5 రోజుల నష్టాలకు చెక్ | Sensex snaps 5-day fall, recovers 41 points on value buying | Sakshi
Sakshi News home page

5 రోజుల నష్టాలకు చెక్

Published Tue, May 6 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

5 రోజుల నష్టాలకు చెక్

5 రోజుల నష్టాలకు చెక్

ఎట్టకేలకు ఐదు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. రోజంతా ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి.

 ఎట్టకేలకు ఐదు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. రోజంతా ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 41 పాయింట్లు లాభపడి 22,445 వద్ద నిలవగా, నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 6,699 వద్ద స్థిరపడింది. రోజులో సెన్సెక్స్ గరిష్టంగా 22,592, కనిష్టంగా 22,354 పాయింట్లను తాకింది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 473 పాయింట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయిల్, మెటల్ రంగాలు 1%పైగా పుంజుకోగా, ఐటీ 1% స్థాయిలో డీలాపడింది. ఎఫ్‌ఐఐలు రూ. 280 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ సంస్థలు రూ. 225 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.

 హిందాల్కో 5% అప్
 సెన్సెక్స్ దిగ్గజాలలో హిందాల్కో 5% జంప్‌చేయగా, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్, ఐటీసీ 2-1% మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా, టాటా పవర్, భారతీ, ఇన్ఫోసిస్, విప్రో 2.3-1.3% మధ్య నీరసించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement