భారీ నష్టాల్లో సెన్సెక్స్ (-321)
ఐటీ, టెక్నాలజీ, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల బాట పట్టాయి.
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ఐటీ, టెక్నాలజీ, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల బాట పట్టాయి.
నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 321 పాయింట్ల పతనంతో 24234 వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల క్షీణించి 7235 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఓదశలో సెన్సెక్స్ 24528 పాయింట్ల, నిఫ్టీ 7,325 గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి.
ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ అత్యధికంగా 7.84 శాతం నష్టపోగా, జిందాల్ స్టీల్ 3.40, ఐడీఎఫ్ సీ 2.97, హెచ్ సీఎల్ టెక్ 2.83 విప్రో 2.81 శాతం నష్టపోయాయి. హిండాల్కో, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, ఎం అండ్ ఎం, అల్ట్రా టెక్ సిమెంట్స్, ఎన్ టీపీసీలు స్వల్ప లాభాల్ని నమోదు చేసుకున్నాయి.