Vizag
-
స్టేడియంకు YSR పేరును తొలగింపు.. కన్నబాబు స్ట్రాంగ్ రియాక్షన్
-
విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లకు జనాదరణ కరువు.. ప్రచారంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైఫల్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో రెండు మ్యాచ్లు విశాఖ వేదికగా జరుగనున్నాయి. మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. మార్చి 30న ఢిల్లీ సన్రైజర్స్ హైదరబాద్ను ఢీకొట్టనుంది. ఢిల్లీ, లక్నో మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఢిల్లీ, సన్రైజర్స్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. లక్నోతో జరుగబోయే తొలి మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిన్ననే విశాఖకు చేరుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖను రెండో హోం గ్రౌండ్గా ఎంచుకోవడంతో ఇక్కడ బీసీసీఐ రెండు మ్యాచ్లను షెడ్యూల్ చేసింది. గతేడాది కూడా ఢిల్లీ రెండు మ్యాచ్లను విశాఖలో ఆడింది. నాడు సీఎస్కే, కేకేఆర్తో జరిగిన మ్యాచ్లకు మంచి ప్రజాదరణ లభించింది. అయితే ఈ సీజన్లో జరుగబోయే మ్యాచ్లకే జనాదరణ కరువైంది. మ్యాచ్లకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం వల్ల టికెట్ల అమ్మకాలు నత్త నడకన సాగుతున్నాయి. మ్యాచ్లపై జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తొలి మ్యాచ్ (లక్నో) ప్రారంభానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉండగా.. ఇప్పటికీ ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోలేదు. ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించి నాలుగు రోజులవుతున్నా ఏమాత్రం జనాదరణ కనిపించడం లేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్ను విశాఖలోనే (లక్నో) ఆడనుంది. ఈ సీజన్లో ఢిల్లీ అక్షర్ పటేల్ నేతృత్వంలో కొంగొత్త జట్టుతో ఉరకలేస్తుంది. కెప్టెన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన అక్షర్కు డిప్యూటీగా అనుభవజ్ఞుడైన ఫాఫ్ డుప్లెసిస్ను నియమించింది ఢిల్లీ మేనేజ్మెంట్.ఈ సీజన్లో ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్లతో కూడిన ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉంది. మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, నటరాజన్లతో బౌలింగ్ విభాగం కూడా ప్రమాదకరంగా ఉంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్ -
Vizag: రుషికొండ బీచ్ కు ఉన్న బ్లూఫాగ్ హోదా రద్దుతో పర్యాటకుల విచారం
-
యమ రిచ్ దొంగ..! మూడు ఫ్లాట్లు భార్యకు, గర్ల్ఫ్రెండ్కు..!
తన కోసం ఆంధ్రప్రదేశ్లో మూడు ఫ్లాట్లు; భార్యకు, గర్ల్ఫ్రెండ్కు రెండు ఇండిపెండెంట్ ఇళ్లు; పెంపుడు శునకం మెడలో ఇండోనేసియా నుంచి రూ.3 లక్షలకు! కొన్న గంట; పబ్కు వెళితే కనీసం రూ.లక్ష, స్పాకు వెళితే కనీసం రూ.2 లక్షల బిల్లు– ఇవన్నీ ఎవరో బిజినెస్మ్యాన్కో, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తికో చెందిన విలాసాలు అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే! విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్గా ఉండి దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని ప్రముఖుల ఇళ్లల్లో చోరీలు చేసిన యమ రిచ్ దొంగ కర్రి సతీష్ అలియాస్ స్పైడర్ సతీష్ వ్యవహారం. ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఒడిశాల్లో వందకు పైగా కేసులు ఉన్నాయి. ఇతణ్ణి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఒడిశా రాజధాని భువనేశ్వర్ అధికారులు కటకటాల్లోకి పంపారు. విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. వాహనాల చోరీలతో పాటు ఓ ఇంట్లో దొంగతనం చేసి తొలిసారిగా 2005లో వైజాగ్ పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. దోపిడీ కేసులో విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేశారు. ఇన్ని కేసులున్నా, సత్తిబాబు విశాఖ నుంచి పాస్పోర్ట్ పొంది, 2010లో సింగపూర్ వెళ్లిపోయాడు. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉండి వెల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేశాడు. తర్వాత తిరిగి వచ్చేసి, 2012 వరకు మొత్తం 16 చోరీలు చేశాడు. సత్తిబాబు కేవలం సంపన్నులు, ప్రముఖుల ఇళ్లనే టార్గెట్గా చేసుకుంటాడు. పగలు రెక్కీ చేసి అర్ధరాత్రి వేళ అపార్ట్మెంట్స్ గోడలు ఎగబాకి ఇళ్లలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఇతడిని స్పైడర్ సతీష్ అని పిలుస్తుంటారు. పోలీసు నిఘా పెరగడంతో సతీష్ వైజాగ్ వదిలి, 2013లో హైదరాబాద్కు వచ్చి చందానగర్లో స్థిరపడ్డాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వీఐపీల ఇళ్లల్లో చోరీలు చేయడంతో ఇతడిపై 12 కేసులు నమోదయ్యాయి. ఈ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బుతో కేపీహెచ్బీ కాలనీలో ఇల్లు, ఓ కారు, ప్రొక్లైనర్ కొని సెటిలైపోయాడు. తర్వాత 2014లో ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకు చిక్కాడు. దీంతో వారికి భారీగా లంచాలు ఇచ్చి, అరెస్టును తప్పించుకున్నాడు. దీనికోసం ఇంటితో పాటు అన్నీ అమ్మేసుకున్నాడు. కొంత లంచం సొమ్మును పోలీసుల బ్యాంకు ఖాతాల్లో కూడా జమ చేశాడు. ఉన్నదంతా పోవడంతో మళ్లీ నేరాలు మొదలెట్టిన సతీష్ 2014లో సూర్యాపేట పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడి వద్ద దొరికిన ఓ బ్యాంకు రసీదు విషయం ఆరా తీస్తే, పోలీసులతో చేసుకున్న సెటిల్మెంట్ వెలుగులోకి వచ్చింది. సతీష్ 2018లో హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖుల ఇళ్లల్లో చోరీలకు పాల్పడి, బెంగళూరుకు ఉడాయించాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 9న బెంగళూరులోని కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం చెవులు దొంగిలించి పార్క్ చేసి ఉన్న కారు పట్టుకుపోయాడు. ఆ కారు నంబర్ తొలగించి, బోగస్ నంబర్ ప్లేట్ తగిలించాడు. అదే నెల 18న సదాశివనగర్లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన ఇంట్లో సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్ పెట్రోలింగ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. చోరీ సమయంలో సత్తిబాబు సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా గ్లౌజ్ ధరిస్తుంటాడు. బెంగళూరు పోలీసుల విచారణలోనే తన టార్గెట్లో జూబ్లీహిల్స్లోని సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇల్లు ఉందని వెల్లడించాడు. అరెస్టు అయినప్పుడల్లా కొత్త పేరు చెప్పే సతీష్కు సత్తిబాబు, సతీష్రెడ్డి, స్టీఫెన్ తదితర పేర్లు కూడా ఉన్నాయి. ఇతడి భార్య మాత్రం ముద్దుగా బుజ్జి అని పిలుస్తుంది. సత్తిబాబుపై హైదరాబాద్ పోలీసులు 2016లో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించి చంచల్గూడ జైలుకు పంపారు. అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్ నరేంద్ర నాయక్, కడపకు చెందిన పి.శ్రీనివాస్లతో ముఠా కట్టాడు. ఆ ఇద్దరూ చిల్లర దొంగలు కావడంతో ‘థింక్ బిగ్’ అంటూ వారికి నూరిపోశాడు. 2018 మార్చ్లో జైలు నుంచి విడుదలైన ఈ త్రయం వరుసపెట్టి చోరీలు చేసింది. శ్రీకాకుళం, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, బంజారాహిల్స్ల్లో పంజా విసిరి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. దీనికి ముందే శ్రీకాకుళం, బెంగళూరు కేసుల్లో అక్కడి అధికారులకు దొరికినా, బయటి ప్రాంతాల్లో చేసిన నేరాల వివరాలు మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ ఏడాది జనవరి 26న ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిరంజన్ పట్నాయక్ ఇంటి నుంచి రూ.50 లక్షల విలువైన సొత్తు చోరీ చేశాడు. ఈ కేసులో ఫిబ్రవరి 13న భువనేశ్వర్ పోలీసులకు చిక్కాడు. విశాఖపట్నంలో కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు ఇంట్లోను, హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డాక్టర్ రామారావు, వెంకట్రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లోను, ఫిలింనగర్ సినార్ వ్యాలీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఎస్ శర్మ ఇంట్లోనూ చోరీలు చేసిన చరిత్ర ఇతడిది. -శ్రీరంగం కామేష్(చదవండి: ఉద్యోగం, వివాహం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే సివిల్స్ సత్తా చాటింది..!) -
వైజాగ్ బీచ్ రోడ్డులో రచ్చ
-
ఐపీఎల్ 2025లో SRH షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్లో జరుగబోయే మ్యాచ్లు ఇవే..!
ఐపీఎల్ 2025 షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదల చేసింది. 65 రోజుల పాటు జరిగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మెగా లీగ్ నిర్వహించబడుతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది.ఇదే ఈడెన్ గార్డెన్స్లో క్వాలిఫయర్-2 (మే 23) మరియు ఫైనల్ మ్యాచ్లు (మే 25) జరుగనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో క్వాలిఫయర్-1 (మే 20) మరియు ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్లు జరుగుతాయి.మార్చి 23న జరిగే సీజన్ రెండో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ను ఎస్ఆర్హెచ్ తమ సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంది. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మొత్తం 14 మ్యాచ్లు ఆడుతుంది (ప్లే ఆఫ్స్ కాకుండా). ఇందులో ఏడు మ్యాచ్లు హైదరాబాద్లో జరుగనున్నాయి. వీటితో పాటు క్వాలిఫయర్-1 (మే 20) మరియు ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్లు కూడా హైదరాబాద్లోనే జరుగుతాయి.విశాఖపట్నంలో రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో ఒకటి సన్రైజర్స్ ఆడే మ్యాచ్ కాగా.. రెండోది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (మార్చి 24) మ్యాచ్.ఈ సీజన్లో సన్రైజర్స్.. ఢిల్లీ, కేకేఆర్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్తో తలో రెండు మ్యాచ్లు ఆడుతుంది. రాజస్థాన్, ఆర్సీబీ, పంజాబ్, సీఎస్కేతో తలో మ్యాచ్ ఆడుతుంది. ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్లు..మార్చి 23 (ఆదివారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)మార్చి 27 (గురువారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్)మార్చి 30 (ఆదివారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (వైజాగ్)ఏప్రిల్ 3 (గురువారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (కోల్కతా)ఏప్రిల్ 6 (ఆదివారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 12 (శనివారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 17 (గురువారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 23 (బుధవారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 25 (శుక్రవారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ సీఎస్కే (చెన్నై)మే 2 (శుక్రవారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్)మే 5 (సోమవారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)మే 10 (శనివారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (హైదరాబాద్)మే 13 (మంగళవారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ (బెంగళూరు)మే 18 (ఆదివారం)- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో (లక్నో)ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు..అథర్వ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమ్రన్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేశ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ -
వైజాగ్లో కింగ్డమ్
వైజాగ్ వెళ్లారట విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘కింగ్డమ్’ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ చిత్రీకరణ ఇప్పటికే 75 శాతానికి పైగా పూర్తయింది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం విజయ్ దేవరకొండ వైజాగ్ వెళ్లారని తెలిసింది.దాదాపు 20 రోజులకు పైగా వైజాగ్లో ‘కింగ్డమ్’ చిత్రీకరణ జరుగుతుందని, కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరణ జరిగేలా ఈ చిత్రదర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేశారని ఫిల్మ్నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, రెండు రకాల టైమ్లైన్స్తో కథ సాగుతుందనే ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ ఆల్రెడీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ‘కింగ్డమ్’ సినిమాను మే 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ఇక ఈ చిత్రమే కాకుండా దర్శకులు రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలాలతో విజయ్ దేవరకొండ ఆల్రెడీ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. -
విశాఖ ఉక్కు కార్మికులకు కేంద్రమంత్రి కుమారస్వామి షాక్
-
హనీ ట్రాప్ కేసులో సీన్ రీ కన్స్ట్రక్షన్
-
స్టీల్స్టాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత మాధవ్
-
Tirupati Stampede: మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది..
వైకుంఠ ద్వారం నుంచి ఆ కలియుగ వేంకటేశ్వరస్వామివారిని దర్శించి పునీతులు కావాలని తరలివచ్చారు. కానీ అధికా రులు, సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు. వారి జ్ఞాపకాలు తలుచుకుని బంధువులు నేటికీ కన్నీటి పర్యంతమవుతున్నారు.తిరుపతి టాస్క్ఫోర్స్: వారిని కదిలిస్తే చాలు.. కన్నీళ్లే సమాధానం చెబుతున్నాయి. తోడుగా ఉన్నవారు దూరమవడంతో దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తల్లిలేని ఆడ బిడ్డల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ ఘటన నుంచి తేరుకోలేక పోతున్నామని, ఆ జ్ఞాపకాలు తలుచుకుని మంచానికే పరిమితమయ్యామని మృతుల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి బైరాగిపట్టెడ, శ్రీనివాసం కౌంటర్లలో ఈనెల 8వ తేదీన జరిగిన తొక్కిలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెల్సిందే. అందులో నలుగురు ఏపీకి చెందిన వారు కాగా ఒకరు తమిళనాడు, మరొకరు కేరళకు చెందిన భక్తులు ఉన్నారు. ఘటన జరిగి సుమారు ఆరు రోజులు కావస్తున్నా మరణించిన భక్తుల రక్తసంబంధీకులు, బంధువులు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కొందరు మంచానికే పరిమితమయ్యామని, జీవితాంతం ఆ లోటు వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారువైజాగ్కు చెందిన మృతురాలు లావణ్య కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. తల్లి దూరమైన ఆ పసిపాపల ఆవేదన వర్ణ నాతీతం. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేమంటూ ఆవేదన చెందుతున్న ఆ పిల్లలను బంధువులు ఓదార్చలేని పరిస్థితి. తల్లిని కోల్పోయా.. మాది కేరళ. ఈనెల 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి కౌంటర్లలో జరిగిన తొక్కిసలాటలో మా తల్లి నిర్మల చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోలేకున్నాం. మా తల్లి నా కళ్ల ఎదుటే తి రుగుతున్నట్లు ఉంది. మా కుటుంబానికి ఆ మే పెద్ద దిక్కు. అలాంటిది తల్లి లేకపోవడం కలచివేస్తోంది. ఏ జన్మలో పాపం చేశానో త ల్లిని పోగొట్టుకున్నాను.–కౌషిగ, మృతురాలు నిర్మల కుమార్తె, కేరళఅమ్మ జ్ఞాపకాలతో..ఊహించని ఘటనతో కుటుంబం అంతా షాక్లోనే ఉంది. దైవదర్శనానికి వెళితే ఇలా జరగడం మనసును కలచివేస్తోంది. అమ్మ జ్ఞాపకాలు ప్రతి క్షణం వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి అమ్మతో కలసి సంతోషంగా గడుపుకున్నాం. ఇప్పుడు నాన్నతో పాటు యావత్ కుటుంబం, బంధువులు విషాదంలో మునిగిపోయి ఉన్నాం. జ్వరాలతో మంచాన పడ్డాం. – మహేష్, మృతురాలు శాంతి కుమారుడు, వైజాగ్మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది మాది వైజాగ్ దగ్గర మద్దెలపాళెం. నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మాకు ఒక్కడే కుమారుడు. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లాం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో నా భార్య రజిని మరణించింది. మా ఇంటి మహాలక్ష్మి మాకు దూరమైంది. ఇంట్లో నేను, నా కుమారుడు ఇద్దరమే మిగిలాం. ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి సంతోషంగా గడిపాం. ఈ ఏడాది ఆమెను దేవుడు దూరం చేశాడు. మా అబ్బాయి విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. – లక్ష్మణరెడ్డి, మృతురాలి భర్త, మద్దెలపాళెం, వైజాగ్ఆయన జ్ఞాపకాలతో కుమిలిపోతున్నా.. వైకుంఠ వాకిలి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలనే తపనతో నా భర్త నాయుడుబాబుతో క లసి 8వ తేదీన తిరుపతికి వచ్చాం. అదే రోజు జరిగిన తొక్కిసలాటలో నా భర్త చనిపోయాడు. కూలి చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న మా కుటుంబంలో ఈ విషాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నా భర్త వెంట లేడనే బాధను దిగమింగుకోలేక పోతున్నా. కుటుంబంలో 90 ఏళ్ల పెద్దవారు ఉన్నా రు. వారి బాగోగులు చూసుకోవాలి. ఆయన తోడు విడిచాడు. నా పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం సాయం అందించింది. నేను పెద్దగా చదువుకున్న దానిని కాదు. అధికారులు ఉద్యోగం నర్సీపట్నంలోనే కల్పిస్తే నాకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది.– మణికుమారి,మృతుడు నాయుడుబాబు సతీమణి, నర్సీపట్నం -
మరో కుట్రకు తెరతీసిన విశాఖ ఉక్కు యాజమాన్యం
విశాఖ,సాక్షి: విశాఖ ఉక్కుపై (vizag steel) నీలినీడలు కమ్ముకున్నాయి. కార్మికులను సాగనంపేందుకు యాజమాన్యం కుట్రకు తెరతీసింది. ఇందులో భాగంగా కార్మికుల్ని సాగనంపేందుకు సిద్ధమైంది. వీఆర్ఎస్ (vrs) పథకం అమలుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.తద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైంది.కాగా,వీఆర్ఎస్ నిర్ణయంపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ తీవ్రంగా మండిపడుతుంది. వీఆర్ఎస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కార్మికులు వీఆర్ఎస్ తీసుకోవద్దని పోరాట కమిటీ పిలుపు నిచ్చింది. అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలేనని అంటున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దసరాకు బోనస్ , దీపావళికి జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వీఆర్ఎస్ పేరుతో యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.👉ఇదీ చదవండి : బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..! -
నితీశ్ రెడ్డికి వైజాగ్లో ఘన స్వాగతం.. ఓపెన్టాప్ జీపులో! వీడియో
టీమిండియా యువ సంచలనం, ఆంధ్ర స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తన టెస్టు అరంగేట్ర సిరీస్లోనే అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్లో అడుగు పెట్టిన నితీశ్.. తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.తొలిసారి ఆసీస్ గడ్డపై అడినప్పటికి నితీశ్లో కొంచెం కూడా భయం కన్పించలేదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర కుర్రాడు సత్తాచాటాడు. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని తన అంతర్జాతీయ సెంచరీని కూడా నితీశ్ అందుకున్నాడు. మెల్బోర్న్లో అతడి చేసిన సెంచరీ తన కెరీర్లో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బీజీటీ సిరీస్లో ఐదు టెస్టుల్లో నితీశ్ ఐదు టెస్టుల్లో 37.25 సగటుతో 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెడ్డి రెండో స్ధానంలో నిలిచాడు. బౌలింగ్లోనూ 5 వికెట్లతో మెరిశాడు.వైజాగ్లో గ్రాండ్ వెలకమ్..ఇక ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటిన నితీష్ కుమార్ రెడ్డి తన స్వస్థలమైన విశాఖకు గురువారం చేరుకున్నాడు. విమానాశ్రయంలో ఈ తెలుగు తేజానికి ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ముంచెత్తారు. పలువురు అభిమానులు ఆటోగ్రాఫ్లు, ఫొటోలు తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఇంటికి ర్యాలీగా వెళ్లారు. ఓపెన్ టాప్ జీపులో ముందు సీట్లో నితీశ్ రెడ్డి కూర్చోగా.. వెనుక ఆయన తండ్రి ముత్యాలరెడ్డి ఉన్నారు. అభిమానులతో గాజువాక వీధులు కిక్కిరిసిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: SA T20: జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ చిత్తునితీష్ శనివారం అకాడమిలో శిక్షణకు వెళ్లనున్నాడు. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్తో జరగనున్న టీ20లు, వన్డే మ్యాచ్లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. కాగా నితీశ్ ఇప్పటికే టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేశాడు. గతేడాది ఆక్టోబర్లో బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో నితీశ్ రెడ్డి డెబ్యూ చేశాడు.బంగ్లాతో సిరీస్లో కూడా అతడు అద్బుతంగా రాణించాడు. అయితే టీ20, టెస్టుల్లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ఈ వైజాగ్ కుర్రాడు.. ఇప్పుడు వన్డేల్లో కూడా డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు 21 ఏళ్ల నితీశ్ను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అతడు అక్కడ తన సత్తాచాటితే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశముంది. ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 22న ఈడెన్ గార్డెన్స్తో జరగనున్న తొలి టీ20తో ఇంగ్లండ్ భారత పర్యటన ప్రారంభం కానుంది. ఐదు టీ20 అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ కూడా ప్రారంభం కానుంది.చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్ India allrounder Nitish Kumar Reddy received a grand welcome at the Vizag airport upon his homecoming after a successful tour of Australia, where he scored a maiden Test 💯 at the MCG ##BGT2025 pic.twitter.com/jt0AqTDTXK— Gaurav Gupta (@toi_gauravG) January 9, 2025 -
AP: ఉక్కు ఉద్యమంపై ఉక్కుపాదం
విశాఖ సాక్షి: విశాఖ ఉక్కు కార్మికులు చేపట్టిన నిరాహా దీక్షను భగ్నం చేయాలనే యోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. వారిపై ఉక్కు పాదం మోపేందుకు సమాయత్తమైంది. దీనిలో భాగంగా వారి సెలవుల్ని రద్దు చేయాలని చూస్తోంది. శాంతి భద్రతల పేరుతో నిరాహార దీక్ష చేపట్టిన కార్మికుల సెలులు రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపుతోంది. ఇలా మెయిల్స్ పంపడంపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. శాంతి భద్రతలకు ఉక్కు కార్మికులకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తోంది.నిరాహార దీక్ష ప్రారంభంఉక్కు కార్మికుల నిరాహార దీక్ష ప్రారంభమైంది. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మికులు 36 గంటల పాటు నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఈ దీక్ష సందర్భంగా విశాఖ ఉక్కుపై ప్రధాని సానుకూల ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రధాని మోదీని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు అపాయిట్మెంట్ అడిగారు. అయితే, ఆ అపాయిట్మెంట్పై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. -
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు
సాక్షి,విశాఖ : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. కిరండోల్-విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికల అక్రమణ రవాణా జరుగుతుందనే సమాచారంతో రైల్వే పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 11మంది మైనర్లను రక్షించారు. బాలికల్ని తమిళనాడుకు తరలిస్తున్న ముఠాను నిందితుడు రవి బిసోయ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో ఒరిస్సాలోని నవరంగ్ పూర్ ప్రాంతానికి చెందిన చిన్నారులుగా గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం విశాఖ రైల్వే పోలీసులు కేసును ఒరిస్సా పోలీసులకు అప్పగించారు. -
విశాఖలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో బీజేపీ యువ నేత
-
విశాఖలో అలజడిగా మారిన సముద్రం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సముద్రం అలజడిగా మారింది. ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్ను కెరటాలు తాకుతున్నాయి. గతంలో వర్షాలకు రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో తీరం భారీగా కోతకు గురవుతోంది. ఫెంగల్ తుపాను సమయంలో సబ్ మెరైన్ వద్ద తీరం కోతకు గురైంది. రాత్రి వేళలో అలలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం ఉంది. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. -
లక్కీ భాస్కర్ సినిమా చూసి హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థులు
-
అధికారం కోసం చంద్రబాబు గడ్డి కరుస్తారు
-
Vizag Steel Plant: మంత్రి కుమారస్వామిని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కలిశారు.
-
YSRCP అండగా ఉంటుంది: గుడివాడ అమర్నాథ్
-
ఈనెల 29న విశాఖ రానున్న ప్రధాని మోదీ
-
విశాఖలో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ
-
స్టీల్ ప్లాంట్ రన్ చేసే విషయంలో లోపాలున్నాయి : పవన్ కల్యాణ్
-
హోంమంత్రి అనిత ఇంటికి కూతవేటు దూరంలో గంజాయి సాగు
-
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ అరెస్ట్లా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే స్వయంగా ఒప్పుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టుల ద్వారా పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు.సోషల్ మీడియా కోఆర్డినేటర్లను అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుడివాడ అమర్నాథ్ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, దీనిపై పోలీసులు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు.. -
స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఉక్కుపాదం నోరు మెదపని కూటమి ప్రభుత్వం
-
'అమ్మ, నాన్న పెట్టిన పేరు అదే'.. హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబయి, హైదరాబాద్లో ఫుల్ బిజీగా ఈవెంట్స్లో పాల్గొన్నారు. శివ దర్శకత్వంలో వస్తోన్న హిస్టారికల్ యాక్షన్ మూవీ కంగువా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఇవాళ వైజాగ్లో కంగువా చిత్రయూనిట్ సభ్యులు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో సూర్యతో పాటు డైరెక్టర్ శివ, నిర్మాత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వైజాగ్ సిటీ నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిందని అన్నారు. మా అమ్మ, నాన్నలకు ఎంతో ఇష్టమైన నగరాల్లో వైజాగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ..'వైజాగ్ సిటీ నాకు చాలా ప్రత్యేకం. అంతేకాదు ఈ రోజు నాకు స్పెషల్ డే. 2015లో సింగం-3 షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చా. ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం అమ్మ, నాన్న వైజాగ్కు వచ్చారు. కానీ ఆ తర్వాత నా సినిమా షూటింగ్స్ అప్పుడు కూడా ఇద్దరు వచ్చేవారు. ఇక్కడ ప్రజల ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాతో అన్నారు. నాకు మా అమ్మ, నాన్న పెట్టిన పేరు శరవణన్. సినిమాల్లోకి వచ్చాకే నా పేరు సూర్యగా మారింది. నా పట్ల తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. నా పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కంగువా సినిమా చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. కంగువా చిత్రం వచ్చేనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా.. చైనాతో లింకులు
సాక్షి,విశాఖపట్నం : భారీ సైబర్ ముఠా గుట్టురట్టయ్యింది. విశాఖ కేంద్రంగా బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తూ వచ్చిన నిధుల్ని చైనా, తైవాన్లకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ క్రైమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు విశాఖ పోలీసులకు అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారం అందింది. దీంతో రంగంలోకి విశాఖ పోలీసులు సైబర్ నేరస్థుల్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ల దందాపై సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ కేంద్రంగా సైబర్ క్రైమ్కి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నాం. చైనాతో సంబంధాలు ఉన్న ఈ ముఠా గుట్టు రట్టు చేశాం. నిందితులు రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఈ బెట్టింగ్ యాప్ నడుపుతున్నారు. విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో ఒక వర్కింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును చైనా,తైవాన్లకు పంపుతున్నారు. నేరానికి పాల్పడ్డ నిందితుల్ని ఇప్పటి వరకూ ఏడుగురుని అదుపులోకి తీసుకున్నాం. నిందితులు నుంచి పది ల్యాప్టాప్లు, ఎనిమిది పర్సనల్ కంప్యూటర్లు,కార్,బైక్ స్వాధీనం చేసుకున్నాం.వీటితో పాటు 800 అకౌంట్లు, చెక్ బుక్ లు, డెబిట్ కార్డులు, స్వాధీనం చేసుకున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. -
వైజాగ్ హనీ ట్రాప్ కేసులో బయటపడ్డ జాయ్ జెమిమా వీడియో
-
మోడీని బాగా పొగిడారు.. స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు అడగలేదు
-
ఉక్కు కార్మికుల భారీ మానవహారం
సాక్షి,విశాఖపట్నం: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మికులు తమ ఆందోళనలను మరింత ఉదృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కార్మికులు భారీ ఎత్తున మానవ హారం నిర్వహించనున్నారు.ఢిల్లీ పర్యటనకు వెళుతున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉక్కు ఉద్యమానికి ప్రజలు సహకరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. శనివారరం అర్ధరాత్రి వరకు ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద కొనసాగిన ఉక్కు కార్మికుల నిరసన.. కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. నేడు నేషనల్ హైవేపై అగనంపూడి నుంచి గాజువాక వరకు భారీ మానవ హారం చేపట్టనున్నారు. -
స్టీల్ ప్లాంట్లో ఉద్రిక్తత.. 200 మంది ఉద్యోగుల అష్టదిగ్బంధనం
సాక్షి,విశాఖపట్నం : స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వందలాది స్టీల్ప్లాంట్ ఉద్యోగుల్ని.. కాంట్రాక్ట్ ఉద్యోగులు అడ్డుకున్నారు. స్టీల్ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్లైన్ గేటు పాసులను నిలిపివేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించారు.స్టీల్ప్లాంట్లో అర్ధరాత్రి రాత్రి వరకు నిరసన చేపట్టారు. ఈడీ వర్క్స్ బిల్డింగ్లో సుమారు 200 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కార్మికులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నట్లు హెచ్చరించారు. మరోవైపు మా పొట్టకొట్టొద్దని 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంపై ఆందోళన చేస్తున్నా.. కూటమి నేతలు స్పందించలేదని వాపోతున్నారు. -
నావెల్ డాక్ యార్డు ఎదుట మహిళల ఆందోళన
సాక్షి,విశాఖపట్నం: నావెల్ డాక్ యార్డు ప్రధాన ద్వారం ఎదుట మహిళల ఆందోళన కొనసాగుతుంది. తమ భర్తల ప్రాణాలకు రక్షణ కావాలంటూ డాక్ యార్డ్ ఉద్యోగస్తుల భార్యలు ఆందోళన బాట పట్టారు. ఇటీవల నూతన వంతెన నిర్మాణం కోసం పోర్ట్ యాజమాన్యం రహదారిని మూసివేసింది. దీంతో ప్రత్నామాయ ఏర్పాటు చేసి నావికా దళానికి చెందిన ఎస్బీసీ నుండి రాకపోకలకు అనుమతి ఇవ్వాలంటూ సుమారు 200 మహిళలు రోడ్డెక్కారు. మల్కాపురం, సిందియా, రామకృష్ణాపురం ప్రాంతాలనుండి విధులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Madhurawada Nidhi: క్యాన్సర్ను ఓడించి..క్రీడల్లో మెరిసి..!
కష్టాలను జయించి.. స్వప్నాలను సాకారం చేసుకున్న పోరాట యోధురాలు ఆమె. చిన్న వయసులోనే క్యాన్సర్ తన జీవితాన్ని కుదిపేసినా ధైర్యంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో కాలు కోల్పోయినా.. ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు. తన బలహీనతను బలంగా మార్చుకుని.. పోరాటానికి సిద్ధమైంది. పారా క్రీడల్లో తనను తాను నిరూపించుకుంటూ.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ఆమే మధురవాడకు చెందిన నిధి. ఆమె ఒక క్రీడాకారిణిగానే కాకుండా.. కష్టాలను ఎలా అధిగమించాలనే దానికి ఒక సాక్ష్యం. ఆమె కథ మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఆమె విజయాలు ప్రేరణగా నిలుస్తాయి. భవిష్యత్తులో నిధి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం. – విశాఖ స్పోర్ట్స్విశాఖలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ కాలుతో నడుస్తూ.. నాలుగు క్రీడాంశాల్లో పోటీపడుతున్న ఆమె చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మధురవాడ ప్రాంతానికి చెందిన నిధి తండ్రి కేశవరావు, తల్లి జ్యోతి. ప్రస్తుతం ఆమె 10వ తరగతి చదువుతోంది. ఏడేళ్ల వయసులోనే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ బారిన పడింది. చికిత్సలో భాగంగా ఆమె ఎడమ కాలును కోల్పోయింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. క్యాన్సర్ను జయించి మామూలు స్థితికి చేరుకుంది. అంగవైకల్యాన్ని మరిచిపోయేందుకు ఆటలను ఎంపిక చేసుకుంది. కృత్రిమ కాలుతో కదన రంగంలోకి దిగింది. పట్టుదలతో స్విమ్మింగ్, చదరంగం, రైఫిల్ షూటింగ్, రన్నింగ్లో శిక్షణ పొందింది. పారా క్రీడల్లో తాను తలపడుతున్న అన్ని అంశాల్లోనూ నేడు పతకాలు సాధించే స్థాయికి చేరుకుంది. ఇటీవల రష్యాలో జరిగిన పారా క్రీడల్లో నాలుగు పతకాలను సొంతం చేసుకుంది. మలుపు తిప్పిన సర్వేవర్స్ క్యాంప్ అంగవైకల్యం ఏర్పడినా క్యాన్సర్ను జయించిన నిధి నిబ్బరంగానే నిలిచింది. చదువుకుంటూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆటలపై ఆసక్తిని పెంచుకుంది. అప్పట్లో ముంబయిలో క్యాన్సర్ చికిత్స తీసుకున్న ఆమె.. క్యాన్సర్ సర్వేవర్స్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు నిర్వహించిన పోటీల్లో పాల్గొంది. తనలాంటి వారితో నిర్వహించే పోటీల్లో పోటీపడగలననే ధీమాతో.. వారిచ్చిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. అలా రాంచీలో జరిగిన జాతీయస్థాయి చదరంగం అండర్–19 పోటీల్లో తొలిసారి పాల్గొని సత్తా చాటింది. జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక 2019లో కరోనా కారణంగా పోటీల్లో పాల్గొనడం కాస్త తగ్గించింది నిధి. అప్పటికే ముంబయి నుంచి విశాఖకు తల్లిదండ్రులతో వచ్చేసిన నిధి తిరిగి గ్వాలియర్లో జరిగిన పారా స్విమ్మింగ్ పోటీల్లో తన కేటగిరీలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల రష్యాలో జరిగిన రైఫిల్ షూటింగ్లో కాంస్య పతకం, చెస్, స్విమ్మింగ్లతో పాటు రన్నింగ్లో స్వర్ణ పతకాలను అందుకుంది. ఆదివారం విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో ఎస్–9 కేటగిరీలో తలపడింది. 50 మీటర్ల ఫ్రీస్టయిల్, బ్యాక్ స్ట్రోక్, వంద మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో విజేతగా నిలిచింది. వచ్చే నెలలో గోవాలో జరగనున్న జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలకు సిద్ధమవుతోంది. -
యాజమాన్యానికి షాకిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
-
యాజమాన్యానికి షాకిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
సాక్షి,విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఉద్యోగులు షాకిచ్చారు. 500 మంది ఉద్యోగుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్కు తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నం చేసింది. ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను పంపుతున్నట్లు సర్య్కులర్ జారీ చేసింది. దీంతో పాటు ఉద్యోగుల ఇంటర్వ్యూలు కోసం 4 బృందాలు ఏర్పాటు చేసింది.కానీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్కు వెళ్లేందుకు ముందుకు రాలేదు. యాజమాన్యం నిర్వహించిన ఇంటర్వ్యూలకు కనీసం 20 మంది ఉద్యోగులు కూడా హాజరు కాలేదు. అయితే, ప్లాంట్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే గొడవలు జరుగుతాయని చెప్పి ప్రైవేట్ హోటల్స్లో విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించడం కొసమెరుపుచదవండి : మీకో దణ్ణం చంద్రబాబు : ఆర్కే రోజా -
ప్రైవేటీకరణ వైపు స్టీల్ ప్లాంట్ నిజాలు బయటపెట్టిన CMD
-
తోడల్లుళ్ల పిల్ల చేష్టలు.. కలియుగ రాక్షసుడు చంద్రబాబు
-
కార్మికులను చర్చలకు పిలిచి ఢిల్లీ వెళ్లిపోయిన స్టీల్స్టాంట్ సీఎండీ
-
విశాఖ ఉక్కులో డిప్యుటేషన్ల రగడ
ఉక్కు నగరం (విశాఖ): విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను ఛత్తీస్గఢ్లోని నగర్నార్ స్టీల్ప్లాంట్కు డిప్యుటేషన్పై పంపేందుకు రంగం సిద్ధమైంది. తమకు అవసరమున్న పోస్టులు, విధివిధానాలు, ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలు నగర్నార్ ప్లాంట్ నుంచి వచ్చిన లేఖ ద్వారా బయటకు పొక్కాయి. స్టీల్ప్లాంట్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చేపడుతున్న అనేక పొదుపు చర్యల్లో భాగంగా 500 మంది అధికారులు, ఉద్యోగులను నగర్నార్ ప్లాంట్కు డిప్యుటేషన్పై పంపాలని యాజమాన్యం నిర్ణయించింది. తద్వారా ప్లాంట్పై ఆర్థిక భారం తగ్గుతుందని యాజమాన్యం ప్రకటించింది. దశలవారీగా డిప్యుటేషన్దశలవారీగా పంపనున్న జాబితాలో మొదటి విడతగా 100 మంది అధికారులను డిప్యుటేషన్పై పంపేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఉక్కు యాజమాన్యం నగర్నార్ ప్లాంట్ యాజమాన్యానికి ఈ నెల 11న లేఖ రాసింది. ఆ లేఖపై స్పందిస్తూ నగర్నార్ ప్లాంట్ యాజమాన్యం తమకు కావాల్సిన సిబ్బంది, విధివిధానాలపై విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యానికి లేఖ రాసింది. అధికారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కోరుతూ ఓ నమూనాను పంపింది. అధికారులకు కావాల్సిన విభాగాలు, గ్రేడ్లకు చెందిన సిబ్బంది వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 23 నుంచి 25 వరకు విశాఖ స్టీల్ప్లాంట్లోనే ఇంటర్వ్యూలు చేయనున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా డిప్యుటేషన్ అంశాన్ని మొదటి నుంచీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు నగర్నాగర్ ప్లాంట్ నుంచి వచ్చిన లేఖను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఖలోని విధి విధానాల్లో క్లారిటీ లేదని, ఉద్యోగుల వ్యక్తిగత అంగీకారంతో డిప్యుటేషన్ అంటే.. జరిగే పని కాదని ఉక్కు అధికారుల సంఘం (సీ) నాయకులు వ్యాఖ్యానించారు.డిప్యుటేషన్ ప్రతిపాదనను విరమించుకోవాలిస్టీల్ప్లాంట్లో మొత్తం 20 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తుతం 12,600 మంది మాత్రమే ఉన్నారు. ఇందులోంచి కూడా ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు డిప్యుటేషన్పై పంపిస్తామంటే మేం ఎలా అంగీకరిస్తాం. ఉన్న ఉద్యోగులను ఉపయోగించి పూర్తి ఉత్పత్తి సాధించాలి గానీ.. డిప్యుటేషన్కు పంపడమేంటి. దీనిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. యాజమాన్యం ఆ ప్రతిపాదనను విరమించుకోవాలి. – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షుడు, స్టీల్ప్లాంట్ సీఐటీయూ -
అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
అనకాపల్లి జిల్లా,సాక్షి : అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి అనుమాస్పద స్థితిలో శవమై తేలాడు. దీంతో ఉద్యోగి అదృశ్యం కాస్త విషాదంగా మారింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్లో రండి సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల విధులు నిర్వహించేందుకు వెళ్లిన సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంపై ఆతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్టోరేజీ ట్యాంక్ సూర్యనారాయణ డెడ్బాడీ బయటపడడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఉత్తరాంధ్రాలో ఫార్మా కంపెనీ పేరు చెబితేనే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత ఆగస్ట్ నెలలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్లో ప్రమాదంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ
సాక్షి,విశాఖపట్నం : విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఎఫ్ 1ను మూసేసిన ప్లాంట్ అధికారులు.. తాజాగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్లాంట్లోని వరుస పరిణామలపై అటు ఉద్యోగులు.. ఇటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు నిలిపివేసి.. కేవలం ఒక బ్లాస్ట్ ఫర్నేస్లో కార్యకలాపాలు నిర్వహించడంపై కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..ఉద్యోగుల జీతాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని వాపోతున్నారు.ఇప్పటి వరకు రెండు బ్లాస్ట్ ఫర్నెస్ లు నడిపితే అరకొరగా ఉత్పత్తి.. ఇకపై ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ తోనే ఉత్పత్తితో కేవలం నెలకు రూ. వెయ్యి కోట్లు మాత్రమే రాబడి వస్తుందని, ఇలా అయితే ప్లాంట్ నిర్వహణ అసాధ్యమని స్టీల్ ప్లాంట్ కమిటీ సంఘాలు నేతలు చెబుతున్నారు. -
బాబుకు అమరావతి పై ఉన్న శ్రద్ధ స్టీల్ ప్లాంట్ పై లేదు..
-
సెంట్రల్ జైలు గేటు వద్ద రౌడీషీటర్ హల్చల్
-
ఢిల్లీ-వైజాగ్ విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ-విశాఖపట్నం ఎయిర్ఇండియా విమానానికి మంగళవారం(సెప్టెంబర్3) అర్ధరాత్రి బాంబు బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. అయితే ఈ బెదిరింపు ఆకతాయిలు చేసిన పనిగా అధికారులు తేల్చారు. విమానంలో బాంబు ఉందని తొలుత ఢిల్లీ పోలీసులకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో వారు తమను అప్రమత్తం చేసినట్లు వైజాగ్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. 107 మందితో ప్రయాణించిన విమానం విశాఖపట్నంలో షెడ్యూల్ ప్రకారం ల్యాండ్ అయింది.విమానం ల్యాండ్ అయి ప్రయాణికులందరు దిగిన తర్వాత తనిఖీలు నిర్వహించామని, అందులో పేలుడు పదార్ధాలేవీ లేవన్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. -
ఎసెన్షియా ప్రమాద బాధితులకు చంద్రబాబు పరామర్శ
-
18 మంది చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం
-
YSRCP కార్యకర్తలకు విజ్ఞప్తి
-
మళ్లీ ‘ఓటుకు నోటు’ పాలిటిక్స్కు టీడీపీ రెడీ
సాక్షి, విశాఖపట్నం: మళ్లీ ఓటుకు నోటు రాజకీయాలకు టీడీపీ సిద్ధమవుతోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా పోటీకి దిగే యోచనలో ఉంది. ఓట్ల కొనుగోలుకు డబ్బున్న అభ్యర్థిని టీడీపీ తెరపైకి తెచ్చింది. గత ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఎంపీ సీటుకు ప్రయత్నించిన బైరా దీలీప్ చక్రవర్తి తెరపైకి వచ్చారు. టీడీపీలో సభ్యత్వం లేకపోయినా దిలీప్ను పోటీకి దించాలనే కూటమి భావిస్తోంది. డబ్బులు పెట్టి ఓట్లు కొనాలని దిలీప్కు టీడీపీ టాస్క్ ఇచ్చినట్లు సమాచారం.ఓడిపోయినా సరే పోటీ చేయాలని బైరా దిలీప్పై టీడీపీ ఒత్తిడి తెస్తోంది. ఓడిపోతే ప్రభుత్వం ఉంది కాబట్టి కాంట్రాక్ట్లు ఇస్తామంటూ ఆఫ్ర్ ఇచ్చినట్లు సమాచారం. కాంట్రాక్ట్ల ద్వారా డబ్బు సంపాదనకు టీడీపీ పోటీకి దింపుతోంది. ఇప్పటికే డబ్బులు పెట్టేది లేదని ఇప్పటికే పీలా గోవింద్, గండి బాబ్జి చెప్పేశారు.మొత్తం 840 ఓట్లు ఉండగా, 11 ఖాళీలు ఉన్నాయి. వైఎస్సార్సీపీకి 615 మంది ప్రజాప్రతిధులు ఉండగా, టీడీపీకి కేవలం 214 మంది మాత్రమే ఉన్నారు. 400 మంది వ్యత్యాసం ఉన్నా పోటీకి దిగాలని కూటమి నిర్ణయం తీసుకుంది. ఓటుకు నోటు రాజకీయానికి టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లను కొనేందుకు అప్పగింతల తంతు కొనసాగుతోంది. -
విశాఖలో కోర్బా ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
పోలీసులపై పిడిగుద్దులు అర్ధరాత్రి కిక్ బాక్సింగ్
-
ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం
-
భర్త వివాహేతర సంబంధం లైవ్ లో పట్టుకున్న భార్య
-
అమరావతి కోసం విశాఖ మెట్రో ప్రాజెక్టుకు బ్రేక్
-
విశాఖ డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి
-
మీడియా ఆఫీస్ పై టీడీపీ దాడి..
-
కిడ్నీ మార్పిడి కేసులో NRI ఆసుపత్రి కీలక పాత్ర
-
వందే భారత్ రీషెడ్యూల్.. నాలుగు గంటల ఆలస్యం!
ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘వందే భారత్’ రైలు సుమారు నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరనుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. రేపు (ఆదివారం) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వచ్చే ట్రైన్ సుమారు 4.15 గంటలకు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకోనుంది.Train RescheduleTrain No.20833 Visakhapatnam - Secunderabad Vande Bharat express is rescheduled to leave at *10:00 hrs* on 23.06.2024 instead of its scheduled departure at 05:45 hrs. (Rescheduled by 4 hrs 15 Minutes) @RailMinIndia@EastCoastRail@SCRailwayIndia @drmvijayawada pic.twitter.com/fJjRmKUV5z— DRMWALTAIR (@DRMWaltairECoR) June 21, 2024 అయితే రేపు ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్ను ఉదయం 10 గంటలకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఇక.. రీషెడ్యూల్ కారణంగా ఆలస్యం జరగనున్నట్లు సమాచారం. దీంతో ట్రైన్ ఆలస్యానికి చింతిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం ‘ఎక్స్’లో వైరల్గా మారింది. -
జనసేనలో చేరిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీకృష్ణపై అనర్హత వేటు
-
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
రుషి కొండపై గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను భూతద్దంలో చూపిస్తూ విష ప్రచారం చేస్తున్న టీడీపీ నేతల తీరును వైఎస్సార్సీపీ ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.‘రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు’అంటూ వైస్సార్సీపీ ట్వీట్లో పేర్కొంది.రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి… https://t.co/o3m2GSOrAk— YSR Congress Party (@YSRCParty) June 16, 2024 -
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: వైజాగ్ చేరుకున్న బాధితులు
విశాఖపట్నం: కంబోడియా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని విశాఖపట్నం పోలీసు కమిషనర్ రవి శంకర్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో ఈ కేసు సంబంధించిన విషయాలు తెలిపారు. ‘‘మొత్తం 68 మంది బాధితులను రక్షించాము. ఇంకా 90 మంది కంబోడియాలో ఉన్నారు. 68 మందిలో 25 మంది వైజాగ్ వాళ్ళూ. దేశ వ్యాప్తంగా 25 మంది ఏజెంట్లు ఉన్నారు. 12 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశాం. ఆరుగురు ఏజెంట్లుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాము. ఈ మొత్తం స్కాంలో సిమ్ సప్లయార్స్ ముగ్గురుని గుర్తించాం. ... ఒక సిమ్ కార్డు భారత్ నుంచి తీసుకొని వెళ్లి ఇస్తే 10 నుంచి 15 వేలు కమిషన్ ఇస్తారు. నకిలీ బ్యాంక్ అకౌంట్స్.. తయారు చేస్తున్న ముఠాపై కూడా నిఘా పెట్టము. ఎమర్జెన్సీ పాస్ పోర్టు కూడా ఇండియా ఎంబసీ అధికారులు జారీ చేస్తున్నారు’’ అని తెలిపారు.కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్పై తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు వాట్సాప్తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. -
ఆపరేషన్ కంబోడియా సక్సెస్.. శభాష్ వైజాగ్ పోలీస్!
సాక్షి, విశాఖ: ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. కంబోడియాలో మరో 60 మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ అధికారులు కాపాడారు. దీంతో, కంబోడియా నుంచి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 420కి చేరుకుంది.కాగా, భారత ఎంబసీ అధికారులు ఆపరేషన్ కంబోడియాను విజయవంతం చేశారు. సైబర్ నేరాల బారినపడి కంబోడియాలో చిక్కుకున్న భారతీయులను ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో, 420 మంది భారతీయులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. కాగా, నిన్న(బుధవారం) 360 మందిని అధికారులు పోలీసుల చర నుంచి విడిపించారు. ఇక, 420 మందిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని సమాచారం.ఈ సందర్భంగా భారత రాయబారి దేవయాని ఖోబ్రగడే కంబోడియాలో ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవయాని మాట్లాడుతూ.. మన భారతీయులను మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయులకు మద్దతు ఇవ్వడం.. వారి భద్రత, శ్రేయస్సు కోసం రాయబార కార్యాలయం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే కంబోడియా అధికారులకి ధన్యవాదాలు తెలిపారు.అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. -
KK రాజు ఎమ్మెల్యే అయితే మీ ఇంట్లో మనిషి అయినట్టే..
-
‘దేవర’ చలో వైజాగ్
వైజాగ్ వెళ్లనున్నారట ‘దేవర’ టీమ్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. జాన్వీకపూర్ హీరోయి న్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వైజాగ్లో ్రపారంభం కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. అయితే ఈ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తారట మేకర్స్. ప్రస్తుతం ముంబైలో హిందీ చిత్రం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ సినిమా తాజా షెడ్యూల్ పూర్తయిన తర్వాత ‘దేవర’ సెట్స్లో ఎన్టీఆర్ జాయి న్ అవుతారట. కల్యాణ్రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తొలి భాగాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
సంచలన నిజాలు బయటపెట్టిన అప్పటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
-
వెంకటాయపాలెం : 1996 శిరోముండనం కేసులో కీలక తీర్పు
సాక్షి, విశాఖపట్నం: 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది. శిరోముండనం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దాడి కేసులో మాత్రం మొత్తం 10 మందిని దోషులుగా కోర్టు గుర్తించింది. ఈ పది మందిలో ఒకరు మృతి చెందారు. నిందితులకు అట్రాసిటీ కేసులో 18 నెలల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 42,000 రూపాయల చొప్పున 3,78,000 జరిమానా విధించింది. ఈ కేసులో 28 ఏళ్లపాటు వివిధ కోర్టుల్లో కేసు విచారణ కొనసాగింది. విశాఖ కోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ జరగ్గా.. ఎట్టకేలకు తీర్పు వెల్లడించింది. కోర్టు దోషులుగా గుర్తించిన పది మందిలో రాజకీయ నాయకుడు తోట త్రిమూర్తులు ఒకరు. నేరం జరిగినప్పుడు త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1996లో చంద్రబాబు సీఎంగా ఉండగా డిసెంబర్ 29న ఈ ఘటన జరిగింది. వెంకటాయపాలెంలో అయిదుగురు దళితులను చిత్రహింసలు పెట్టారని, వారికి శిరోముండనం చేశారని కేసు నమోదయింది. భారతీయ శిక్షాస్మృతి 342, 324, 506 లతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3 లతో రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు 28 ఏళ్ల పాటు విచారణ జరిగి ఈ రోజు తుది తీర్పు వెలువడింది. తోట త్రిమూర్తులు భవితవ్యమేంటీ? 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం1995లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది. 2024లో జరుగుతున్న ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయనున్నారు. తొలుత శిక్ష విషయంపై ఆందోళన చెందినా.. కోర్టు 18 నెలల జైలు శిక్ష మాత్రమే విధించడంతో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం త్రిమూర్తులుతో సహా నిందితులందరూ దరఖాస్తు చేసుకున్నారు. నిందితులు హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి వారికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. చట్టాన్ని గౌరవిస్తాను చట్టాన్ని గౌరవించడం నా బాధ్యత, ఈ కేసుపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలని భావిస్తున్నాను, అందుకే గడువు కోసం బెయిల్ విజ్ఞప్తి చేయగా... కోర్టు అంగీకరించింది : తోట త్రిమూర్తులు -
ఎంపీ సీటు కోసం GVL వదలని పట్టు.. బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి..
-
వైజాగ్లో పురందేశ్వరికి బిగ్ షాక్..!
-
ధోనినా మజాకా.. చెవులు చిల్లులు పడేలా చేశాడు.. కోహ్లి కూడా అంతే..!
విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకులు పొట్టి ఫార్మాట్లోని పూర్తి మజాను ఆస్వాదించారు. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చాలాకాలం తర్వాత సూపర్ మ్యాన్ ఇన్నింగ్స్ ఆడటంతో విశాఖ ప్రేక్షకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. NOT IN CHEPAUK!!!! pic.twitter.com/JYZv3gzvuu — CricTracker (@Cricketracker) March 31, 2024 ధోని తొలి బంతికే బౌండరీ కొట్టినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆ సమయంలో చెవులు చిల్లులు పడే స్థాయిలో 128 డెసిబుల్స్ సౌండ్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ సీజన్లో ఇంతటి సౌండ్ నమోదు కావడం ఇది రెండోసారి. కొద్దిరోజుల కిందట చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేసినప్పుడు కూడా ఇంతే స్థాయిలో (128 డెసిబుల్స్) శబ్దాలు నమోదయ్యాయి. Highest peak Roars for any player in this IPL 2024: 128 DB - When Virat Kohli completed fifty at chinnaswamy. 128 DB - When MS Dhoni hits First boundary. - Two GOATs, Two Brands of World Cricket. 🐐 pic.twitter.com/GYL002yRET — CricketMAN2 (@ImTanujSingh) April 1, 2024 కాగా, విశాఖ మ్యాచ్లో ధోని చెలరేగినప్పటికీ సీఎస్కే 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ధోని లేటుగా క్రీజ్లోకి రావడంతో సీఎస్కే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. పృథ్వీ షా (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రిషబ్ పంత్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పతిరణ 3 వికెట్లతో రాణించాడు. VINTAGE MS DHONI AT VIZAG...!!!! Raina & Aakash commentary - "Mahi Maar Raha Hai". ❤️ pic.twitter.com/hoUihqM4mp — CricketMAN2 (@ImTanujSingh) March 31, 2024 అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. ఖలీల్ అహ్మద్ (4-1-21-2), ముకేశ్ కుమార్(3-0-21-3), అక్షర్ పటేల్ (3-0-20-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రుతురాజ్ (1),రచిన్ రవీంద్ర (2), సమీర్ రిజ్వి (0) విపలం కాగా.. రహానే (45), డారిల్ మిచెల్ (34) పర్వాలేదనిపించారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (21 నాటౌట్), ధోని చెలరేగిప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సీజన్లో సీఎస్కేకు ఇది తొలి ఓటమి కాగా.. ఢిల్లీ బోణీ కొట్టింది. The Roar when MS Dhoni hits First Six of this IPL 2024. - Dhoni is an emotion, He's beyond everything...!!!!! 🐐 pic.twitter.com/t5H2GhZ8if — CricketMAN2 (@ImTanujSingh) March 31, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
CSK DC Practice Session Photos: విశాఖలోలో డీసీ, సీఎస్కే ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
బొజ్జల సుధీర్ రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రజల డిమాండ్
-
డ్రగ్స్ కేసులో దొరికింది టిడిపి వాళ్లే కావడంతో ఫ్రస్ట్రేషన్ లో బాబు
-
యువతను చిత్తు చేస్తున్న మత్తు
-
Vizag : విశాఖలో ఘనంగా హోలీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
విశాఖ డ్రగ్స్ కేసు: అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు
సాక్షి, విశాఖపట్నం: సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్ఎస్కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున నగరంలో ఈ-సిగరెట్స్ పట్టుబడ్డాయి. పకడ్బందీ సమాచారంతో టాయిస్ షాపుల్లో వున్న నిషేధిత సిగరెట్టను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-సిగరెట్లు కూడా పోర్టు నుంచే బయటకు వచ్చినట్టు అనుమానం. కస్టమ్స్ పరిధిని దాటి నిషేధిత సిగరెట్లు బయటకు రావడం, ఇప్పుడు డ్రగ్ కంటైనర్ పట్టుబడటంతో అనుమానాలు బలపడుతున్నాయి. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా టెక్స్ బస్సు కాకినాడ: మూలపేట ఎస్ఈజడ్ కాలనీలో అనుమానాస్పదంగా సంధ్య ఆక్వాటెక్స్కు చెందిన బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో యు.కొత్తపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం సీబీఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన బస్సులో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్ మదర్బోర్డు గుర్తించారు. బస్సు బ్రేక్ డౌన్ అయ్యిందని డ్రైవర్ చెబుతున్నాడు. -
వైజాగ్లో ఐపీఎల్ మ్యాచ్లు.. టికెట్ల బుకింగ్ ఎప్పటినుంచంటే?
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి రెండు హోం మ్యాచ్లను వైజాగ్లోని ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మ్యాచ్లకు సంబంధించి టిక్కెట్ల విక్రయాలపై ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన చేసింది. ఈ రెండు మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో విక్రయించనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి హోం మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఆదివారం(మార్చి 24) అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా ఈ నెల 31న ఢిల్లీ క్యాపిటల్స్– చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్కు 27వ తేదీ నుంచి టిక్కెట్ల అమ్మకం ప్రారంభం కానుంది. .కాగా ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్లను పీఎం పాలెంలో ఉన్న స్టేడియం ‘బి’ గ్రౌండ్, నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడెమ్షన్ కౌంటర్లలో ఫిజికల్ టిక్కెట్లను పొందాలి. రూ. 7,500, రూ. 5,000, రూ. 3,500, రూ. 3,000, రూ. 2,500, రూ. 2,000, రూ. 1,500, రూ. 1,000 విలువ చేసే టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. కాగా ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. -
చంద్రబాబు సతీమణి పై చర్యలు తీసుకోవాలని కోరాం
-
వైజాగ్ డ్రగ్స్ కేసు చంద్రబాబు కథ అడ్డం తిరిగింది
-
డ్రగ్స్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుంటే టీడీపీ చిల్లర రాజకీయం
-
Klin Kaara Beach Photos: క్లీంకారకు బీచ్ని పరిచయం చేసిన రామ్చరణ్.. ఫొటోలు వైరల్
-
'అమ్మా, నాన్నతో తొలిసారి అలా'.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్లో జరుగుతోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీ సరసన కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ లుక్ నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చెర్రీ డిఫరెంట్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే షూటింగ్కు కాస్తా విరామం లభించండంతో గ్లోబల్ స్టార్ ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యారు. వైజాగ్ సముద్ర తీరాన తన ముద్దుల కూతురు, భార్య ఉపాసనతో కలిసి ఎంజాయ్ చేశారు. క్లీంకారతో ఎత్తుకుని బీచ్లో ఆడుకుంటున్న దృశ్యాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను ఉపాసన తన ఇన్స్టాలో షేర్ చేసింది. వైజాగ్ మా హృదయాలను దోచేసింది.. క్లీంకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇదే వీడియోలో మెగా అభిమానులు రామ్ చరణ్ను గజమాలతో సత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
హీరో అల్లు అర్జున్ మరో మల్టీప్లెక్స్.. ఈసారి ఎక్కడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్తో బిజీబిజీ. మొన్నీమధ్యే వైజాగ్ వెళ్లొచ్చాడు. దీని తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో కలిసి పనిచేస్తాడని అంటున్నారు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో మూవీ ఉంది. ఇంత బిజీలోనూ అటు ఫ్యామిలీకి టైమ్ ఇస్తూనే మరోవైపు తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉన్నాడు. కొత్తగా మరో మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: సింపుల్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) ఒకప్పుడు తెలుగు హీరోలు.. సినిమాలు చేస్తూ మహా అయితే పలు వ్యాపారాలు చేసేవారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ, మహేశ్ బాబు తదితరులు మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ఎంటరయ్యారు. హైదరాబాద్లో ఇప్పటికే మహేశ్కి ఏఎంబీ, అల్లు అర్జున్కి ఏఏఏ మల్టీప్లెక్స్లు ఉన్నాయి. త్వరలో రవితేజది ఓపెన్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్.. వైజాగ్లోనూ ఏఏఏ మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కడుతున్న ఇనార్బిట్ మాల్లో ఆసియన్ సంస్థతో కలిసి హైదరాబాద్లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారట. నిజామా కాదా అనేది త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది. మరోవైపు ప్రస్తుతం చాలామంది సింగిల్ స్క్రీన్ థియేటర్ల కంటే మల్టీప్లెక్స్ల్లో సినిమా చూసేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలు ఈ బిజినెస్లో హవా చూపిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) -
పుట్టినరోజుకి 'గేమ్ ఛేంజర్' నుంచి సర్ ప్రైజ్!
వైజాగ్ వెళ్లాడు గేమ్చేంజర్. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘గేమ్చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ వైజాగ్లో ప్రారంభం కానుంది. ఈ వారంలో ఆరంభం కానున్న ఈ షెడ్యూల్లో రామ్చరణ్పాల్గొంటారు. రామ్చరణ్పాల్గొనగా కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట మేకర్స్. అలాగే ఈ నెల 27న రామ్చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘గేమ్చేంజర్’ సినిమాలోని ‘జరగండి..’పాట లిరికల్ వీడియో విడుదల కానుంది. అంజలి, నవీన్చంద్ర, శ్రీకాంత్, సునీల్, జయరాం, ఎస్జే సూర్య కీలకపాత్రల్లో ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వర్తకర్త. -
వైజాగ్లో అల్లు అర్జున్.. ఫ్యాన్స్ హంగామా.. ఇదెక్కడి క్రేజ్ రా మావ!
అల్లు అర్జున్ మరోసారి వైజాగ్లో ల్యాండ్ అయిపోయాడు. అయితే ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఎయిర్పోర్ట్ దగ్గర మొదలుపెడతే దారిపొడవున బన్నీకి అదిరిపోయే రేంజులో వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అల్లు అర్జున్ వైజాగ్ ఎందుకెళ్లాడంటే? (ఇదీ చదవండి: 100 కోట్ల కలెక్షన్ సూపర్ హిట్ సినిమా.. ఏ ఓటీటీ సంస్థ కొనట్లేదు!) 'పుష్ప'తో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ చిత్ర సీక్వెల్తో బిజీగా ఉన్నాడు. మొన్నటివరకు హైదరాబాద్ లో షూటింగ్ జరగ్గా, తాజాగా విశాఖపట్నంలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బన్నీ.. విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యాడు. అయితే విమానాశ్రయం దగ్గర నుంచి అభిమానులు అతడితో పాటు హంగామా చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. 'పుష్ప 2' సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేస్తామని చాలారోజుల క్రితమే ప్రకటించారు. మరి చెప్పిన డేట్కి వస్తుందా లేదా అనేది చూడాలి. అలానే 'పుష్ప' చిత్రానికి మూడో భాగం కూడా ఉండే అవకాశముందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) Love you Forever 🛐♾️@AlluArjun Anna 🧎#Pushpa2TheRule #AlluArjun #VizagGaddaAlluArjunAdda pic.twitter.com/4rfl9EE7j2 — Hell King Sai (@hell_king_Sai) March 10, 2024 Icon Star @alluarjun received Grand & MASSive welcome by fans at his fort Vizag 🔥#VizagGaddaAlluArjunAdda #AlluArjun𓃵 #AlluArjun pic.twitter.com/V7ChISIJXn — Sarath Kv (@SarathK12319725) March 10, 2024 -
సీఎం జగన్ విజన్ విశాఖ పై వైజాగ్ ప్రజల అభిప్రాయం
-
విశాఖలో భవిత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
Vizag : విశాఖ స్వప్నం సాకారం దిశగా జగన్ పాలన
ఇవాళ వైజాగ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం విన్న ఎవరికైనా మనసులో ఒకటి కచ్చితంగా అనిపించి ఉంటుంది. ఏంటీ.. సీఎం జగన్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు.? ఇంత బలంగా మాట్లాడుతున్నారని మనసులో తప్పకుండా అనుకుని ఉంటారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సీఎం జగన్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. విశ్వాసం పెరిగిపోతుంది. దీనికి తన పాలనపై తనకు నమ్మకం ఉండటం వలన కావొచ్చు. ఒక పక్క టీడీపీ - జనసేన పొత్తులతో కుస్తీ పడుతుంటే.. వైఎస్ఆర్ సీపీ మాత్రం తన ప్రశాంతంగా చేసుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ తాడే పల్లి ప్యాలస్.. తాడేపల్లి ప్యాలస్ అని కామెంట్ చేసినవారు.. ఇప్పుడు ఆ ప్యాలెస్లో ప్రశాంతంగా కూర్చొని ..సీఎం జగన్ ఆడే రాజకీయ చదరంగం చూసి వణికిపోవడమే కాదు బెంబేలెత్తుతున్నారు. "వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానన్నారు." ఈ పదాలు పలుకుతున్నప్పుడు సీఎం జగన్ ముఖంలో ఆత్మవిశ్వాసం చూశారా.. యస్ నేను సాధిస్తాననే నమ్మకంలో ఆయన ముఖంలో అణువణువునా కనిపించింది. ఈ రోజు విశాఖలో జగన్ ఇచ్చిన స్పీచ్ ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి భరోసానిచ్చింది. ఉత్తరాంధ్ర విజన్నే కాదు విశాఖ భవిష్యత్తును రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోట్ల మంది కళ్లకు కనబడేలా ప్రసంగించారు. భవిష్యత్తులో విశాఖ నగరం హైదరాబాద్, చెన్నైల కంటే ఎక్కువుగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు సీఎం జగన్. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించామని చెప్పారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని.. భవిష్యత్తులో రూ.10 నుంచి 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని సీఎం జగన్ చెప్పారు. విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకు 6 లైన్ల రహదారి విశాఖకు మణిమకుటం కానుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 70 శాతం వృద్ధి సాధించామని సీఎం జగన్ చెప్పారు. 58 నెలల వైఎస్ జగన్ పాలనలో ఆయన తీసుకొచ్చిన వ్యవసాయ రంగంలోని సంస్కరణలు ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాయి. RBKలు విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటున్నాయి. భవిష్యత్తులో ఆర్బీకేలు లావాదేవీ కేంద్రాలుగానే కాకుండా ప్రయోగ కేంద్రాలుగా కూడా మారబోతున్నాయి. ఉత్పత్తి రంగంలో ఏపీ మెరుగ్గా దూసుకెళ్తుందని చెప్పారు సీఎం జగన్. మూలపేట, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం రేవులతో ఆంధ్రా తీరం రూపురేఖలు మారిపోతోంది. ఏపీలో తలసరి ఆదాయం తెలంగాణ కంటే ఎక్కువుగా పెరిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తమ ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొచ్చిన పరిశ్రమలు వలన రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం తగ్గిందన్నారు సీఎం జగన్. డీబీటీ ద్వారా నేరుగా కోట్ల మందికి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. నిజంగా ఇది దేశంలోనే అత్యద్భుతమైన ప్రయోగమని ఆర్ధిక నిపుణులు, సామాజిక వేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా నిరుద్యోగిత రేటు తగ్గడం కాకుండా యువత క్రైం వైపు, టెర్రరిజం, మావోయిజం వైపు మొగ్గు చూపకుండా తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఉద్యోగాలు చేసుకుంటారు. ఈ వాతావరణం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. మెగా, భారీ పరిశ్రమల వలన కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వల్ల 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ విశాఖ వేదికగా చెప్పారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలకు, వ్యాపార వేత్తలకు కనీస విలువ ఉండేది కాదు. చంద్రబాబు హయాంలో అవినీతి గురించి కొందరు విదేశీ వ్యాపారులు కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారంటేనే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇక.. భవిత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జాబ్ ఓరియంటెడ్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నామన్నారు. స్కూల్లో 3వ తరగతి నుంచే సబ్జక్ట్ టీచర్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు. 158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్ధులకు శిక్షణ ఇచ్చాయన్నారు. విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మాటలు భవిష్యత్ తరానికి ఆశాకిరణంగా కనిపించాయి. పిల్లలను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గ వనరులను కల్పిస్తున్నారు. మంచి ఇంగ్లిష్ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చనేది సీఎం జగన్ అనుకుంటున్నారు. ఇది నిజం. చేతిలో విద్య అనే ఆయుధముంటే విశ్వాన్నిగెలవచ్చు. సీఎం జగన్ నాణ్యమైన విద్య గురించి, నాణ్యమైన మానవ వనరుల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో ముందు చూపు ఉన్న నాయకుడు మాత్రమే ఇలా మాట్లాడగలరు. సీఎం జగన్ ప్రసంగంలోని కాన్పెన్స్కు ప్రధాన కారణం.. నిజాయితీ, అవినీతిలేని పాలన. తాను చేయాలి అనుకున్నది చేసుకుంటూ పోవడం. ప్రజలకు మంచి చేస్తున్నానే సంతృప్తి. పారదర్శక పాలన. ఇవన్నీ ఆయనలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. - YV రెడ్డి -
ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన చేస్తాం: సీఎం జగన్
-
వైజాగ్ ని ఒక ఎకనామిక్ ఇంజిన్ ని చేస్తా..!
-
విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది: సీఎం జగన్
-
రూ.1500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
-
మనం ఎకనామిక్ ఇంజిన్ హైదరాబాద్ ని కోల్పోయాం
-
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ హోం మ్యాచ్లు విశాఖలో.. ఎందుకంటే..?
ఐపీఎల్ 2024 ఎడిషన్ తొలి విడత షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహకులు 17 రోజుల షెడ్యూల్ను మాత్రమే ప్రకటించారు. ఈ లెగ్లో మొత్తం 21 మ్యాచ్లు జరుగనున్నాయి. మార్చి 22న ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇంతవరకు టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తొలి విడతలో డబుల్ హెడర్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. డే గేమ్స్ మధ్యాహ్నం 3:30 గంటలకు.. నైట్ మ్యాచ్లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా, తొలి విడత షెడ్యూల్లో ఓ ఆసక్తికర విషయం అందరి దృష్టిని ఆకర్శించింది. అన్ని జట్లు తమ హోం గేమ్స్ను సొంత మైదానాల్లో ఆడుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే సొంత మైదానంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆడుతుంది. ఇందుకు కారణంగా ఏంటని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్కు సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ జరుగనుంది. ఈ మైదానంలో మహిళల ఐపీఎల్ సెకెండ్ ఆఫ్ మ్యాచ్లతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ లెక్కన పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇక్కడ 11 మ్యాచ్లు జరుగనున్నాయి. వరుస మ్యాచ్ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో డీసీ యాజమాన్యం, బీసీసీఐ కలిసి సంయుక్తంగా వేదికను విశాఖకు తరలించేందుకు అంగీకరించారు. ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు హోం గేమ్స్ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లు ఢిల్లీలో కాకుండా విశాఖలో జరుగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్.. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్తో.. ఏప్రిల్ 3న కేకేఆర్తో విశాఖలో ఆడనుంది. ఇక రెండో విడతలో ఢిల్లీ ఆడాల్సిన ఐదు హోం గేమ్స్ను సొంత మైదానంలోనే ఆడుతుంది. ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న ఆడనుంది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో డీసీ టీమ్.. పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. అనంతరం మార్చి 28న జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో (రాత్రి 7:30).. మార్చి 31న విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో (రాత్రి 7:30).. ఏప్రిల్ 3న విశాఖ వేదికగా కేకేఆర్తో (రాత్రి 7:30) డీసీ తలపడనుంది. అన్ని అనుకూలిస్తే.. విశాఖలో రిషబ్ పంత్ మెరుపులు చూసే అవకాశం కూడా ఉంటుంది. పంత్ కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకుని రానున్న ఐపీఎల్లో ఆడతాడని ప్రచారం జరుగుతుంది. -
విశాఖ పరిపాలన రాజధాని అంశంపై కట్టుబడి ఉన్నాం: సుబ్బారెడ్డి
-
క్రికెట్ మ్యాచ్ను వీక్షించిన సీఎం జగన్..!
-
విశాఖ బీచ్ సూపర్
విశాఖ సిటీ: విశాఖ ఆర్కే బీచ్ అందానికి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టీవ్ హార్మిసన్ ఫిదా అయ్యాడు. భారత్లో తాను చూసిన బీచ్లలో రామకృష్ణ బీచ్ అత్యంత శుభ్రమైనది అని కితాబిచ్చాడు. భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కోసం హార్మిసన్ విశాఖకు వచ్చాడు. ఆయన మ్యాచ్ చివరి రోజు ఆర్కే బీచ్ను సందర్శించాడు. హార్మిసన్ యూకేకు చెందిన టాక్స్పోర్ట్స్ చానల్తో మాట్లాడుతూ భారత్లో తాను అనేక బీచ్లను సందర్శించానని, విశాఖ ఆర్కే బీచ్ ఉన్నంత క్లీన్గా మరెక్కడా కనిపించలేదన్నాడు. రోడ్డుకు అతి సమీపంలోనే బీచ్ ఉండడం, యంత్రాల ద్వారా క్లీనింగ్ చేయడం అద్భుతంగా ఉందని చెప్పాడు. విశాఖ ప్రజలు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని హార్మిసన్ ప్రశంసించాడు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో... రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విశాఖ సముద్ర తీర ప్రాంతాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని విధంగా తీర ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. సముద్రం కోతకు గురికాకుండా విశాఖ పోర్టు డ్రెడ్జింగ్ చేపడుతోంది. గతంలో లేని విధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ప్రత్యేక పర్యాటక బీచ్లను అభివృద్ధి చేస్తోంది. రుషికొండ బీచ్లో కల్పించిన సదుపాయాల కారణంగా ప్రతిష్టాత్మకమైన బ్లూ ప్లాగ్ సర్టిఫికేషన్ -
Visakha Test Match: రోహిత్ పైనే భారం
విశాఖ స్పోర్ట్స్: ఒకవైపు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తదితర కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం... మరోవైపు అనుభవంలేని యువ ఆటగాళ్లు... తొలి టెస్టులో ఊహించని పరాజయం... ఈ నేపథ్యంలో వైజాగ్లోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శుక్రవారం నుంచి ఇంగ్లండ్తో జరిగే రెండో టెస్టులో భారత ప్రదర్శన ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొని ఉంది. ఈ వేదికపై భారత జట్టు ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడింది. ఆ రెండింటిలోనూ భారత జట్టే గెలిచింది. కోహ్లి కెప్టెన్సీలో 2016 నవంబర్ 17 నుంచి 21 వరకు ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో టీమిండియా 246 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం 2019 అక్టోబర్ 2 నుంచి 6 వరకు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కోహ్లి సారథ్యంలోనే భారత జట్టు 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్రితంసారి ఇక్కడ ఆడిన భారత టెస్టు జట్టు నుంచి కేవలం రోహిత్ , అశ్విన్ మాత్రమే ఈసారి ఆడుతున్నారు. నాటి టెస్టులో రోహిత్ రెండు సెంచరీలతో (తొలి ఇన్నింగ్స్లో 176; రెండో ఇన్నింగ్స్లో 127) అదరగొట్టాడు. ఫలితంగా బ్యాటింగ్ విషయంలో ఈసారీ రోహిత్ శర్మపైనే అధిక భారం పడనుంది. మరోసారి రోహిత్ మెరిసి... యశస్వి, అయ్యర్ ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తే విశాఖపట్నంలో భారత జట్టు ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంటుంది. సంయమనం అవసరం: కోచ్ రాథోడ్ యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ఒకట్రెండు మ్యాచ్లతో వారి సత్తాపై అంచనాకు రావొద్దని ఆయన కోరారు. బుధవారం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం విక్రమ్ రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రస్తుత భారత జట్టులోని శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడలేదు. వారి విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. వారిపట్ల సంయమనంతో వ్యవహరించాలి. అయ్యర్ త్వరలోనే ఫామ్లోకి వస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నా. పిచ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అలవాటు చేసుకోవాలి. పరుగులు చేసేందుకు అవకాశాలు ఉంటే వాటిని సది్వనియోగం చేసుకోవాలి. షాట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి’ అని రాథోడ్ వ్యాఖ్యానించారు. -
భారత్ Vs ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్
-
అశ్విన్, రోహిత్లకు అచ్చొచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి (విశాఖ) స్టేడియం
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో టీమిండియాతో రెండో టెస్ట్లో తలపడనుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో విశాఖ మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాగైనా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత ఆటగాళ్లు సైతం ఈ మ్యాచ్ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్నారు. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది. మరోవైపు తొలి టెస్ట్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ఇంగ్లండ్ సైతం ఉరకలేస్తుంది. ఆ జట్టు కూడా గెలుపుపై ధీమాగా ఉంది. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో టీమిండియా ఓటమనేదే ఎరుగదు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో భారత్ విజయఢంకా మోగించింది. 2016లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 246 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (167), పుజారా (119) సెంచరీలతో కదంతొక్కారు. అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో అర్ధసెంచరీ సహా ఎనిమిది వికెట్లతో (మ్యాచ్లో) ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్లో శతక్కొట్టిన విరాట్ సెకెండ్ ఇన్నింగ్స్లోనూ అర్ధసెంచరీతో (81) రాణించాడు. బ్యాటింగ్లో విరాట్, బౌలింగ్లో అశ్విన్ చెలరేగడంతో ఈ మ్యాచ్ వన్సైడెడ్గా సాగింది. 2019లో ఇక్కడ జరిగిన మరో మ్యాచ్లో భారత్.. సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్లోనూ భారత్ భారీ తేడాతో (203 పరుగులు) విజయం సాధించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (215) డబుల్ సెంచరీతో, రోహిత్ శర్మ (176) భారీ శతకంతో విజృంభించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 502 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం సౌతాఫ్రికా సైతం టీమిండియాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. డీన్ ఎల్గర్ (160), డికాక్ (111 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 431 పరుగులు చేసింది. అశ్విన్ 7 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. అనంతరం రోహిత్ శర్మ సెకెండ్ ఇన్నింగ్స్లో మరోసారి రెచ్చిపోయాడు. ఈసారి అతను మెరుపు శతకంతో (127) విరుచుకుపడ్డాడు. అతనికి తోడు పుజారా (81) రాణించడంతో భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో 323 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా షమీ (5/35), జడేజా (4/87) ధాటికి 191 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్కు ముందు టీమిండియాను గాయాల బెడద కలవరపెడుతుంది. తొలి టెస్ట్ సందర్భంగా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయపడ్డారు. విశాఖలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సిరీస్కు ముందు నుంచే అందుబాటులో లేడు. ఈ ప్రతికూలతల నడుమ టీమిండియా విశాఖలో విజయయాత్ర కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. -
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గజేంద్ర మోక్షం
-
AP: విశాఖలో మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఛత్తీస్గఢ్లో సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ స్కామ్ వైజాగ్లో కలకలం రేపుతోంది. వైజాగ్లో నమోదైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో వైజాక్కు చెందిన అమిత్ అగర్వాల్, నితిన్ తిబ్రూయల్ను ఈడీ తాజాగా అదుపులోకి తీసుకుంది. నితిన్, అమిత్లు టెక్ ప్రో ఐటీ సొల్యూషన్ పేరుతో వైజాగ్లో కంపెనీ ఏర్పాటు చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నిధులను ఈ కంపెనీ ఖాతాలను వినియోగించి వీరిద్దరు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. బెట్టింగ్ యాప్లోలో వచ్చిన నిధులతో ఆస్తులు కొనుగోలు చేశారు. భార్యల పేరు మీద ఈ ఆస్తులన్నీ ఉంచారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాగేల్కు ఈ కేసులో ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కేసు అక్కడ పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఇదీచదవండి.. పండగ పూట విషాదం.. ముగ్గులు వేస్తుండగా -
Ind Vs Eng- Vizag: టికెట్ల అమ్మకం అప్పటి నుంచే.. వారికి ఫ్రీ ఎంట్రీ
Ind vs Eng 2nd Test 2024: మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు విశాఖపట్నం సిద్దమవుతోంది. టీమిండియా- ఇంగ్లండ్ మ్యాచ్ రూపంలో నాలుగేళ్ల తర్వాత నగరవాసులకు టెస్టు నేరుగా వీక్షించే భాగ్యం కలుగనుంది. కాగా అఫ్గనిస్తాన్తో స్వదేశంలో టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత రోహిత్ సేన ఇంగ్లండ్తో టెస్టులు ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో టెస్టుకు విశాఖపట్నం వేదిక కానుంది. నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి 2- ఫిబ్రవరి 6 వరకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్లో టికెట్ల విక్రయాలు జరిపేందుకు సన్నాహకాలు జరగుతున్నాయి. జనవరి 15 నుంచి ఆన్లైన్లో.. 26 నుంచి ఆఫ్లైన్లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఏసీఏ-వీడీసీ ఏ స్టేడియంతో పాటు స్వర్ణ భారతి స్టేడియంలో ఆఫ్లైన్లో టికెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా.. ఈ టెస్టు మ్యాచ్ వీక్షించేందుకు వీలుగా రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టులకు వరుసగా హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్కోట్, రాంచి, ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనున్నాయి. చదవండి: Shreyas Iyer: అందుకే అతడిని సెలక్ట్ చేయలేదు.. కారణం చెప్పిన ద్రవిడ్ -
సంక్రాంతికి పండగే పండగ
‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘సైంధవ్’ చేశాం. సంక్రాంతి పండగకు రిలీజ్ చేస్తున్నాం.. పండగే పండగ.. మీకు(అభిమానులు, ప్రేక్షకులు)నచ్చేలా నా ఎమోషనల్, యాక్షన్ సీన్స్ కొత్తగా చేశాను. ‘ధర్మచక్రం, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఇలా.. అన్ని సినిమాలను ఆదరించిన మీరు ‘సైంధవ్’ ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బేబీ సారా కీలక పాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైజాగ్లో జరిగిన ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’, ‘సుందరకాండ’, ‘మల్లీశ్వరీ’, ‘గురు’, ‘గోపాల గోపాల’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చాలా చిత్రాల కోసం వైజాగ్ వచ్చాను. ఇప్పుడు ‘సైంధవ్’ కోసం వచ్చాను. న్యూ ఏజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సైంధవ్’. శైలేష్ కొలను బాగా చూపించాడు. ప్రేక్షకులు కంటతడి పెట్టే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాకు హీరో సారా పాప. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా పండక్కి ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్గారి 75వ సినిమా ‘సైంధవ్’ బాధ్యతని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆయన్ను మీరు (ప్రేక్షకులు, అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాను. నేను కమల్హాసన్ గారి అభిమానినని చాలాసార్లు చె΄్పాను. ఇకపై నేను వెంకటేశ్గారి అభిమానిని కూడా. నవాజుద్దీన్ గారిని తెలుగుకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన సీనియర్ హీరోలు రియలిస్టిక్ సినిమాలు చేస్తే చూడాలనుకుంటాం.. అలాంటి ఓ సినిమా ‘సైంధవ్’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘బ్రహ్మపుత్రుడు’ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు తొలిసారి వెంకటేశ్గారిని చూశాను. ‘సైంధవ్’ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. ఈ వేడుకలో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, కెమెరామేన్ మణికందన్ , బేబీ సారా, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, ఎడిటర్ గ్యారీ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ నార్త్ సమన్వయకర్త కేకే రాజు అధ్వర్యంలో బస్సుయాత్ర
-
భయంకరంగా మిచాంగ్ తుఫాన్..
-
Vizag: ఐపీఎల్ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా! ఇప్పుడు లెజెండ్స్ లీగ్లో..
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్ అభివృద్ధి కోసం అన్ని జిల్లాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణను సైతం దిగ్విజయంగా పూర్తి చేస్తున్న తాము.. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) ఆతిథ్యంలోనూ భాగం కానున్నామని హర్షం వ్యక్తం చేశారు. దాదాపు వంద మంది క్రికెటర్లు నగరానికి క్రికెట్ ప్రమోషన్లో భాగంగా విశాఖలోని పీఎంపాలెంలో గల డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడు ఎల్ఎల్సీ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం నుంచి సోమవారం వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దాదాపు వంద మంది క్రికెటర్లు టోర్నమెంట్లో పాల్గొననున్నారని గోపినాథ్రెడ్డి తెలిపారు. భారత్- ఆస్ట్రేలియా, భారత్- సౌతాఫ్రికా మ్యాచ్లు గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్ స్టార్స్, అర్బన్రైజర్స్, హైదరాబాద్ జట్లు ఇక్కడ జరిగే మ్యాచ్లలో పాల్గొంటాయని వెల్లడించారు. అదే విధంగా... ఏసీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి 19న ఇండియా – ఆస్ట్రేలియా వన్డే, నవంబర్ 23న ఇండియా – ఆస్ట్రేలియా టీ–20, గతేడాది జూన్ 14న ఇండియా- సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ–20 మ్యాచ్లను దిగ్విజయంగా నిర్వహించామని ఈ సందర్భంగా గోపినాథ్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ‘‘ఇవే గాకుండా వైజాగ్లో ఫ్లడ్ లైట్స్లో ఏపీఎల్, విజయనగరంలో డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్ జరిపి ఆంధ్ర క్రీడాకారులకు ఐపీఎల్ అవకాశాలను పెంచడం జరిగింది. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏపీలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ కోసం ఏసీఏ ఆధ్వర్యంలో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశాం. క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ అని గోపినాథ్రెడ్డి తెలిపారు. లెజెండ్స్ మ్యాచ్ల షెడ్యూల్.. ►డిసెంబరు- 2 సాయంత్రం 7 గంటలకు: ఇండియా క్యాపిటల్స్ – మణిపాల్ టైగర్స్ ►డిసెంబరు- 3 మధ్యాహ్నం 3 గంటలకు: గుజరాత్ జైంట్స్–సదరన్ సూపర్స్టార్స్ ►డిసెంబరు- 4 సాయంత్రం 7 గంటలకుః మణిపాల్ టైగర్స్–అర్బన్ రైజర్స్ హైదరాబాద్. కాగా మాజీ క్రికెటర్ల సారథ్యంలో సాగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ నవంబరు 18న మొదలైంది. ఈ టీ20 లీగ్లో ఫైనల్ మ్యాచ్ డిసెంబరు 9న సూరత్లో జరుగనుంది. చదవండి: ఆడేది 3 మ్యాచ్లు మాత్రమే.. 17 మంది ఎందుకు? భారత సెలక్టర్లపై ప్రశ్నల వర్షం -
LLC 2023: వైజాగ్లో లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు
సాక్షి, విశాఖపట్నం: లెజెండ్స్ క్రికెట్ లీగ్ టీ–20 తొలి దశ మ్యాచ్లకు విశాఖ కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 2 నుంచి 4 వరకు గల షెడ్యూల్లో భాగంగా ఇక్కడ ఐదు జట్లు ప్రత్యర్థులతో తలపడనున్నాయి. ఈ లీగ్లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన దాదాపు 70 మంది క్రికెటర్లు వైజాగ్కు రానున్నారు. ►ఇక మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సారథిగా వ్యవహరించే ఇండియా క్యాపిటల్స్ కెవిన్ పీటర్స్న్, యశ్పాల్సింగ్, రిచర్డ్ పావెల్, మునాఫ్ పాటేల్, దిల్హార్ ఫెర్నాండో తదితరులు ఉన్నారు. ►మరోవైపు.. హర్బజన్సింగ్ కెప్టెన్గా వ్యవహరించే మణిపాల్ టైగర్స్ జట్టులో ఎస్. బద్రినాథ్, రాబిన్ ఊతప్ప, మహ్మద్ కైఫ్, ప్రవీణ్కుమార్, పంకజ్ సింగ్, మిశ్చెల్, కారీ అండర్సెన్ ఉన్నారు ►అదే విధంగా.. సురేష్ రైనా సారథిగా వ్యవహరించే అర్బన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, ప్రజ్జాన్ ఓజా, టినో బెస్ట్, చమర కాపుగెందర భాగం కానున్నారు. ►ఇక పార్థీవ్ పటేల్ కెప్టెన్గా వ్యవహరించే గుజరాత్ జైంట్స్ జట్టులో క్రిస్ గేల్, కెవిన్ ఓ బ్రియన్, హమీద్ రజా, ఎస్. శ్రీశాంత్ ఉండనున్నారు. ►అదేవిధంగా ఆరోన్ ఫించ్ సారథిగా ఉన్న సదరన్ సూపర్స్టార్స్ జట్టులో అబ్దుల్ రజాక్, టేలర్, ఉపుల్ తరంగ, అశోక్ దిండా తదితరులు ఉన్నారు. షెడ్యూల్ ఇలా.. ►డిసెంబర్ 2- సాయంత్రం 7 గంటలకు ఇండియా క్యాపిటల్స్- మణిపాల్ టైగర్స్ ►3-మధ్యాహ్నం 3 గంటలకు గుజరాత్ జైంట్స్- సదరన్ సూపర్ స్టార్స్ ►4- సాయంత్రం 7 గంటలకు మణిపాల్ టైగర్స్- అర్బన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. కాగా రాంచి వేదికగా నవంబరు 18న మొదలైన లెజెండ్స్ లీగ్ డిసెంబరు 9న సూరత్లో జరిగే ఫైనల్తో ముగియనుంది. -
ఒక తండ్రిలా ఆదుకున్నాడు వైఎస్ జగన్
-
వచ్చే ఆరునెలలూ కేవలం టీ20లే ఆడించండి: టీమిండియా మాజీ ఓపెనర్
Ind Vs Aus 1st T20- Suryakumar Yadav: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో ‘స్కై’కి ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ధాటికి ప్రత్యర్థి జట్టు తమ ప్రణాళికలను అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుందంటూ ఆకాశానికెత్తాడు. తొలిసారి టీమిండియా కెప్టెన్గా కాగా రోహిత్ శర్మ గైర్హాజరీ, హార్దిక్ పాండ్యా గాయపడిన నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు సూర్య టీమిండియా కెప్టెన్గా ఎంపికయ్యాడు. తొలిసారిగా భారత జట్టు పగ్గాలు చేపట్టిన ఈ ముంబై బ్యాటర్ గురువారం నాటి తొలి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి.. 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆదిలోనే జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 58 పరుగులతో అదరగొట్టగా... నాలుగో స్థానంలో దిగిన సూర్య ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. నో బాల్తో విజయం ఖరారు మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 190కి పైగా స్ట్రైక్రేటుతో 80 పరుగులు సాధించాడు. ఇక రింకూ సింగ్ ఆఖరి బంతికి షాట్ బాది(నో బాల్ వల్ల.. ఆ సిక్సర్ కౌంట్ కాలేదు) టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. సూర్య వచ్చాడంటే వ్యూహాలు మార్చాల్సిందే ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేలా ఉంటుంది. నార్మల్ బాల్ వేస్తే కచ్చితంగా షాట్ బాదుతాడు. మిడిలార్డర్లో తను బ్యాటింగ్కు వస్తున్నాడంటే ప్రత్యర్థి ఫీల్డింగ్ మార్పులు చేసుకోవాల్సిందే. డీప్ ఫైన్ లెగ్.. మిడాన్ దిశగా థర్డ్మ్యాన్ను పెట్టాలి. సూర్య క్రీజులోకి వచ్చాడంటే తనకు తగ్గట్లు అప్పోజిషన్ టీమ్ అప్పటికప్పుడు తమ వ్యూహాలు మారుస్తూ పోవాలి. ఈ విషయంలో మిగతా బ్యాటర్లతో పోలిస్తే సూర్య మరింత ప్రత్యేకం’’ అని సూర్య ఆట తీరును ప్రశంసించాడు. వచ్చే ఆరునెలలు కేవలం టీ20లే ఆడించండి ఇక అంతకు ముందు జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్న ఆకాశ్ చోప్రా.. ప్రతి ఆటగాడిని మూడు ఫార్మాట్లు ఆడేలా ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. సూర్యుకుమార్ వంటి విధ్వంసకర ఆటగాళ్లను వారికి ప్రావీణ్యం ఉన్న ఫార్మాట్లకు పరిమితం చేయడం ద్వారా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. టెస్టు, వన్డే, టీ20లలంటూ అటూ ఇటూ తిప్పకుండా.. సూర్యను వచ్చే ఆర్నెళ్ల పాటు పొట్టి ఫార్మాట్లోనే వీలైనంత ఎక్కువగా ఆడించాలని ఆకాశ్ చోప్రా మేనేజ్మెంట్కు సూచించాడు. టీ20 స్పెషలిస్టుగా తన సేవలను విరివిగా వినియోగించుకుంటూ అతడి నైపుణ్యాలు మరింత మెరుగుపడేలా తీర్చిదిద్దాలని సలహా ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలైన సూర్య.. తనకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్లో తిరిగి బ్యాట్ పట్టగానే సునామీ ఇన్నింగ్స్ ఆడటం విశేషం. చదవండి: రోహిత్ అలా.. కోహ్లి ఇలా.. ఎవరు మాత్రం టెంప్ట్ కాకుండా ఉంటారు?: ఆశిష్ నెహ్రా Captain Suryakumar Yadav's first match as #TeamIndia Captain presented an additional challenge 😉 How well does SKY remember his match-winning knock? 🤔 WATCH 🎥#TeamIndia | #INDvAUS pic.twitter.com/X9fLNQEqjw — BCCI (@BCCI) November 24, 2023 -
విశాఖ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్
-
విశాఖ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం: ఎంపీ మోపీదేవి
-
ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘటనపై వెంటనే స్పందించారు: అవంతి
-
దేశంలోనే అత్యధికంగా మత్స్యకార భరోసా ఇస్తున్న రాష్ట్రం ఏపీ: సీదిరి
-
వైజాగ్ స్కూల్ ఆటో ఘటన.. విజయవాడ RTA అలర్ట్
-
భారత్-ఆసీస్ తొలి టీ20.. వైజాగ్లో వాతావరణ పరిస్థితి ఏంటి..?
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా వైజాగ్లోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వైజాగ్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వైజాగ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశాలు ఉండటంతో టాస్ ఆలస్యమవ్వవచ్చని స్థానికులు అంటున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమేమీ లేనప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. కాగా, భారత సెలెక్టర్లు ప్రధాన ఆటగాళ్లకంతా విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్లో యువ జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. వరల్డ్కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెటర్లు.. వైజాగ్ టీ20లో ఆసీస్ను మట్టికరిపించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ సైతం కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్కప్ అనంతరం కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ డేవిడ్ వార్నర్, పేసర్లు స్టార్క్, హాజిల్వుడ్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ సిరీస్లో మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్కు మ్యాక్స్వెల్, ట్రవిస్ హెడ్, ఆడమ్ జంపా దూరంగా ఉండనున్నారని సమాచారం. తుది జట్లు (అంచనా).. భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్గ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, ఎలిస్, బెహ్రన్డార్ఫ్, తన్విర్ సంఘా. -
IND VS AUS 1st T20: మనదే పైచేయి.. విశాఖలోనూ మనోళ్లే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (నవంబర్ 23) తొలి మ్యాచ్ జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఆసీస్పై గెలిచి వరల్డ్కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. ఆసీస్ సైతం వారి కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్కప్ ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ జట్టులో ఉన్నప్పటికీ తొలి టీ20కి ఆడే అవకాశం లేదు. అతనితో పాటు మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఆసీస్ తమ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను తొలి మ్యాచ్లో అడించే అవకాశం ఉంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించినప్పటికీ టీమిండియా ఆసీస్తో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తుంది. కెప్టెన్ స్కై, ఇషాన్ కిషన్, యశస్వి, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్, బిష్ణోయ్లతో భారత స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఆర్షదీప్, ప్రసిద్ద్, ముకేశ్ కుమార్లతో కూడిన పేస్ విభాగమే కాస్త వీక్గా ఉంది. మనదే పైచేయి.. ఇరు జట్ల మధ్య జరిగిన టీ20ల తీరును పరిశీలిస్తే.. ఆసీస్పై భారత్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉందని తెలిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 టీ20ల్లో ఎదురెదురుపడగా.. భారత్ 15, ఆసీస్ 10 మ్యాచ్ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్ రద్దైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 10 మ్యాచ్లు ఆడగా భారత్ 6 మ్యాచ్ల్లో గెలిచి, 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. విశాఖలోనూ మనోళ్లే..! విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడగా రెండింటిలో (2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై) గెలిచి, ఓ మ్యాచ్లో (2019లో ఆ్రస్టేలియా) ఓటమిపాలైంది. -
నిస్వార్ధంగా, నిర్భయంగా ఆడండి.. వ్యక్తిగత మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదు..!
వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 ముందు టీమిండియా కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతను వరల్డ్కప్ అనుభవాలను పంచుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం బాధాకరమని అన్నాడు. వరల్డ్కప్లో తమ ప్రయాణం అద్భుతంగా సాగిందని తెలిపాడు. ఫైనల్లో ఓడినప్పటికీ తమ ప్రదర్శన యావత్ భారత దేశానికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నాడు. పైనల్లో ఎదురైన చేదు అనుభవాన్ని మరచిపోయి ముందుకు సాగాలని అనుకుంటున్నామన్నాడు. వరల్డ్కప్లో రోహిత్ శర్మ టీమిండియాను అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హిట్మ్యాన్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే వరల్డ్ ఛాంపియన్లను ఢీకొట్టేందుకు కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు. రోహిత్ లాగే తాను కూడా జట్టుకు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటానని వివరించాడు. వ్యక్తిగతంగా మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదని పేర్కొన్నాడు. సిరీస్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ.. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్కప్ దృష్ట్యా ఈ సిరీస్ చాలా కీలకమని తెలిపాడు. నిర్భయంగా, నిస్వార్ధంగా, జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆడమని సభ్యులతో చెప్పానని అన్నాడు. ఇటీవలికాలంలో జరిగిన దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్లో వారు అదే చేశారని తెలిపాడు. కాగా, వైజాగ్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు భారత్-ఆసీస్ మధ్య తొలి ట20 జరుగనున్న విషయం తెలిసిందే. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్గ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, ఎలిస్, బెహ్రన్డార్ఫ్, తన్విర్ సంఘా. -
విశాఖలో భారత్ టి20 టీం ప్రాక్టీస్ (ఫొటోలు)
-
లక్ష్మణ్ హెడ్కోచ్గా సూర్య కెప్టెన్సీలో! షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓటమి బాధను మర్చిపోకముందే.. భారత జట్టు తిరిగి మైదానంలో దిగేందుకు సిద్ధమైంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను మొదలుపెట్టనుంది. వైజాగ్ వేదికగా గురువారం ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు అక్కడి చేరుకుని ప్రాక్టీస్లో తలమునకలయ్యాయి. కాగా ఆసీస్తో టీ20 సిరీస్కు ఎప్పటిమాదిరే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉండనున్నారు. ఇక వీరితో పాటు వన్డే వరల్డ్కప్ ఆడిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సిరాజ్, బుమ్రా, షమీ తదితరులు కూడా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరంగా.. సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టీమిండియా సారథిగా ఈ సిరీస్తో పగ్గాలు చేపట్టనున్నాడు. ఇక హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి టీమిండియాకు మార్గదర్శనం చేయనున్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్ నేతృత్వంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు వైరల్గా మారాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ ►తొలి టీ20- నవంబరు 23- గురువారం- వైజాగ్ ►రెండో టీ20- నవంబరు 26- ఆదివారం- తిరువనంతపురం ►మూడో టీ20- నవంబరు 28- మంగళవారం- గువాహటి ►నాలుగో టీ20- డిసెంబరు 1- శుక్రవారం- రాయ్పూర్ ►ఐదో టీ20- డిసెంబరు 3- ఆదివారం- బెంగళూరు ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఆరంభం కానున్నాయి. టీవీలో.. స్పోర్ట్స్ 18, కలర్స్ సినీప్లెక్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే విధంగా డిజిటల్ మీడియాలో జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఆసీస్తో టీ20 సిరీస్కు టీమిండియా సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా జట్టు మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా. చదవండి: అందుకే దాన్ని ఫైనల్ అంటారు: కైఫ్ విమర్శలపై వార్నర్ స్పందన -
ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
బాధితులకు అండగా ఉండాలని సీఎం ఆదేశించారు: మంత్రి సీదిరి
-
మెడ్టెక్ జోన్లో ఎల్సీఎన్జీ స్టేషన్
సాక్షి, విశాఖపట్నం: సౌత్ ఈస్ట్రన్ రీజియన్ పైప్లైన్ (ఎస్ఈఆర్పీఎల్) పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొట్టమొదటి లిక్విఫైడ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (ఎల్సీఎన్జీ) స్టేషన్ను విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్లో ఏర్పాటు చేసింది. ఈ గ్యాస్ స్టేషన్ను ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) బృందం శుక్రవారం ప్రారంభించింది. ఏపీ మెడ్టెక్ జోన్లోని ఎల్సీఎన్జీ హబ్ ద్వారా ఏపీ రీజియన్కు సంబంధించిన సీఎన్జీ అవసరాలను తక్షణమే తీర్చడంతోపాటు నేచురల్ గ్యాస్ లభ్యత, నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు అవకాశం ఉంటుంది. -
ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. రేపటి నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 23న జరుగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కోసం 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం (insider.in) లింక్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్, వన్టౌన్లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్లైన్లో టికెట్లు విక్రయిస్తామని తెలిపారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు వన్టౌన్లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల 22వ తేదీ వరకు, అదేవిధంగా విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్ లో ఉన్న కౌంటర్ లో 23వ తేదీ వరకు రీడీమ్ చేసుకోవచ్చని తెలిపారు. టికెట్ ధరలు ఇలా.. రూ. 600/–, రూ. 1,500/–, రూ. 2000/–, రూ. 3,000/–, రూ. 3,500/–, రూ. 6000/– విలువ గల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మ్యాచ్ తేదీ: నవంబర్ 23 ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 -
వైజాగ్ నేవీ మారథాన్ విజేతలు శిఖంధర్, ఆశా
విశాఖ స్పోర్ట్స్: విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన వైజాగ్ నేవీ మారథాన్ 8వ ఎడిషన్ ఓపెన్లో శిఖంధర్, మహిళల్లో ఆశా విజేతలుగా నిలిచారు. వైజాగ్ నేవీ మారథాన్ పరుగు సాగరతీరంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి అథ్లెట్లు విజయమే లక్ష్యంగా ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగుపెట్టారు. ఔత్సాహికులు సరదాగా ఐదు కిలోమీటర్ల మేర ఫన్ రన్ చేపట్టారు. ఫుల్ మారథాన్ 42.2 కిలోమీటర్లు, హాఫ్ మారథాన్ 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రేస్ను నిర్వహించి విజేతలకు బహుమతులందించారు. మారథాన్ రేస్, ఫన్ పరుగు ఆర్కే బీచ్ మీదుగా నేవల్ కోస్టల్ బ్యాటరీ వైపు వద్ద యూటర్న్ తీసుకుని.. కాళీమాత ఆలయం మీదుగా వీఎంఆర్డీఏ ఎంజీఎం పార్క్ వద్దకు చేరుకోగానే ముగిసింది. పది కిలోమీటర్ల పరుగు తెన్నేటి వద్ద యూ టర్న్ తీసుకోగా, హాఫ్ మారథాన్ పరుగు వీరులు రుషికొండ గాయత్రి కళాశాల దగ్గర యూ టర్న్ తీసుకున్నారు. పూర్తి మారథాన్లో అథ్లెట్లు ఐఎన్ఎస్ కళింగ సమీపంలోని చేపాలుప్పాడ దగ్గర యూ టర్న్ తీసుకుని ప్రారంభస్థానానికి చేరుకున్నారు. వీఎంఆర్డీఏ పార్క్లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పురుషుల ఓపెన్ హాఫ్ మారథాన్లో దీపక్ కుంబార్, 10 కిలోమీటర్ల పరుగులో సోనుకుష్వా విజేతలుగా నిలిచారు. మహిళా విభాగం హాఫ్ మారథాన్లో లిలియన్ రుట్టో, 10 కిలోమీటర్ల పరుగులో మేరీగ్రేస్ విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. -
ఏపీకి అవకాశం.. అదృష్టంగా భావిస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: అసామాన్యులకు సత్కారం -
ఇది శుభపరిణామం: సీఎం జగన్
Updates: 10:55 AM నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది: షెకావత్ ►ఇరిగేషన్పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాం ►ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోంది ►వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం ►మోదీ నేతృత్వంలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం ►రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం ►భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం ►నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్ తరాలను ఉపయోగం ►వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నాం ►తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నాం ►2019లో మోదీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించాం ►జలశక్తి అభియాన్తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి ►నదుల అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది ►ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నాం ►డ్యామ్ సేఫ్టీ యాక్ట్ల ద్వారా డ్యామ్ల పరిరక్షణ జరుగుతోంది ►అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్లను పరిరక్షిస్తున్నాం ►ప్రపంచబ్యాంకు సహకారంతో డ్యామ్ల పరిరక్షణ జరుగుతోంది 10:45 AM నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం: సీఎం జగన్ ►సదస్సులో పాల్గొన్న దేశ,విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు ►ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ►ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది ►ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం ►రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది ►వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి ►సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం 10:05 AM ►రాడిసన్ బ్లూ హోటల్లో ప్రారంభమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ ►కేంద్రమంత్రి షెకావత్తో కలిసి ప్రారంభించిన సీఎం జగన్ ►ర్యాడిసన్ బ్లూ రిసార్ట్స్ వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు ►సుమారు 90 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ►నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే సదస్సు అజెండా ►కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు సత్కారం చేసి జ్ఞాపికలను బహూకరించిన నిర్వాహకులు ►విశాఖ చేరుకున్న సీఎం జగన్ ►రుషికొండ ఐటీ హిల్స్కు చేరుకున్న సీఎం జగన్ ►విశాఖపట్నం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►మరికొద్ది సేపట్లో ఐసీఐడీ సదస్సుకు హాజరుకానున్న సీఎం సాక్షి, విశాఖపట్నం: మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖ సిద్ధమైంది. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీకి వేదికవుతోంది. 74 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రతినిధులకు అతిథ్యమిస్తోంది. ఇప్పటికే జీఐఎస్, జీ 20 సదస్సులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విశాఖలో గురువారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు జరగనుంది. 57 ఏళ్ల తరువాత భారత్లో జరుగుతున్న ఈ సదస్సుకు విశాఖ వేదికవడం విశేషం. సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాడిసన్ బ్లూ హోటల్లో జరగనున్న ఈ సదస్సును గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ‘వ్యవసాయం నీటి కొరతను అధిగమించడం’ అనే థీమ్తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఐసీఐడీ అధ్యక్షుడు డాక్టర్ రాగబ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు భారత్ నుంచి 300 మంది హాజరుకానున్నారు. అలాగే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, జపాన్, కొరియా, మలేషియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం ఇలా 74 దేశాల నుంచి 900 మందికి పైగా ప్రతినిధులు రానున్నారు. ఇదే వేదికపై 74వ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఐఈసీ) సదస్సు కూడా జరగనుంది. తొలిరోజు ప్రముఖుల కీలక ఉపన్యాసాలు ఉండగా.. 3, 4, 5, అలాగే 9వ తేదీన విశాఖ పర్యాటక ప్రాంతాలైన అరకు వ్యాలీ, బొర్రా గుహలు, తాటిపూడి రిజర్వాయర్ వంటి ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు విజయవంతంగా పూర్తయ్యేందుకు పోలీసులు 1100 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. -
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..ఏపీలో వర్షాలు
-
Ind Vs Aus: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. వైజాగ్లో ఈసారి వేరే లెవల్!
Ind Vs Aus 2023 T20 Series- Vizag: తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు శుభవార్త. వైజాగ్లో మరో అంతర్జాతీయ మ్యాచ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి రంగం సిద్ధం చేసింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్లోనే గడుపనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన అనంతరం పొట్టి ఫార్మాట్లో టీమిండియా- ఆసీస్ తలపడనున్నాయి. వైజాగ్లో తొలి మ్యాచ్ ఇందులో భాగంగా వైజాగ్ వేదికగా నవంబరు 23న భారత్- ఆస్ట్రేలియాల మధ్య తొలి టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గోపీనాథ్రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, సిటీ పోలీస్ కమిషనర్ సీపీ రవి శంకర్ అయ్యనర్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈసారి ఐపీఎల్ తరహాలో ఈ సందర్భంగా.. ఏసీఏ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది లో జరగబోయేది మూడో మ్యాచ్ ఇది. గత మ్యాచ్లలో చోటు చేసుకున్న లోటుబాట్లు ఏమైనా ఉంటే వాటిపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. అన్ని రాష్ట్రాల అధ్యక్షులను, కార్యదర్శులకు ఆహ్వానం ఇస్తాము. మన స్టేడియం కెపాసిటి 27 వేలు. ఇక విశాఖలో బీచ్రోడ్డులో 10 వేల మంది వీక్షించేందుకు ఐపీఎల్ తరహా ఫ్యాన్ పార్క్స్, బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. ఇక మ్యాచ్కు సంబంధించిన ఆన్లైన్, ఆఫ్లైన్లలో టికెట్స్ అందుబాటులో ఉంటాయి’’ అని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. ‘‘టీమిండియా- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నిర్వహణకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్లేయర్స్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తున్నాం... ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్పై అందరి అంచనాలు అందుకునేలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. పూర్తి భద్రత నడుమ అదే విధంగా.. సీపీ రవి శంకర్ అయ్యనర్ సైతం.. ‘‘మ్యాచ్ డేన పార్కింగ్, ట్రాఫిక్లపై పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. అభిమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రత నడుమ నిర్వహిస్తాం. ఆరోజు 2 వేల మంది వరకు విధుల్లో పాల్గొంటాం’’ అని మ్యాచ్ నిర్వహణ సజావుగా సాగేలా పోలీస్ శాఖ సంసిద్ధత గురించి తెలిపారు. కాగా ఈ టీ20 సిరీస్ నవంబరు 23న వైజాగ్లో మొదలై.. డిసెంబరు 3 నాటి హైదరాబాద్ మ్యాచ్తో ముగుస్తుంది. చదవండి: మెకానికల్ ఇంజనీర్! పాక్ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి -
పెట్టుబడుల ఆకర్షణకు సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం: లారస్ సీఈఓ
పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న కృషి అభినందనీయని లారస్ సీఈఓ చావ సత్యనారాయణ కొనియాడారు. విశాఖ పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలోని లారస్- 2 యూనిట్ను సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లారస్ సీఈఓ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్య, వైద్య రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు దేశానికే ఆదర్శమన్నారు. అచ్యుతాపురంలో రూ.460 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్ - 2 ద్వారా 1200 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా రూ.850 కోట్లతో నిర్మించే రెండు యూనిట్లు ద్వారా రానున్న రోజుల్లో మరో 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతానికి లారస్ లో సుమారు ఐదువేల మంది ఉన్నారని, కొత్తగా 2000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. నాడు-నేడు ద్వారా రాష్ట్రంలో వివిధ రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు ఆదర్శప్రామంటున్న లారస్ ల్యాబ్స్ సీఈఓ చావ సత్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి. -
విశాఖ నుంచి పరిపాలన దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు కార్యాలయం,ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం కమిటీని నియమించింది. విశాఖపట్నంలో సీఎం అదనపు క్యాంపు కార్యాలయం ఏర్పాటు పరిశీలన చెయ్యాలని కమిటీని ఆదేశించింది. మున్సిపల్, ఆర్థిక, జిఏడి ప్రిన్సిపాల్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటనలు, క్షేత్రస్థాయిలో పర్యటనల నిమిత్తం అవసరమైన కార్యాలయాలు ఏర్పాటుపై పరిశీలన చెయ్యాలని సూచిస్తూ ప్రభుత్వం ఉన్నతాధికారులకు సూచించింది. -
విశాఖలో వెలుగుచూసిన రూ.350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా
-
వైజాగ్లో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం.. బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ ఇచ్చారు. సోమవారం గోవాలో జరిగిన బీసీసీఐ 92వ వార్షికోత్సవ సమావేశంలో షా ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు మాట ఇచ్చారు. బీసీసీఐ వార్షికోత్సవ సమావేశానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి, ట్రెజరర్ ఎ.వి. చలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా తదితరులతో ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ గోపినాథ్ రెడ్డి చర్చించారు. త్వరలో జై షా వైజాగ్కు వస్తానని హామీ ఇచ్చినట్లు ఏసీఏ పెద్దలు వెల్లడించారు. -
‘రాజధానిగా తక్కువ ఖర్చుతో వైజాగ్ పూర్తవుతుంది’
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్ చారిత్రక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభివర్ణించారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం.. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను ఆయన సచివాలయం నుంచి మీడియాకు తెలియజేశారు. మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నది. విద్యాశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. ఐబీ సిలబస్ దిశగా అడుగులు వేస్తున్నాం. అమెరికాలో ఇలాంటి సిలబస్ ఉంది. ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయటం బాల్యం నుండే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు.. ►కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ చేసేందుకు నిర్ణయించింది. తద్వారా.. 10,115 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 11,630 మంది ఏపీవీపీలో పనిచేసే ఉద్యోగులకు మేలు చేకూరుతుంది. ►ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యేనాటికి ఇంటిస్థలం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటాం. అలాగే.. రిటైర్ అయిన ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు చేయాలని నిర్ణయించాం ►క్యాన్సర్ రోగులకు మరింత వైద్య సేవలకోసం గుంటూరు, వైజాగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో 350 పోస్టుల భర్తీకి నిర్ణయం. 53 వేల ఉద్యోగాలను వైద్య అరోగ్య శాఖలో ఇప్పటి వరకు ఇచ్చాం. ఒక్క ఖాళీ కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఒంగోలు,ఏలూరు, విజయవాడ లోని నర్సింగ్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఆరోగ్య సురక్ష ద్వారా మరింత మేలైన వైద్యం అందించాలని నిర్ణయం. సురక్ష క్యాంపులలో మంత్రులు,ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు. సెప్టెంబరు 30న ప్రారంభమై 45 రోజులపాటు క్యాంపులు జరుగుతాయి. కురుపాం మెడికల్ కాలేజీలో 50 % గిరిజనులకు సీట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ►UPSC ఎగ్జామ్స్ కు వెళ్లేవారికి ‘‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’’ పేరుతో ఆర్థిక సాయం అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకుగానూ రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు సాయం అందించనుంది ప్రభుత్వం. ►ఇక.. తొమ్మిది మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయం ►కాకినాడ బల్క్ డ్రగ్ ప్రాజెక్టును నక్కపల్లికి తరలిస్తూ నిర్ణయం ►ప్రభుత్వ భూమిలోనే ఈ ప్రాజెక్టును పెట్టాలని కేంద్రం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం ►హైకోర్టు లో 28 మంది డ్రైవర్ల నియామకానికి నిర్ణయం ►భూదాన్ చట్టంలో సవరణలకు ఆమోదం ►విశాఖపట్నంలో ఐదు ఎకరాల్లో ఓ భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేబినెట్. వైజాగ్ పరిపాలనా రాజధాని అనేది ఆల్రెడీ నిర్ణయం జరిగింది. పరిపాలనా సౌలభ్యం ప్రకారం జరుగుతుంది. రాజధానిగా తక్కువ ఖర్చుతో వైజాగ్ పూర్తవుతుంది. చంద్రబాబు కోసం యాక్టర్ను తెచ్చారు చంద్రబాబు అరెస్టు వెనుక వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసు. ఆయన్ని అరెస్టు చేయటం వలన ఎలాంటి స్పందన లేదని సినిమా యాక్టర్ని తెచ్చారు. వెంటనే ఆయన ములాఖత్ పేరుతో మిలాఖత్ అయ్యారు. దాంతో టీడీపీ క్యాడర్లో కూడా నీరసం వచ్చింది. చంద్రబాబు తప్పేమీ చేయలేదని టీడీపీ నేతలు తీర్పులు ఇస్తున్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు వక్రభాష్యం చెప్తున్నారు. కేంద్ర నిఘా సంస్థలే స్కిల్ స్కాం జరిగినట్టు నిర్ధారించాయి. ఓటుకు నోటు కేసులో భయపడి రాత్రికి రాత్రి చంద్రబాబు పారిపోయి వచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు స్కిల్ ఉన్న వ్యక్తి.. చాలా స్కాంలు చేశారు. పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ప్రధానే చెప్పారు. కేసుల్లో నిందితుడు కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారు. ఐటీ తెచ్చిందే తానని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు విధానాల వలన బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. వైఎస్సార్ వచ్చాకే ఫీజు రియంబర్స్ మెంట్ తెచ్చారు. దానిద్వారా బీసీలతోపాటు అందరికీ మేలు చేకూరింది. అలాంటప్పుడు చంద్రబాబు ఏం చేశారు? అని మంత్రి వేణు విమర్శలు గుప్పించారు. -
నీతి ఆయోగ్ భవిష్యత్ ప్రణాళికలో వైజాగ్కు చోటు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ నగరాల్లో విశాఖకు చోటు కల్పించింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నాలుగు నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయగా అందులో వైజాగ్కు చోటు దక్కింది.. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశాఖను ఎంపిక చేయగా, మిగతా వాటిలో ముంబై, సూరత్, వారణాసి ఉన్నాయి. వీటిని పైలట్ నగరాలుగా కేంద్రం ఎంచుకుంది. 2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రవేశపెట్టగా, తాజాగా ఎంపికైన నాలుగు నగరాలలో పైలట్ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. నీతి ఆయోగ్ ఎంపిక చేసిన నగరాల్లో భారీ ఎత్తున ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనుంది. చదవండి: ఏపీలో గొప్ప చర్యలు: కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ -
టెక్ హబ్ల జాబితాలో ఏపీ నుంచి మూడు - అవేవో తెలుసా?
Nasscom-Deloitte Report: ఆధునిక ప్రపంచంలో భారతదేశం అభివృద్ధివైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రాలు కూడా ఇదే దిశలో పయనిస్తున్నాయి. దేశంలో 26 డెవెలప్ అవుతున్న టైర్-2 నగరాలు టెక్నాలజీ హబ్లుగా అభివృద్ధి చెందుతున్నాయని డెలాయిట్ ఇండియా వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు.. అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖర్చులు 25 నుంచి 30 శాతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రెంటల్స్లో 50 శాతం ఖర్చు ఆదా అవుతుంది. మన రాష్ట్రంలో టెక్ హబ్లుగా అవతరిస్తున్న నగరాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలోని టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11 నుంచి 15 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్నారు. అలాగే ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు 60 శాతం మంది చిన్న పట్టణాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? దేశంలోని మొత్తం స్టార్టప్లలో 39 శాతం (7,000 కంటే ఎక్కువ) డీప్ టెక్ నుంచి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM) వరకు పరిశ్రమలు విస్తరించి ఉన్న ఈ అభివృద్ధి చెందుతున్న టైర్-2 నగరాల్లో పనిచేస్తున్నాయి. టెక్నాలజీకి సంబంధించి పెద్ద నగరాలు గతంలో ఫోకస్లో ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా చెప్పుకో తగ్గ స్థాయిలో వికేంద్రీకరణ జరిగింది. 2014 - 2018 మధ్య కాలంలో కంపెనీలు గణనీయంగా ఎదిగాయి. 2025 నాటికి ఇవి 2.2 రెట్లు వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు కూడా ప్రస్తుతం పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాల్లోని సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో మనదేశంలో మరిన్ని కొత్త నగరాలు టెక్ హబ్లుగా మారతాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. -
Vizag: లాడ్జిలో మెడికో ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే!
సాక్షి, విశాఖపట్నం: డాబా గార్డెన్స్లో కేరళకు చెందిన మెడికో ఆత్మహత్యకు పాల్పడింది. హోటల్ గదిలో రమేష్ కృష్ణ అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేరళ రాష్ట్రం ఒలరిక్కర ప్రాంతానికి చెందిన రమేష్ కృష్ణ.. సెలవుల కోసం సొంత గ్రామానికి వచ్చింది. ఈనెల 13న తన ఇంటి నుంచి తిరుగు ప్రయాణమై 18వ తేదీన వైజాగ్ చేరుకున్న ఆ యువతి.. డాబా గార్డెన్స్లోని లాడ్జిలో అద్దెకు దిగి.. ఆగస్టు 9వ తేదీన గది ఖాళీ చేసింది. తిరిగి మళ్లీ ఈ నెల 24న ఆమె అదే గదికి వచ్చింది. 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు.. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించగా, ఆ యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది. ‘‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’’ అంటూ ఆ సూసైడ్ నోట్లో ఉందని టూ టౌన్ సిఐ తెలిపారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సాక్షి రిపోర్టర్ సురేష్ పై దాడి చేసిన టీడీపీ గూండాలు
-
వైజాగ్..నా కెరీర్ని మార్చేసింది: జేడీ చక్రవర్తి
మద్దిలపాలెం (విశాఖతూర్పు): ‘నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది వైజాగ్. నా చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు విశాఖ వాళ్లే. అందుకే వైజాగ్ అంటే ప్రాణం. ఇది నా లక్కీ సిటీ అని ప్రముఖ హీరో జేడీ చక్రవర్తి అన్నారు. ‘దయ’తో ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్లో తొలిసారిగా నటించానన్నారు. విశాఖ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే.. ‘గులాబి’తో స్టార్ స్టేటస్ కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబి చిత్రంతో స్టార్ స్టేటస్ లభించింది. ఈ చిత్రం విశాఖలో చిత్రీకరణ జరుపుకుంది. మేఘాలలో తేలిపోమన్నది పాట చిత్రీకరణ పాడేరు కాఫీతోటల సమీపంలో చిత్రీకరించామని, ఆ పాట ఎప్పుడు విన్నా ఈ ప్రాంతం గుర్తుకు వస్తుందన్నారు. దాదాపు ఈ చిత్రమంతా వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ జరిపామన్నారు. గులాబి నా సినీ జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు. వైజాగ్ అంటే ప్రాణం విశాఖ ప్రేక్షకులు సినిమాలను విశేషంగా ఆదరిస్తారని, ఇక్కడ టాక్ బాగుంటే ఆ సినిమా సూపర్ హిట్టే. తాను నటించిన గులాబి, సత్య సూపర్ హిట్ చేశారని, తొలిసారిగా నటించిన ‘దయ’ వెబ్ సిరీస్ను కూడా ఆదరించాలని కోరారు. దయ ప్రమోషన్ ఇక్కడ నుంచే.. దయ వెబ్ సిరీస్ ప్రమోషన్ నా లక్కీ సిటీ వైజాగ్ నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. డిస్నీప్లస్ హాట్స్టార్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ఈ వెబ్ సిరీస్ను 24 గంటల్లోనే ట్రెండింగ్లో నిలిచింది. ఇక్కడ వాళ్లు దయ చూశామని, చాలా బాగుందని చెబుతుండడం ఆనందంగా ఉంది. ఇది నా సెకెండ్ ఇన్నింగ్స్కు శుభసూచికంగా భావిస్తున్నా. మూడు భాషల్లో వెబ్ సిరీస్లో నటిస్తున్నా.. ప్రస్తుతానికి రెండు హిందీ, ఒక తెలుగు, తమిళ వెబ్ సిరీస్లో నటిస్తున్నాను. అలాగే మూడు చిత్రాల్లో నటిస్తున్నా. వాటిలో రెండు తెలుగు చిత్రాలు కాగా, ఒకటి తమిళ చిత్రం. రాజకీయాలకు దూరం రాజకీయాలంటే ఆసక్తే కాని, ప్రత్యక్షంగా ఆ రంగంలోకి వచ్చే ఆలోచనే లేదు. ప్రస్తుతం మంచి చిత్రాలతో అభిమానులను అలరించాలన్నదే నా లక్ష్యం. ఆర్జీవీ నా గురువు రాంగోపాల్ వర్మ నాకు గురువు. చాలా మంది రామూ మీ ఫ్రెండ్ కదా అంటుంటారు. ఆయన జీనియస్..ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. దయ వెబ్ సిరీస్ చూసి ఆదరించండి. చక్కని థ్రిల్ కలిగించే క్రైమ్ వెబ్ సిరీస్. మంచి స్క్రీన్ప్లేతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. -
'ఇది నాకు చాలా ప్రత్యేకం'.. జేడీ చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్!
సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య , విష్ణుప్రియ, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ దయా. ఉత్కంఠ భరితమైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్ట్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్తో ఓటీటీ అరంగేట్రం చేసిన జేడీ చక్రవర్తి వైజాగ్లో సందడి చేశారు. ఈ సందర్భంగా డిస్నీ+ హాట్స్టార్ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. (ఇది చదవండి: 'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) జేడీ మాట్లాడుతూ.. 'డిస్నీ ప్లస్ హాట్స్టార్ కుటుంబంలో భాగమైనందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ క్రైమ్ థ్రిల్లర్ నాకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. ప్రతి పాత్రతో నన్ను సవాలు చేసుకోవడం, తిరిగి ఆవిష్కరించుకోవడం చేస్తుంటాను. ఈ సిరీస్లో నాకు అది దక్కింది.' అని అన్నారు. ఈ కార్యక్రమంలో, జేడీ చక్రవర్తి ప్రేక్షకులతో ఆప్యాయంగా పలకరించారు. తన పాత్రపై అభిమానుల్లో ఉన్నా సందేహాలను సమాధానాలిచ్చారు. ఆ తర్వాత అభిమానులతో సెల్ఫీలు దిగారు. (ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!) -
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
చేపల వేటలో నాగచైతన్య .. ఎందుకో తెలుసా?
మత్స్యకారుల జీవితం గురించి తెలుసుకునే పని మీద నాగచైతన్య శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లిన విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ‘బన్నీ’ వాసు ఓ సినిమా నిర్మించనున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసమే టీమ్ కసరత్తులు చేస్తోంది. గురువారం శ్రీకాకుళంలోని మత్స్యకారులను స్వయంగా కలిసి, వారి సంస్కృతి, జీవనశైలిని అడిగి తెలుసుకున్నారు చైతన్య, చందు, ‘బన్నీ’ వాసు. శుక్రవారం వైజాగ్ పోర్టును సందర్శించారు. మత్స్యకారులతో కలసి చేపల వేటకు వెళ్లారు. సముద్ర ప్రయాణం, వేట, అక్కడ ఎదురయ్యే పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. -
ఆగస్టు 1న విశాఖలో సీఎం జగన్ పర్యటన
-
హైదరాబాద్, వైజాగ్లో క్రికెట్ కిక్
ముంబై: టీమిండియా సొంతగడ్డపై ఆడే షెడ్యూల్ను భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పర్యటనలు–టెక్నికల్ కమిటీ మంగళవారం ఖరారు చేసింది. వచ్చే 2023–24 సీజన్కు సంబంధించిన షెడ్యూల్లో మేటి జట్లయిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లు ఉండటంతో క్రికెట్ కిక్ మరింత క్రేజీని పెంచనుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ కొత్త సీజన్లో సొంతగడ్డపై టీమిండియా 16 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతుంది. ఇందులో 5 టెస్టులు, మూడు వన్డేలు, 8 టి20 మ్యాచ్లున్నాయి. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్కప్ భాగ్యానికి నోచుకోలేకపోయిన వేదికలకు ఈ సీజన్లో న్యాయం చేశారు. ఆయా రాష్ట్రాల క్రికెట్ ప్రియులకు గట్టి ప్రత్యర్థులతో వినోదాన్ని అందివ్వనున్నారు. ఈ సీజన్ సంగతులివి... కొత్త సీజన్ ఆ్రస్టేలియా జట్టు రాకతో మొదలవుతుంది. మెగా ఈవెంట్కు ముందు మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. మొహాలీ, ఇండోర్, రాజ్కోట్ 50 ఓవర్ల మ్యాచ్లకు వేదికలు కాగా... వన్డే ప్రపంచకప్ ముగిశాక ఐదు టి20ల ద్వైపాక్షిక టోర్నీ ఆడుతుంది. కొత్త ఏడాదిలో మూడు టి20లను అఫ్గానిస్తాన్తో ఆడుతుంది. ఇదయ్యాక వెంటనే ఇంగ్లండ్తో సమరానికి సిద్ధమవుతుంది. ఇరు జట్ల మధ్య జనవరి 25 నుంచి ఐదు టెస్టుల సిరీస్ మొదలవుతుంది. ఇదీ... హైదరాబాద్, వైజాగ్ ముచ్చట వచ్చే సీజన్ తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రియుల్ని తెగ మురిపించనుంది. గట్టి ప్రత్యర్థి ఆసీస్తో ఐదు టి20ల సిరీస్ వైజాగ్లో మొదలైతే... హైదరాబాద్లో ముగుస్తుంది. ఈ నవంబర్ 23న వైజాగ్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్, డిసెంబర్ 3న హైదరాబాద్లో ఆఖరి మ్యాచ్ జరుగుతాయి. మళ్లీ కొత్త సంవత్సరం జనవరి 25–29 వరకు ఇంగ్లండ్తో తొలి టెస్టు హైదరాబాద్లో, ఫిబ్రవరి 2–6 వరకు రెండో టెస్టు వైజాగ్లోని వైఎస్ఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. -
విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరాచకం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో పవన్ కల్యాణ్ అభిమానులు అరాచకం సృష్టించారు. బ్రో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తమ నాయకుడిలానే ఊగిపోతూ రచ్చరచ్చ చేశారు. జగదాంబ థియేటర్లో అద్దాలు పగుల గొట్టి బీభత్సం సృష్టించారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, గత నెలలో తొలిప్రేమ సినిమా ప్రదర్శించిన థియేటర్ను ధ్వంసం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గాంధీనగర్లో ఉన్న కపర్థి థియేటర్లో ప్రదర్శించారు. సెకండ్ షో రాత్రి 10.30 గంటలకు మొదలవగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. స్క్రీన్ను చింపేందుకు ప్రయత్నించగా, థియేటర్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పవన్ అభిమానులు రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. స్క్రీన్ను చించివేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. అద్దాలను పగులగొట్టారు. సినిమాకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారు. చదవండి: ‘పవన్.. ఈ తరహా చర్యల వల్ల మీ టీచర్లు కూడా సిగ్గు పడతారు’ -
వైజాగ్లో స్టార్బక్స్.. నోరూరించే మెనూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాఫీ విక్రయాల్లో ఉన్న టాటా స్టార్బక్స్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో స్టోర్ను తెరిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థ కేంద్రాలున్న నగరాల సంఖ్య 45కు చేరుకుంది. ఏపీలో ఇప్పటికే కంపెనీకి విజయవాడలో ఔట్లెట్ ఉంది. టాటా కంజ్యూమర్ ప్రొడక్ట్స్ సంయుక్త భాగస్వామ్యంలో 2012లో భారత్లో ప్రవేశించిన స్టార్బక్స్కు దేశవ్యాప్తంగా 350 స్టోర్లు ఉన్నాయి. ఈ స్టోర్లో అనుకూలమైన ఎంపికల శ్రేణిని టాటా స్టార్బక్స్ పరిచయం చేస్తోంది. కొత్త పిక్కో కప్ సైజుతో సహా, కాఫీ ప్రియులకు ఫేవరెట్ పానీయాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫిల్టర్ కాఫీ, మసాలా చాయ్, ఏలకుల చాయ్, మిల్క్షేక్లు, శాండ్విచ్లను ఆకర్షణీయమైన ఆఫర్లతో అందిస్తోంది. -
పూర్ణానంద స్వామి చేష్టలు బయట పెట్టిన మైనర్ బాలిక
-
పూర్ణానంద స్వామి పై అత్యాచారం కేసు