మరో 30 వేల కొత్త కొలువులు: టెక్ మహీంద్రా | Tech Mahindra plans increasing global seating capacity by 30000 | Sakshi
Sakshi News home page

మరో 30 వేల కొత్త కొలువులు: టెక్ మహీంద్రా

Published Mon, Dec 22 2014 12:33 PM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

మరో 30 వేల కొత్త కొలువులు: టెక్ మహీంద్రా

మరో 30 వేల కొత్త కొలువులు: టెక్ మహీంద్రా

ఐటీ సంస్థ టెక్ మహీంద్రా వచ్చే రెండేళ్లలో 30,000 మందిని కొత్తగా నియమించుకోనుంది.

హైదరాబాద్: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా వచ్చే రెండేళ్లలో 30,000 మందిని కొత్తగా నియమించుకోనుంది. తద్వారా సంస్థ ఉద్యోగుల సంఖ్య 1.25 లక్షలకు ఎగబాకనుంది. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాలతోపాటు వైజాగ్, జైపూర్, భువనేశ్వర్ కేంద్రాల్లో ఈ విస్తరణ ఉంటుందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సి.పి.గుర్నాణి తెలిపారు.

‘వైజాగ్‌లో సుమారు 1,500 మంది పనిచేస్తున్నారు. ఈ నగరంలో కంపెనీకి కొత్తగా స్థల కేటాయింపులు పూర్తి అయ్యాయి. భువనేశ్వర్‌లో మరో బ్లాక్‌ను జోడిం చాం. గత కొన్నేళ్లుగా పరిశోధన, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. ఆదాయాల్లో 2-3 శాతం ఇందుకోసం వ్యయం చేస్తున్నాం’ అని చెప్పారు. టెక్ మహీంద్రాకు హైదరాబాద్ కేంద్రం అతిపెద్దదని, ఈ కేంద్రంలో 20,000 మందికిపైగా పనిచేస్తున్నారని వివరించారు. ఇక్కడికి సమీపంలోని బహదూర్‌పల్లి ఫెసిలిటీలో ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటుకు సుమారు రూ.600 కోట్ల మొత్తాన్ని వెచ్చించినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement