోసం పలు సంస్థలు వేచి చూస్తున్నాయని మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు తెలిపాయి. వీటిలో చాలా మటుకు కంపెనీలు రోడ్షోలు కూడా పూర్తి చేశాయని ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రావు చెప్పారు. ఐపీవోలకు అనుమతులు పొందిన సంస్థలలో ఫ్యాబ్ఇండియా, భారత్ ఎఫ్ఐహెచ్, టీవీఎస్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, మెక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్, కిడ్స్ క్లినిక్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. సెంటిమెంట్ డౌన్: గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) 52 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1.11 లక్షల కోట్లు సమీకరించాయి. కొత్త తరం టెక్నాలజీ స్టార్టప్ల ఇష్యూలపై ఆసక్తి నెలకొనడం, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పాలుపంచుకోవడం, లిస్టింగ్ లాభాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే, ప్రస్తుతం సెకండరీ మార్కెట్ భారీగా కరెక్షన్కు లోను కావడం, పేటీఎం.. జొమాటో వంటి డిజిటల్ కంపెనీల పనితీరు ఘోరంగా ఉండటం, ఎల్ఐసీ వంటి దిగ్గజం లిస్టింగ్లో నిరాశపర్చడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ వివరించారు. క్యూలో మరిన్ని కంపెనీలు. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ .. ఐపీవో ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు గత రెండు నెలలుగా కంపెనీలు క్యూ కడుతుండటం గమనార్హం. జూన్–జూలైలో మొత్తం 15 కంపెనీలు సెబీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సూలా విన్యార్డ్స్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సాయి సిల్క్ కళామందిర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న నగరాల్లో అద్భుతంగా రా>ణించిన వ్యాపార సంస్థల ప్రమోటర్లు ఇప్పుడు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ముందుకు వస్తున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎండీ అభిజిత్ తారే తెలిపారు. త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా నమోదవుతుండటం, ఆర్థిక డేటా కాస్త ప్రోత్సాహకరంగా కనిపిస్తుండటం తదితర అంశాలు, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సహేతుకమైన ధరతో వచ్చే కంపెనీల ఐపీవోలకు సానుకూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. -
'మా వాటా మేం అమ్మేస్తున్నాం'..జొమాటోకు మరో షాక్!
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్..దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్ను అమ్మేందుకు ఉబర్ సిద్ధమైంది. 7.8 శాతం వాటాల అమ్మకంతో ఉబర్కు రూ.3,305 కోట్ల వస్తాయని అంచనా వేస్తుంది. తక్కువలో తక్కువ డీల్ పరిమాణం రూ.2,938.6 కోట్లు ఉండనుంది. భారత్లో ఉబర్ తన ఫుడ్ డెలివరీ విభాగమైన ఉబెర్ ఈట్స్ను జొమాటోకు అమ్మేసింది. ఆ సమయంలో ఉబర్..జొమాటోలో వాటాను కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్టాక్ లావాదేవీ డీల్ విలువ రూ.1,376 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆ స్టేక్ను ఉబర్ అమ్మేయడంతో ఉబర్కు కనీసం 2.5శాతం లాభం పొందవచ్చని భావిస్తోంది. పోటీ పడుతున్న అమెరికన్ కంపెనీలు జొమాటోలో ఉన్న తన వాటాను ఆగస్ట్ 5కి క్లోజ్ చేయాలని ఉబర్ భావిస్తుంది. ఈ తరుణంలో జొమాటోలోని తన షేర్లను ఉబర్ ఎవరికి అమ్మేస్తుందని అంశంపై టర్మ్ షీట్లో వెల్లడించలేదు. అయినప్పటికీ ఉబర్ అమ్మే 7.8% వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన అనేక మంది సంస్థాగత పెట్టుబడిదారులు పోటీ పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వెయ్యి కోట్లు లాస్ జొమాటో ప్రీ-ఐపీవో వాటాదారులకు ఒక సంవత్సరం లాక్ ఇన్ పీరియడ్ జులై 23న ముగిసింది. లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన వారం తర్వాత ఉబర్ తన జొమాటోలోని తన వాటాల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత మార్కెట్ ప్రారంభమైన జులై 25 ఒక్కరోజే జొమాటో సుమారు వెయ్యి కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. -
ఐపీవో తర్వాత,తొలిసారి ఎల్ఐసీ కొత్త ప్లాన్..అదేంటో తెలుసా?
హైదరాబాద్: జీవిత బీమా పరిశ్రమలో అదిపెద్ద కంపెనీ అయిన ఎల్ఐసీ కొత్తగా బీమా రత్న పేరుతో ఒక ప్లాన్ను తీసుకొచ్చింది. మే 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీలతో సంబంధం లేని), నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవిత బీమాతో కూడిన ప్లాన్ అని ఎల్ఐసీ తెలిపింది. ఇందులో పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించడం, మనీ బ్యాక్ ప్లాన్, గ్యారంటీడ్ అడిషన్ సదుపాయాలు ఉన్నాయి. 15, 20, 25 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. వీటిల్లో ఎంపిక చేసుకున్న ప్లాన్ కాల వ్యవధికి నాలుగేళ్లు ముందు వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 15 ఏళ్ల కాలానికి ప్లాన్ తీసుకుంటే 11 ఏళ్లు ప్రీమియం చెల్లింపుల టర్మ్ ఉంటుంది. పాలసీదారు జీవించి ఉంటే పాలసీ ప్లాన్ గడువు ముగిసే చివరి రెండు సంవత్సరాల్లో ఏటా 25 శాతం బేసిక్ సమ్ అష్యూర్డ్ వెనక్కి వస్తుంది. గడువు తీరిన తర్వాత మిగిలిన 50 శాతం సమ్ అష్యూర్డ్ (బీమా)తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ను ఎల్ఐసీ చెల్లిస్తుంది. ఈ ప్లాన్ను కనీసం రూ.5 లక్షల కవరేజీ, అంతకంటే ఎక్కువకు తీసుకోవచ్చు. పాలసీపై రుణం తీసుకోవచ్చు. మరణ పరిహారం మొత్తాన్ని ఒకే విడత కాకుండా ఐదేళ్లపాటు తీసుకునే సదుపాయం కూడా ఉంది. చదవండి👉 చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
కంపెనీల ఐపీవోకి సెబీ గ్రీన్ సిగ్నల్, టార్గెట్ రూ.7వేల కోట్లు!
న్యూఢిల్లీ: లైఫ్స్టయిల్ రిటైల్ బ్రాండ్ ఫ్యాబ్ఇండియా, స్పెషాలిటీ కెమికల్ కంపెనీ ఏథర్ ఇండస్ట్రీస్ సహా మొత్తం ఏడు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, ఏషియానెట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్, సనాతన్ టెక్స్టైల్స్, క్యాపిలరీ టెక్నలజీస్ ఇండియా, హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలు దాదాపు రూ. 9,865 కోట్ల వరకూ నిధులు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇవి గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో దరఖాస్తు చేసుకున్నాయి. ఏప్రిల్ 27–30 మధ్యలో సెబీ అనుమతులు మంజూరు చేసింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) ప్రకారం ఫ్యాబ్ఇండియా .. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల వరకూ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.5 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనుంది. ఈ ఇష్యూ సుమారు రూ. 4,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అటు ఏథర్ ఇండస్ట్రీస్ ఆఫర్ ప్రకారం రూ. 757 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ మార్గంలో 27.51 లక్షల షేర్లను విక్రయించనుంది. మొత్తం మీద రూ. 1,000 కోట్ల వరకూ సమీకరించవచ్చని తెలుస్తోంది. మిగతా సంస్థలు.. ►ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏషియానెట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ రూ. 765 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, హాథ్వే ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ రూ. 465 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనుంది. ►ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల సంస్థ సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీస్ దాదాపు రూ. 1,000–1,200 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. రూ. 926 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్ వీణా కుమారి టాండన్ 33.69 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నారు. ► యార్న్ తయారీ సంస్థ సనాతన్ టెక్స్టైల్స్ ఐపీవో ద్వారా సుమారు రూ. 1,200–1,300 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల మేర కొత్త షేర్లు, ఓఎఫ్ఎస్ కింద 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ►ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూష న్స్ అందించే క్యాపిలరీ టెక్నాలజీస్ .. ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమకూర్చుకోనుంది. పబ్లిక్ ఇష్యూ కింద తాజాగా రూ. 200 కోట్ల విలువ చేసే షేర్లు, అలాగే ఓఎఫ్ఎస్ ద్వారా రూ. 650 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ►హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ రూ. 750 కోట్లు సమీకరిస్తోంది. రూ. 455 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రస్తుత షేర్హోల్డర్లు రూ. 300 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నారు. -
ఎల్ఐసీ ఐపీవో.. ఈ వారంలో కేంద్రం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టే అంశంపై ఈ వారంలో ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడే వీలున్నట్లు తెలుస్తోంది. మార్చి ముగిసేలోగా ఐపీవో పూర్తిచేయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో వాయిదా పడింది. ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించే యోచనలో ఉంది. తద్వారా బీమా దిగ్గజాన్ని స్టాక్ ఎక్ఛేంజీలో లిస్ట్ చేయాలని ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇష్యూకి మే 12వరకూ గడువు ఉంది. దీంతో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేయవలసిన అవసరంలేదని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఇష్యూని చేపట్టే అంశం క్లిష్టంగా మారినట్లు తెలియజేశారు. రిటైల్, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల డిమాండు సానుకూలంగా ఉన్నప్పటికీ ఎఫ్పీఐలు తిరిగి పెట్టుబడుల బాటలోకి మళ్లేవరకూ వేచిచూసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి👉 చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో సప్లై చైన్ కంపెనీ డెల్హివరీ, నగదు లాజిస్టిక్స్ కంపెనీ రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ చోటు చేసుకున్నాయి. డెల్హివరీ.. సప్లై చైన్ కంపెనీ డెల్హివరీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 7,460 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగం గా కంపెనీ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,460 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కార్లయిల్ గ్రూప్, సాఫ్ట్బ్యాంక్తోపాటు కంపెనీ సహవ్యవస్థాపకులు ఆఫర్ చేయనున్నారు. కంపెనీ 2021 నవంబర్లో సెబీకి దరఖాస్తు చేసింది. ప్రధానంగా కార్లయిల్ గ్రూప్ రూ. 920 కోట్లు, సాఫ్ట్బ్యాంక్ రూ. 750 కోట్లు విలువైన షేర్లను విక్రయించనున్నాయి. రేడియంట్ క్యాష్ క్యాష్ లాజిస్టిక్స్ సంస్థ రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి సెబీ క్లియరెన్స్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 3 కోట్ల షేర్లను ప్రమోటర్ డేవిడ్ దేవసహాయం, పీఈ సంస్థ ఎసెంట్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఆఫర్ చేయనున్నాయి. 2021 అక్టోబర్లో కంపెనీ సెబీకి దరఖాస్తు చేసింది. రేడియంట్లో ఎసెంట్ 37.2 శాతం వాటాను 2015లో కొనుగోలు చేసింది. వెరండా లెర్నింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులు, ఎడ్యురెకా కొనుగోలు అవసరాలు, వృద్ధి అవకాశాలకు వినియోగించనుంది. కంపెనీ 360 డిగ్రీ సమీకృత ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్గా సర్వీసులు సమకూర్చుతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ హైబ్రిడ్, ఆఫ్లైన్ బ్లెండెడ్ విధానాల్లో సేవలందిస్తోంది. -
2 ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: ఇటీవల స్టాక్ మార్కెట్లు కొంతమేర ఒడిదుడుకులు చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్ మాత్రం ఉత్సాహంతో కదం తొక్కుతోంది. తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా.. డేటా అనలిటిక్స్, ఇన్సైట్స్ సేవల కంపెనీ కోర్స్5 ఇంటెలిజెన్స్ తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వివరాలు చూద్దాం.. ఫైవ్స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఎన్బీఎఫ్సీ.. ఫైవ్స్టార్ బిజినెస్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా సెబీ నుంచి అనుమతిని పొందింది. టీపీజీ, మ్యాట్రిక్స్ పార్టనర్స్, నార్వెస్ట్ వెంచర్స్, సీక్వోయా, కేకేఆర్లకు పెట్టుబడులుగల కంపెనీ సెప్టెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,752 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఐపీవోలో భాగంగా ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా టీపీజీ ఏషియా 7 ఎస్ఎఫ్ పీటీఈ రూ. 1,350 కోట్లు, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ రూ. 569 కోట్లు, నార్వెస్ట్ వెంచర్ పార్టనర్స్ మారిషస్ రూ. 386 కోట్లు ఎస్సీఐ ఇన్వెస్ట్మెంట్స్ రూ. 257 కోట్లు, ప్రమోటర్ గ్రూప్ రూ. 181 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నాయి. మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్, సొంత ఆదాయం కలిగిన వ్యక్తులకు సెక్యూర్డ్ బిజినెస్ రుణాలను కంపెనీ అందిస్తుంటుంది. వారీ ఎనర్జీస్... సౌర ఇంధన రంగ కంపెనీ.. వారీ ఎనర్జీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా సెబీ నుంచి అనుమతిని పొందింది. కంపెనీ నవంబర్లో ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 1,350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 40 లక్షలకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తాజా ఈక్విటీ నిధుల్లో రూ. 1,162 కోట్లను 2 గిగావాట్ల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న సోలార్ సెల్ తయారీ యూనిట్తోపాటు, 1 జీడబ్ల్యూ వార్షిక సామర్థ్యంతో గుజరాత్లోని చిక్లీలో నెలకొల్పనున్న సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్కు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ఇప్పటికే సూరత్, టంబ్, నందిగ్రామ్లలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. ఐపీవోకు కోర్స్5 ఇంటెలిజెన్స్ డేటా అనలిటిక్స్, ఇన్సైట్స్ సేవల కంపెనీ కోర్స్5 ఇంటెలిజెన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నట్లు ప్రాస్పెక్టస్లో కంపెనీ పేర్కొంది. -
ఐపీవోకు మూడు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఈ క్యాలండర్ ఏడాదిలో సెకండరీ మార్కెట్లతో పోటీ పడుతున్న ప్రైమరీ మార్కెట్ పలు అన్లిస్టెడ్ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది 65 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా సుమారు రూ. 1.3 లక్షల కోట్లు సమీకరించాయి. ఈ బాటలో తాజాగా మరో మూడు సంస్థలు ఐపీవో బాట పట్టాయి. జాబితాలో స్పోర్ట్స్, అథ్లెటిక్ ఫుట్వేర్ కంపెనీ క్యాంపస్ యాక్టివ్వేర్, ట్రావెల్ సర్వీసుల సంస్థ టీబీవో టెక్ లిమిటెడ్, ఐటీ ఆధారిత సొల్యూషన్ల కంపెనీ ప్రొటియన్ ఈగోవ్ టెక్నాలజీస్ చేరాయి. ఈ మూడు కంపెనీలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతిని కోరుతూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా దరఖాస్తు చేశాయి. వివరాలు చూద్దాం.. క్యాంపస్ యాక్టివ్వేర్ స్పోర్ట్స్, అధ్లెస్యూర్ ఫుట్వేర్ విభాగంలో క్యాంపస్ బ్రాండును కలిగిన క్యాంపస్ యాక్టివ్వేర్ నిధుల సమీకరణ సన్నాహాలు ప్రారంభించింది. ఐపీవోలో భాగంగా 5.1 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు హరి కృష్ణ అగర్వాల్, నిఖిల్ అగర్వాల్కు సంయుక్తంగా 78.21 శాతం వాటా ఉంది. 2005లో ప్రారంభమైన క్యాంపస్ బ్రాండు విలువరీత్యా ఆర్గనైజ్డ్ మార్కెట్లో 15 శాతం వాటాను కలిగి ఉంది. టీబీవో టెక్ ట్రావెల్ సర్వీసుల కంపెనీ టీబీవో టెక్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 2,100 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు వీలుగా రూ. 900 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీని ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. తాజా ఈక్విటీ నిధులను వ్యూహాత్మక కొనుగోళ్లు, క్రయవిక్రయాల ప్లాట్ఫామ్ అభివృద్ధి, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్లో పేర్కొంది. ప్రొటియన్ ఈగోవ్ గతంలో ఎన్ఎస్డీఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా వ్యవహరించిన ప్రొటియన్ ఈగోవ్ టెక్నాలజీస్ నిధుల సమీకరణకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా పబ్లిక్ ఇష్యూ ద్వారా 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనుంది. 1995లో ప్రారంభమైన ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా గ్రీన్ఫీల్డ్ టెక్నాలజీ సొల్యూషన్లను అందిస్తోంది. ఐటీ ఆధారిత సేవల ఈ కంపెనీ జాతీయస్థాయిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్తతరహా ప్రజాసంబంధ ఈగవర్నెన్స్ సొల్యూషన్లు సమకూరుస్తోంది. -
మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? సోషల్ మీడియాతో జాగ్రత్త!!
పేటీఎం లిస్టింగ్ రోజున లోయర్ సర్క్యూట్ (ఆ రోజు అనుమతించిన మేరకు గరిష్ట పతనం)ను తాకడం చాలా మంది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు, పోస్ట్లతో తమ ఆందోళనను, కంగారును వ్యక్తం చేయడం చాలా మంది గమనించే ఉంటారు. ఇదే విషయమై ప్రముఖ ట్విట్టర్ హ్యాండిల్ ‘ఐపీవో మంత్ర’ నిర్వహిస్తున్న ఆర్కే గుప్తాకు వందలాది మెయిల్స్ వచ్చాయి. ‘‘దేశంలోనే పేటీఎం అతిపెద్ద ఐపీవో. కానీ, ఐపీవోను కంపెనీ సరైన విధంగా నిర్వహించలేకపోయింది. పెద్ద బ్రాండ్లు ఎప్పుడు కూడా పెద్ద రాబడులకు మార్గం కాబోవు. జాగ్రత్తగా ఉండాలని నేను ముందు నుంచే చెబుతున్నాను’’ అని గుప్తా అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికలు ఐపీవో చుట్టూ ఆసక్తికర వాతావరణం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విశ్లేషకులు (ఎనలిస్ట్లు), మార్కెట్ నిపుణులను లక్షలాది మంది నిత్యం, అనుక్షణం ఫాలో అవుతుండడాన్ని గమనించొచ్చు. ఆర్కే గుప్తాను ప్రతీ నెలా 15,000–20,000 మంది కొత్తగా అనుసరిస్తుండడం గమనార్హం. అయితే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అన్నీ కూడా ఇన్వెస్టర్లను సరైన మార్గంలో నడిపిస్తాయని భావించడం పొరపాటే అవుతుంది. పాలు నుంచి నీటిని వేరు చేసినట్టు.. ఈ పోస్ట్ల్లో మెరుగైన వాటిని వడకట్టడం యువ ఇన్వెస్టర్లకు కష్టమైన పనే అవుతుంది. విశ్లేషకుడు లేదా మరొకరు చెప్పారనో.. ఆసక్తికర పోస్ట్లు చూసో.. వచ్చిన ప్రతీ ఐపీవోకు బిడ్ వేయడం లాభాలకు హామీనివ్వబోదన్న విషయాన్ని తెలుసుకోవాలి. యవతరం వన్సైడ్.. మార్కెట్లు గరిష్టాలకు చేరి, ఐపీవోల సందడి నేపథ్యంలో కొత్త కొత్త ఇన్వెస్టర్లు లాభాల కోసం డీమ్యాట్ ఖాతాలను తెరిచేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీని ఫలితమే గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు 3 కోట్లకు పైనే కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. ఇందులో ఎక్కువ వాటా సీడీఎస్ఎల్కే వెళ్లింది. కొత్త ఇన్వెస్టర్లలో యువతరమే ఎక్కువగా ఉంది. వీరు ఎక్కువగా సోషల్మీడియాను అనుసరిస్తుంటారు. ఆశ్చర్యకరం ఏమిటంటే.. దేశంలో మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీల గురించి తగిన అధ్యయనం చేయకుండా, ఐపీవో ముసాయిదా పత్రాలను చదవకుండా పెట్టుబడులు పెడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వీరి పెట్టుబడి నిర్ణయాల వెనుక.. బుల్మార్కెట్ యూఫోరియాకుతోడు.. జొమాటో, నైకా తదితర ప్రముఖ కంపెనీల ఐపీవోల పట్ల నెలకొన్న ప్రచారమే కారణంగా కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో చాలా కంపెనీలు లిస్టింగ్ రోజే అద్భుతమైన రాబడులను ఇస్తుండడం, గ్రే మార్కెట్లో ఐపీవో ఇష్యూల ధరలకు భారీ ప్రీమియం పలకడం, పెద్ద ఎత్తున సబ్స్క్రయిబ్ కావడం, సోషల్ మీడియాలో ఊదరగొట్టే ప్రచారం, పోస్టింగ్లు ఇలా అన్నింటి పాత్ర ఉంది. ఈ సంస్కృతి ఎంతగా విస్తరించిందంటే.. అనధికారికంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ ఐపీవోలకు ప్రచారం కల్పిస్తుండడం గమనించాలి. యూట్యూబ్ చానళ్లలోనూ కొందరు ఇదే పనిచేస్తున్నారు. ‘‘పెట్టుబడుల అవకాశాలను గుర్తించడంలో, కంపెనీలు, ఐపీవోలకు సంబంధించి ప్రచారం కల్పించడంలో షోషల్ మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది’’ అని నెజెన్ క్యాపిటల్ సీఈవో నీల్ బహల్ తెలిపారు. చికాగోకు చెందిన అన్సిడ్ క్యాపిటల్ ఫండ్ మేనేజర్ అనురాగ్సింగ్.. పేటీఎం ఐపీవోపై నవంబర్ 8న చేసిన ట్వీట్ పెద్ద వైరల్ అయింది. పేటీఎం ఐపీవోపై సింగ్ ఎన్నో ట్వీట్లు చేశారు. ‘‘సాధారణ కంపెనీ అయిన పేటీఎంను దిగ్గజాలు ఎప్పుడో అధిగమించేశాయి. యాక్సిస్ బ్యాంకులో 65 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 40 శాతం మార్కెట్ విలువను పేటీఎం ఆశిస్తోంది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ పథకం పేటీఎంలో పెట్టుబడులు పెడితే, వెంటనే ఆ సిప్ను ఆపివేసుకోండి’’ అంటూ ఇన్వెస్టర్ల కళ్లు తెరిపించే ప్రయత్నాన్ని అనురాగ్సింగ్ చేశారు. టీవీల్లో ఇప్పుడు పేటీఎంపై విశ్లేషణల్లో సింగ్ వ్యాఖ్యానాలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడిందనడంలో సందేహం లేదు. భిన్న దారులు.. జొమాటో, పేటీఎం, నైకా, పీబీ ఫిన్టెక్ (పాలసీ బజార్) తదితర నూతనతరం టెక్నాలజీ ఆధారిత కంపెనీల విలువల విషయంలో మార్కెట్ రెండు వర్గాలుగా విడిపోయింది. కొత్తతరహా కంపెనీలను.. పాత విధానంలో పీఈ, ఇతర లాభాల రేషియోల ఆధారంగా విలువ కట్టడం సరికాదన్నది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు నష్టాలు వస్తున్నా.. కొంత కాలానికి అవి లాభాలను కురిపించే యంత్రాలుగా మారతాయని కొందరు బలంగా విశ్వసిస్తుంటారు. ‘‘పాత తరం ఇన్వెస్టర్లు టెక్నాలజీ బూమ్కు, క్రిప్టో, ఎన్ఎఫ్టీ బూమ్లకు దూరంగా ఉండిపోయారు. నైకా తదితర కొత్త కంపెనీలను వ్యాపారంలో లాభాలకు బదులు వృద్ధి రేటు ఆధారంగా పెట్టుబడులకు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ బలమైన బ్రాండ్ను ఏర్పాటు చేసుకునే క్రమంలో కంపెనీ ఉంది. వీటిల్లో కొన్ని ఇప్పుడు ఖరీదుగానే కనిపిస్తున్నా.. 3–4 ఏళ్ల తర్వాత చౌకగా అనిపిస్తాయి’’ అని నీల్ బహల్ వివరించారు. చదవండి: ఐపీవోల హవా.. ఈ ఏడాది రూ.1.35 లక్షల కోట్లు.. వచ్చే ఏడాది? -
స్టాక్ మార్కెట్లో ఐపీవోల సందడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్కు చెందిన ఫార్మసీ రిటైల్ దిగ్గజం మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 13న ప్రారంభమై 15న ముగుస్తుంది. ఇందుకు సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 780–796గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా మెడ్ప్లస్ దాదాపు రూ. 1,398 కోట్లు సమీకరించనుంది. కనీసం 18 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల కోసం రూ. 5 కోట్ల విలువ చేసే షేర్లను కేటాయించారు. సిబ్బందికి తుది ధరపై షేరు ఒక్కింటికి రూ. 78 డిస్కౌంటు లభిస్తుంది. ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటరు, ప్రస్తుత వాటాదారులు రూ. 798.30 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్ఎస్ పరిమాణాన్ని రూ. 1,039 కోట్ల నుంచి తగ్గించారు. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను అనుబంధ సంస్థ ఆప్టివల్ నిర్వహణ మూలధన అవసరాల కోసం ఉపయోగించుకోనున్నారు. గంగాడి మధుకర్ రెడ్డి 2006లో మెడ్ప్లస్ను ప్రారంభించారు. ఔషధాలు, వైద్య పరికరాలు, టెస్ట్ కిట్లతో పాటు ఇతరత్రా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను కూడా మెడ్ప్లస్ స్టోర్స్ విక్రయిస్తాయి. ఢిల్లీ, కేరళ మార్కెట్లపైనా దృష్టి .. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 2,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయని వర్చువల్ మీడియా సమావేశంలో కంపెనీ ఎండీ, సీఈవో మధుకర్ రెడ్డి వివరించారు. ఢిల్లీ, కేరళ మార్కెట్లలోకి కూడా ప్రవేశించే యోచన ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గతేడాది కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ 350 స్టోర్స్ ఏర్పాటు చేశామని మధుకర్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో ప్రైవేట్ లేబుల్స్ వాటా సుమారు 11.98 శాతంగా ఉందని పేర్కొన్నారు. మెట్రో బ్రాండ్స్ ఐపీవో న్యూఢిల్లీ: ఫుట్వేర్ రిటైలర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ శుక్రవారం(10న) మొదలుకానుంది. మంగళవారం(14న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 485–500కాగా.. తద్వారా రూ. 1,368 కోట్లు సమీకరించాలని కంపెనీ ఆశిస్తోంది. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలాకు పెట్టుబడులున్న మెట్రో బ్రాండ్స్ గురువారం(9న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా రూ. 295 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ప్రమోటర్లు దాదాపు 10 శాతం వాటాను ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 84 శాతంగా నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులలో కొంతమేర మెట్రో, మోచీ, వాకెవే, క్రాక్స్ బ్రాండ్లతో కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. -
ఫాల్గుని నాయర్కి షాక్! నైకా షేర్లకి భారీ కుదుపు
ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)తో మార్కెట్లో సంచలనం సృష్టించిన నైకా కంపెనీ షేర్లు కుదుపులకి లోనవుతున్నాయి. దీంతో ఇటీవల సెల్ఫ్మేడ్ సంపన్న మహిళగా గుర్తింపు పొందిన ఫాల్గుని నాయర్ సంపదకి కోత పడుతోంది. ఇండియాలో ఈ కామర్స్ మార్కెట్లో ప్రీమియం బ్యూటీ ప్రొడక్టులు అందించే సంస్థగా నైకా విజయ ప్రస్థానం సాగించింది. ఆ తర్వాత కంపెనీ విస్తరణ కోసం ఇటీవల ఐపీవోకి వచ్చింది. రికార్డు స్థాయిలో కంపెనీ షేర్లు ఏకంగా రూ. 2,400 దగ్గర ట్రేడయ్యాయి. దీంతో వారం రోజులు పూర్తి కాకుండానే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ లక్ష కోట్ల రూపాయలను దాటేసింది. ఇన్వెస్టర్లు నైకా షేర్ల కోసం ఎగబడ్డారు. బ్లూమ్బర్గ్ స్వయంప్రకాశిత సంపన్న మహిళ అంటూ నైనా వ్యవస్థాపకురాలు ఫాల్గుని నాయర్ని కీర్తించింది. సోమవారం జులై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి ఫలితాలను నైకా వెల్లడించింది. నికర లాభంగా రూ.1.20 కోట్లను ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి నికర లాభం రూ.27 కోట్లుగా నైకా ప్రకటించింది. ఒక్కసారిగా లాభాలు భారీగా పడిపోవడంతో.. ఆ ప్రభావం కంపెనీ షేర్లపై కనిపించింది. దీంతో ఒక్కసారిగా కంపెనీ షేర్ల ధర 7 శాతం పడిపోయింది. క్యూ 2 ఫలితాలు ప్రకటించకముందు కంపెనీ షేరు రూ.2351 దగ్గర ట్రేడయ్యింది. ఫలితాలు వెలువడిన తర్వాత షేరు ధర కుదుపులకు లోనవుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో షేరు ధర రూ.2312 దగ్గర ట్రేడవుతోంది. ఒక్కో షేరు ధర 44 వరకు పడిపోయింది. క్యూ 2 ఆర్థిక ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే ఇదే కాలానికి సంబంధించి ఇయర్ టూ ఇయర్ లాభాలు రూ.603 కోట్లు ఉండగా ఈ ఏడాది అది రూ. 885 కోట్లుగా నమోదు కావడం ఇన్వెస్టర్లు ఊరటనిస్తోంది. అయితే భవిష్యత్తులో నైకా మంచి ఫలితాలు కనబరిచే అవకాశం ఉందటున్నారు మార్కెట్ నిపుణులు. రెండేళ కాలానికి పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్న వారు నైకా షేర్లను గమనిస్తూ ఉండటం మంచిదని చెబుతున్నారు. ధర ఏమైనా తగ్గి రూ.1900 దగ్గర ట్రేడ్ అయితే ఈ షేర్లు కొనుగోలు చేయడం ఉత్తమం అంటున్నారు. చదవండి:నైకా లిస్టింగ్ బంపర్ హిట్.. ఒక్కరోజులోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. జాబితాలో క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్, మహిళా దుస్తుల బ్రాండ్ గో కలర్స్ సంస్థ గో ఫ్యాషన్, మైనింగ్ ప్రొడక్టుల కంపెనీ టెగా ఇండస్ట్రీస్ చేరాయి. ఆగస్టులో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. కాగా.. డైవర్సిఫైడ్ సంస్థ పీకేహెచ్ వెంచర్స్ ఐపీవో ప్రయత్నాలు విరమించుకుంటూ ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. వివరాలిలా.. ఐపీవో ద్వారా సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్ సంస్థ సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఈక్విటీని విక్రయించనుంది. బేరింగ్ పీఈ ఏషియాకు చెందిన ఈ సంస్థ 2015లో సీఎంఎస్లో 100 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక ఐపీవోలో భాగంగా గో ఫ్యాషన్ ఇండియా లిమిటెడ్ రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను సైతం విక్రయించనుంది. నిధులను 120 కొత్త ప్రత్యేకించిన బ్రాండ్ ఔట్లెట్ల ఏర్పాటుకు వినియోగించనుంది. టెగా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 1.36 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. క్యాపిటల్ స్మాల్ బ్యాంక్ కూడా.... షెడ్యూల్డ్ హోదా గల క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు మరో 38.40 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. పీఐ వెంచర్స్ ఎల్ఎల్పీ 3.37 లక్షల షేర్లు, ఎమికస్ క్యాపిటల్ పీఈ1 ఎల్ఎల్పీ 6.04 లక్షల షేర్లు, ఒమన్ ఇండియా సంయుక్త ఇన్వెస్ట్మెంట్ ఫండ్2– 8.37 లక్షల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఇతర వాటాదారులు సైతం 19.91 లక్షల షేర్లను విక్రయించనున్నారు. నైకా ఐపీవోకు భారీ డిమాండ్ 82 రెట్లు అధిక స్పందన ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ కంపెనీ నైకా వెంచర్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు సోమవారానికల్లా దాదాపు 82 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. షేరుకి రూ. 1,085–1,125 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా దాదాపు 2.65 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. అయితే 216 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. తద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమకూర్చుకుంది. బ్యూటీ, వెల్నెస్ ప్రొడక్టుల కంపెనీ నైకా ఐపీవోకు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లు(క్విబ్) 91.2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలు చేయగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలోనూ 12.25 రెట్లు అధికంగా స్పందన కనిపించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 630 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 4.19 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. ఐపీవోలో భాగంగా గత బుధవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,396 కోట్లు సమీకరించిన విషయం విదితమే. -
విదేశీ నిధుల ప్రవాహంపై రూపాయికి భరోసా!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయికి ఎగసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 47 పైసలు లాభపడి 74.88 వద్ద ముగిసింది. రానున్న వారాల్లో జారీ కానున్న క్విప్, ఐపీఓల ద్వారా మార్కెట్లోకి భారీ విదేశీ నిధుల ప్రవాహం జరుగుతుందన్న అంచనాలు రూపాయి సెంటిమెంట్ను బలోపేతం చేశాయన్నది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా కొంత శాంతించడం, తగ్గిన డాలర్ ఇండెక్స్ దూకుడు వంటి అంశాలు కూడా రూపాయికి కలిసి వచ్చాయి. నిజానికి రూపాయి మరింత బలపడాల్సిందని, అయితే ఈక్విటీల బలహీన ధోరణి రూపాయిని కొంతమేర కట్టడి చేసిందని ఫారెక్స్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వర్థమాన దేశాల్లో భారత్ కరెన్సీనే బుధవారం ప్రధానంగా బలపడింది. డాలర్పై చైనా యువాన్ ర్యాలీ (దాదాపు నాలుగు నెలల గరిష్టానికి అప్) మొత్తంగా ప్రాంతీయ కరెన్సీలకు మద్దతునిస్తోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిసెర్చ్ అనలిస్ట్ దిలిప్ పార్మార్ పేర్కొన్నారు. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ స్వల్ప లాభాల్లో 74.77 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాల్లో 93.64పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
9 నెలల్లో రెండు దశాబ్దాల రికార్డ్
న్యూఢిల్లీ: బుల్లిష్గా ఉన్న ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రతిబింబిస్తూ దేశీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఈ కేలండర్ ఏడాది(2021) తొలి 9 నెలల్లో 72 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. తద్వారా జనవరి– సెపె్టంబర్ మధ్య కాలంలో 970 కోట్ల డాలర్ల(రూ. 72,500 కోట్లు)ను సమీకరించాయి. వెరసి రెండు దశాబ్దాల తదుపరి అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్నాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రోత్సాహకర పరిస్థితులు దోహదం చేసినట్లు కన్సలి్టంగ్ కంపెనీ ఈవై తాజాగా రూపొందించిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ ట్రెండ్ మద్దతుతో దేశీయంగా క్యూ3(జులై–సెపె్టంబర్)లో లావాదేవీల సంఖ్య మరింత జోరందుకుంది. 72 ఐపీవోలలో డైవర్సిఫైడ్ ఇండ్రస్టియల్ ప్రొడక్టుల విభాగం నుంచి 15, కన్జూమర్ ప్రొడక్ట్స్ రిటైల్ విభాగం నుంచి 11 చొప్పున కంపెనీలు నిధులను సమీకరించాయి. 31 ఐపీవోలు సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో 31 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా 5 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వీటిలో డైవర్సిఫైడ్ ఇండ్రస్టియల్ ప్రొడక్టుల నుంచి 8 కంపెనీలు, టెక్నాలజీ విభాగం నుంచి 5 సంస్థలు పెట్టుబడులను సమీకరించాయి. ఈ రంగాల నుంచి జొమాటో, నువోకో విస్టాస్ కార్ప్, కెమ్ప్లాస్ట్ సన్మార్ భారీ ఇష్యూలను చేపట్టాయి. 2017 నాలుగో త్రైమాసికం తదుపరి దేశీ మార్కెట్లో ఈ క్యూ3 అత్యధిక లావాదేవీలకు నెలవైనట్లు ఈవై నిపుణులు ప్రశాంత్ సింఘాల్ తెలియజేశారు. కాగా.. ఇంతక్రితం 2018 తొలి 9 నెలల్లో ప్రైమరీ మార్కెట్ ద్వారా 130 కంపెనీలు నిధులను అందుకున్నాయి. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లోనూ కొత్తతరం, టెక్నాలజీ ఆధారిత కంపెనీలు ఐపీవోలకు రానున్నట్లు సింఘాల్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల సెన్సెక్స్ 60,000 పాయింట్ల మార్క్ను సైతం అధిగమించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా జులై–సెపె్టంబర్లో 2020 క్యూ3తో పోలిస్తే డీల్స్ 11 శాతం అధికమయ్యాయి. 2007లో నమోదైన గరిష్ట డీల్స్తో పోలిస్తే మరింత అధికంగా 18 శాతం పుంజుకున్నాయి. 2021 క్యూ3లో 547 ఐపీవోల ద్వారా కంపెనీలు 106.3 బిలియన్ డాలర్లు సమకూర్చుకున్నాయి. తొలి 9 నెలల్లో చూస్తే 1,635 కంపెనీలు 331 బిలియన్ డాలర్ల విలువైన పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది కంపెనీలలో 87 శాతం, పెట్టుబడుల సమీకరణలో 99 శాతం వృద్ధి. తొలి 9 నెలల్లో ప్రపంచవ్యాప్త ఐపీవో సమీకరణ నిధుల్లో 3 శాతం(9.7 బిలియన్ డాలర్లు) వాటాను దేశ మార్కెట్ ఆక్రమించింది. ఐపీవోల సంఖ్యలో అయితే 4.4 శాతానికి చేరింది. ఇక గ్లోబల్ మార్కెట్లలోనూ 2020 పూర్తి ఏడాదితో పోలిస్తే క్యూ3లో డీల్స్తోపాటు, నిధుల సమీకరణ అత్యధికంగా నమోదుకావడం విశేషం! -
మార్కెట్ల నష్టాల్లోనూ'ఐపీఓ'ల జోరు
ముంబై: మార్కెట్ల నష్టాల్లోనూ ఐపీఓల జోరు కొనసాగుతుంది. తాజాగా మూడు కంపెనీలు ఐపీఓ కోసం సెబీకి ప్రాస్పెక్ట్ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వాటిలో క్లినికల్ రీసెర్చ్ సంస్థ 'వీడా' పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 832 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు వీడా క్లినికల్ రీసెర్చ్ పేర్కొంది. ఇష్యూలో భాగంగా దాదాపు రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, అనుబంధ సంస్థ బయోనీడ్స్ ఇండియాకు నిధులు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు వీడా క్లినికల్ రీసెర్చ్ తెలియజేసింది. 'వీడా' తో పాటు సౌర ఇంధన కంపెనీ వారీ ఎనర్జీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా దాదాపు రూ. 1,350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు మరో 40 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో కొంత భాగాన్ని 2 గిగావాట్ల వార్షిక సామర్థ్యంగల సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా 1 గిగావాట్ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్కూ వెచ్చించనుంది. గుజరాత్లోని చిఖ్లీలో వీటిని ఏర్పాటు చేయనుంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం సైతం.. మొబైల్ ఫోన్ల తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 4.37 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను బ్రాండ్ నిర్మాణం, మార్కెటింగ్లతోపాటు.. ఇతర కంపెనీల కొనుగోళ్లు, అనుబంధ సంస్థలలో పెట్టుబడులు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్లో లావా ఇంటర్నేషనల్ పేర్కొంది. చదవండి: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్ -
ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్
ముంబై: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న పబ్లిక్ ఇష్యూల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ) మరింత బలపడనున్నట్లు గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ప్రైమరీ మార్కెట్లో జోష్ కారణంగా రానున్న మూడేళ్లలో దేశీ మార్కెట్ క్యాప్నకు 400 బిలియన్ డాలర్లు జమకానున్నట్లు తెలియజేసింది. దీంతో 2024కల్లా మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లను తాకనున్నట్లు అంచనా వేసింది. వెరసి ప్రపంచంలో అత్యధిక మార్కెట్ క్యాపిటటైజేషన్ కలిగిన దేశాలలో 5వ ర్యాంకుకు చేరే వీలున్నట్లు అభిప్రాయపడింది. గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లో నెలకొన్న బూమ్ నేపథ్యంలో తాజా అంచనాలను రూపొందించినట్లు యూఎస్ బ్రోకింగ్ దిగ్గజం వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంనుంచీ చూస్తే పబ్లిక్ మార్కెట్ ద్వారా కంపెనీలు 10 బిలియన్ డాలర్లను సమీకరిస్తున్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించింది. గత మూడేళ్లలోనే ఇది అత్యధికంకాగా.. రానున్న 12–24 నెలల్లోనూ ఇది కొనసాగనున్నట్లు అంచనా వేసింది. యూనికార్న్ల దన్ను నవ ఆర్థిక వ్యవస్థ నుంచి పుట్టుకొస్తున్న యూనికార్న్లు, ఐపీవోల ద్వారా లిస్టింగ్కు సిద్ధపడుతున్న కంపెనీలు మార్కెట్ క్యాప్ అంచనాలకు బలాన్నిచ్చినట్లు గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ఇటీవల బిలియన్ డాలర్ల విలువను అందుకోడం ద్వారా యూనికార్న్ హోదాను పొందుతున్న స్టార్టప్లలో స్పీడ్ నెలకొన్నదని తెలియజేసింది. ఇంటర్నెట్ వృద్ధి, ప్రయివేట్ పెట్టుబడుల లభ్యత, నియంత్రణ సంస్థల తోడ్పాటు వంటి అంశాలు దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు దన్నునిస్తున్నట్లు వివరించింది. ఫలితంగా ఇటీవల 3.5 ట్రిలియన్ డాలర్లను అందుకున్న దేశీ మార్కెట్ క్యాప్ 2024కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. గత వారం ఫ్రాన్స్ను అధిగమిస్తూ దేశీ మార్కెట్ విలువ ప్రపంచంలో ఆరో ర్యాంకును అందుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్ జోరు ప్రస్తుతం దేశీ ఈక్విటీ ఇండెక్సులలో పాతతరం ఆర్థిక రంగాలకు చెందిన కంపెనీలదే అధిపత్యమని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. 20 ఏళ్ల సగటు లిస్టింగ్ వయసు కారణంగా పురాతన సూచీలుగా నిలుస్తున్నట్లు వ్యాఖ్యానించింది. అయితే అతిపెద్ద డిజిటల్ ఐపీవోల ద్వారా కొత్త తరానికి చెందిన రంగాలకు ప్రాధాన్యత పెరగనున్నట్లు అంచనా వేసింది. దీంతో నవతరం ఆర్థిక, టెక్ రంగాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడులు 5 శాతం నుంచి 12 శాతానికి(50 శాతం ఫ్లోట్) పెరగనున్నట్లు అభిప్రాయపడింది. ఈ బాటలో ఇటీవల స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటో లిస్ట్కాగా.. ఫిన్టెక్ దిగ్గజం పేటీఎమ్సహా పలు ఇతర కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలియజేసింది. -
భారీగా పుట్టుకొస్తున్న సాస్ స్టార్టప్లు, ఐపీఓకి జోష్
ముంబై: ఇటీవల డిమాండుకు అనుగుణంగా దేశంలో సాస్(ఎస్ఏఏఎస్) స్టార్టప్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. మరోపక్క కొద్ది నెలలుగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న పబ్లిక్ ఇష్యూల హవా చిన్నా, పెద్దా కంపెనీలకు కొత్త జోష్నిస్తోంది. దీంతో సాఫ్ట్వేర్నే సర్వీసులుగా అందించే(సాస్) స్టార్టప్లు సైతం పబ్లిక్ ఇష్యూలను చేపట్టాలని యోచిస్తున్నాయి. తద్వారా పెట్టుబడుల సమీకరణతోపాటు స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టింగ్ను సాధించాలని ఆశిస్తున్నాయి. గత నెలలో రెండు సాస్ స్టార్టప్లు ఐపీవో బాటలో సాగనున్నట్లు ప్రకటించాయి కూడా. ఇవి రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, ఫ్రెష్వర్క్స్ ఇంక్. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం సాస్ స్టార్టప్ల పట్ల ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో పలు కంపెనీలు ఈ బాట పట్టనున్నట్లు భావిస్తున్నారు. దేశీయంగా ఆతిథ్యం, ట్రావెల్ విభాగంలో అతిపెద్ద సాస్ కంపెనీగా నిలుస్తున్న రేట్గెయిన్ టెక్నాలజీస్ తొలిగా స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్ట్కానున్నట్లు అంచనా వేస్తున్నారు. రూ. 1,200 కోట్లు పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకునేందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రేట్గెయిన్ దరఖాస్తు చేసింది. మరోవైపు చెన్నై సిలికాన్ వ్యాలీ కంపెనీ.. ఫ్రెష్వర్క్స్ ఇంక్ 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 730 కోట్లు) సమీకరణకు గత వారాంతాన యూఎస్లో ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా నాస్డాక్ గ్లోబల్ సెలక్ట్ మార్కెట్లో క్లాస్–ఏ కామన్స్టాక్గా లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. కొన్నేళ్ల నుంచీ సాస్ కంపెనీలు పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ రంగంలో ఇప్పటివరకూ 6 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 44,000 కోట్లు) పెట్టుబడులు నమోదయ్యాయి. గత మూడేళ్లలోనే 4 బిలియన్ డాలర్లు లభించడం గమనార్హం! కాగా.. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్(ఏపీఐలు)లకు సహకార ప్లాట్ఫామ్గా వ్యవహరించే పోస్ట్మ్యాన్ కంపెనీ ఇటీవల 22.5 కోట్ల డాలర్లను సమీకరించింది. తద్వారా కంపెనీ విలువ 5.6 బిలియన్ డాలర్లను అందుకుంది. వెరసి దేశీయంగా అత్యంత విలువైన సాస్ స్టార్టప్గా ఆవిర్భవించింది. యూనికార్న్లుగా దేశంలో ప్రస్తుతం బిలియన్ డాలర్ విలువను సాధించడం ద్వారా యూనికార్న్ హోదా పొందిన 60 సంస్థలలో 10 స్టార్టప్లు సాస్ విభాగంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదిలో నాలుగు సంస్థలు కొత్తగా జాబితాలో చేరాయి. దేశీయంగా సాస్ విభాగంలో సమర్ధవంతమైన కంపెనీలు ఊపిరి పోసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్లకు ప్రాధాన్యత, ప్రపంచస్థాయి ప్రొడక్టులు సహకరిస్తున్నాయి. డిమాండు ఆధారంగా సంస్థలను నెలకొల్పే టెక్ వ్యవస్థాపకులకుతోడు.. నైపుణ్యం కలిగిన డెవలపర్ల అందుబాటు వంటి అంశాలతో పరిశ్రమ వేగంగా ఎదుగుతున్నట్లు ట్రూస్కేల్ క్యాపిటల్ అధికారి సమీర్ నాథ్ తెలియజేశారు. దీంతో చివరి కస్టమర్లకు పలు విలువైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దేశీ సాస్ కంపెనీలు పోటీలో ముందుంటున్నట్లు వివరించారు. పలు దేశీ కంపెనీలు యూఎస్తోపాటు, అవకాశాలకు వీలున్న గ్లోబల్ మార్కెట్లపై దృష్టిసారిస్తున్నాయి. అధిక వృద్ధి, ఆదాయాలు, ఆకర్షణీయ మార్జిన్లతో పోటీ సంస్థలతో పోలిస్తే ప్రీమియం విలువలను అందుకుంటున్నాయని విశ్లేషకులు తెలియజేశారు. రేట్గెయిన్ ఐపీవో రేట్గెయిన్ ట్రావెల్ను 2004లో భాను చోప్రా ఏర్పాటు చేశారు. హోటళ్లు, ఎయిర్లైన్స్, ఆన్లైన్ ట్రావెల్, టూర్ ప్యాకేజీ ప్రొవైడర్స్, రైల్, క్రూయిజర్లు తదితరాలలో సొల్యూషన్స్ అందిస్తోంది. ఆతిథ్యం, ట్రావెల్ విభాగంలో అతిపెద్ద డేటాపాయింట్ సర్వీసులను కల్పిస్తోంది. 1400 కస్టమర్ సంస్థలను కలిగి ఉంది. గ్లోబల్ ఫార్చూన్–500 కంపెనీలలో 8 సంస్థలకు సేవలు సమకూర్చుతోంది. హోటళ్ల విభాగంలో ఇంటర్కాంటినెంటల్, కెస్లర్ కలెక్షన్, లెమన్ ట్రీ, ఓయో తదితరాలున్నాయి. ఫ్రెష్వర్క్స్కు పెట్టుబడులు ఇటీవల ఫ్రెష్వర్క్స్ 40 కోట్ల డాలర్ల(రూ. 2,925 కోట్లు) పెట్టు బడులు సమకూర్చుకుంది. దీంతో కంపెనీ విలువ 3.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఫ్రెష్వర్క్స్లో దిగ్గజాలు సీక్వోయా క్యాపిటల్, యాక్సెల్, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, క్యాపిటల్ జి తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. గత ఏడాది కాలంలో యూఎస్లో సాప్ ఐపీవోలు విజయవంతమయ్యాయి. నాస్డాక్లో లిస్టింగ్ ద్వారా 10 బిలియన్ డాలర్ల విలువను అందుకోవాలని ఫ్రెష్వర్క్స్ చూస్తోంది. వెరసి అతిపెద్ద దేశీ సాస్ స్టార్టప్లలో ఒకటిగా నిలిచే అవకాశముంది. చదవండి : రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ! -
రేసు గుర్రాల్లా యూనికార్న్లు
ముంబై: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల స్టార్టప్లు దూకుడు చూపుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విభాగాలలో కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి. వెరసి దేశీయంగా స్టార్టప్ల హవా నెలకొంది. ఇప్పటికే బిలియన్ డాలర్ల (రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్లు 60కు చేరాయి. వీటిని యూనికార్న్లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్లో సాగుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ ఎన్నడూలేని విధంగా కళకళలాడుతోంది. ఈ బాటలో స్టార్టప్ యూనికార్న్లు సైతం పబ్లిక్ ఇష్యూల బాటపడుతున్నాయి. రానున్న రెండేళ్లలో 18 పెద్ద స్టార్టప్లు ఐపీవోలకు రానున్నట్లు వాల్స్ట్రీట్ బ్రోకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవో ఎఫ్ఏ) ఒక నివేదికలో పేర్కొంది. 12 బిలియన్ డాలర్లు... ఈ ఏడాదిలోనే దేశీయంగా 20 స్టార్టప్లు కొత్తగా యూనికార్న్ హోదాను అందుకున్నాయి. ఫలితంగా వీటి సంఖ్య 60ను తాకింది. స్టార్టప్లలో కొద్ది నెలలుగా భారీ స్థాయిలో పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్య 100 మార్క్ను చేరవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్లోబల్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ సైతం ఈ మార్చిలో ఇదే తరహా అంచనాలు వెలువరించడం గమనార్హం! రానున్న 24 నెలల్లో పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించేందుకు దిగ్గజాలు బైజూస్, ఫ్లిప్కార్ట్, పేటీఎమ్, ఓలా, ఓయో తదితరాలు ప్రణాళికలు వేశాయి. అంతేకాకుండా పాలసీబజార్, పెప్పర్ఫ్రై, ఇన్మోబి, గ్రోఫర్స్, మొబిక్విక్, నైకా, ఫ్రెష్వర్క్స్, పైన్ల్యాబ్స్, ఫార్మ్ఈజీ, డెలివరీ, డ్రూమ్, ట్రాక్సన్ సైతం ఇదే బాటలో నడవనున్నాయి. తద్వారా సుమారు 18 కంపెనీలు 12 బిలియన్ డాలర్లు(రూ. 88,000 కోట్లు) వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు బీవోఎఫ్ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ గౌరవ్ సింఘాల్ తెలియజేశారు. భారీ ఇష్యూలు.. ఇప్పటికే సెబీ వద్ద పలు స్టార్టప్ దిగ్గజాలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో పేటీఎం(రూ. 16,600 కోట్లు), ఓలా(రూ. 11,000 కోట్లు), పాలసీబజార్ (రూ. 6,000 కోట్లు), నైకా(రూ. 4,000 కోట్లు), మొబిక్విక్(రూ. 1,900 కోట్లు) ఉన్నాయి. ఇటీవల రూ. 6,300 కోట్లు సమీకరించిన జొమాటో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. దేశీయంగా యూనికార్న్లు ఐపీవోలు చేపట్టడం ద్వారా సంప్రదాయ కుటుంబ బిజినెస్ల ట్రెండ్లో మార్పులను తీసుకువచ్చే వీలున్నట్లు సింఘాల్ అభిప్రాయపడ్డారు. దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ)లో ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల వాటా 1 శాతానికంటే తక్కువేనని పేర్కొన్నారు. యూఎస్ మార్కెట్లో 40 శాతం మార్కెట్ వాటాను ఇవి ఆక్రమిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువ రూ. 250 లక్షల కోట్లను తాకిన సంగతి తెలిసిందే. రానున్న ఐదేళ్ల కాలంలో యూనికార్న్ల సంఖ్య రెట్టింపుకావచ్చని అంచనా వేశారు. ఈ ఏడాది యూనికార్న్ హోదాకు చేరిన కంపెనీలలో షేర్చాట్, గ్రో, గప్షుప్, మీషో, ఫార్మ్ఈజీ, బ్లాక్బక్, డ్రూమ్, ఆఫ్బిజినెస్, క్రెడ్, మోగ్లిక్స్, జెటా, మైండ్టికిల్, బ్రౌజర్స్టాక్, ఆప్గ్రేడ్ తదితరాలున్నాయి. త్వరలో మరో 32... ఫ్యూచర్ యూనికార్న్ జాబితాలో చేరగల మరో 32 కంపెనీలను హురున్ ఇండియా తాజాగా ప్రస్తావించింది. ఇవి ఇప్పటికే 50 కోట్ల డాలర్ల విలువను అందుకున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో 20 కోట్ల డాలర్ల విలువను సాధించిన మరో 54 సంస్థలు సైతం జోరు మీదున్నట్లు పేర్కొంది. భవిష్యత్లో యూనికార్న్లుగా ఆవిర్భవించగల కంపెనీల విలువను 36 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దేశీయంగా 60 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నట్లు తెలియజేసింది. 2025కల్లా ఈ సంఖ్య 90 కోట్లను తాకనున్నట్లు వివరించింది. ప్రస్తుతం అత్యధిక యూనికార్న్లున్న దేశాల జాబితాలో అమెరికా(396), చైనా(277) తదుపరి మూడో ర్యాంకులో భారత్ నిలుస్తున్నట్లు పేర్కొంది. -
స్టాక్ మార్కెట్లో రికార్డుల ర్యాలీ.. ఈ అంశాలే కీలకం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వారంలోనూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అధిక ధరల వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయ డేటాతో పాటు ప్రపంచ పరిమాణాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు దిశా నిర్దేశం చేస్తాయని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలు కూడా సూచీల ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. నిఫ్టీ పైపైకి ‘‘జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో సూచీల రికార్డు ర్యాలీ కొనసాగవచ్చు. లాభాల స్వీకరణ జరగకపోతే నిఫ్టీ 16,900 స్థాయిని అందుకుంటుంది. దిగువస్థాయిలో 16,550 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. మార్కెట్ను ప్రభావితం చేసే ఇతర అంశాలను పరిశీలిస్తే.., క్యూ1 జీడీపీ గణాంకాలపైనే అందరి దృష్టి ... కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికపు (ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలను మంగళవారం విడుదల చేయనుంది. లో బేస్ ఎఫెక్ట్ కారణంగా (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) క్యూ1లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని అర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంచనాలు ఏమాత్రం తారుమారైనా మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇతర స్థూల ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు... ఆటో కంపెనీలు ఆగస్ట్ వాహన విక్రయ గణాంకాలను బుధవారం విడుదల చేయనున్నాయి. దేశీయంగా కోవిడ్ ఆంక్షల సడలింపుతో ఉత్పత్తి ఊపందుకుంది. పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేతతో ఎగుమతులు పెరిగాయి. ఈ పరిణామాలతో ఆటో అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూలై నెల మౌలిక రంగ పనితీరు, ద్రవ్యలోటు గణాంకాలు ఈ మంగళవారం విడుదల కానున్నాయి. ఇక సెప్టెంబర్ 1వ తేదిన (బుధవారం) ఆగస్ట్ నెలకు సంబంధించిన మార్కిట్ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, ఆగస్ట్ మాసపు సేవల రంగపు డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. అదే శుక్రవారం ఆర్బీఐ ఆగస్ట్ 27వ తేదితో ముగిసే ఫారెక్స్ నిల్వలను ప్రకటించనుంది. ఈ వారంలో రెండు ఐపీఓలు... ఈ వారంలో ఒకే రోజున రెండు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ అమీ ఆర్గానిక్స్, హెల్త్ కేర్ సేవల సంస్థ విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ పబ్లిక్ ఇష్యూలు సెప్టెంబర్ 1న మొదలై, మూడవ తేదీన ముగియనున్నాయి. ఈ రెండు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.2,465 కోట్లను సమీకరించనునున్నాయి. 4 నెలల తర్వాత తొలిసారి కొనుగోళ్లు నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈ ఆగస్ట్లో తొలిసారి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు ఈ ఆగస్టులో రూ.986 కోట్ల షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.13,494 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. అంచనాలకు కంటే ముందుగా వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఫెడ్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడంతో భారత్తో పాటు వర్థమాన దేశ మార్కెట్లలోకి చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదని మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ హెడ్ శ్రీవాస్తవ తెలిపారు. చదవండి : కేంద్రం చెబుతున్న మానిటైజేషన్తో ప్రయోజనం ఎవరికి ? ఆస్తుల నగదీకరణ ఎందుకు ? -
లిస్టింగ్ రోజే అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి నాలుగు నెలల్లో పబ్లిక్ ఇష్యూల హవా నెలకొంది. అయితే ఐపీవోలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు లిస్టింగ్ రోజునే అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఏప్రిల్–జులై మధ్య కాలంలో 52 శాతం మంది ఇన్వెస్టర్లు తొలి రోజునే అలాట్ అయిన షేర్లను విక్రయించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషణ పేర్కొంది. మరో 20 శాతం మంది లిస్టయిన వారం రోజుల్లోపే షేర్లను వొదిలించుకున్నట్లు తెలియజేసింది. మోతీలాల్కు చెందిన బ్రోకింగ్, పంపిణీ విభాగం చేసిన విశ్లేషణ ప్రకారం ఐపీవో క్లయింట్లలో 64 శాతం మంది సగటున కనీసం రెండు ఇష్యూలకు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది తొలి 4 నెలల్లో 5.7 లక్షల మంది ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూల బాట పట్టగా.. గతేడాది(2020–21) ఇదే కాలంలో 5.1 లక్షల మంది మాత్రమే వీటికి సబ్స్క్రయిబ్ చేశారు. రాష్ట్రాల వారీగా మొత్తం ఐపీవో క్లయింట్లలో దాదాపు 70 శాతం మంది గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కంపెనీలు సైతం క్యూ కట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్–జులైలో 36 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో 17 ఇష్యూలు మాత్రమే నమోదయ్యాయి. 61 శాతం మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. గ్లెన్మార్క్ లైఫ్సైన్సెస్కు అత్యధికంగా 68 శాతం మంది క్లయింట్లు అప్లై చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ సాధించడం ద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఏడాది చివరికల్లా 100 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేసింది. -
ఐపీవోలకు మరో మూడు కంపెనీలు రెడీ...!
న్యూఢిల్లీ: ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతూ బుల్ జోరు చూపుతుంటే.. మరోపక్క సెకండరీ మార్కెట్ సైతం పలు ఇష్యూలతో సందడి చేస్తోంది. గత వారం రోజుల్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్లు దాఖలు చేయగా.. ప్రస్తుతం మరో మూడు కంపెనీలు ఇదే బాట పట్టాయి. ఇక ఇటీవలే ఐపీవోలు ముగించుకున్న నాలుగు కంపెనీలు సోమవారం(16న) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా సెబీ తలుపు తడుతున్న కంపెనీల జాబితాలో మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్, స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్, రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీ చేరాయి. వివరాలు చూద్దాం.. (చదవండి: ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్ఫోన్ సొంతం...!) మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఫార్మసీ రిటైల్ చైన్.. మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఐపీవోకు అనుమతించమంటూ సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 1,639 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు మరో రూ. 1,039 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ఫ్యురో ఇన్వెస్ట్మెంట్స్ రూ. 450 కోట్లు, పీఐ అపార్చునిటీస్ ఫండ్–1 రూ. 500 కోట్లు చొప్పున వాటాలను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీతో లభించే నిధులను అనుబంధ సంస్థ ఆప్టవల్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్ అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంతా గ్రూప్ కంపెనీ స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. రూ. 1,250 కోట్ల సమీకరణకు అనుమతించవలసిందిగా సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా ఉద్యోగులకు సైతం షేర్లను కేటాయించనుంది. ఇష్యూ నిధులను ప్రత్యేకించిన కొన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఐపీవోకు ముందు షేర్ల జారీ ద్వారా రూ. 220 కోట్లను సమకూర్చుకోనున్నట్లు ప్రాస్పెక్టస్లో విద్యుత్ పంపిణీ మౌలికసదుపాయాల కంపెనీ పేర్కొంది. రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీ ప్రయాణాలు, ఆతిథ్య రంగ టెక్సాలసీ సర్వీసులందించే రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు, ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు మరో 2.26 కోట్ల షేర్లను సైతం విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా వ్యాగ్నర్ లిమిటెడ్ 1.71 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీతో లభించే నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లకు వెచ్చించనుంది. (చదవండి: ఆపిల్ కంపెనీకి భారీ షాక్..!) -
లిస్టింగ్లు: మూడు హిట్.., ఒకటి ఫట్
ముంబై: నాలుగు ఐపీఓల్లో మూడు ప్రీమియం ధరతో.., ఒకటి డిస్కౌంట్ ధరతో లిస్ట్ అయ్యాయి. మొదటిరోజు దేవయాని ఇంటర్నేషనల్, ఎక్సారో టైల్స్, క్రిష్ణా డయాగ్నస్టిక్స్ షేర్లు వరుసగా 37%, పదిశాతం, నాలుగు శాతం లాభాలన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. విండ్లాస్ బయోటెక్ షేరు మాత్రం 11.58 శాతం నష్టంతో ముగిసింది. బీఎస్ఈలో దేవయాని ఇంటర్నేషనల్ షేర్లు 69.15 లక్షల షేర్లు చేతులు మారగా, మార్కెట్ క్యాప్ రూ.14,833 కోట్ల వద్ద స్థిరపడింది. -
ప్లీజ్, మొక్కుబడిగా చేయొద్దు
న్యూఢిల్లీ: చాలా మటుకు కంపెనీలు ముఖ్యమైన వివరాల వెల్లడికి సంబంధించిన నిబంధనల స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించడం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ అజయ్ త్యాగి వ్యాఖ్యానించారు. దీన్ని మొక్కబడి వ్యవహారంగా పరిగణించవద్దంటూ సంస్థలకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన వార్షిక క్యాపిటల్ మార్కెట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు పేర్కొన్నారు. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలు తరచుగా జరిగే ఆర్థిక ఫలితాల్లాంటి అంశాలతో పాటు .. ఇతరత్రా పరిణామాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ‘ఈ రెండు విషయాలపైనా కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాలి. వార్షిక నివేదికల్లాంటి వాటిల్లో నిర్దేశిత అంశాలూ పొందుపరుస్తున్నప్పటికీ.. చాలా సందర్భాల్లో ఏదో మొక్కుబడిగా చేస్తున్నట్లుగా ఉంటోంది. ఇది ఆమోదయోగ్యం కాదు. అలాగే, చాలా కేసుల్లో మీడియాలో వార్తలు రావడం, వాటిపై వివరణ ఇవ్వాలంటూ కంపెనీలను స్టాక్ ఎక్సేంజీలను కోరడం, ఆ తర్వాత ఎప్పుడో కంపెనీలు సమాధానాలు ఇవ్వడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. కంపెనీలు తమ విధానాలను పునఃసమీక్షించుకోవాలి. నిబంధనలను కేవలం మొక్కుబడిగా కాకుండా వాటి వెనుక స్ఫూర్తిని అర్థం చేసుకుని పాటించాలి‘ అని త్యాగి పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాలు, వార్షిక నివేదికలు, కార్పొరేట్ గవర్నెన్స్ నివేదికలకు సంబంధించిన పత్రాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. కార్పొరేట్ గవర్నెన్స్పై దృష్టి పెట్టాలి .. ప్రస్తుత పరిస్థితుల్లో షేర్హోల్డర్, బోర్డు సమావేశాలు వర్చువల్గా నిర్వహించడం మంచిదేనని త్యాగి చెప్పారు. అయితే, బోర్డు సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు గోప్యంగానే ఉంటున్నాయా, షేర్హోల్డర్ల సమావేశాల్లో వాటాదారుల గళానికి తగు ప్రాధాన్యమిస్తున్నారా లేదా అన్నవి తరచి చూసుకోవాల్సిన అంశాలని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు, పారదర్శకతను నిరంతరం మెరుగుపర్చుకోవడం అన్నది కంపెనీలో అంతర్గతంగా రావాలని త్యాగి చెప్పారు. నిర్వహణ బాగున్న కంపెనీలపై ఇన్వెస్టర్లకు నమ్మకం ఏర్పడుతుందని, ఆయా సంస్థలకు దీర్ఘకాలంలో వాటి ప్రయోజనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వీయ నిర్వహణను పరిశ్రమ సక్రమంగా పాటిస్తే నియంత్రణ సంస్థ ప్రతి సారి రంగంలోకి దిగాల్సిన అవసరం ఉండదన్నారు. పబ్లిక్ ఇష్యూల నిబంధనల్లో సంస్కరణలు .. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నిబంధనల్లో .. ముఖ్యంగా బుక్ బిల్డింగ్, రేటు, ధర శ్రేణికి సంబంధించిన కొన్ని అంశాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టడంపై సెబీ కసరత్తు చేస్తోందని త్యాగి తెలిపారు. గత కొన్నాళ్లుగా నిధుల సమీకరణ ధోరణులు మారాయని, సెబీ కూడా తదనుగుణంగా నిబంధనలకు సవరణలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ ఇష్యూ నిబంధనల్లో పలు మార్పులు చేయడం, పెద్ద కంపెనీలు సులభంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు వీలు కల్పించేలా కనీస పబ్లిక్ షేర్హోల్డింగ్ను సవరించడం మొదలైనవి గత రెండేళ్లలో చేసినట్లు త్యాగి చెప్పారు. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు, స్టార్టప్ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రమోటరు షేర్హోల్డింగ్ స్థానంలో నియంత్రణ వాటా కలిగిన షేర్హోల్డర్ల కాన్సెప్టును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్పటికే చర్చాపత్రం విడుదల చేసినట్లు వెల్లడించారు. స్పాట్ మార్కెట్ ద్వారా పసిడి దిగుమతులు .. భవిష్యత్తులో పసిడిని ఎక్సే్చంజ్ వ్యవస్థ (ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్–ఈజీఆర్) ద్వారా దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సెబీ హోల్ టైమ్ సభ్యుడు జి. మహాలింగం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టర్కీ, చైనా వంటి దేశాల్లో ఈ విధానాన్ని పాటిస్తున్నారని ఆయన తెలిపారు. 995 స్వచ్ఛతకు మించిన బంగారం ఎక్సే్చంజ్ వ్యవస్థ ద్వారానే వచ్చేలా చూడాలని, దీంతో అది ఆర్థిక సాధనంగా మారుతుందని మహాలింగం చెప్పారు. ప్రస్తుతం భారత్ ఏటా 35 బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోందని, ఎక్సే్చంజ్ మార్కెట్ వ్యవస్థలోకి మళ్లించడం వల్ల కరెంటు అకౌంటు లోటుపరమైన భారం తగ్గుతుందని తెలిపారు. -
ఐపీవోల్లోనూ పెన్షన్ ఫండ్ మేనేజర్ల పెట్టుబడులు
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీవోలు), ఎన్ఎస్ఈ–200 కంపెనీల్లో కూడా పెన్షన్ ఫండ్ల మేనేజర్లు (పీఎఫ్ఎం) ఇన్వెస్ట్ చేసేందుకు త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు పింఛను రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ్ వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో కొత్త నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు జారీ చేసే డెట్ సాధనాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు పీఎఫ్ఎంలను అనుమతించే అవకాశాలు ఉన్నాయని బందోపాధ్యాయ్ వివరించారు. ప్రస్తుతం పీఎఫ్ఎంలు తమ కార్పస్లోని ఈక్విటీ విభాగం నిధులను రూ. 5,000 కోట్ల పైచిలుకు మార్కెట్ క్యాప్ ఉండి, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ సెగ్మెంట్లో ట్రేడయ్యే స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతులు ఉన్నాయి. దీనివల్ల ఫండ్ మేనేజర్లు మెరుగైన రాబడులు అందించే అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ఎంలు.. ఐపీవోలు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లు, ఆఫర్ ఫర్ సేల్ మొదలైన వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ట్రేడయ్యే టాప్ 200 స్క్రిప్స్లోనూ ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. ఈక్విటీలపరంగా ఎదురయ్యే రిస్కులను తగ్గించేందుకు తగిన నిబంధనలు ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడులు మెరుగైన రాబడులు అందిస్తున్న నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా ఈక్విటీ పెట్టుబడుల వైపే మొగ్గు చూపుతానని బంద్యోపాధ్యాయ్ తెలిపారు. -
మీరు చూసింది ట్రైలరే, నేను ఏకంగా సినిమా చూపిస్తా
న్యూఢిల్లీ: రూ. 9,375 కోట్ల సేకరించే లక్క్ష్యంతో ప్రారంభమైన జొమాటో ఐపీవోలో రికార్డ్ స్థాయిల్ని క్రియేట్ చేస్తోంది. అమెరికా, చైనాలో ఫుడ్ డెలివరీ సంస్థ ఐపీఓల కంటే భారత్ కు చెందిన జొమాటో ఐపీఓ మార్కెట్లో సత్తా చాటుతోంది. జొమాటో ఇష్యూ ప్రైస్బాండ్ ఒక్కో షేరుకు రూ.72-76గా నిర్ణయిస్తూ రంగంలోకి దిగిన జొమాటోకి ఇన్వెస్టర్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. బీఎస్ఈ లెక్కల ప్రకారం జొమాటో ఐపీవో రెండో రోజు ఇప్పటి వరకు ఈ ఐపీఓలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ 98శాతం సబ్ స్క్రిప్షన్ (నమోదు) , నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 13శాతం, వ్యక్తిగత రిటైల్ పెట్టుబడిదారులు.3.62 శాతం, ఉద్యోగులు 18శాతం మంది సబ్ స్క్రిప్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో జొమాటో ప్రతినిథులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఓ ప్రారంభానికి ముందే సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఐపీవో ఒత్తిడిలో మూడు సార్లు బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేశానంటూ గోయల్ ట్వీట్ చేయడం వ్యాపార దిగ్గజాలు స్పందిస్తూ తమదైన స్టైల్లో గోయల్కి అభినందనలు చెప్పారు. గోయల్కు అభినందనలు వెల్లువెత్తుతుంటే జొమాటో కో ఫౌండర్ గౌరవ్ గుప్తా అభి బాకి హై మేరీ దోస్త్ అంటూ "ఇప్పటి వరకు మీరు చూసి కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా చూపిస్తానంటూ ఓ టీవీ చర్చా వేదికలో డైలాగ్స్ పేల్చారు. ఆ డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఐపీఓలో ఊహించని విధంగా జొమాటోకి విశేష స్పందన లభించడంతో ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలు సైతం ఐపీఓల దిశగా అడుగులు వేస్తున్నాయి. మరి అవి ఏమేరకు ఫలితాల్ని సాధిస్తాయో వేచి చూడాల్సి ఉంది. చదవండి: వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది -
మళ్లీ ఐపీవోలకు కంపెనీల క్యూ
దాదాపు రెండేళ్లుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ ఇకపై మరింత సందడి చేయనుంది. పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు ఇటీవల 30 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. మరో 10 కంపెనీలు అనుమతులు పొంది ఈ నెలలో ఐపీవోలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఐపీవో మార్కెట్పై మర్చంట్ బ్యాంకర్లు అందించిన వివరాలిలా.. సాక్షి ,ముంబై: ఓవైపు ప్రతీ వారంలోనూ దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ జోరుగా సాగుతున్నాయి. మరోపక్క పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 22 కంపెనీలు ఉమ్మడిగా రూ. 27,426 కోట్లను సమీకరించగా.. ఇకపై మరో 10 కంపెనీలు ఈ నెలలోనే పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 25,000 కోట్లవరకూ సమకూర్చుకోనున్నాయి. ఈ బాటలో మరో 30 కంపెనీలు ఇప్పటికే సెబీకి దరఖాస్తు చేశాయి. తద్వారా రూ. 55,000 కోట్లను పొందేందుకు ప్రణాళికలు వేశాయి. వెరసి సమీప భవిష్యత్లో 40 కంపెనీలు రూ. 80,000 కోట్లను సమీకరించే సన్నాహాల్లో ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డుకు వేదికకానున్నాయి. భారీ లిక్విడిటీ, కొత్తగా జత కలుస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ క్యాపిటల్ మార్కెట్లకు జోష్నిస్తున్నాయి. 2020లో 16 ఇష్యూలు రూ. 26,628 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రైమరీ మార్కెట్ ద్వారా 2019లో రూ. 12,687 కోట్లు సమీకరించగా.. 2018లో 25 కంపెనీలు అత్యధికంగా రూ. 31,731 కోట్లను సమీకరించాయి. ఎఫ్పీఐల దన్ను దేశీయంగా గతేడాది(2021) విదేశీ ఫండ్స్ సరికొత్త రికార్డును సృష్టిస్తూ 35 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఏడాదిలోనూ ట్రెండ్ కొనసాగే వీలుంది. వీటికి జతగా ఎల్ఐసీ తదితర దేశీ ఫండ్స్ సైతం కోట్లను కుమ్మరిస్తున్నాయి. ఈ బాటలో ఈ ఏడాది కొత్తగా 2 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లలో ప్రవేశించారు. కాగా.. జనవరి–మార్చి మధ్య ఐఆర్ఎఫ్సీ, ఇండిగో పెయింట్స్, రైల్టెల్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, లక్ష్మీ ఆర్గానిక్స్, బార్బిక్యూ నేషన్, అనుపమ్ రసాయన్, కల్యాణ్ జ్యువెలర్స్, బ్రూక్ఫీల్డ్ ఇండియా రీట్, స్టవ్ క్రాఫ్ట్ తదితరాలు ఐపీవోలను చేపట్టాయి. ఉత్కర్‡్ష స్మాల్ బ్యాంక్, గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, రోలెక్స్ రింగ్స్, సెవెన్ ఐలాండ్ షిప్పింగ్ సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ పొందాయి. పేటీఎమ్ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ రూ. 18,500 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉంది. తద్వారా 2010 అక్టోబర్లో వచ్చిన అతిపెద్ద ఇష్యూ కోల్ ఇండియా(రూ. 15,000 కోట్లు)ను అధిగమించే వీలుంది. కాగా.. ఇప్పటికే సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసిన కంపెనీల జాబితాలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఫిన్కేర్ స్మాల్ బ్యాంక్, జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, న్యువోకో విస్టాస్, కార్ట్రేడ్, ఆరోహణ్ ఫైనాన్షియల్, శ్రీరామ్ ప్రాపర్టీస్, సన్సేరా ఇంజినీరింగ్, సుప్రియా లైఫ్సైన్సెస్ ఉన్నాయి. -
ఐపీవోల సందడే సందడి
ఓ వైపు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్నప్పటికీ మరోపక్క యూఎస్సహా దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. తాజాగా సెన్సెక్స్, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి కూడా. ఈ నేపథ్యంలో 2020లో ప్రైమరీ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకోగా.. ఈ ఏడాదిలోనూ పలు కంపెనీలు ఐపీవోల ద్వారా నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ముంబై: వారాంతానికల్లా ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 52,600 పాయింట్లను అధిగమించగా, నిఫ్టీ 15,800ను దాటేసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఈ జోష్ ప్రైమరీ మార్కెట్లకూ పాకింది. దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. పేమెంట్స్ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్సహా ఫైనాన్షియల్ సర్వీసుల రంగానికి చెందిన 12 కంపెనీలు ఐపీవోలకు సిద్ధపడుతున్నాయి. తద్వారా సంయుక్తంగా రూ. 55,000 కోట్లవరకూ సమీకరించే సన్నాహాల్లో ఉన్నాయి. వీటిలో ఫిన్టెక్ కంపెనీలు సైతం ఉన్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సంస్థలు పేర్కొన్నాయి. అతిపెద్ద ఇష్యూ బీమా, ఆస్తుల నిర్వహణ, వాణిజ్య బ్యాంకింగ్, మైక్రోఫైనాన్స్, నాన్బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్స్ రంగాల నుంచి సుమారు 12 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. ఇందుకు వీలుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ఈ బాటలో రూ. 22,000 కోట్ల ఇష్యూకిగాను పేమెంట్స్ బ్యాంక్ పేటీఎమ్కు గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. పేటీఎమ్ ఐపీవో పూర్తయితే అతిపెద్ద ఇష్యూగా రికార్డు సృష్టించనుంది. ఇంతక్రితం 2010 అక్టోబర్లో రూ. 15,000 కోట్ల సమీకరణ ద్వారా పీఎస్యూ కోల్ ఇండియా రికార్డ్ నెలకొల్పింది. కాగా.. ఇటీవల ఐపీవోకు దరఖాస్తు చేసిన కంపెనీలలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్(రూ. 7,500 కోట్లు), పాలసీ బజార్(రూ. 4,000 కోట్లు), ఆప్టస్ హౌసింగ్ ఫైనాన్స్(రూ. 3,000 కోట్లు), స్టార్ హెల్త్(రూ. 2,000 కోట్లు), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ(రూ. 1,500–2,000 కోట్లు), ఆరోహణ్ ఫైనాన్షియల్(రూ. 1,800 కోట్లు), ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్(రూ. 1,700 కోట్లు), ఫిన్కేర్ స్మాల్(రూ. 1,330 కోట్లు) తదితరాలున్నాయి. టాప్–5లో ఒకటి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీవో ద్వారా రూ. 2,000 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. రూ. 2.7 లక్షల కోట్ల నిర్వహణలోని ఆస్తుల విలువ రీత్యా కంపెనీ దేశంలోని టాప్–5 ఏఎంసీలలో ఒకటిగా నిలుస్తోంది. ఇక బీమా రంగం నుంచి వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, రాకేష్ ఝున్ఝున్వాలాకు పెట్టుబడులున్న స్టార్ హెల్త్ అల్లీడ్ ఇన్సూరెన్స్, మెడి అసిస్ట్లు పబ్లిక్ ఇష్యూలు చేపట్టనున్నాయి. ఇదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ దన్నుగల ఆధార్ , ఆప్టస్ సైతం ఐపీవో బాట పట్టాయి. మైక్రోఫైనాన్స్ విభాగంలో ఆరోహణ్, ఫ్యూజన్ ఐపీవోలకు రానుండగా.. బ్యాంకింగ్ నుంచి తమిళనాడు మెర్కంటైల్ రెడీ అవుతోంది. కాగా.. ఈ ఏడాది 17 సంస్థలు ఐపీవోల ద్వారా ఇప్పటికే రూ. 17,503 కోట్లు సమకూర్చుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అంతేకాకుండా ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, రోలెక్స్ రింగ్స్, సెవెన్ లాండ్స్ షిప్పింగ్ సెబీ నుంచి అనుమతులను పొందినట్లు పేర్కొన్నారు. మరో 26 కంపెనీలు అనుమతుల కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. ప్రైమరీ మార్కెట్ల కళకళ రెండు నెలల తదుపరి ఈ వారం మళ్లీ పబ్లిక్ ఇష్యూలు సందడి చేయనున్నాయి. నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 9,123 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి. ఇంతక్రితం ఏప్రిల్ 7–9న మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీవోకి వచ్చింది. కాగా.. సోమవారం(14) నుంచి శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ, సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్(సోనా క్యామ్స్టార్) పబ్లిక్ ఇష్యూలు ప్రారంభమయ్యాయి. ఇక కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దొడ్ల డైరీ ఐపీవోలు బుధవారం(16న) ఓపెన్ కానున్నాయి. ఈ బాటలో వచ్చే నెల(జూలై) మొదట్లో ఐపీవో ద్వారా క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైమరీ మార్కెట్లను పలకరించనుంది. రూ. 1,500 కోట్లు సమీకరించే లక్ష్యంతో క్లీన్సైన్స్ వస్తోంది. ఇదే సమయంలో ఇండియా పెస్టిసైడ్స్ కూడా పబ్లిక్ ఇష్యూ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. భారీ లిక్విడిటీ ప్రభావంతో సెకండరీ మార్కెట్లతోపాటు.. ప్రైమరీ మార్కెట్లు సైతం బుల్ దూకుడు చూపుతున్నట్లు పలు బ్రోకింగ్ సంస్థలు ఈ సందర్భంగా పేర్కొంటున్నాయి. టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఇష్యూ.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఐపీవోకు వస్తోంది. ఇష్యూ జూన్ 16న ప్రారంభమై 22న ముగియనుంది. ఐపీవో ద్వారా రూ.4.05 కోట్లను సమీకరిస్తారు. రూ.10 ముఖ విలువతో ఒక్కో షేరు ఇష్యూ ధరను రూ.61గా నిర్ణయించారు. మహిళలే నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఇటీవలే శానిటరీ న్యాప్కిన్స్, డైపర్స్ తయారీలోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్ బజార్ బ్రాండ్ పేరుతో ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభించిన 2012లో రూ.10 లక్షల టర్నోవర్ నమోదు చేసింది. 2019–20లో రూ.20 కోట్ల టర్నోవర్ ఆర్జించింది. మూలధన అవసరాలు, ఉత్పత్తుల విస్తరణకు ఐపీవో నిధులను వెచ్చించనున్నారు. కంపెనీ బోర్డు సభ్యులుగా దిన్నె లక్ష్మి జుమాల్, జయశ్రీ గద్దె, రంగినేని వినిత, ప్రియాంక వంగల, ఎస్.దుర్గ ఉన్నారు. -
ఐపీవో జోష్... రెండు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు బుల్జోష్లో సాగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పడుతున్నాయి. తాజాగా శ్యామ్ మెటాలిక్స్ ఈ నెల 14 నుంచీ ఐపీవో చేపడుతుండగా.. మరో రెండు కంపెనీలు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, గ్లెన్మార్క్ లైఫ్సైన్సెస్ కంపెనీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పబ్లిక్ ఇష్యూకి అనుమతించమంటూ సెబీకి.. ఉత్కర్ష్ స్మాల్ బ్యాంక్ మార్చిలో ప్రాథమిక పత్రాలతో దరఖాస్తు చేయగా.. గ్లెన్మార్క్ లైఫ్ ఏప్రిల్లో ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఉత్కర్ష్ బ్యాక్గ్రౌండ్ ఐపీవోలో భాగంగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 600 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ఉత్కర్ష్ కోర్ఇన్వెస్ట్ విక్రయానికి ఉంచనుంది. వారణాసి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉత్కర్ష్ ఐపీవో(ఈక్విటీ జారీ) నిధులను టైర్-1 పెట్టుబడుల పటిష్టతకు, భవిష్యత్ పెట్టుబడులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. 2009 నుంచి మైక్రోఫైనాన్స్ సంస్థగా కార్యకలాపాలు కొనసాగించిన ఉత్కర్ష్ తదుపరి 2017లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా ఆవిర్భవించింది. 2020 సెప్టెంబర్ నాటికి 528 బ్యాంకింగ్ ఔట్లెట్లతో 2.74 మిలియన్ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. మైక్రోఫైనాన్స్ ద్వారానే అధిక మొత్తంలో రుణాలను విడుదల చేస్తోంది. ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లలో కార్యకలాపాలు విస్తరించింది. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ ఇష్యూ సైజ్: రూ. 1,160. 1,160 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను, రూ .2 చొప్పున 73.05 లక్షల షేర్లకు ఆఫర్ ఫర్ సేల్ జారీ చేయాలని గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ యోచిస్తోంది. వాటా విధానం ప్రకారం, ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సమిష్టిగా 13.15 కోట్ల షేర్లు ఉన్నాయి. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ .43 లక్షల నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 313 కోట్ల రూపాయలు. చదవండి : Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర -
18 నుంచి ఐఆర్ఎఫ్సీ ఐపీవో
న్యూఢిల్లీ: పీఎస్యూ సంస్థ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 18న ప్రారంభంకానుంది. తద్వారా కంపెనీ రూ. 4,600 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు. ఈ నెల 20న ముగియనున్న ఐపీవోకు ధరల శ్రేణి రూ. 25–26గా తెలియజేశారు. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 15న షేర్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ విలువ రూ. 10 కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 575 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 178 కోట్ల షేర్లు పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 178.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో ప్రభుత్వం 59.4 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. మరో 118.8 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,544 కోట్లు లభించనున్నాయి. వెరసి తొలిసారి రైల్వే రంగ ఎన్బీఎఫ్సీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్కానున్నట్లు నిపుణులు తెలియజేశారు. 1986లో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఎఫ్సీ ప్రధానంగా దేశ, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్ల నుంచి చౌకగా నిధులను సమీకరిస్తుంటుంది. తద్వారా దేశీ రైల్వే విభాగానికి ఆస్తుల కొనుగోలు, ఫైనాన్సింగ్ తదితర సేవలను అందిస్తుంటుంది. అంతేకాకుండా దేశీ రైల్వేల అధిక బడ్జెటరీ వ్యయాలకు అవసరమైన నిధులు సమకూర్చుతుంది. 2017 ఏప్రిల్లో కేంద్ర కేబినెట్ రైల్వే కంపెనీలను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ఇర్కాన్ (ఐఆర్సీవోఎన్) ఇంటర్నేషనల్, రైట్స్(ఆర్ఐటీఈఎస్), రైల్ వికాస్ నిగమ్, రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఇప్పటికే ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయ్యాయి. -
కరోనా ఉన్నా... ఆల్టైమ్ హైకి.. ఈక్విటీ నిధుల సమీకరణ
ముంబై: కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థితిగతులను అల్లకల్లోలం చేసింది. కానీ మన దేశంలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ఈక్విటీ మార్గంలో నిధుల సమీకరణ జోరును ఆపలేకపోయింది. ఈక్విటీ మార్కెట్ ద్వారా వివిధ కంపెనీలు ఐపీఓ, ఓఎఫ్ఎస్, ఇతర మార్గాల్లో రూ.1.78 లక్షల కోట్లు సమీకరించాయి. ఇప్పటివరకూ ఇదే రికార్డ్ స్థాయి. గత ఏడాది సమీకరించిన నిధులు(రూ.82,241 కోట్లు)తో పోల్చితే ఇది 116 శాతం అధికం. 2017లో సమీకరించిన రూ. 1,60,032 కోట్ల నిధుల సమీకరణ రికార్డ్ ఈ ఏడాది బద్దలైంది. ప్రైమ్ డేటాబేస్ వెల్లడించిన వివరాల ప్రకారం... ► కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు)ల్లో రిటైల్ ఇన్వెస్టర్లు జోరుగా పాల్గొనడం, ఐపీఓకు వచ్చిన కంపెనీలు స్టాక్మార్కెట్ లిస్టింగ్లో భారీ లాభాలు సాధించడం, క్యూఐపీ, ఇన్విట్స్/రీట్స్ మార్గంలో కంపెనీలు రికార్డ్ స్థాయిలో నిధులు సమీకరించడం... ఈ ఏడాది చెప్పుకోదగ్గ విశేషాలు. ► ఈ ఏడాది ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ రూ.26,611 కోట్లుగా ఉంది. గత ఏడాది 16 కంపెనీలు ఐపీఓకు వచ్చి రూ.12,382 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది 15 కంపెనీలు ఐపీఓల ద్వారా 26,611 కోట్లు సమీకరించాయి. గత ఏడాది ఐపీఓ నిధులతో పోల్చితే ఇది 115 శాతం అధికం. ► నిధుల సమీకరణ–ఎఫ్పీఓల(ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.15,024 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా రూ.21,458 కోట్లు, క్యూఐపీల ద్వారా రూ.84,501 కోట్లు, ఇన్విట్స్/రీట్స్ ద్వారా రూ.29,715 కోట్లుగా ఉన్నాయి. ► బాండ్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తం, రూ.7,485 కోట్లను కూడా కలుపుకుంటే ఈక్విటీ మార్కెట్ల ద్వారా కంపెనీలు రాబట్టిన మొత్తం నిధులు రూ.1,84,953 కోట్లకు పెరుగుతాయి. ఎస్బీఐ కార్డ్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.10,341 కోట్లు సమీకరించింది. ఈ ఏడాది ఇదే అతి పెద్ద ఐపీఓ. -
ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్కు యాంకర్ నిధులు
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ తొలి రోజు(మంగళవారం) 39 శాతం బిడ్స్ దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 11.58 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. ప్రస్తుతం 4.54 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో అత్యధికంగా 85 శాతం దరఖాస్తులు లభించాయి. ఇష్యూలో భాగంగా 35 యాంకర్ ఇన్వెస్టర్ సంస్థలకు షేరుకి రూ. 33 ధరలో 4.23 కోట్లకుపైగా షేర్లను కేటాయించింది. తద్వారా దాదాపు రూ. 140 కోట్లు సమీకరించింది. ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, మిరాయి అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ తదితరాలున్నాయి. టైర్-1 క్యాపిటల్ కోసం గురువారం(22న) ముగియనున్న ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఐపీవోకి ధరల శ్రేణి రూ. 32-33కాగా.. 450 షేర్లను ఒక లాట్గా కేటాయించారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 450 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 518 కోట్లవరకూ సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూ నిధులతో టైర్-1 క్యాపిటల్ను పటిష్టపరచుకోనుంది. తద్వారా భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోనున్నట్లు ప్రాస్పెక్టస్లో కంపెనీ పేర్కొంది. కంపెనీ తొలుత పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని ఆశించింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి మెరుగుపడటంతోపాటు, క్యాపిటల్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ప్రణాళికలను సవరించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ప్రమోటర్ వాటా పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటికి అదనంగా రూ. 280 కోట్ల విలువైన షేర్లను సైతం జారీ చేయనుంది. ఐపీవో తదుపరి బ్యాంక్లో ప్రమోటర్ల వాటా 82 శాతానికి పరిమితంకానుంది. 2021 సెప్టెంబర్కల్లా ఈ వాటాను 40 శాతానికి తగ్గించుకోవలసి ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆపై 2028 సెప్టెంబర్కల్లా 26 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉన్నట్లు వివరించారు. మూడో కంపెనీ పబ్లిక్ ఇష్యూ పూర్తయ్యాక ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన మూడో కంపెనీగా నిలవనుంది. ఎన్బీఎఫ్సీ ఈక్విటాస్ హోల్డింగ్స్కు పూర్తి అనుబంధ సంస్థ ఇది. ఇప్పటికే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ పొందాయి. క్రిసిల్ నివేదిక ప్రకారం బ్యాంకింగ్ ఔట్లెట్స్ ద్వారా 2019లో ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ తొలి ర్యాంకులో నిలిచింది. ఈ విభాగంలో నిర్వహణలోని ఆస్తులు, డిపాజిట్ల రీత్యా రెండో పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. దేశీయంగా ఏయూఎంలో 16 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. -
ఐపీవోలు కళకళ
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు జూలై–సెప్టెంబర్ కాలంలో ర్యాలీ చేయడం ప్రైమరీ మార్కెట్కు కలిసొచ్చింది. సుమారు ఎనిమిది కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. 850 మిలియన్ డాలర్ల (రూ.6,290 కోట్ల) నిధులను సమీకరించాయి. ప్రస్తుత ఏడాది రెండో అర్ధభాగం (జూలై–డిసెంబర్)లో ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ మెరుగ్గా ఉండొచ్చని ఈవై నివేదిక తెలియజేసింది. ఈ సంస్థ 2020 సంవత్సరం మూడో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) ఐపీవో ధోరణులపై సోమవారం నివేదిక విడుదల చేసింది. రియల్ ఎస్టేట్, ఆతిథ్యం, నిర్మాణం, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ కంపెనీలు నిధుల సమీకరణలో చురుగ్గా ఉన్నాయి. 2019 సెప్టెంబర్ త్రైమాసికంలో 12 ఐపీవోలు రాగా, ప్రస్తుత ఏడాది ఇదే కాలంలో ఇవి ఎనిమిదికి పరిమితం కావడం గమనార్హం. అయితే, ఐపీవోలు సంఖ్యాపరంగా తక్కువగానే కనిపించినా సమీకరించిన నిధులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అధికంగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో 12 ఐపీవోలు కలసి సమీకరించిన మొత్తం 652 మిలియన్ డాలర్లు (రూ.4,824 కోట్లు)గానే ఉంది. బడా ఐపీవో ఒక్కటే... ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో మైండ్స్పేస్ బిజినెస్ పార్క్ ఆర్ఈఐటీ ఐపీవో అతిపెద్దదిగా ఉంది. ఈ సంస్థ 602 మిలియన్ డాలర్లను (రూ.4,320 కోట్లు) సమీకరించింది. ‘‘ప్రధాన మార్కెట్లలో (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) 2020 క్యూ3లో నాలుగు ఐపీవోలు వచ్చాయి. కానీ 2019 క్యూలో 3 ఐపీవోలే వచ్చాయి. ఇక ఈ ఏడాది రెండో క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లో ఒక్క ఐపీవో లేదు. దీంతో 2020 సెప్టెంబర్ క్వార్టర్లో 33 శాతం వృద్ధి కనిపిస్తోంది’’ అని ఈవై ఇండియా తెలిపింది. ఇక ఎస్ఎంఈ మార్కెట్లలో నాలుగు ఐపీవోలు నిధుల సమీకరణ పూర్తి చేసుకున్నాయి. 2020లో ఇప్పటి వరకు ఐపీవోల సంఖ్యా పరంగా భారత్ అంతర్జాతీయంగా తొమ్మిదో స్థానంలో ఉన్నట్టు ఈవై ఇండియా తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీవో కార్యకలాపాలు 14 శాతం పెరిగాయని.. 872 ఐపీవోలు 43 శాతం అధికంగా 165.3 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయని ఈ నివేదిక వివరించింది. కల్యాణ్ జువెల్లర్స్ ఐపీవోకి గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ: ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదముద్ర లభించింది. ఈ ఐపీవో ద్వారా సుమారు రూ. 1,750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగా రూ. 1,000 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. కల్యాణ్ జువెల్లర్స్ ప్రమోటర్ టీఎస్ కల్యాణరామన్ దాదాపు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను, హైడెల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సుమారు రూ. 500 కోట్లు విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నాయి. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కల్యాణ్ జువెల్లర్స్ నిర్వహణ మూలధన అవసరాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం వినియోగించనుంది. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి కంపెనీకి దేశవ్యాప్తంగా 107, మధ్యప్రాచ్య దేశాల్లో 30 షోరూమ్లు ఉన్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ ఆఫర్ ప్రారంభం ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంగళవారం(అక్టోబర్ 20న) ఐపీఓ ప్రారంభం కానుం ది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఇష్యూ గురువారం(అక్టోబర్ 22న)ముగిస్తుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.517.6 కోట్లు సమీకరించనుంది. ఈ ఏడాదిలో 12వదైన ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.32–33 మధ్య ఉంది. -
నేటి నుంచి మూడు ఐపీఓలు
ప్రైమరీ మార్కెట్ మళ్లీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో కళకళలాడుతోంది. గతవారమే మూడు కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ వారం... అదీ...నేటి(మంగళవారం) నుంచి మరో మూడు ఐపీఓలు (–మజగావ్ డాక్ షిప్బిల్డర్స్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్) సందడి చేయనున్నాయి. గతవారం ఐపీఓలకు మంచి స్పందన వచ్చినట్లే ఈ ఐపీఓలకు కూడా ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభించవచ్చని అంచనా. గురువారం (అక్టోబర్ 1న) ముగిసి వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే ఈ ఐపీఓలకు సంబంధించి మరిన్ని వివరాలు... మజగావ్ డాక్ షిప్బిల్డర్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్న తొలి ప్రభుత్వ రంగ ఐపీఓ ఇది. రూ.135–145 ప్రైస్బాండ్తో వస్తున్న ఈ ఇష్యూ సైజు రూ.444 కోట్లు. కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేయాలి. లిస్టింగ్ లాభాలు, దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ఐపీఓకు దరఖాస్తు చేయవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్పీ) 90 శాతం(రూ.125–130) రేంజ్లో ఉండటంతో లిస్టింగ్లో మంచి లాభాలు వస్తాయని నిపుణులంటున్నారు. యూటీఐ ఏఎమ్సీ ఈ వారంలో వస్తున్న అతి పెద్ద ఐపీఓ ఇదే. రూ.552–554 ప్రైస్బాండ్తో వస్తున్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,260 కోట్లు సమీకరించగలదని అంచనా. కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.40–42 రేంజ్లో ఉంది. లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయిల్, గ్యాస్పైప్లైన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలందించే ఈ కంపెనీ ఐపీఓ ప్రైస్బాండ్ రూ. 117–120గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.20 రేంజ్లో ఉంది. -
ఆర్బీఐ, ప్రపంచ పరిణామాలే కీలకం!
న్యూఢిల్లీ: ఆర్బీఐ పాలసీ, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్కు కీలకాంశాలని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు వాహన విక్రయ గణాంకాలు, మౌలిక, తయారీ రంగ సంబంధిత గణాంకాలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు....మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం(వచ్చే నెల2న) సెలవు కావడంతో ట్రేడింగ్ ఈ వారం నాలుగు రోజులే జరగనున్నది. మరో వైపు మంగళవారం నుంచి మూడు ఐపీఓలు–యూటీఐ ఏఎమ్సీ, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల ఐపీఓలు మొదలు కానున్నాయి. గురువారం ఆర్బీఐ పాలసీ.. మారటోరియం రుణాలపై వడ్డీకి సంబంధించిన కేసు ఈ నెల 28న (నేడు–సోమవారం)సుప్రీం కోర్టులో విచారణకు రానున్నది. బుధవారం (ఈ నెల 30న) ఆగస్టు నెలకు సంబం«ధించిన మౌలిక రంగ గణాంకాలు వెల్లడవుతాయి. వచ్చే నెల 1(గురువారం) ఆర్బీఐ పాలసీ వెల్లడి కానున్నది. అదే రోజు వాహన కంపెనీలు సెప్టెంబర్ నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. మరోవైపు సెప్టెంబర్ నెలకు సంబంధించి తయారీ రంగ పీఎమ్ఐ గణాంకాలు కూడా గురువారమే రానున్నాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లండ్ల జీడీపీ గణాంకాలు, అమెరికాకు సంబంధించి పీఎమ్ఐ గణాంకాలు వెల్లడవుతాయి. ఒడిదుడుకులు కొనసాగుతాయ్.... గత శుక్రవారం రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకున్నా, యూరప్లో కరోనా కేసులు పెరుగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో మార్కెట్లో ఒడిదుడుకులకు అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. రూ. 476 కోట్ల విదేశీ నిధులు వెనక్కి.... విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.476 కోట్లు వెనక్కి తీసుకున్నారు. గత వారంలో ఎఫ్పీఐలు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.10,491 కోట్లు నికర అమ్మకాలు జరిపారు. యూరప్, ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్ల అప్రమత్తతను ఇది సూచిస్తోందని నిపుణులంటున్నారు. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ ఈక్విటీ మార్కెట్ నుంచి నికరంగా రూ.4,016 కోట్లు ఉపసంహరించుకోగా, డెట్ మార్కెట్లో నికరంగా రూ. 3,540 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద నికరంగా రూ.476 కోట్లు ఉపసంహరించుకున్నారు. -
ఆఫర్.. సూపర్!
న్యూఢిల్లీ: కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల జోరు మొదలైంది. సోమవారం మొదలై బుధవారం ముగిసిన రెండు ఐపీఓలకు మంచి స్పందనే లభించింది. మరోవైపు ఈ నెల 29 నుంచి మరో మూడు కంపెనీలు–యూటీఐ ఏఎమ్సీ, మజగావ్ డాక్ షిప్బిల్డర్స్, లిఖితా ఇన్ఫ్రా ఐపీఓలు రానున్నాయి. మరిన్ని వివరాలు.... క్యామ్స్ ఐపీఓ.. 47 రెట్లు స్పందన మ్యూచువల్ ఫండ్స్కు రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్గా వ్యవహరించే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్(క్యామ్స్) ఐపీఓ 47 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. రూ.1,229–1,230 ప్రైస్బాండ్తో ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,242 కోట్లు సమీకరించనున్నది. ఈ కంపెనీ ఈ వారంలోనే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.666 కోట్లు సమీకరించింది. వచ్చే నెల 1న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్పీ) రూ.340–360 రేంజ్లో ఉంది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. 29 నుంచి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైస్ బ్యాండ్ రూ.117–120 ఆయిల్, గ్యాస్ పైప్లైన్కు సంబంధించిన మౌలిక సదుపాయాల సేవలందించే లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ ఈ నెల 29 నుంచి మొదలై అక్టోబర్ 1న ముగుస్తుంది. రూ.117–120 ప్రైస్బ్యాండ్ ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓలో భాగంగా 25.86 శాతం వాటాకు సమానమైన 51 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాలి. వచ్చే నెల 12న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. శ్రీనివాసరావు గడ్డిపాటి, లిఖిత గడ్డిపాటిలు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీ భారత్–నేపాల్ల మధ్య పైప్లైన్ నిర్మాణాన్ని ఇటీవలనే పూర్తి చేసింది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా యూనిస్టోన్ క్యాపిటల్ వ్యవహరిస్తోంది. వచ్చే వారమే మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ ఇష్యూ! ప్రభుత్వ రంగ రక్షణ కంపెనీ మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ ఐపీఓ కూడా ఈ నెల 29 నుంచే మొదలయ్యే అవకాశాలున్నాయి. వచ్చే నెల 1న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450–550 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. ప్రైస్బ్యాండ్ను ఇంకా కంపెనీ నిర్ణయించలేదు. రూ.140–150 రేంజ్లో ఉండొచ్చని అంచనా. మార్కెట్ లాట్ 90–100 షేర్ల రేంజ్లో ఉండొచ్చు. ఈ షేర్లు వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధనౌకలు, జలాంతర్గాముల రిపేర్లు నిర్వహిస్తోంది. ఇతర క్లయింట్ల వాణిజ్య నౌకల రిపేర్లను కూడా చేస్తోంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,566 కోట్ల ఆదాయంపై రూ. 415 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది ఐపీఓకు వస్తోన్న తొలి ప్రభుత్వ రంగ కంపెనీ ఇది. కెమ్కాన్ ఐపీఓ...149 రెట్లు కెమ్కాన్ స్పెషాల్టీ కెమికల్స్ ఐపీఓ 149 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. రూ.338–340 ప్రైస్బ్యాండ్తో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.318 కోట్లు సమీకరించనున్నది. వచ్చే నెల 1న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.310–320 రేంజ్లో ఉంది. ఈ కంపెనీ గత శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.95 కోట్లు సమీకరించింది. కాగా ఏంజెల్ బ్రోకింగ్ ఐపీఓ ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ ఐపీఓ నేడు (గురువారం) ముగుస్తోంది. యూటీఐ ఏఎమ్సీ 29 నుంచి.. యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ ఈ నెల 29 నుంచి మొదలవుతుందని సమాచారం. వచ్చే నెల 1న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ప్రైస్బ్యాండ్ రూ.750–760 రేంజ్లో ఉండొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.170–180 రేంజ్లో ఉంది. వచ్చే నెల 12న యూటీఐ ఏఎమ్సీ షేర్లు స్టాక్మార్కెట్లో లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా వ్యవహరిస్తున్నాయి. -
ఈ ఏడాదీ ‘షేర్ల’ పండుగే!
సాక్షి, బిజినెస్ విభాగం: ఈ ఏడాది కూడా ఐపీఓ మార్కెట్ జోరుగా ఉండనున్నది. రూ.50,000 కోట్లకు మించి ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లు రానున్నాయి. తాజాగా ప్రకటించిన ఎల్ఐసీ ఐపీఓ కూడా ఈ ఏడాదే వస్తే... నిధుల సమీకరణ మొత్తం రూ. 1.5 లక్షల కోట్ల కు ఎగబాకే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ కార్డ్స్, యూటీఐ ఏఎమ్సీ వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది ఐపీఓకు వస్తాయని, గత ఏడాది కంటే ఈ ఏడాదే ఐపీఓల జోరు బాగా ఉండగలదని నిపుణులంటున్నారు. 2019లో 16 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. రూ.12,300 కోట్ల మేర సమీకరించాయి.. ఇక ఈ ఏడాది కనీసం 20–30 కంపెనీలు ఐపీఓకు వస్తాయని, నిధుల సమీకరణ నాలుగు రెట్లకు పెరగవచ్చని విశ్లేషకులంటున్నారు. ఐపీఓ జోరు కొనసాగుతుందా ? గత ఏడాది స్టాక్ మార్కెట్ రికార్డ్ల మీద రికార్డ్లు సృష్టించింది. ఐపీఓకు వచ్చిన కంపెనీలు అదరగొట్టే లాభాలనివ్వడం, ప్రతి ఐపీఓ కూడా అనేక రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కావడంతో ఈ ఏడాది కూడా ఐపీఓ జోరు కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. ఈ ఏడాది కనీసం 40 కంపెనీల ఐపీఓలు మార్కెట్ను ముంచెత్తుతాయని అంచనా. అంతర్జాతీయంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంక్లు ఉదార ద్రవ్య విధానాన్ని అనుసరించే అవకాశాలుండటంతో గ్లోబల్ లిక్విడిటీ మన మార్కెట్ను ముంచెత్తుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఆర్సీటీసీ, సీఎస్బీ బ్యాంక్ వంటి ఐపీఓలు గత ఏడాది ఊహించనంతగా విజయం కావడంతో కార్పొరేట్లలో విశ్వాసం పెరిగింది. ఇక గత ఏడాది ఐపీఓకు వచ్చిన షేర్లు ఇన్వెస్టర్లకు లిస్టింగ్లో మంచి లాభాలనే ఇచ్చాయి. సగటున ఐపీఓ షేర్ల రాబడి 40 శాతానికి పైగానే ఉండటం విశేషం. ఐఆర్సీటీసీ, ఆఫిల్ ఇండియా, ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్లు ఇష్యూ ధర కంటే రెట్టింపునకు పైగా పెరిగాయి. 30కి పైగా కంపెనీలు... ఈ ఏడాది ఇప్పటివరకూ 10 కంపెనీలకు పైగా ఐపీఓలకు సెబీ అనుమతిచ్చింది. వీటి విలువ రూ.16,000 కోట్ల మేర ఉంది. సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య గత ఏడాది 28 ఉండగా, 2018లో 72, 2,017లో 46గా ఉన్నాయి. ఇక సెబీ ఆమోదం కోసం మరో 11 కంపెనీల ఐపీఓలు ఎదురు చూస్తున్నాయి. వీటి విలువ రూ.21,200 కోట్లమేర ఉంటుంది. సెబీ ఆమోదం పొందిన ఐపీఓల జాబితాలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (రూ.9,000 కోట్లు) మజగావ్ డాక్ షిప్బిల్డర్స్, రూట్ మొబైల్(ఇష్యూ సైజు–రూ.600 కోట్లు), సంహి హోటల్స్ (రూ.2,000 కోట్లు), ఐఆర్ఈడీఏ(రూ.750 కోట్లు), శ్యామ్ స్టీల్, బజాజ్ ఎనర్జీ(రూ.5,450 కోట్లు), సత్యశ్రీ ప్రెజర్, అన్నై ఇన్ఫ్రా డెవలపర్స్, బర్గర్ కింగ్ ఇండియా(రూ.1,000 కోట్లు), పురానిక్ బిల్డర్స్(రూ.1,000 కోట్లు), ఈజీ ట్రిప్ ప్లానర్స్(రూ.510 కోట్లు), మోంటొకార్లో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి కనీసం రూ. 40,000–50,000 కోట్ల రేంజ్లో నిధులు సమీకరించనున్నాయి. నిధుల సమీకరణ... ఐపీఓనే మేలు మార్గం గత ఐదేళ్లలో రానన్ని కంపెనీలు ఈ ఏడాది ఐపీఓకు వస్తాయని శామ్కో సెక్యూరిటీస్ ఎనలిస్ట్ ఉమేశ్ మెహతా అంచనా వేస్తున్నారు. నిధుల సమీకరణ విషయంలో కూడా ఈ ఏడాది అదరగొడుతుందని పేర్కొన్నారు. భారత్లో మూలధనానికి కొరత తీవ్రంగా ఉందని, దీర్ఘకాలిక మూలధన నిధుల సమీకరణకు ఐపీఓ మంచి మార్గమని వివరించారు. హెచ్డీబీ ఫైనాన్షియల్, ఎస్బీఐ కార్డ్స్, బర్గర్ కింగ్ తదితర ఐపీఓకు మంచి స్పందన లభించే అవకాశాలున్నాయన్నారు. కాగా ఇన్వెస్టర్లకు ప్రీమి యమ్ షేర్లు సమంజసమైన ధరలకే లభించే ఏకైక మార్గం ఐపీఓనే కావడం కంపెనీలకు కలసివచ్చే అంశం. ఎల్ఐసీ మెగా ఐపీఓ.. ఎవ్వరూ ఊహించని విధంగా ఎల్ఐసీని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేస్తామని బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని అంచనా. ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత ఐపీఓకు వస్తామని ఎల్ఐసీ వర్గాలు వెల్లడించాయి. ఇష్యూ సైజు, ఎంత వాటా విక్రయిస్తారు అనేదానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే ఎల్ఐసీలో కనీసం 10% వాటాను ఐపీఓ ద్వారా విక్రయిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇష్యూ సైజు రూ.90,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. భారత్లో ఇప్పటివరకూ అతిపెద్ద ఐపీఓ (రూ.15,000 కోట్లు)గా కోల్ ఇండియా రికార్డ్ను ఎల్ఐసీ బ్రేక్ చేయనుంది. ఈ ఏడాది రానున్న మరికొన్ని ఇష్యూలు శ్రీ భజరంగ్ పవర్, ఎన్సీడీఈఎక్స్, హిందుజా లేలాండ్ ఫైనాన్స్, టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధం), హెచ్డీబీ ఫైనాన్షియల్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏఎమ్సీ, పీఎన్బీ మెట్లైఫ్, యాక్సిస్ బ్యాంక్ ఏఎమ్సీ, ఆదిత్య బిర్లా ఏఎమ్సీ, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్. ఇష్యూ ధర కీలకం... మార్కెట్ బలహీనంగా ఉంటే, ఐపీఓల జోరు తగ్గుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ పతన బాటలో ఉంటే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటుందని, దీంతో కంపెనీలు ఐపీఓలు వాయిదా వేసే అవకాశాలు అధికంగా ఉంటాయని వారంటున్నారు. ఐపీఓ సక్సెస్ కావడానికి ఇష్యూ ధర కీలకమని షేర్ఖాన్ అనలిస్ట్ హేమంగ్ జని వ్యాఖ్యానించారు. మార్కెట్ స్థితిగతులూ కీలకమేనని, ఈ రెండూ బావుంటే గత ఏడాది కంటే అధికంగానే ఈ ఏడాది ఐపీఓలు వస్తాయని వివరించారు. -
ఐపీఓ నిధులు అంతంతే!
ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్న ప్రభావం కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నిధుల సమీకరణపై పడింది. ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు 60 శాతం మేర తగ్గాయి. గత ఏడాది ఐపీఓల ద్వారా రూ.30,959 కోట్లుగా ఉన్న ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ ఈ ఏడాది రూ.12,362 కోట్లకు తగ్గింది. గత ఏడాది 24 కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ ఏడాది 16 కంపెనీలే ఐపీఓకు వచ్చాయి. ఈ వివరాలను క్యాపిటల్ మార్కెట్ గణాంకాలను అందించే ప్రైమ్ డేటాబేస్ వెల్లడించింది. మరిన్ని వివరాలు.... ► ఈ ఏడాది క్యూ2 జీడీపీ ఏడేళ్ల కనిష్ట స్థాయి, 4.5 శాతానికి పడిపోయింది. జీడీపీ మెరుగుపడుతున్న సూచనలు ఏమీ లేవు. రూ.51,000 కోట్ల సమీకరణ నిమిత్తం సెబీ ఆమోదం పొందిన 47 కంపెనీల ఐపీఓల గడువు తీరిపోవడం ఈ విషయాన్ని మరింత ప్రతిబింబిస్తోంది. ► ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ 60 శాతం తగ్గినా, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్), క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ)ల ద్వారా నిధుల సమీకరణ మాత్రం మెరుగ్గానే ఉంది. ఈ రెండు మార్గాల ద్వారా గత ఏడాది వివిధ కంపెనీలు రూ.63,651 కోట్లు సమీకరించాయి. ఇది ఈ ఏడాది రూ.81,174 కోట్లకు పెరిగింది. 2017తో పోల్చితే(రూ.1,60,032 కోట్లు) ఇది 49% తక్కువ. ► ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓగా స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ నిలిచింది. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.2,850 కోట్లు. ► ఈ ఏడాది వచ్చిన మొత్తం 16 ఐపీఓల్లో ఏడు కంపెనీల ఐపీఓలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ ఐపీఓలు 10 రెట్లకు పైగా సబ్స్క్రైబయ్యాయి. ► ఐఆర్సీటీసీ ఐపీఓ 109 రెట్లు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్బ్యాంక్ వంద రెట్లకు మించి సబ్స్క్రైబయ్యాయి. ► లిస్టింగ్ లాభాల్లో ఈ ఏడాది ఐపీఓలు అదరగొట్టాయి. ► ఐపీఓకు వచ్చిన కంపెనీల షేర్లు వాటి ఇష్యూ ధరల కంటే దిగువకు పడిపోవడం గత కొన్నేళ్లలో పరిపాటిగా ఉండేది. ఈ ఏడాది దీనికి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో 3 కంపెనీల షేర్లు మాత్రమే ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయాయి. మిగిలిన 13 కంపెనీల షేర్లు 21–170 శాతం రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► ఈ ఏడాది ఐపీఓ నిధుల సమీకరణ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా ప్రమోటర్లు బాగానే లాభపడ్డారు. 2018లో ఓఎఫ్ఎస్ ద్వారా రూ.10,672 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.25,811 కోట్లు వచ్చాయి. ► ఈ ఏడాది ప్రభుత్వ వాటాల విక్రయం(డిజిన్వెస్ట్మెంట్)కు కలిసిరాలేదు. డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.1,05,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇప్పటిదాకా రూ.17,744 కోట్లు (17 శాతం మాత్రమే) సమీకరించింది. ► వచ్చే ఏడాది ఐపీఓలు ఆశావహంగానే ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ 21 కంపెనీలు ఐపీఓల కోసం సెబీ ఆమోదం పొందాయి. ఈ కంపెనీలు రూ.18,700 కోట్లు సమీకరించనున్నాయి. మరో 13 కంపెనీలు సెబీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవి రూ.18,000 కోట్ల సమీకరించడం కోసం సెబీకి దరఖాస్తు చేశాయి. -
ఐపీవో, ఎఫ్పీవో, ఈసాప్లకు ఎల్టీసీజీ రాయితీ
న్యూఢిల్లీ: ఐపీవోలు, బోనస్, రైట్స్ ఇష్యూలు, ఈసాప్ల విషయంలో కేంద్రం ఇన్వెస్టర్లకు కాస్తంత వెసులుబాటు ఇచ్చింది. వీటిపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) చెల్లించకపోయినప్పటికీ రాయితీతో కూడిన 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)కు అర్హత కల్పించింది. 2018–19 బడ్జెట్లో ప్రభుత్వం రాయితీతో కూడిన 10 శాతం ఎల్టీసీజీని షేర్ల అమ్మకంపై ప్రవేశపెట్టింది. లాభం రూ.లక్ష మించితే 10 శాతం ఎల్టీసీజీ పన్ను పడుతుంది. అయితే, కొనుగోలు సమయంలో ఎస్టీటీ చెల్లించాలన్న నిబంధన ఉంది. ఎస్టీటీ చెల్లింపు కింద తాజాగా వీటికి మినహాయింపు కల్పిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్ఆర్ఐలు, క్యూఐబీలు, వెంచర్ క్యాపిటలిస్ట్లు సైతం ఎస్టీటీ చెల్లించకపోయినా సరే 10 శాతం రేటుకు అర్హులవుతారు. ఎస్టీటీ చెల్లించకపోయి, లావాదేవీలు మినహాయింపు జాబితాలో లేకపోతే అప్పుడు షేర్ల విక్రయంపై 20 శాతం ఎల్టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్వల్ప కాలం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
ఈ ఐపీఓలకు ఏమైంది..?
(సాక్షి, బిజినెస్ విభాగం) : ప్రైమరీ మార్కెట్లో సందడి చేసిన అనేక కంపెనీల ఐపీఓలు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) సెకండరీ మార్కెట్కు వచ్చే సరికి చతికిలపడిపోతున్నాయి. పలు సంస్థల ప్రకటనలు మూలధన సమీకరణకే పరిమితమైపోతున్నాయి. ఐసీఓ సమయంలో అది చేస్తాం, ఇది చేస్తాం.. కంపెనీ సమర్థత ఓ స్థాయిలో ఉందని చెప్పి ఓవర్ వాల్యుయేషన్స్ కట్టుకున్న అనేక కంపెనీల అసలు రంగు నెమ్మదిగా బయటపడుతోంది. గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.500 కోట్లకు మించి నిధులను సమీకరించిన కంపెనీల జాబితాలో 33 సంస్థలుండగా వీటిలో ఏకంగా 17 కంపెనీల ప్రస్తుత మార్కెట్ ధరలు ఇష్యూధర కంటే కూడా దిగువకు పడిపోయాయి. వీటిలో 3 కంపెనీలు ఇన్వెస్టర్ల పెట్టుబడిని సగానికిపైగా హరించేశాయి. మార్కెట్ పైకి.. షేరు ధర కిందకి గడిచిన ఏడాదికాలంలో సెన్సెక్స్ 12 శాతం వృద్ధిని నమోదుచేసింది. గతేడాదిలో అయితే ఏకంగా 28 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో భారీ పతనాలున్నప్పటికీ మొత్తంగా చూస్తే మేజర్ గ్లోబల్ మార్కెట్ల కంటే అధిక లాభాలనే పంచింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా, రష్యా మార్కెట్లతో పోలిస్తే అవుట్ పెర్ఫార్మర్గానే నిలిచింది. ప్రధాన సూచీలు ఇలా ఉంటే.. తాజాగా ఐపీఓకు వచ్చి సెకండరీ మార్కెట్లోకి అడుగుపెట్టిన పలు కంపెనీలు ఇష్యూ ధర కంటే 11– 69 శాతం శాతం దిగువన ట్రేడవుతున్నాయి. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. దేశంలోనే అతి పెద్ద సాధారణ బీమా సంస్థగా ప్రైమరీ మార్కెట్లో సందడిచేసిన ‘న్యూ ఇండియా అష్యూరెన్స్’ ఐపీఓ ఆ తరువాత కాలంలో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. రూ.770– 800 ధరల శ్రేణినితో వచ్చి రూ.800 వద్ద 1.19 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ రూ.9,600 కోట్లు సమీకరించింది. లిస్టింగ్ రోజునే 6.39 శాతం డిస్కౌంట్తో షాకిచ్చి.. క్రమంగా పడిపోతూ ఏడాది కూడా పూర్తికాకముందే 70 శాతం పెట్టుబడిని ఆవిరిచేసింది. ప్రస్తుతం రూ.244 వద్ద ఉంది. ప్రభుత్వ రంగ సంస్థే ఇంతటి ఓవర్ వాల్యుయేషన్స్తో వచ్చి తమను దెబ్బతీస్తుందని ఎలా ఊహిస్తామన్నది రిటైల్ ఇన్వెస్టర్ల మాట. జనరల్ ఇన్సూరెన్స్దీ అదే దారి... ప్రభుత్వ రంగంలోని మరో బీమా సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఐపీఓ సైతం ఇదే తీరును ప్రదర్శించింది. రూ.11,373 కోట్ల సమీకరణ లక్ష్యంతో అతిపెద్ద ఐపీఓగా సందడి చేసి చివరకు భారీ నష్టాలను మిగిల్చిందీ సంస్థ. ఇష్యూ ధర రూ.912 కాగా, మంగళవారం నాటి మార్కెట్ ముగింపు సమయానికి రూ.354 వద్ద నిలిచింది. గతేడాది అక్టోబరులో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ ఇప్పటివరకు షేరు ధరలో 63 శాతం పతనాన్ని నమోదు చేసింది. ఇక ఐపీఓ ద్వారా రూ.515 కోట్లను సమీకరించిన పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ ఎస్ చాంద్ అండ్ కంపెనీ కూడా ఇన్వెస్టర్ల పెట్టుబడిని సగం చేసింది. ఇష్యూ ధర రూ.670 ఉండగా, ప్రస్తుతం రూ.300 స్థాయిలో కొనసాగుతోంది. షేరు ధర 54 శాతం కరిగిపోయింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ రోడ్ నెట్వర్క్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ సహా పలు కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. అధిక విలువలే అసలు కారణం..! కొనేవారు ఉండాలే కానీ, కొన్ని పరిమితులకు లోబడి షేరు ప్రీమియంను నిర్ణయించుకునే వెసులుబాటు కంపెనీలకు ఉంది. ఈ పరిమిత స్వేచ్ఛను ఆసరాగా తీసుకునే పలు కంపెనీలు ఐపీఓ ధరల శ్రేణిని అధిక వాల్యుయేషన్స్ వద్ద ప్రకటించేస్తున్నాయి. ఇలా అధిక విలువతో ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్టర్లను ఊదరగొడుతున్నప్పటికీ... సెకండరీ మార్కెట్లో క్రమంగా అసలు విలువ బయటపడుతోంది. ఈ క్రమంలోనే తాజా 17 కంపెనీల షేరు ధరలో పతనం నమోదైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సత్తా చూపిన అవెన్యూ సూపర్ మార్ట్స్ వాల్యుయేషన్స్ పక్కాగా ఉన్న కంపెనీలలో పెట్టుబడి పదిలంగా ఉండడమే కాకుండా, లాభాలు వందల శాతాల్లోనే ఉంటాయనే దానికి ‘డీ మార్ట్’ రిటైల్ చైన్ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ ఐపీఓ అద్ధం పట్టింది. ఈ కంపెనీ ఇష్యూ ధర కేవలం రూ.299 కాగా, ప్రస్తుతం రూ.1,534 స్థాయిలో కొనసాగుతోంది. ఏడాదిన్నర కాలంలోనే 413 శాతం రాబడిని అందించింది. 2017 ఐపీఓ మార్కెట్ వేడిలోనే పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 94 శాతం, బంధన్ బ్యాంక్ 66 శాతం లాభాలను అందించాయి. విలువ సరిగ్గా ఉండడం, నిర్వహణ సజావుగా కొనసాగడం, వ్యాపార ధోరణిలో సత్తా ఉండడం వంటి అంశాల కారణంగా ఇదే తరహాలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఐపీఓలు ఇష్యూ ధర కంటే 45 శాతానికి మించి రాబడిని అందించాయి. -
పబ్లిక్, రైట్స్ ఇష్యూ.. రయ్రయ్!
ముంబై: ఐపీవోలు, టేకోవర్, రైట్స్ ఇష్యూలకు సంబంధించి కీలక మార్పులకు సెబీ ఓకే చెప్పింది. ఐపీవో ధరల శ్రేణిని 2 రోజుల ముందు ప్రకటించే విధానానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐపీవో ప్రారంభానికి ఐదు రోజులు ముందుగానే ధరల్ని ప్రకటించాల్సి ఉంది. దీన్ని రెండు రోజులకు తగ్గించే సవరణకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలకు సెబీ ఆమోదముద్ర వేసింది. ఇంకా పలు సవరణలకు కూడా ఆమోదం తెలుపుతూ గురువారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఐపీవోలకు వెసులుబాట్లు ఐపీవో, రైట్స్ ఇష్యూలకు వచ్చే కంపెనీలు ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆర్థిక ఫలితాల వివరాలను వెల్లడించాలన్న నిబంధన ఉంది. దీన్ని ఇక నుంచి మూడు ఆర్థిక సంవత్సరాలకు సెబీ తగ్గించింది. అదేవిధంగా, కన్సాలిడేటెడ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ వివరాలనే పత్రాల్లో వెల్లడించాలని సెబీ పేర్కొంది. స్టాండలోన్, సబ్సిడరీల ఆర్థిక ఫలితాలు, వివరాలను కంపెనీ వెబ్సైట్లో పేర్కొంటే సరిపోతుందని తెలియజేసింది. యాంకర్ ఇన్వెస్టర్ సైజు కనీస పరిమితిని రూ.2 కోట్లకు తగ్గించింది. సబ్బ్రోకర్ల కేటగిరీని ఎత్తేసి, వారిని అధీకృత వ్యక్తులు లేదా ట్రేడింగ్ సభ్యులుగా పరిగణించనుంది. సెబీ ఈ నిర్ణయాలు తీసుకునే ముందు ప్రైమరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీ సిఫారసులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది.ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ (ఐసీడీర్)కు సంబంధించి వెల్లడించాల్సిన వివరాల్లో గందరగోళాన్ని తొలగించడమే తాజా నిర్ణయాలకు కారణమని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు. ఎండీ పదవీ కాలంలో మార్పులు డిపాజిటరీ, క్లియరింగ్ కార్పొరేషన్, స్టాక్ ఎక్సేంజ్ వంటి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లలో (ఎంఐఐలు) అర్హత కలిగిన దేశీయ, విదేశీ కంపెనీలు 15 శాతం వాటా తీసుకునేందుకు అనుమతించడం కూడా సెబీ తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి. ఇక ఎంఐఐలకు ఎండీగా వ్యవహరించేవారు రెండు పర్యాయాలు 5 సంవత్సాల చొప్పున లేదా 65 ఏళ్లు వీటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుందని సెబీ వెల్లడించింది. ఇక ఎంఐఐలకు పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్లు మూడేళ్లు చొప్పున మూడు పర్యాయాలు మాత్రమే లేదా 75 ఏళ్లు ఏది ముందు అయితే అంతకాలం పాటే పదవుల్లో ఉండగలరని తెలిపింది. సరైన దిశలోనే సెబీ ఈ నిర్ణయాలు తీసుకుందని ఖైతాన్ అండ్ కో పార్ట్నర్ ఆదిత్య చెరియన్ పేర్కొన్నారు. వివరాల వెల్లడిలో పాత విధానాలను తొలగించి ఇన్వెస్టర్లు ఆఫర్ పత్రాలను అర్థం చేసుకుని, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయన్నారు. కీలక అంశాలు ►ఇకపై ఐపీవోకు రెండు రోజుల ముందు ధరలు (ప్రైస్ బ్యాండ్) ప్రకటిస్తే చాలు. ►ఐపీవోలు, రైట్స్ ఇష్యూలకు వచ్చే కంపెనీలు మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫలితాల వివరాలు వెల్లడిస్తే చాలు. ►స్టాక్ ఎక్సేంజ్లు, డిపాజిటరీలు, క్లియరింగ్ కార్పొరేషన్లలో 15 శాతం వాటా కొనుగోలుకు అర్హత కలిగిన దేశ, విదేశీ సంస్థలకు అనుమతి. ►ప్రమోటర్ గ్రూపు గుర్తింపునకు షేర్హోల్డింగ్ ప్రారంభ పరిమితి 10 శాతం నుంచి 20శాతానికి పెంపు. ►సెక్యూరిటీల చట్టం కింద థర్డ్ పార్టీ అస్సైన్మెంట్కు సంబంధించిన నిబంధనల సవరణకు చర్చాపత్రం. ► వాట్సాప్లో ఆర్థిక ఫలితాల సమాచారం లీకులపై మరింతగా దర్యాప్తు. ► యాంకర్ ఇన్వెస్టర్ సైజు రూ.2 కోట్లకు తగ్గింపు. ►ఇకపై సబ్బ్రోకర్లు అధీకృత వ్యక్తులు లేదా ట్రేడింగ్ సభ్యులుగా పరిగణింపు. సబ్బ్రోకర్లకు తాజా రిజిస్ట్రేషన్ ఇక మీదట ఉండదు. వాట్సాప్ లీకులపై మరింత దర్యాప్తు కొన్ని కంపెనీలకు సంబంధించి స్టాక్ ధరల్ని ప్రభావితం చేసే సమాచారాన్ని వాట్సాప్లో లీక్ చేసిన ఉదంతంలో సెబీకి 4 నివేదికలు అందాయి. దీనిపై తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు త్యాగి తెలిపారు. ఈ కేసులో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, బాటా ఇండియాలకు వ్యతిరేకంగా ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించడం తెలిసిందే. అంతర్గత విచారణ చేపట్టాలని ఈ కంపెనీలను కోరినట్టు త్యాగి చెప్పారు. నాలుగు నివేదికలు తమకు అందాయన్నారు. ఈ విషయంలో అవసరమైన చర్యల్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయమై 12 కంపెనీలు సెబీ నిఘాలో ఉన్నాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలకు సరిపోలే సమాచారాన్ని ముందుగానే వాట్సాప్ వేదికలపై లీక్ చేసినట్టు సెబీ తన ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఐసీఐసీఐ నుంచి ఇంకా జవాబు రాలేదు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచర్పై వచ్చిన అభియోగాలపై వివరణ కోరామని త్యాగి చెప్పారు. ఆ బ్యాంక్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి జవాబు రాలేదన్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలు ఇచ్చింది. ఈ రుణాల విషయంలో చందా కొచర్ కుటుంబ సభ్యుల లబ్ది పొందారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విషయమై ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు జరుగుతుండటంతో, ఈ దర్యాప్తు పూర్తయ్యేవరకూ సెలవుపై వెళ్లాలన చందా కొచర్ నిర్ణయించుకున్నారని ఐసీఐసీఐ బ్యాంక్ ఇటీవలే పేర్కొంది. -
రెండు ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ రెండు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు ఆమోదం తెలిపింది. దేవీ సీ ఫుడ్స్, ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ ఐపీఓలకు పచ్చజెండా ఊపటంతో ఈ ఏడాది సెబీ ఆమోదం పొందిన ఐపీఓల సంఖ్య 18కు చేరింది. దేవీ సీఫుడ్స్: విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.900 కోట్ల రేంజ్లో ఉండొచ్చు. ఐపీఓలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు కొంత వాటా షేర్లను విక్రయిస్తారు. 1992లో ఆరంభమైన ఈ కంపెనీ సీఫుడ్ను (ముఖ్యంగా రొయ్యలు) ఎగుమతి చేస్తోంది. ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.500 కోట్లని అంచనా. ఐపీఓలో భాగంగా 76.65 లక్షల షేర్లను ఆపర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఆఫర్ చేయనున్నది. 1970లో ప్రారంభమైన ఈ కంపెనీ ఆహార పదార్ధాలు, ప్లాస్టిక్స్, రబ్బర్లు, పెయింట్స్, ఇంక్లు, కాస్మోటిక్స్, కోటింగ్స్, ల్యూబ్స్ తదితర ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలను తయారు చేస్తోంది. -
యాప్కీ కహానీ...
రానున్న ఐపీఓలు, ఎస్ఎంఈ ఐపీఓలు, ఎన్సీడీలు, బాండ్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు ‘ఐపీఓ గైడ్’ యాప్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ రన్నింగ్/అప్కమింగ్ ఐపీఓల సమాచారం తెలుసుకోవచ్చు. ♦ రానున్న ఎస్ఎంఈ ఐపీఓలు, ఎన్సీడీలు, బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు చూడొచ్చు. ♦ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన స్టాక్ టిప్స్ పొందొచ్చు. ♦ ఐపీఓలో పాల్గొన్నవారు అలాట్మెంట్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. అలాగే రానున్న ఐపీఓలకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నవారు బేసిక్ వివరాలు అందిస్తే సంస్థ ఎగ్జిక్యూటివ్స్ ఐపీఓ/ఎన్సీడీ/బాండ్ల దరఖాస్తుకు సహాయపడతారు. ♦ యాప్లో ఐపీఓ/ఎన్సీడీ/ ఎస్ఎంఈ ఐపీఓ/ బాండ్లకు సంబంధించిన ఐపీఓ తేదీ, ప్రైస్ బ్యాండ్, లిస్టింగ్ తేదీ, సబ్స్క్రిప్షన్ వివరాలు, కంపెనీ సమాచారం వంటి వివరాలు అందుబాటులో ఉన్నాయి. ♦ ఐపీఓల పనితీరు ఎలా ఉందో గమనించొచ్చు. ♦ ఐపీఓ ఎప్పుడు ప్రారంభమౌతుంది.. ఎప్పుడు ముగుస్తుంది.. ఎప్పుడు లిస్టవుతుంది.. వంటి విషయాలను అలర్ట్స్ రూపంలో పొందొచ్చు. ♦ ఐపీఓ క్యాలెండర్ కూడా అందుబాటులో ఉంది. గమనిక: కేవలం ఈ యాప్ ఆధారంగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ను సంప్రదించండి. -
2018లోనూ ఐపీఓల జోరు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) జోరుగా వచ్చాయని ఎర్నస్ట్ అండ్ యంగ్ (ఈవై) తాజా నివేదిక పేర్కొంది. ఈ ఏడాదిలో దాదాపు 153 కంపెనీలు ఐపీఓల ద్వారా 1,160 కోట్ల డాలర్లు సమీకరించాయని వివరించింది. వచ్చే ఏడాది కూడా ఇదే జోరు కొనసాగుతుందంటున్న ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ♦ ఈ ఏడాది అక్టోబర్– డిసెంబర్ కాలానికి మొత్తం 22 కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులు సమీకరించాయి. గత ఏడాది ఇదే కాలానికి వచ్చిన ఐపీఓలతో పోలిస్తే ఇది 47% అధికం. ♦ ఈ ఏడాది బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎస్ఎంఈ ప్లాట్ఫార్మ్లపై వచ్చిన మొత్తం ఐపీఓల సంఖ్య 153. గత ఏడాది వచ్చిన ఐపీఓలతో పోలిస్తే ఇది 74 శాతం ఎక్కువ. అంతేకాకుండా ఇటీవల కాలంలో రికార్డ్ స్థాయిలో నిధుల సమీకరణ కూడా ఇదే ఏడాది జరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను, పెరుగుతున్న ఇన్వెస్టర్ల పెట్టుబడి దాహాన్ని ప్రతిబింబిస్తోంది. ♦ యూరప్, మధ్య ఆసియా, భారత్, ఆఫ్రికా(ఈఎంఈఐఏ) ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే భారత్లోనే అధికంగా (550 కోట్ల డాలర్ల మేర) ఐపీఓల నిధుల సమీకరణ జరిగింది. హా ఈఎంఈఐఏ ప్రాంతంలో అతి పెద్ద ఐపీఓగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొ ఐపీఓ నిలిచింది. ఈ కంపెనీ 170 కోట్ల డాలర్లు సాధించింది. ♦ ఈఎంఈఐఏ ప్రాంతంలో టెక్నాలజీ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల ఐపీఓలు అగ్రస్థానాల్లో నిలిచాయి. ♦ హా భారత్లో రాజకీయంగా సుస్థిరత నెలకొనడం, సంస్కరణలు కొనసాగుతుండటం, అమెరికాలో పన్ను సంస్కరణల కారణంగా భవిష్యత్తులో ఐపీఓల జోరు కొనసాగుతుంది. ♦ విదేశీ ఇన్వెస్టర్లు భారత్పై మళ్లీ దృష్టిసారిస్తుండటం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బాగా ఉండటంతో భారత్లో ఇన్వెస్ట్మెంట్ వాతావరణం నెలకొన్నది. ♦ రానున్న నెలల్లో పెట్టుబడులు పెట్టడానికి వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఆకర్షణీయంగా నిలవనున్నది. ఐపీఓ మార్కెట్ జోరుగా పెరుగుతుండటం, ఆర్థిక వృద్ధి పుంజుకుంటుండటం దీనికి ప్రధాన కారణాలు. ♦ మార్కెట్ వేల్యుయేషన్లు అధికంగా ఉండటం వల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెద్ద స్థాయి వాటాదార్లకు తమ వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించుకోవడం మంచి లాభాలు పొందే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. -
ఐపీవోలపై ఝున్ఝున్ వాలా స్పందన
న్యూఢిల్లీ: ఒకవైపు దేశంలో ఐపీవోల హవా నడుస్తుండగా భారతీయ ప్రధాన స్టాక్మార్కెట్ పెట్టుబడిదారు రాకేష్ ఝున్ఝున్ దేశీయ ఐపీవోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భారత ఐపీవోలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్ల కొత్త గరిష్టాలు, పెట్టుబడుల ప్రవాహం నేపథ్యంలో ప్రస్తుతం ఐపీవోలకు దూరంగా ఉండాలని తాను విస్తున్నట్టు చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ 2018 ఔట్లుక్ సమ్మిట్ లో ప్రసంగించిన ఝున్ఝున్ ఐపీవో మార్కెట్పై ఎక్కువ ప్రచారం జరుగుతోందని వీటికి దూరంగా ఉండాలని సూచించారు. అందుకే ఇటీవలి ఐపీవోలకు తాను దూరంగా ఉన్నానని ఇండియన్ వారెన్ బఫెట్ చెప్పారు. ఈ ఏడాది ఐపీఓలలో రికార్డుస్థాయిలో 11 బిలియన్ డాలర్లు సేకరించిందనీ, అయితే, హై వాల్యూమ్స్, ముఖ్యంగా ఇటీవల కొన్ని ఇన్సూరెన్స్ ఐపిఒలకు ఐపీవోలకు సెకండరీ మార్కెట్లో స్పందన బలహీనంగా ఉందని పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడిందన్నారు. 2016తరువాత భారీగా ర్యాలీ అయిన ఈక్విడీ మార్కెట్లు స్వల్ప-కాలిక వెనుకంజలో ఉన్నాయనీ, కానీ బుల్ మార్కెట్లో పతనం చాలా తీవ్రంగా ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ ఆదాయాలు పుంజుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 30 తో ముగిసిన త్రైమాసికంలోఈ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అలాగే 2018 సంవత్సరంలో రూపాయి మరింత బలహీనపడనుందని అంచనా వేశారు. -
ఈ వారంలో రెండు ఐపీవోలు
రూ.1,200 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: ఈ వారంలో డిక్సన్ టెక్నాలజీస్, భారత్ రోడ్ నెట్వర్క్ ఐపీవోలు నిధుల సమీకరణకు ప్రజల ముందుకు రానున్నాయి. ఈ రెండు ఐపీవోలు 6వ తేదీ మొదలై 8వ తేదీతో ముగుస్తాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ అయిన డిక్సన్ టెక్నాలజీస్ ఒక్కో షేరుకు రూ.1,760–1,766 ధరల శ్రేణి నిర్ణయించింది. ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 30,53,675 షేర్లతోపాటు రూ.60 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఐపీవో ద్వారా రూ.600 కోట్లను సమీకరించనుంది. ఈ నిధులను తిరుపతిలో ఎల్ఈడీ తయారీ యూనిట్ ఏర్పాటుకు, ఎల్ఈడీ లైటింగ్ ఉత్పత్తులు, ఐటీ సామర్థ్యాల బలోపేతానికి, రుణాల చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఐడీఎఫ్సీ బ్యాంకు, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, యెస్ సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. రహదారుల నిర్మాణ సంస్థ అయిన భారత్ రోడ్ నెట్వర్క్ ఒక్కో షేరుకు రూ.195–205ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఐపీవోలో మొత్తం 2.93 కోట్ల షేర్లను కంపెనీ విక్రయించనుంది. శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్కు ఇది అనుబంధ కంపెనీ. ఐపీవో ద్వారా రూ.600 కోట్ల వరకు నిధుల సమీకరణ చేయనుంది. ఇంగా క్యాపిటల్, ఇన్వెస్టెక్ క్యాపిటల్ సర్వీసెస్, శ్రేయి క్యాపిటల్ మార్కెట్స్ ఐపీవోకు మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతాయి. -
సెప్టెంబర్లో ఐపీవోల జాతర!!
♦ పబ్లిక్ ఇష్యూకి రానున్న నాలుగు కంపెనీలు ♦ రూ. 2,500 కోట్ల సమీకరణ ∙ ♦ లిస్టులో మ్యాట్రిమోనీడాట్కామ్ కూడా న్యూఢిల్లీ: మెరుగుపడిన ఇన్వెస్టర్ల సెంటిమెంటు ఊతంతో ఇటీవలి కాలంలో కంపెనీలు మళ్లీ ఐపీవోల బాట పట్టాయి. సెప్టెంబర్లో నాలుగు సంస్థలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. రూ. 2,500 కోట్లు సమీకరించనున్నాయి. ఈ జాబితాలో ఆన్లైన్ వివాహ సేవల సంస్థ మ్యాట్రిమోనీడాట్కామ్, భారత్ రోడ్ నెట్వర్క్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్, నిర్మాణ రంగ కంపెనీ కెపాసిటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ నాలుగూ వచ్చే నెల ఐపీవోకి రాబోతున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ఐపీవో నిధులను ప్రధానంగా విస్తరణ ప్రణాళికలకోసం, రుణాల చెల్లింపునకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం ఆయా సంస్థలు వినియోగించనున్నాయి. ఈసారి మెరుగే..: గతేడాది మొత్తం 26 కంపెనీలు మొత్తం రూ. 26,000 కోట్లు సమీకరించాయి. ఐపీవోలకి సంబంధించి ఆరేళ్లలో ఇవే అత్యుత్తమ గణాంకాలు. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఐపీవో విభాగం గతేడాది కన్నా మెరుగ్గానే ఉండగలదని పరిశీలకులు భావిస్తున్నారు. మధ్యమధ్యలో హెచ్చుతగ్గులు ఉంటున్నప్పటికీ .. మార్కెట్లో బులిష్ సెంటిమెంట్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు ఇరవైకి పైగా కంపెనీలు సెబీకి ఐపీవో ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 17 కంపెనీలు ఇనీషియల్ షేర్ సేల్ ఆఫర్ల ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించాయి. ఇందులో బీఎస్ఈ, అవెన్యూ సూపర్మార్ట్స్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో), ఎరిస్ లైఫ్సైన్సెస్, కొచిన్ షిప్యార్డ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. ఐపీవోల వివరాలు.. 1. భారత్ రోడ్ నెట్వర్క్ శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్కి సంబంధించిన ఈ సంస్థ ఐపీవో సెప్టెంబర్ 6–8 మధ్యలో రానుంది. రూ. 10 ముఖవిలువ చేసే 29.30 లక్షల ఈక్విటీ షేర్లను ఈ సందర్భంగా విక్రయించనున్నారు. రూ. 1,200 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. 2. డిక్సన్ టెక్నాలజీస్.. సుమారు రూ. 600–650 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత షేర్ హోల్డర్లు 37,53,739 షేర్లను విక్రయించనుండగా, కొత్తగా మరో రూ. 60 కోట్ల విలువ చేసే షేర్లను ఐపీవోలో జారీ చేయనున్నారు. ఈ ఇష్యూ కూడా సెప్టెంబర్ 6న మొదలై 8తో ముగియనుంది. 3. మ్యాట్రిమోనీడాట్కామ్.. భారత్మ్యాట్రిమోనీ బ్రాండ్ కింద ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక సేవలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా రూ. 350 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్ ఫర్ సేల్ కింద 37,67,254 షేర్లను, కొత్తగా రూ. 130 కోట్లు విలువ చేసే షేర్లను జారీ చేయనుంది. 4. కెపాసిటీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.400 కోట్లు సమీకరించవచ్చని అంచనా. -
ఈ వారం రెండు ఐపీఓలు
మ్యూజిక్ బ్రాడ్కాస్ట్.. రూ.400 కోట్లు అవెన్యూ సూపర్ మార్ట్స్.. రూ.1,870 కోట్లు న్యూఢిల్లీ: ఈ వారంలో రెండు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)లు రానున్నాయి. రేడియో సిటీ ఎఫ్ఎం రేడియో చానళ్లన్నీ నిర్వహించే జాగరణ్ ప్రకాశన్ గ్రూప్కు చెందిన మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, డి–మార్ట్ రిటైల్ సూపర్ మార్కెట్ చెయిన్ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్లు ఈ ఐపీఓల ద్వారా రూ.2,300 కోట్ల వరకూ నిధులు సమీకరించనున్నాయి. ఈ నెల 6 నుంచి మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐపీఓ దేశవ్యాప్తంగా 37 నగరాల్లో రేడియో సిటీ బ్రాండ్ కింద ఎఫ్ంఎ రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్న మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఐపీఓ ఈ నెల 6 న ప్రారంభం కానున్నది. 8వ తేదీన ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో 26.59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ధరల శ్రేణి రూ.324–333గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 17న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావచ్చని అంచనా. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను..లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డిబెంచర్ల ఉపసంహరణకు వినియోగిస్తారు. గత శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీ రూ.146 కోట్లు సమీకరించింది. ఈ నెల 8 నుంచి డి–మార్ట్ ఐపీఓ డి–మార్ట్ రిటైల్ చెయిన్ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ ఐపీఓ ఈ నెల 8న ప్రారంభం అవుతుంది. ఈ నెల 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,870 కోట్లు సమీకరించనున్నది. ధరల శ్రేణిని రూ.295–299గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 21న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావచ్చని అంచనా. గతేడాది రూ.3,000 కోట్ల పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ.