Tech Mahindra
-
ఎన్విడియాతో ఐటీ దిగ్గజాల జత
గ్లోబల్ చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియాతో దేశీ ఐటీ దిగ్గజాలు విప్రో, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ చేతులు కలిపాయి. వివిధ పరిశ్రమలకు ఏఐ ఆధారిత విభిన్న సొల్యూషన్లు అందించే బాటలో ఎన్విడియాతో విడిగా భాగస్వామ్యాలకు తెరతీస్తున్నాయి. చిప్ తయారీ దిగ్గజం ప్రస్తుతం కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న జీపీయూ టెక్నాలజీ వార్షిక సదస్సు(జీటీసీ)లో భాగంగా దేశీ ఐటీ కంపెనీలు ఎన్విడియా టెక్నాలజీల ఆధారంగా అందిస్తున్న సేవలను ప్రదర్శిస్తున్నాయి.ఈ సందర్భంగా ఎన్విడియా ఏఐ సాఫ్ట్వేర్ ఆధారిత అటానమస్ ఫార్మాకోవిజిలెన్స్(పీవీ) సొల్యూషన్లు టెక్ మహీంద్రా విడుదల చేసింది. వీటిని ఔషధ భద్రత నిర్వహణలో వినియోగిస్తారు. తద్వారా వేగవంత, కచ్చితమైన పీవీ ప్రాసెస్కు వీలుంటుంది. ఎన్విడియా ఏఐ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సహాయంతో విప్రో కొత్తతరహా ఏజెంటిక్ ఏఐ సర్వీసులను ప్రవేశపెట్టింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ ప్రత్యేక ఇన్ఫ్రా, డేటా, వర్క్ఫోర్స్, బిజినెస్ నెట్వర్క్స్ను పటిష్టపరచుకోవడంతోపాటు ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి, అమలు చేసేందుకు వీలుంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హెల్త్కేర్, ఎడ్యుకేషన్ తదితర రంగాలలో పౌర సేవలను భారీగా మెరుగుపరచేందుకు విప్రో ఎకోసిస్టమ్ వినియోగపడనుంది.ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంఎన్విడియా జెట్సన్ ప్లాట్ఫామ్ను వినియోగించుకోవడం ద్వారా ఏఐ ఆధారిత రైల్వే ట్రాక్ తనిఖీ సొల్యూషన్ ట్రాక్ఈఐను ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ విడుదల చేసింది. తద్వారా రియల్ టైమ్ లోపాల గుర్తింపు, నిర్వహణలో మద్దతు తదితర ప్రపంచవ్యాప్త రైల్వే నెట్వర్క్ల భద్రతను పెంచేందుకు సహాయపడనుంది. ఎన్విడియా జీటీసీ 2025ను ఈ నెల 17–21 మధ్య కాలిఫోర్నియాలోని శాన్జోస్లో నిర్వహిస్తోంది. ఏఐలో తాజా ఆధునికతలను ప్రదర్శించేందుకు సదస్సు ఉపపయోగపడుతోంది. -
అమెరికాలో టెక్ మహీంద్రా విస్తరణ
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా టెక్సాస్లోని ప్లానోలో ఆఫీసు ఏర్పాటు చేసింది. ఇది 130 సీట్ల సామర్థ్యంతో 27,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైంది. అమెరికాలో ఇది తమకు పంతొమ్మిదో కార్యాలయమని సంస్థ తెలిపింది. కన్సలి్టంగ్, డెలివరీ, కస్టమర్ సపోర్ట్ సర్వీసులు మొదలైన సరీ్వసులు దీని ద్వారా అందించనున్నట్లు వివరించింది. ఇదే ప్రాంగణంలో ఇన్నోవేషన్ ల్యాబ్ను కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 90 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టెక్ మహీంద్రాలో 1,50,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
అత్యంత విలువైన ఐటీ బ్రాండ్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దేశీ టెక్నాలజీ సంస్థలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా దిగ్గజాలు టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్(Infosys), హెచ్సీఎల్ టెక్నాలజీస్(HCL Tech), విప్రో(Wipro), టెక్ మహీంద్రా(Tech Mahindra) ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సర్వీసుల బ్రాండ్ల జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకున్నాయి. 2025కి గాను టాప్ 25 సంస్థలతో బ్రాండ్ వేల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన నివేదికలో వరుసగా నాలుగో సంవత్సరంలోనూ టీసీఎస్ రెండో స్థానంలో, ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. ఇందులో యాక్సెంచర్ వరుసగా ఏడో ఏడాది అగ్రస్థానంలో కొనసాగింది.టీసీఎస్ బ్రాండ్ విలువ 11 శాతం పెరిగి 21.3 బిలియన్ డాలర్లకు చేరగా, ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 15 శాతం పెరిగి 16.3 బిలియన్ డాలర్లకు చేరింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ సేవల బ్రాండుగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ నిల్చింది. కంపెనీ బ్రాండు విలువ 17 శాతం పెరిగి 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అటు విప్రో, టెక్ మహీంద్రా, హెక్సావేర్ మొదలైనవి కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. దేశాలపరంగా చూస్తే మొత్తం బ్రాండ్ వేల్యూలో 40 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో 36 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రిలియనీర్లు వచ్చేస్తున్నారహో!కోలుకుంటున్న మార్కెట్ ..ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023 ఆఖర్లో, 2024 తొలినాళ్లలో కార్పొరేట్లు వ్యయాలను తగ్గించుకున్నాయని, అదే సమయంలో కృత్రిమ మేథ సంబంధిత సర్వీసులకు డిమాండ్ పెరిగిందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. అమెరికా మార్కెట్ క్రమంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారతీయ ఐటీ సంస్థలకు ప్రయోజనాలు చేకూరగలవని పేర్కొంది. 2025లో వడ్డీ రేట్లు తగ్గి, కార్పొరేట్లు ఖర్చు చేయడం పెరగడంతో పాటు కొత్త టెక్నాలజీలకు డిమాండ్ నెలకొనడం వల్ల ఐటీ సంస్థలు లబ్ధి పొందవచ్చని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. అత్యంత విలువైన బ్రాండ్లన్నీ కూడా మారుతున్న పరిశ్రమ ట్రెండ్స్కి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు, వ్యూహాత్మక ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. -
విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!
ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు (Q3 Results) సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 24% జంప్చేసి రూ. 3,354 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా 0.5% పుంజుకుని రూ. 22,319 కోట్లకు చేరింది.క్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 260.2–265.5 కోట్ల డాలర్ల శ్రేణిలో నమోదుకాగలదని (గైడెన్స్) తాజాగా ప్రకటించింది. వెరసి ఆదాయ వృద్ధిని మైనస్ 1% నుంచి +1% మధ్య అంచనా వేసింది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు కంపెనీ బోర్డు అనుమతించింది. మూడేళ్లపాటు లాభాల్లో 70%వరకూ వాటాదారులకు చెల్లించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.బిలియన్ డాలర్లు: తాజా సమీక్షా కాలంలో 17 భారీ డీల్స్ ద్వారా బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు విప్రో వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో కొత్తగా 10,000–12,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేసింది. క్యూ3లో నికరంగా 1,157మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,732కు చేరింది.టెక్ మహీంద్రాఐటీ సొల్యూషన్ల కంపెనీ టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 93 శాతం దూసుకెళ్లి రూ. 983 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో ప్రతికూలతల కారణంగా కేవలం రూ. 510 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2లో సాధించిన రూ. 1,250 కోట్లతో పోలిస్తే నికర లాభం తగ్గింది.ఇదీ చదవండి: ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..కాగా.. మొత్తం ఆదాయం నామమాత్రంగా 1 శాతమే పుంజుకుని రూ. 13,286 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 5.4 శాతం నుంచి 10.2 శాతానికి మెరుగుపడ్డాయి. అయితే రెండేళ్లలో ఇవి 15 శాతానికి బలపడగలవని కంపెనీ సీఈవో, ఎండీ మోహిత్ జోషీ పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రధానంగా టెలికం, తయారీ రంగాల నుంచి74.5 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు సీఎఫ్వో రోహిత్ ఆనంద్ వెల్లడించారు. -
టెక్ మహీంద్రా, పెరల్ ఇన్నోవేషన్ హబ్
ముంబై: టెక్ మహీంద్రా సహకారంతో బెంగుళూరులో మేకర్స్ ల్యాబ్ పేరుతో ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్టు పెరల్ అకాడమీ తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెటావర్స్, గేమింగ్ రంగాల్లో పరిష్కారాలను అభివృద్ధి చేసే దిశగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్ధేశమని క్రియేటివ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన పెరల్ అకాడమీ పేర్కొంది.‘టెక్ మహీంద్రా సంకేతిక నైపుణ్యంతో మా డిజైన్ ఇన్నోవేషన్లను మిళితం చేయడం ద్వారా పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది’ అని అకాడమీ ప్రెసిడెంట్ అదితీ శ్రీవాస్తవ తెలిపారు. అభివృద్ధి చెందిన సాంకేతిక రంగం కొత్త నైపుణ్యాలను, సృజనాత్మక రంగం అనుభవాలను మేకర్స్ ల్యాబ్ అందిస్తుందన్నారు. -
చేతులు కలిపిన టెక్ మహీంద్రా, ఏడబ్ల్యూఎస్
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్తో (ఏడబ్ల్యూఎస్) ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజిన్స్ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా టెలికం నెట్వర్క్లను రూపాంతరం చేసే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది.అధునాతన ఏఐ పరిష్కారాలను వినియోగించి నెట్వర్క్ సామర్థ్యాన్ని, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికి ఇరు సంస్థలు కృషిచేస్తాయి. కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు, ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం రూపొందించిన అటానమస్ నెట్వర్క్స్ ఆపరేషన్స్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్తో టెక్ మహీంద్రా బహుళ–సంవత్సరాల వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకం చేసింది. -
టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ ఇండస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తాజాగా ప్రాజెక్ట్ ఇండస్ను ప్రారంభించింది. బహుళ భారతీయ భాషలు, మాండలికాలలో సంభాíÙంచడానికి దేశీయంగా రూపొందించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఇది. ఇండస్ ఎల్ఎల్ఎం మొదటి దశ హిందీ భాషతోపాటు దాని 37కుపైగా మాండలికాల కోసం అభివృద్ధి చేశారు. ఇండస్ మోడల్ ప్రారంభంలో మౌలిక సదుపాయాలు, కంప్యూటింగ్ను ఒక సేవగా, సంస్థలకు ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అందించడం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెడుతుందని కంపెనీ తెలిపింది. ఎల్ఎల్ఎంకు అవసరమైన అధిక–పనితీరు గల కంప్యూటింగ్ సొల్యూషన్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి డెల్ టెక్నాలజీస్తో టెక్ మహీంద్రా చేతులు కలిపింది. కస్టమర్లు జెన్ఏఐ అప్లికేషన్లలో ఇండస్ మోడల్ను ఏకీకృతం చేసేందుకు వీలుగా ఇంటెల్ జియాన్ ప్రాసెసర్లు, వన్ఏపీఐ సాఫ్ట్వేర్, ఇంటెల్ అడ్వాన్స్డ్ మ్యాట్రిక్స్ ఎక్స్టెన్షన్స్ సహా ఇంటెల్–ఆధారిత మౌలిక సదుపాయాల పరిష్కారాలను ప్రాజెక్ట్ ఇండస్ స్వీకరిస్తుంది. -
టెక్ మహీంద్రా కంపెనీ ‘కామ్వివా’కి కొత్త సీఈవో
టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ అయిన డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కామ్వివాకి కొత్త సీఈవో నియమితులయ్యారు. రాజేష్ చంద్రమణిని సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.2024 మేలో పదవీ విరమణ చేసిన మనోరంజన్ 'మావో' మహాపాత్ర నుంచి రాజేష్ చంద్రమణి పగ్గాలు చేపట్టారు. కాగా కామ్వివా బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మహాపాత్ర కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.రాజేష్ చంద్రమణి గతంలో టెక్ మహీంద్రాలో సీనియర్ నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఆయన అక్కడ కమ్యూనికేషన్స్, మీడియా & ఎంటర్టైన్మెంట్ విభాగంలో యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, జపాన్, భారత్లో వ్యూహాత్మక మార్కెట్లకు బిజినెస్ యూనిట్ హెడ్గా పనిచేశారు. -
టెక్ మహీంద్రా మాజీ చీఫ్ వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా లిమిటెడ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. వినీత్ నయ్యర్ మృతిపై పలువురు ప్రముఖలు తమ సంతాపాన్ని తెలియజేశారు."భారత్ ఈరోజు అత్యుత్తమ నాయకుడిని కోల్పోయింది" అని టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ నయ్యర్ మరణానికి సంతాపాన్ని తెలియజ్తేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా నయ్యర్ మృతికి ‘ఎక్స్’ పోస్ట్లో సంతాపం తెలిపారు. "భారతీయ వ్యాపార రంగంలో వినీత్ అతి పెద్ద వ్యక్తి" అని పేర్కొన్నారు. టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ‘ఎక్స్’లో వినీత్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది.1939లో జన్మించిన నయ్యర్ మసాచుసెట్స్లోని విలియమ్స్ కళాశాల నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఐఏఎస్ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన 40 ఏళ్ల కెరీర్లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ రంగాల్లో పనిచేశారు. పదేళ్లకుపైగా ప్రపంచ బ్యాంకులో పనిచేసిన ఆయన పలు కీలక పదవులను నిర్వహించారు. 2009లో కుప్పకూలిన కంప్యూటర్ సేవల సంస్థ సత్యం పునరుద్ధరణలో నయ్యర్ కీలక పాత్ర పోషించారు.It saddens me to share the news of the passing of Vineet Nayyar this morning.Vineet was a larger than life figure in the Indian Business landscape. A distinguished IAS officer, who then served with the World Bank, he became the first Chairman of GAILHe then made a hugely… pic.twitter.com/ZLlfzNXJ2K— anand mahindra (@anandmahindra) May 16, 2024 -
మైక్రోసాఫ్ట్తో టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: బిజినెస్, డేటా నిపుణులకు సులభతరంగా ఉండే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆధారిత వర్క్బెంచ్ను రూపొందించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపినట్లు టెక్ మహీంద్రా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వినియోగాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్క్బెంచ్ సిస్టమ్ ఉపయోగపడగలదని, సంక్లిష్టమైన డేటా వర్క్ఫ్లోను సరళతరమైన ఇంటర్ఫేస్తో సులభంగా రూపొందించవచ్చని టెక్ మహీంద్రా వివరించింది. వ్యాపారాల వృద్ధిలో తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్తో భాగస్వామ్యం తోడ్పడగలదని పేర్కొంది. -
గుర్నానీకి హైసియా పురస్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ మహీంద్రా మాజీ సీఈవో, ఎండీ సి.పి.గుర్నానీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) నుంచి జీవిత కాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. హైసియా 31వ జాతీయ సదస్సు, అవార్డుల కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో జరిగింది. 2022–23 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో మొత్తం 36 కంపెనీలు, వ్యక్తులు హైసియా అవార్డులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
గిగ్ వర్కర్ల కోసం.. టెక్ మహీంద్రా ‘పాప్యులై’ ప్లాట్ఫామ్
న్యూఢిల్లీ: తాత్కాలిక ఉద్యోగార్థులు (గిగ్ వర్కర్లు) ప్రముఖ కంపెనీల్లో చిరుద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా సహాయపడేందుకు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా ‘పాప్యులై’ పేరిట క్రౌడ్సోర్సింగ్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది. ఇందులో ఉద్యోగార్థుల కోసం కంటెంట్ రేటింగ్, డేటా కలెక్షన్, డేటా ట్రాన్స్క్రిప్షన్, డేటా అనోటేషన్ వంటి తాత్కాలిక ఉద్యోగావకాశాలు ఉంటాయి. అటు కంపెనీలపరంగా చూస్తే అర్హత కలిగిన నిపుణుల డేటాబేస్ అందుబాటులో ఉంటుంది. తద్వారా ఇటు ఉద్యోగార్థులకు, అటు కంపెనీలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని టెక్ మహీంద్రా బిజినెస్ హెడ్ (బిజినెస్ ప్రాసెస్ సరీ్వసెస్) బీరేంద్ర సేన్ తెలిపారు. తదుపరి తరం కృత్రిమ మేథ (ఏఐ) సొల్యూషన్స్ను రూపొందించాలంటే గణనీయంగా సమయంతో పాటు సాధారణంగా కంపెనీల్లో ఉండే ఉద్యోగులే కాకుండా బైటి నిపుణుల అవసరం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పాప్యులై ప్లాట్ఫాం అంతర్జాతీయ స్థాయిలో గిగ్ నిపుణులను, కంపెనీలను అనుసంధానిస్తుందని తెలిపారు. దీనితో కంపెనీలు వ్యయాలు తగ్గించుకుంటూ, ఉత్పాదకత పెంచుకుంటూ .. ఏఐ సొల్యూషన్స్ రూపకల్పనను వేగవంతం చేసుకోవచ్చని సేన్ చెప్పారు. అలాగే గిగ్ నిపుణులు టాప్ ఏఐ ప్రాజెక్టులను దక్కించుకోవచ్చని, మరిన్ని వనరుల ద్వారా ఆదాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. -
టెక్ మహీంద్రా లాభం డౌన్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో నికర లాభం 61 శాతం క్షీణించి రూ. 505 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,299 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం నీరసించి రూ. 12,864 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 13,130 కోట్ల టర్నోవర్ సాధించింది. ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన తన కెరీర్లోకెల్లా గత కొన్ని త్రైమాసికాలు అత్యంత క్లిష్టమైనవంటూ టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. ► త్రైమాసికవారీగా 78% వృద్ధితో రూ. 5,300 కోట్లు(64 కోట్ల డాలర్లు) విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 2,980 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 8 శాతంపైగా క్షీణించి 1,50,604కు పరిమితమైంది. గతేడాది క్యూ2 లో ఈ సంఖ్య 1,63,912గా నమోదైంది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు వార్షిక ప్రాతిపదికన 20% నుంచి 11%కి దిగివచి్చంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు 1.4% నష్టంతో రూ. 1,140 వద్ద ముగిసింది. -
రాష్ట్రంలో టెక్ మహీంద్రా స్టార్ హోటల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించేందుకు మహీంద్రా హాలిడేస్ చైర్మన్, టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీసీ గుర్నాని సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన గురువారం సీఎం వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. స్టార్ హోటల్స్ ఏర్పాటు గురించి సీఎం జగన్కు ఆయన వివరించారు. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి సీఎం జగన్ వివరించారు. విశాఖ సహా 3 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నామని.. వచ్చే 2 నెలల్లో శంకుస్థాపన చేపడతామని మహీంద్రా ప్రతినిధులు వెల్లడించారు. మహీంద్రా గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్రా సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్రా విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు. -
సీఎం జగన్ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ సీపీ గుర్నాని
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని గురువారం కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్ సంసిద్దత వ్యక్తం చేసింది. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎంకి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులు వివరించారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్న మహీంద్ర గ్రూప్, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో మహీంద్ర గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్ర సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్ర విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు. చదవండి: సొంత పార్టీ, వర్గాన్ని అమ్ముకునే వ్యక్తి పవన్: సీఎం జగన్ కౌంటర్ -
టెక్ మహీంద్రా కీలక నిర్ణయం .. ఆనందంలో ఉద్యోగులు
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జాబ్ మార్కెట్లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది విడుదలై జాబ్ మార్కెట్లో అలజడి సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్పై 8 వేల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. వ్యూహాత్మక అడుగుతో జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ డిమాండ్ను తీర్చేందుకు కంపెనీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, మార్కెటింగ్ హెడ్ హర్షేంద్ర సోయిన్ సంస్థ వృద్ధి సాధించడంలో ఏఐ ప్రాముఖ్యతను వివరించారు.బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, హెల్త్కేర్, మ్యానఫాక్చరింగ్, రిటైల్పై సంస్థ దృష్టి సారించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా సంస్థ నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. సవాళ్లు - అవకాశాలు ఏఐ,ఎమర్జింగ్ టెక్నాలజీలపై టెక్ మహీంద్రా దృష్టి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, జూన్ త్రైమాసికంలో కంపెనీ సవాళ్లను ఎదుర్కొంది, గత సంవత్సరంతో పోలిస్తే నికర లాభంలో 38% క్షీణతను చవిచూసింది. కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ (సీఎంఈ) విభాగంలో ఈ సవాళ్లకు దోహదం చేసింది. అయితే భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేసిన ప్రస్తుత సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలను వృద్ధికి కీలక టెక్నాలజీ రంగాలుగా గుర్తించారు. ఇందులో భాగంగా, ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ఏఐపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైల్ చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి.. ఎందుకంటే? -
అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ టెక్ కంపెనీ సీఈవోలు వీరే.. (ఫొటోలు)
-
AP: ఐటీ ఎగుమతుల్లో బూమ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు గత నాలుగేళ్లుగా వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. స్టాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), వీసెజ్ల్లో నమోదైన ఐటీ కంపెనీల ద్వారా 2022–23లో రాష్ట్రంలో రూ.1,649.25 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగినట్లు ఐటీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఎస్టీపీఐలో నమోదైన ఐటీ కంపెనీల ద్వారా రూ.972.43 కోట్ల ఎగుమతులు జరగగా వీసెజ్ కంపెనీల ద్వారా రూ.676.82 కోట్ల ఎగుమతులు జరిగాయి. రూ.5,000 కోట్లపైనే! 2019–20లో ఏపీ నుంచి రూ.1,087.4 కోట్ల ఐటీ ఎగుమతులు నమోదు కాగా నాలుగేళ్లలో 34 శాతం పెరిగాయి. నాలుగేళ్లలో ఎస్టీపీఐ కంపెనీల ద్వారా ఎగుమతులు రూ.846.77 కోట్ల నుంచి రూ.972.43 కోట్లకు పెరిగితే వీసెజ్ ద్వారా ఎగుమతులు రూ.240.63 కోట్ల నుంచి రూ.676.82 కోట్లకు చేరుకున్నాయి. ఇంకా పలు ఐటీ కంపెనీల ఆడిటింగ్ పూర్తికాలేదని, ప్రాథమిక సమాచారం మేరకు 2022–23 ఐటీ ఎగుమతుల అంచనాలను రూపొందించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రం నుంచి భారీగా ఎగుమతులు జరుగుతున్నా వాటి ప్రధాన కార్యాలయాలు ఇక్కడ లేకపోవడంతో మన రాష్ట్ర పరిధిలోకి రావడం లేదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రం నుంచి కనీసం రూ.5,000 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరుగుతున్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్నెళ్లలో వరుసగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ కంపెనీలు విశాఖతోపాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కి ముందు రాష్ట్రంలో ఐటీ కంపెనీల సంఖ్య 178 కాగా ఇప్పుడు 372కి చేరుకోవడం గమనార్హం. గత ఆర్నెళ్ల వ్యవధిలో అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, బీఈఎల్, ఇన్ఫోసిస్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ అమెరికా సాఫ్ట్వేర్, టెక్బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ లాంటి డజనుకుపైగా ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటైనట్లు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిటా) గ్రూపు సీఈవో ఎస్.కిరణ్ కుమార్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇవికాకుండా మరికొన్ని కీలక ఐటీ కంపెనీలతో చర్చలు తుది దశలో ఉన్నట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీల ద్వారా అదనంగా 20,000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు. విస్తరిస్తున్న కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుండటంతో ఇప్పటికే ఏర్పాటైన పలు ఐటీ కంపెనీలు భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటిదాకా విశాఖకు పరిమితమైన టెక్ మహీంద్రా తాజాగా విజయవాడలో కార్యకలాపాలను ప్రారంభించింది. గన్నవరం మేథా టవర్స్లో 120 మంది సీటింగ్ సామర్థ్యం ఉన్న కార్యాలయాన్ని టెక్ మహీంద్రా ప్రారంభించింది. హెచ్సీఎల్ విజయవాడ నుంచి విశాఖకు విస్తరించగా, విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్ఎస్, పల్ససెస్ ఐడీఏ లాంటి 30కిపైగా ఐటీ, ఐటీ ఆథారిత సేవల కంపెనీలు విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది. 2012లో కేవలం 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. వీరిలో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు డబ్ల్యూఎన్ఎస్ సీఈవో కేశవ్.ఆర్.మురుగేష్ ప్రకటించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీలతోపాటు విస్తరణ ద్వారా గత మూడేన్నరేళ్లలో రాష్ట్రంలో 23,000 మందికి ఐటీ రంగంలో ఉపాధి లభించింది. 2019 నాటికి రాష్ట్రంలో 35,000గా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 58,000కి చేరినట్లు (అపిటా) గ్రూపు సీఈవో కిరణ్కుమార్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఐటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖలో మిలియన్ టవర్ రెండో దశ నిర్మాణ పనులు పూర్తి కాగా తాజాగా రూ.300 కోట్లతో ఐస్పేస్ బిజినెస్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి అదనంగా అదానీ డేటా సెంటర్లో ఐటీ పార్క్ను అభివృద్ధి చేస్తోంది. -
మేం రెడీ: ఆల్ట్మాన్కు సీపీ గుర్నానీ చాలెంజ్, ఏం జరిగిందంటే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త సామ్ ఆల్ట్మన్ సిలికాన్ వ్యాలీతో భారతీయ నిపుణులు పోటీ పడలేరన్న వ్యాఖ్యలపై టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ స్పందించారు. భారతీయ కంపెనీలు తమ సిలికాన్ వ్యాలీ కౌంటర్ పార్ట్లతో పోటీ పడలేరన్న ఆల్ట్మాన్ చాలెంజ్ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. భారతదేశంతో సహా ఆరు దేశాల పర్యటనలో ఉన్న ఆల్ట్మాన్ను ఇండియాలో చాలా పవర్ ఫుల్ ఎకోసిస్టం ఉంది. ప్రత్యేకంగా ఏఐపై దృష్టి పెడుతున్నాం, కానీ చాట్జీపీటీ లాంటి కృత్రిమ మేధస్సు సాధనాన్ని ఇండియా, ఆగ్నేయాసియాలో తయారు చేయగలదా అని మాజీ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. (వారికి గుడ్న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!) "ఇది ఎలా పని చేస్తుందో మీకు చెప్పబోతున్నాం, ట్రైనింగ్ ఫౌండేషన్ మోడల్స్పై పోటీ పడటం పూర్తిగా ప్రయోజనం లేనిది, ఆఫ్కోర్స్.. ఎలాగైనా ప్రయత్నించడం మీ జాబ్ అయినా కానీ వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందడని సమాధానమిచ్చాడు. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) ఆల్ట్మాన్ వ్యాఖ్యలను పూర్తి తిప్పికొడుతూ గుర్నానీ ట్వీట్ చేశారు. ఒక సీఈవోకి మరో సీఈవోకి ఇచ్చిన సవాలును స్వీకరిస్తున్నానంటూ ప్రతి సవాల్ విసిరారు. మరోవైపు చాట్జిపిటి వంటి టూల్ను రూపొందించే సామర్థ్యం భారత్కు లేదని ఆల్ట్మాన్ పేర్కొన్నప్పటికీ, భారతీయ పారిశ్రామికవేత్తలు తమ సొంత సాధనాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారని ఆనందన్ కూడా ట్వీట్ చేశారు. అంతేకాదు 5000 సంవత్సరాల భారతీయ వ్యవస్థాపకత, భారతీయ పారిశ్రామిక వేత్తలను మనం ఎప్పటికీ తక్కువ అంచనా వేయొద్దు, తామూ ప్రయత్నించాలనుకుంటున్నామన్నారు. OpenAI founder Sam Altman said it’s pretty hopeless for Indian companies to try and compete with them. Dear @sama, From one CEO to another.. CHALLENGE ACCEPTED. pic.twitter.com/67FDUtLNq0 — CP Gurnani (@C_P_Gurnani) June 9, 2023 -
టెక్ మహీంద్రా ఎండీగా మోహిత్ జోషి
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తాజాగా మరో ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా కొత్త ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హోదాల్లో ఉన్న సీపీ గుర్నాణీ డిసెంబర్ 19న పదవీ విరమణ చేశాక .. జోషి బాధ్యతలు చేపడతారు. బాధ్యతల మార్పిడి, కార్యకలాపాలపై అవగాహన కోసం అంతకన్నా ముందుగానే కంపెనీలో చేరతారని టెక్ మహీంద్రా తెలిపింది. మరోవైపు, జోషి తన పదవికి రాజీనామా సమర్పించారని, మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉంటారని ఇన్ఫీ పేర్కొంది. కంపెనీలో ఆయన ఆఖరు పని దినం జూన్ 9గా ఉంటుందని వివరించింది. జోషి 2000లో ఇన్ఫీలో చేరారు. అంతకు ముందు ఆయన ఏబీఎన్ ఆమ్రో, ఏఎన్జెడ్ గ్రిండ్లేస్ తదితర సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి లండన్లో ఉంటున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కొత్త టెక్నాలజీలు, భారీ డీల్స్ విషయంలో జోషికి ఉన్న అపార అనుభవం టెక్ మహీంద్రాకు సహాయకరంగా ఉండగలదని గుర్నాణీ తెలిపారు. టెక్ మహీంద్రా కొత్త మైలురాళ్లను అధిగమించడంలో అందరితో కలిసి పనిచేస్తానని, సానుకూల ఫలితాలు సాధించడానికి కృషి చేస్తానని జోషి పేర్కొన్నారు. -
ఇన్ఫోసిస్కి షాకిచ్చిన టెక్ఎం కొత్త సీఎండీ, రోజు సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ , టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా సీఎండీగా మోహిత్ జోషి ఎంపికైన సంగతి తెలిసిందే. భారతీయ ఐటీ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పదివిని వరించిన ఈ నేపథ్యంలో ఆయన విద్యార్హతలు, టెక్ ప్రపంచంలో అనుభవం, వార్షికవేతన తదితర అంశాలు చర్చకు దారి తీసాయి. మోహిత్ జోషి ఎవరు? టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్లో 22 సంవత్సరాల అనుభవజ్ఞుడైన మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఇప్పటివరకు ఆయన ఒక్క రోజు వేతనం రూ. 9.5 లక్షలు. రెండు దశాబ్దాల అనుభవంతో ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్,కన్సల్టింగ్ రంగంలో నిపుణుడు. ఇన్ఫోసిస్ కంటే ముందు అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో పనిచేశారు. (ఇదీ చదవండి: జాక్పాట్ అంటే ఇదే! నిమి...రతన్ టాటాను మించిపోయాడు!) 1974 ఏపప్రిల్13న జన్మించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం నుండి పాఠశాల విద్య పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో తన గ్రాడ్యుయేషన్, తరువాత ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (FMS) నుండి MBA చేసాడు. అమెరికా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుండి ప్రపంచ నాయకత్వం , పబ్లిక్ పాలసీని కూడా అధ్యయనం చేశాడు. 2000లో ఇన్ఫోసిస్లో చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. మోహిత్ తన కెరీర్లో ఆసియా, అమెరికా,యూరప్, మెక్సికోలో పనిచేశారు. జోషికి భార్య ఇద్దరు కుమార్తెలతో లండన్లో నివసిస్తున్నారు. 2021 సంవత్సరంలో, మోహిత్ జీతం రూ. 15 కోట్ల నుండి రూ. 34. 82 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఫైలింగ్ ప్రకారం, అతను 2021-2022లో రూ. 34,89,95,497 (రూ. 34.89 కోట్లు) జీతం పొందారు. ఇన్ఫోసిస్కి పెద్ద దెబ్బే ఇటీవలి కాలంలో ఇన్ఫోసిస్కి ఇది రెండో అతిపెద్ద నిష్క్రమణ. ఇటీవలే రవికుమార్ ఎస్ ఇన్ఫోసిస్కి గుడ్బై చెప్పి కాగ్నిజెంట్కు సీఈఓగా చేరారు. జోషిని బోర్డులో ఉంచడానికి ఇన్ఫోసిస్ చివరి నిమిషం దాకా ప్రయత్నించింది విఫలమైందట. జోషి నిష్క్రమణ ఇన్ఫోసిస్కి పెద్ద లోటేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్ఫీ సీఎండీ సలీల్ పరేఖ్ తరువాత అత్యధిక పే అందుకున్నవారు జోషి మాత్రమే. (మైక్రోసాఫ్ట్లో మూడో రౌండ్ తీసివేతలు, ఈసారి ఎవరంటే?) గుర్నానీకి సరైన ప్రత్యామ్నాయం టెక్ మహీంద్రా సీఎండీ గుర్నానీ పదవీ విరమణ చేస్తున్న తరుణంలో ఆయనకు సరైన ప్రత్యామ్నాయంగా టెక్ఎం భావించడం విశేషం. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సమాచారంలోశనివారం ప్రకటించింది. అయితే టెక్ఎం సీఎండీగా జోషి వేతనం, ఇతర ప్రయోజనాలపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. మోహిత్ జోషి గురించి మరిన్ని విషయాలు మోహిత్ జోషి ఇన్ఫోసిస్ మాజీ సీఈవొ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్గా సేవలు అవివా Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా రిస్క్ & గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడు CBI (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్ 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ యంగ్ గ్లోబల్ లీడర్ (YGL)గా ఎంపిక -
ఇన్ఫోసిస్కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు
సాక్షి, ముంబై: దేశీయ ఆరో అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్త సీఈవోగా మోహిత్ జోషి ఎంపికయ్యారు. ప్రస్తుత సీఎండీ సీపీ గుర్నానీ స్థానంలో ఆయన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా చేరనున్నారు. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో శనివారం ప్రకటించింది. గుర్నానీ పదవీ కాలం డిసెంబర్ 19న ముగియనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి ప్రత్యర్థి టెక్ మహీంద్రాలో చేరడానికి కంపెనీకి రాజీనామా చేసినట్లు రెండు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపాయి. 2000 నుండి ఇన్ఫోసిస్లో భాగమైన మోహిత్ జోషి 2023,మార్చి 11రాజీనామా చేశారు.జోషి మార్చి 11 నుండి సెలవులో ఉంటారని, జూన్ 9 చివరి తేదీ అని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి ఒక ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. అలాగే మోహిత్ జోషి డిసెంబర్ 2023 నుండి 5 (ఐదు) సంవత్సరాలపాటు 2028 వరకు పదవిలో ఉంటారని టెక్ ఎం వెల్లడించింది. ఇన్పీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ హెల్త్కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపార హెడ్గా పనిచేసిన జోషికి ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ మరియు కన్సల్టింగ్ స్పేస్లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఇన్ఫోసిస్లో, జోషి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ & హెల్త్కేర్, సాఫ్ట్వేర్ బిజినెస్కు నాయకత్వం వహించారు. అలాగే ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్కు ఛైర్మన్గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్తో పాటు, ABN AMRO, ANZ Grindlays వంటి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడా పనిచేశారు. సీబీఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్గా సేవలందించారు. Aviva Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గాను, రిస్క్ అండ్ గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్కు ఆహ్వానితుడు కూడా. మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఎంబీఏ, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
ప్రొడక్టులు, ప్లాట్ఫామ్స్పై పెట్టుబడులు
ముంబై: ఐటీ సర్వీసుల దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్టులు, ప్లాట్ఫామ్స్ విభాగంపై రూ. 700 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. రానున్న రెండేళ్లలో ఈ పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. టెలికం రంగానికి సేవలందిస్తున్న కామ్వివా కొనుగోలు ద్వారా కంపెనీ ఇప్పటికే ప్రొడక్టులు, ప్లాట్ఫామ్స్ బిజినెస్లో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటితోపాటు ఇతర సర్వీసులు సైతం అందిస్తున్న కామ్వివా వార్షికంగా 45 కోట్ల డాలర్ల ఆదాయ రన్రేట్ను సాధించినట్లు గుర్నానీ వెల్లడించారు. కాగా.. ప్రొడక్టులు, ప్లాట్ఫామ్స్ బిజినెస్ ద్వారా రెండేళ్లలో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఇన్వెస్టర్ డే సందర్భంగా పుణే నుంచి వర్చువల్గా గుర్నానీ ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటు చేసిన విభాగంపై పెట్టుబడులను కామ్వివా బృందం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న కామ్వివా భువనేవ్వర్, బెంగళూరులలోనూ కార్యకలాపాలు విస్తరించినట్లు తెలియజేశారు. టెలికంతోపాటు తాజా విభాగం బీఎఫ్ఎస్ఐ తదితర రంగాలకూ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా మరో 20 కోట్ల డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ వార్తల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు బీఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 1,085 దిగువన ముగిసింది. -
ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా
గత కొంత కాలంగా ఐటీ రంగంలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. జాయినింగ్ లెటర్స్ జారీలో జాప్యం, సంస్థలో తొలగింపులు వంటివి చేపడుతున్నాయి. ఇవి ఆ రంగంలోని ఉద్యోగులను, ఐటీ కొలువు కోసం వేచి చూస్తున్న విద్యార్ధులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా మరికొన్ని సంస్థలు.. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికి.. సదరు ఆఫర్ను తిరస్కరిస్తున్నట్లుగా సమాచారం కూడా ఇస్తున్నాయి. ఇలా ఆఫర్ తిరస్కరణ సందర్భంలో.. ‘మా సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మీ అర్హతలు లేవు’ అనో.. లేదా ‘మీరు మీ ్ర΄÷ఫైల్కు సరిపడే సర్టిఫికేషన్స్ పూర్తి చేయలేదు’ అనో పేర్కొంటున్నాయి. దీంతో క్యాంపస్ డ్రైవ్లో తమ అకడమిక్ ప్రతిభను, మార్కులను, స్కిల్స్ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసి, ఆఫర్ లెటర్లు ఇచ్చిన సంస్థలు.. ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఏంటి? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు ► ప్రస్తుత పరిస్థితుల్లో పలు ఎంఎన్సీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయనే సంకేతాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఇప్పటికే ఫేస్బుక్ ఆధ్వర్యంలోని మేటా సంస్థలో 12 వేల మందిని పనితీరు ప్రతిపాదికగా తొలగించనున్నట్లు ప్రకటించారు. ► దాదాపు 1.15 లక్షల ఉద్యోగులు ఉన్న ఇంటెల్ సంస్థ.. అంతర్జాతీయంగా 20 శాతం మేరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ► దేశీయంగానూ ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ రెండున్నర వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. n గూగుల్ సంస్థ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రాబడిలో తగ్గుదలతో నూతన నియామకాల విషయంలో కొంతకాలం స్వీయ నిషేధం విధించింది. మాంద్యం సంకేతాలే కారణమా! ► ఐటీలో ఆన్బోర్డింగ్ ఆలస్యానికి అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందనే సంకేతాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలోని సంస్థల్లో అధిక శాతం అమెరికాలోని కంపెనీలకు ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలందిస్తున్నాయి. అమెరికా మాంద్యం ముంగిట నిలిచిందనే అంచనాల కారణంగా.. అక్కడి కంపెనీల్లో కార్యకలా΄ాలు మందగిస్తున్నాయి. ఫలితంగా ఆయా సంస్థలు కొత్త ప్రాజెక్ట్ల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. దీంతో.. సదరు సంస్థలకు సేవలపై ఆధారపడిన మన ఐటీ కంపెనీలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇది అంతిమంగా ఆన్ బోర్డింగ్లో జాప్యానికి కారణమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా కొత్త ప్రాజెక్ట్లు రావడం కొంత కష్టంగా ఉంది. ఇది కూడా ఆన్ బోర్డింగ్లో జాప్యానికి మరో కారణమని చెబుతున్నారు. చదవండి: ‘కోహినూర్ వజ్రం కోసం ఇలా ట్రై చేస్తే’.. హర్ష గోయెంకా ట్వీట్కి నవ్వకుండా ఉండలేరు! -
ఫ్రెషర్స్కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్!
ఆఫర్ లెటర్లు అందుకుని ఎప్పుడెప్పుడు ఉద్యోగాలలో చేరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనిపించుకోవాలన్న ఫ్రెషర్లకు భారీ షాక్నే ఇచ్చాయి ఐటీ దిగ్గజాలు. అన్ని రౌండ్లు పూర్తి చేసి ఆఫర్ లెటర్ కూడా అందుకున్న విద్యార్ధుల ఉద్యోగాలలో జాప్యం చేసిన విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర వంటి దిగ్గజ కంపెనీలు తాజాగా యూటర్న్ తీసుకున్నాయి. ఫ్రెషర్స్కు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. బిజినెస్లైన్ కథనం ప్రకారం.. విద్యార్థులు 3-4 నెలల క్రితమే టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పలు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత కంపెనీల నుంచి వారు ఆఫర్ లెటర్లు కూడా అందుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగే ఆన్బోర్డింగ్ ప్రక్రియను ఐటీ సంస్థలు నెలల తరబడి ఆలస్యం చేశాయి. ప్రస్తుతం విద్యార్థులు కంపెనీల్లో చేరేందుకు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో వారి ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ఆయా కంపెనీల నుంచి లెటర్స్ అందుకోవడంతో ఎంపికైన విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో కంపెనీలు వారి అర్హతా నిబంధనలు, కంపెనీ మార్గదర్శకాల అనుసరించి ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు తెలిపినట్లు చెబుతున్నారు. మార్కెట్లో మనీ ఫ్లో కఠినతరంగా మారడం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండడం వంటివి నెలల తరబడి ఉన్న స్టార్టప్ల నుంచి దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న టెక్ దిగ్గజాల వరకు అన్ని ఐటీ కంపెనీలపై ఈ పరిణామాలు ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. ప్రతికూల వ్యాపార పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నియామకాలను నిలిపివేసాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా ఇటీవల నియామకాల ప్రక్రియను నిలిపివేయడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులతో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. చదవండి: అక్టోబర్లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే! -
ఏపీ వైపు ‘ఐటీ’ చూపు
సాక్షి, అమరావతి: ఇన్ఫోసిస్, అసెంచర్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుండటంతో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐటీ పెట్టుబడులకు అనువైనవిగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పెద్ద ఐటీ కంపెనీలు విశాఖ, విజయవాడలను ఎంచుకుంటుండగా, చిన్న స్థాయి కంపెనీలు తిరుపతి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ ఆధారిత సేవలు అందించే ఏడు కంపెనీలు తాజాగా తిరుపతిలో తమ కార్యాలయాలను ప్రారంభించడానికి ముందుకు వచ్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ఐజెన్ అమెరికన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, కాన్ఫ్లక్స్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్, లోమా ఐటీ సొల్యూషన్స్, మాగంటి సాఫ్ట్వేర్, సాగర్ సాఫ్ట్వేర్, నెట్ ల్యాబ్ వంటి సంస్థలు కార్యాలయాలను ప్రారంభించనున్నాయి. ఫ్రెంచ్కు చెందిన రాన్స్టాండ్ అనే కన్సల్టెన్సీ సంస్థ విశాఖ, తిరుపతిలో కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. మొత్తం ఈ ఎనిమిది కార్యాలయాల ద్వారా 4,720 మందికి ఉపాధి లభించనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కంపెనీలు కార్యాలయాలు ప్రారంభించడానికి అవసరమైన వాణిజ్య సముదాయాలను ఏపీ టక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్) సమకూరుస్తోంది. ఈ పరిణామాల పట్ల నిరుద్యోగులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఐటీ పార్కులు రాష్ట్రానికి చెందిన ఐటీ రంగ నిపుణులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ చర్యలపై కంపెనీలకు నమ్మకం పెరగడంతో ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి. యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలు అనువుగా ఉంటాయి. ఈ మూడు చోట్ల అన్ని మౌలిక వసతులతో కూడిన ఐటీ పార్కులను అభివృద్ధి చేయనున్నాం. త్వరలోనే ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖలో ఒక సదస్సు నిర్వహించనున్నాం. – ఎం.నంద కిషోర్, ఎండీ, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్) -
సీఎం జగన్ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ
అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టెక్ మహేంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు. ఈ మేరకు ముందుగా సీఎం జగన్ను సత్కరించిన గుర్నానీ.. ఆపై జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గుర్నానీని సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. , , -
గూగుల్ స్ట్రీట్ వ్యూ 360
-
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అందుబాటులోకి గూగుల్ అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చేస్తున్న ప్రయత్నానికి భారత ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన దేశంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ను విడుదల చేసింది. ఈ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్లో మనకు కావాల్సిన ప్రాంతాన్ని 360డిగ్రీల్లో వీక్షించొచ్చు. గూగుల్ సంస్థ..టెక్ మహీంద్రా, జెన్సె సంస్థలతో కలిసి సంయుక్తంగా అహ్మద్ నగర్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, నాసిక్, పూణే, వడదోరా నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. మిలియన్ల కొద్దీ 360 డిగ్రీల పనోరమిక్ ఇమేజెస్ సాయంతో మొత్తం పది నగరాల్లో లక్షా 50వేల కిలోమీటర్ల వరకు ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి మరో 50 నగరాలకు ఈ ఫీచర్ను విస్తరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫీచర్ వల్ల లాభం ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ పాలసీ నిబంధనలకు అనుగుణంగా..గూగుల్ ఇవ్వాళ విడుదల చేసిన గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్ను ఓపెన్ చేసి మీకు కావాల్సిన స్ట్రీట్లో టార్గెటెడ్ షాప్స్, స్కూల్స్, టెంపుల్స్ విడివిడిగా చూడొచ్చని తెలిపింది. అంతేకాదు గూగుల్ ఎర్త్ ఇంజన్ సహాయంతో టెంపరేచర్ డేటాను పొందవచ్చు. 2016 నుంచి విశ్వ ప్రయత్నాలు గూగుల్ సంస్థ మనదేశంలో పనోరామిక్ స్ట్రీట్ లెవల్ ఇమేజ్ ఆప్షన్ను స్ట్రీట్ వ్యూ ఫీచర్ 2011లో విడుదల చేసింది. కానీ ఈ ఫీచర్తో దేశ భద్రతకు నష్టం వాటిల్లో ప్రమాదం ఉందనే కారణంతో 2016లో దీనిపై నిషేదం విధించింది. ఈ తరుణంలో గూగుల్ స్థానిక టెక్ కంపెనీల సాయంతో వీటిని తీసుకొచ్చింది. -
టెక్ మహీంద్రా.. మార్జిన్లు తగ్గాయ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం 16.4 శాతం క్షీణించి రూ. 1,132 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,353 కోట్లు. పలు అంశాల మూలంగా మార్జిన్లు తగ్గిపోవడమే తాజాగా లాభాల క్షీణతకు కారణం. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం 24.6 శాతం వృద్ధి చెంది రూ. 10,198 కోట్ల నుంచి రూ. 12,708 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.2 శాతం నుంచి 11 శాతానికి తగ్గగా, నిర్వహణ లాభం 9.2 శాతం క్షీణించి రూ. 1,403.4 కోట్లకు చేరింది. లాభదాయకతను పెంచుకునేందుకు అన్ని అవకాశాలూ వినియోగించుకుంటామని, రాబోయే రోజుల్లో అధిక స్థాయిలో నమోదు చేయగలమని సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాణీ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ కోణంలో కొన్ని పెట్టుబడులు పెట్టడంతో పాటు సరఫరా తరఫు సమస్యలు (అధిక వేతనాలతో ఉద్యోగులను తీసుకోవడం లేదా సబ్–కాంట్రాక్టుకు ఇవ్వడం వంటివి) కూడా మార్జిన్ల తగ్గుదలకు కారణమని తెలిపారు. ఆర్థిక ఫలితాల్లో మరిన్ని విశేషాలు.. ► క్యూ1లో 6,862 మంది ఉద్యోగుల నియామకాలతో సిబ్బంది సంఖ్య 1.58 లక్షలకు పెరిగింది. ► అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) మార్చి త్రైమాసికంలో 24 శాతంగా ఉండగా, జూన్ క్వార్టర్లో 22 శాతానికి తగ్గింది. అయితే, గతేడాది క్యూ1లో నమోదైన 17 శాతంతో పోలిస్తే ఇంకా అధికంగానే ఉంది. ► బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేరు 1.15 శాతం క్షీణించి రూ. 1,016.55 వద్ద క్లోజయ్యింది. చదవండి: 5జీ వేలం.. పోటీపడుతున్న బడా కంపెనీలు -
దావోస్లో ఏపీ ధగధగ
సాక్షి, అమరావతి: దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్ మహీంద్రా ముందుకొచ్చింది. జపాన్కు చెందిన ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి కాకినాడలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంసిద్ధత తెలిపింది. స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హై ఎండ్ టెక్నాలజీ హబ్గా విశాఖ విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగస్వామి కానున్నట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. దావోస్లోని ఏపీ పెవిలియన్లో టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమై నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు లాంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీతోపాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, 175 స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరిస్తూ వీటిని ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలని కోరారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా ఇంటర్న్షిప్, అప్రెంటిషిప్ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గుర్నానీ స్పందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్తో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేందుకు హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీతో కలసి ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్తో ముఖ్యమంత్రి రూ.250 కోట్లతో అసాగో ఇథనాల్ ప్లాంట్ మహీంద్రా గ్రూపు అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.250 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం దృష్టికి తెచ్చింది. ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. విద్యారంగంలో ‘దస్సాల్’ పెట్టుబడులు విద్య, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. దావోస్లో దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సహకారం అందించాలని సీఎం కోరారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ ఏపీలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చించినట్లు అనంతరం ఫ్లోరెన్స్ వెర్జలెన్ తెలిపారు. ఏపీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టడానికి దస్సాల్ సిస్టమ్స్ ఆసక్తిగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త తరహా ఇంధనాలపై కూడా చర్చించామని, త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఫ్లోరెన్స్ తెలిపారు. కాకినాడకు జపాన్ లాజిస్టిక్ దిగ్గజం సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉండటంతో పాటు ఏపీలో కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా లభించే లాజిస్టిక్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై జపాన్కు చెందిన లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి ఓ ఎస్కే లైన్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులతో సరుకు రవాణాను ఏటా 507 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి సంబంధించి కంటైనర్ హబ్, లాజిస్టిక్ రంగాలపై దృష్టి సారించాలని సీఎం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హషిమొటో కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ ఈవీ వాహనాలపై ‘హీరో’తో చర్చలు రాష్ట్రంలో వ్యాపార విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అంశాలపై హీరో గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్తో సీఎం జగన్ చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హీరో గ్రూపు అథెర్ ఎనర్జీలో ఇప్పటికే 36 శాతం వాటాను కొనుగోలు చేయడమే కాకుండా తైవాన్కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ గగొరోలో భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, హీరో గ్రూప్ విస్తరణ అవకాశాలపై చర్చలు జరిగాయి. సీఎం జగన్తో స్విట్జర్లాండ్లో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తదితరులు విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్లో భాగంగా పరిశ్రమలకు నీటి వనరులను సమకూర్చడంలో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి కండలేరు నుంచి నీటిని ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. అంతకుముందు భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్తో కూడిన స్విస్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. భారత రాయబారి సంజయ్ భట్టాచార్య కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. -
యూకేలో టెక్ మహీంద్రా 1000 కొలువులు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా యూకేలో కొత్తగా 1,000 మందికి ఉద్యోగాలిచ్చే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. యూకేలోని అత్యున్నత అకాడమీ, రీసెర్చ్ సంస్థతో సాంకేతిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పేర్కొంది. మిల్టన్ కీన్స్లో కంపెనీకిగల మేకర్స్ ల్యాబ్లో కోఇన్నోవేట్ ఒప్పందాన్ని అమలు చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా రూ. 1,000 మందివరకూ ఉపాధి కల్పించే వీలున్నట్లు తెలియజేసింది. కాగా.. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విషయంలో రెండు దేశాలూ పరస్పరం సహకరించుకునేందుకు వీలైన కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు. -
టెక్ మహీంద్రా సంచలన నిర్ణయం, గ్రామీణ విద్యార్ధులకు అదిరిపోయే గుడ్ న్యూస్!
ప్రముఖ టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర సంచలన నిర్ణయం తీసుకుంది. టెక్ మహీంద్రాకు చెందిన మేకర్స్ ల్యాబ్ 'మెటా విలేజ్'ను లాంచ్ చేసింది. ఈ ఫ్లాట్ ఫామ్తో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఉపాధి పొందాలనుకునే విద్యార్ధులకు వరంగా మారనుంది. మేకర్స్ ల్యాబ్ డిజైన్ చేసిన ఈ ప్లాట్ఫారమ్ లోకల్ లాంగ్వేజ్లో కంప్యూటర్లు, కోడింగ్ నేర్చుకునేలా సాయపడనుంది. ఇందులో భాగంగా టెక్ మహీంద్రా మహరాష్ట్రలోని పరాగావ్ గ్రామంలో మెటా విలేజ్ను ప్రారంభించింది. ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ మెటా విలేజ్ సాయంతో విద్యార్థులు స్థానిక మాతృ భాషలో కోడింగ్ చేసేలా కోచింగ్ ఇవ్వనుంది. ప్రస్తుతం పరాగావ్ గ్రామ విద్యార్ధులకు ఆన్లైన్లో కోడింగ్ నేర్పిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా "మేక్ ఇన్ ఇండియా" పట్ల నిబద్ధతను తెలుపుతూ మెటా విలేజ్ ప్రారంభించాం. తద్వారా అట్టడుగు స్థాయిలో విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టున్నాన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేలా టెక్ మహీంద్రా మేకర్స్ ల్యాబ్ ఇప్పటికే విద్యార్ధులకు భారత్ మార్కప్ లాంగ్వేజ్ (బీహెచ్ఏఎంఎల్)ను నేర్పిస్తున్నట్లు మేకర్స్ ల్యాబ్ గ్లోబల్ హెడ్ నిఖిల్ మల్హోత్రా అన్నారు. అవకాశాల వెల్లువ టెక్ మహీంద్రా అందుబాటులోకి తెచ్చిన ఫ్లాట్ ఫామ్తో విద్యార్ధులు లోకల్ ల్యాంగేజ్లో కోడింగ్ నేర్చుకోవచ్చు. కోడింగ్ అనేది ఇంగ్లీష్ భాషలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ మేకర్స్ ల్యాబ్ సంస్థ స్థానిక భాషలో కోడింగ్ నేర్చుకునేలా ఈ మెటావిలేజ్ను డెవలప్ చేసింది. ఇందులో లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి. స్థానిక భాషల్లో కోడింగ్ నేర్చుకొని ఆన్లైన్లో ఉపాధి పొందవచ్చు. ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందవచ్చు. చదవండి: రండి..రండి.. దయచేయండి! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్! -
రండి..రండి.. దయచేయండి! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
మొదట కొన్ని రోజులు మాత్రమే అనుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్ తరువాత కొన్ని నెలలకు చేరింది. ఏకంగా రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోల్ని ఆఫీస్లకు ఆహ్వానిస్తున్నాయి. తాజాగా టెక్ మహీంద్రా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగులకు ఘనంగా స్వాగతం పలుకుతోంది.అందుకు సంబంధించిన వీడియోను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా వీడియోల్ని షేర్ చేశారు. కరోనా కష్టకాలంలో అన్నీరంగాలు కుదేలైతే..ఐటీ రంగం మాత్రం అపరిమిత లాభాలు సాధించింది. దీని కారణం ఐటీ కంపెనీలు అమలు చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే. ఈ పద్దతిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐటీ కార్యకలాపాలు కొనసాగాయి. కానీ ఇప్పుడు కరోనా తగ్గు ముఖం పట్టడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలుపునిస్తున్నాయి. Screens are no substitute for a warm, personal hello. Welcome back Team @MahindraRise https://t.co/rXaBfBvLlb — anand mahindra (@anandmahindra) April 14, 2022 ఈ నేపథ్యంలో "ఇన్ని రోజులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయాలకు చాలా ఎగ్జైట్మెంట్తో స్వాగతిస్తున్నాం. మహీంద్రా సంస్థలోని మా సహోద్యోగులు మళ్లీ తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారంటూ" ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. చదవండి: ఇన్ఫోసిస్ సంచలనం నిర్ణయం! ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..! -
ఎయిర్టెల్, టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా చేతులు కలిపాయి. 5జీ, ప్రైవేట్ నెట్వర్క్లు, క్లౌడ్ వంటి విభాగాల్లో కంపెనీలకు అవసరమయ్యే డిజిటల్ సొల్యూషన్స్ను సంయుక్తంగా అభివృద్ధి, మార్కెటింగ్ చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్టెల్ ఇప్పటికే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అటు టెక్ మహీంద్రా 5జీ సర్వీసులకు సంబంధించిన అప్లికేషన్స్, ప్లాట్ఫామ్లను రూపొందించింది. ఒప్పందం ప్రకారం భారత్, అంతర్జాతీయ మార్కెట్లలో 5జీ సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్ను అభివృద్ధి చేసేందుకు ఇరు సంస్థలు సంయుక్తంగా ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తాయి. -
రూ.322 కోట్లు డీల్, టెక్ మహీంద్రా చేతికి మరో కంపెనీ!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సంస్థ థర్డ్వేర్ను కొనుగోలు చేయనుంది. పూర్తి నగదు రూపంలో ఉండే ఈ డీల్ కోసం 42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 322 కోట్లు) వెచ్చించనుంది. ఆటోమోటివ్ కన్సల్టింగ్, డిజైన్ తదితర విభాగాలకు సంబంధించి తమ డిజిటల్ సొల్యూషన్స్, సేవలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ కొనుగోలు దోహదపడగలదని టెక్ మహీంద్రా తెలిపింది. ఈ ఏడాది మే నాటికి డీల్ పూర్తి కాగలదని భావిస్తున్నట్లు వివరించింది. థర్డ్వేర్ సొల్యూషన్స్లో 850 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 211 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో రూ. 226 కోట్ల టర్నోవరు సాధించింది. -
టెక్ మహీంద్రా భారీ స్కెచ్.. వెయ్యి మందితో అదిరిపోయే ప్లాన్
ఫ్యూచర్ టెక్నాలజీగా అందరిచేత అభివర్ణించబడుతున్న మెటావర్స్పై ఫోకస్ చేసింది టెక్ మహీంద్రా. మిగిలిన కంపెనీల కంటే ముందుగానే మెటావర్స్పై పట్టు సాధించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. హైదరాబాద్ వేదికగా ప్లాన్ అమలు కానుంది. మెటావర్స్ రంగంలో పని చేసేందుకు ప్రత్యేకంగా వెయ్యి మంది ఇంజనీర్లను ఎంపిక చేసింది టెక్ మహీంద్రా. ఈ గ్రూప్కి టెక్ఎంవర్స్గా పేరు పెట్టింది. ఈ గ్రూపుకి చెందిన ఇంజనీర్లు మెటావర్స్ ఆధారిత సేవలపై పని చేస్తారు. హైదరాబాద్, పూనే, డల్లాస్, లండన్ వేదికగా నాలుగు టీమ్లను టెక్ఎంవర్స్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బ్లాక్చెయిన్, 5జీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాల్టీ, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర టెక్నాలజీతో మెటావర్స్ సమ్మిళతం చేస్తూ సరికొత్త బిజినెస్ మోడళ్లను రూపొందించడం టెక్ఎంవర్స్లు ప్రధాన బాధ్యతలు. సంక్లిష్టమైన ఈ పనిని సుళువుగా చేసి భవిష్యత్తుకు అనుగుణంగా బిజినెస్ను విస్తరించేందుకే ఈ వెయ్యిమందితో కూడిన టీమ్ను ఏర్పాటు చేసింది టెక్ మహీంద్రా. ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్, మెటా బ్యాంక్ (వర్చువల్ బ్యాంక్), గేమింగ్ సెంటర్, మెటావర్స్ బేస్డ్ కార్ డీలర్షిప్, మిడిల్మిస్ట్ తదితర అనేక ఆవిష్కరణలకు మెటావర్స్లో చోటుంది. మెటావర్స్తో మన రియాల్టీ ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తాయి. అందుకు అనుగుణంగా మా ప్రణాళికలు ఉంటాయని టెక్ మహీంద్రా ప్రతినిధుతులు తెలిపారు. చదవండి: భవిష్యత్తు మెటావర్స్దే అంటున్న గార్ట్నర్ -
నిరుద్యోగులకు టెక్ మహీంద్రా బంపరాఫర్...!
ప్రముఖ ఐటీ సంస్ధ టెక్ మహీంద్రా నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కొత్త ప్రోగ్రాంను టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ ప్రోగ్రాంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగ్గా వస్తాయని కంపెనీ అభిప్రాయపడింది. సంయుక్తంగా.. టెక్ మహీంద్రాకు చెందిన సీఏస్ఆర్ విభాగం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉచిత క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణను అందించనుంది. AWS రీ/స్టార్ట్ ప్రోగ్రాంను టెక్ మహీంద్రా ఫౌండేషన్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా కలిసి నేర్పించానున్నయి. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా ఫౌండేషన్ సీఈఓ రాకేష్ సోని మాట్లాడుతూ..."క్లౌడ్ కంప్యూటింగ్ అనేది 21వ శతాబ్దపు అద్భుత సాంకేతిక ఆవిష్కరణ. ఇది డిజిటల్ పరివర్తనను ఎనేబుల్ చేస్తోంది. కరోనా మహమ్మారి అనేక వ్యాపారాల క్లౌడ్ మైగ్రేషన్ను వేగవంతం చేసింది. ఈ ప్రోగ్రాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. 39 దేశాల్లో... AWS రీ/స్టార్ట్ అనే ప్రోగ్రాం 39 దేశాలలో అందించబడుతుంది. ఈ ప్రోగ్రాం సహాయంతో 90 శాతం కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్లను నేరుగా ఉద్యోగ ఇంటర్వ్యూ అవకాశాలతో అనుసంధానించనుంది. ఇది 12-వారాల జరిగే ప్రోగ్రాం. వ్యక్తిగతంగా, నైపుణ్యం-ఆధారిత శిక్షణను నిరుద్యోగులకు అందిస్తారు. దీనిలో ప్రాథమిక AWS క్లౌడ్ నైపుణ్యాలను, అలాగే ఇంటర్వ్యూ, రెస్యూమ్ రైటింగ్ వంటి ప్రాక్టికల్ కెరీర్ నైపుణ్యాలను కవర్ చేయనుంది. ఎంట్రీ-లెవల్ క్లౌడ్ పొజిషన్కు సిద్ధం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా హైదరాబాద్, మొహాలి, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణేలలోని టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా సినారియో-బేస్డ్ ఎక్సర్సైజులు, హ్యాండ్-ఆన్ ల్యాబ్లు, కోర్స్వర్క్ల ద్వారా, విద్యార్థులు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (లైనక్స్, పైథాన్), నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ రిలేషనల్ డేటాబేస్ స్కిల్స్ మొదలైనవాటిని కోర్సు ముగింపులో నేర్చుకుంటారని కంపెనీ తెలిపింది. కాగా కోర్సులో భాగంగా ఇప్పటికే మొదటి రెండు కోహోర్ట్లు ఫిబ్రవరి 9, 2022న ప్రారంభమయ్యాయని టెక్ మహీంద్రా తెలిపింది. -
మరో విదేశీ కంపెనీ టెక్ మహీంద్రా సొంతం..! సత్యం కంప్యూటర్స్ తరువాత..!
న్యూఢిల్లీ: యూరోపియన్ కంపెనీ కామ్ టెక్ కో ఐటీ(సీటీసీ)లో పూర్తి వాటాను కొనుగోలు చేసినట్లు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా వెల్లడించింది. సీటీసీలో 100 శాతం వాటా కోసం 31 కోట్ల యూరోల(సుమారు రూ. 2,628 కోట్లు)ను వెచ్చించినట్లు తెలియజేసింది. భవిష్యత్ పనితీరు, కంపెనీల కలయిక ఆధారిత చెల్లింపులతో కలిపి డీల్ కుదుర్చుకుంది. అంతేకాకుండా సీటీసీ గ్రూప్నకే చెందిన ఎస్డబ్ల్యూఎఫ్టీ, స్యూరెన్స్ ప్లాట్ఫామ్లలో 25 శాతం యాజమాన్య వాటాను సైతం సొంతం చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఇందుకు మరో 2 కోట్ల యూరోల(దాదాపు రూ. 170 కోట్లు) పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. తద్వారా డిజిటల్ ఇంజినీరింగ్, బీమా రంగ టెక్నాలజీ సర్వీసుల్లో మరింత బలపడనున్నట్లు వివరించింది. వెరసి టెక్ మహీంద్రా.. 2010 ఏప్రిల్లో సత్యం కంప్యూటర్స్ను చేజిక్కించుకున్నాక తిరిగి రెండో అతిపెద్ద కొనుగోలుకి తెరతీయడం విశేషం! 110 కోట్ల డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువలో సత్యం కంప్యూటర్స్లో 42 శాతం వాటా కోసం 50 కోట్ల డాలర్లను వెచ్చించింది. డిజిటల్ ఇంజినీరింగ్, బీమా రంగ టెక్నాలజీ బిజినెస్ల వృద్ధి కోసం ఇటీవల కాలంలో తాము చేపట్టిన అత్యధిక పెట్టుబడులివని టెక్ మహీంద్రా బీఎఫ్ఎస్ఐ, హెచ్ఎల్ఎస్, కార్పొరేట్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ వివేక్ అగర్వాల్ పేర్కొన్నారు. సీటీసీ వివరాలివీ.. టెక్ మహీంద్రా అందించిన వివరాల ప్రకారం 2020లో సీటీసీ 71.3 మిలియన్ యూరోల ఆదాయం సాధించింది. 2021 సెప్టెంబర్తో ముగిసిన 9 నెలల కాలంలో 58.8 మిలియన్ యూరోల టర్నోవర్ నమోదైంది. కంపెనీకిగల 720 మంది సిబ్బంది ఇకపై టెక్ మహీంద్రాలో భాగంకానున్నారు. కాగా.. భవిష్యత్లో ఎస్డబ్ల్యూఎఫ్టీ, స్యూరెన్స్లలో వాటాలు పెంచుకునే అవకాశమున్నట్లు అగర్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం బీమా రంగం భారీ స్థాయిలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ బాట పట్టినట్లు పేర్కొన్నారు. తాజా కొనుగోళ్ల ద్వారా తాము ఈ విభాగంలో కీలకపాత్ర పోషించే వీలున్నట్లు వివరించారు. బెలారస్, లాత్వియాలలో డెవలప్మెంట్ కేంద్రాలుగల ఈ సంస్థలు ప్రధానంగా యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలలో క్లయింట్లకు సర్వీసులందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ వార్తల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు 1% నీరసించి రూ. 1,722 వద్ద ముగిసింది. -
అమెరికన్ కంపెనీను కైవసం చేసుకున్న టెక్ మహీంద్రా..!
అమెరికాకు చెందిన గ్రీన్ ఇన్వెస్ట్మెంట్, అల్లీస్ గ్రూప్ ఇండియా సంస్థలను భారత ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా పూర్తిగా కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తివాటాలు టెక్ మహీంద్రా సొంతం..! అల్లీస్ ఇండియా, గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్లో పూర్తిగా 100 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ డీల్ మొత్తం విలువ 125 మిలియన్ డాలర్లు. ఈ మొత్తాన్ని కంపెనీ పూర్తిగా నగదు రూపంలోనే చెల్లించనుంది. అమెరికాలోని సీటెల్ వేదికగా అల్లీస్ ఇండియా, గ్రీన్ ఇన్వెస్టమెంట్స్ పనిచేస్తున్నాయి. సుమారు 660 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ సంస్థల ఆదాయం 39.6 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంస్థల కొనుగోలుతో టెఖ మహీంద్రాకు డిజిటల్ ఎక్స్పీరియెన్స్ సోల్యుషన్స్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, మార్కెటింగ్, క్లౌడ్ అండ్ ఆటోమేషన్, బీఐ అండ్ అనలిటిక్స్, టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్స్ వంటి రంగాల్లో కంపెనీ మరింత వృద్ధిని నమోదుచేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం..! వాటిని వదిలించుకునేందుకే.. -
టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం
కుత్బుల్లాపూర్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభించే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న వేళ ఓ యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. ఏకం గా 25 మంది విద్యార్థులు, ఐదుగురు అధ్యాపకులలో కరోనా లక్షణాలు బయటపడటంతో కళాశాలలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. బహదూర్పల్లిలోని టెక్ మహీంద్ర ఏకోలా వర్సిటీ ఇటీవల మొదటి సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. పలు దేశాల విద్యార్థులు వర్సిటీలో చేరగా, కొందరు అస్వస్థతకు గురయ్యారు. వీరికి కరోనా లక్షణాలు వెల్లడయ్యాయి. దీంతో ముందస్తుగా యాజమాన్యం వర్సిటీకి సెలవులు ప్రకటించింది. రెండు వేలకుపైగా విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసిస్తున్నారు. గత రెండు రోజులుగా విద్యార్థుల రాకపోకలు లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై యూనివర్సిటీ వారిని ‘సాక్షి’ ఫోన్లో ఆరా తీయగా అటువంటిదేమీ లేదన్నారు. కాగా, ఈ క్యాంపస్లోని 1,700 మంది విద్యార్థులు హోం ఐసోలేషన్లో ఆరోగ్యంగానే ఉన్నారని, ఎటువంటి ఆందోళన పడాల్సిన పరిస్థితిలేదని కుత్బుల్లాపూర్ మండల వైద్యాధికారి డాక్టర్ నిర్మల ‘సాక్షి’కి తెలిపారు. -
టెక్ మహీంద్రా లాభం 26% అప్..
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం 26 శాతం ఎగిసింది. రూ. 1,339 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 1,065 కోట్లు. ఇక తాజా సమీక్షాకాలంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెంది రూ. 10,881 కోట్లుగా నమోదైంది. జూన్ క్వార్టర్తో పోలిస్తే 6.4 శాతం పెరిగింది. ఇది దశాబ్ద కాలంలోనే గరిష్ట వృద్ధి. టెక్ మహీంద్రా షేరు ఒక్కింటికి రూ. 15 చొప్పున ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. క్యూ2లో కొత్తగా 750 మిలియన్ డాలర్ల డీల్స్ కుదిరాయని, వీటిలో సింహభాగం డిజిటలైజేషన్కి సంబంధించినవే ఉన్నాయని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహా పనితీరు సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 15.2 శాతంగా నమోదైన నిర్వహణ లాభాల మార్జిన్ను ఇకపైనా అదే స్థాయిలో లేదా అంతకు మించి సాధించే అవకాశాలు ఉన్నాయని గుర్నానీ చెప్పారు. రెండు సంస్థల కొనుగోలు .. డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ లోడ్స్టోన్తో పాటు మరో సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు టెక్ మహీంద్రా తెలిపింది. ఇందుకోసం సుమారు 105 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 789 కోట్లు) వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, బ్రిటన్కు చెందిన ఉయ్ మేక్ వెబ్సైట్స్ (డబ్ల్యూఎండబ్ల్యూ)ని 9.4 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 97 కోట్లు) కొనుగోలు చేసినట్లు వివరించింది. అట్రిషన్తో సమస్యలు.. నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) ఐటీ సంస్థలకు సమస్యాత్మకంగా తయారైందని గుర్నానీ తెలిపారు. అయితే, తమ సంస్థ దీన్ని ఎదుర్కొంటున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టెక్ మహీంద్రాలో అట్రిషన్ రేటు తాజా క్యూ2లో 21 శాతానికి పెరిగింది. ఇది గత క్యూ2లో 14 శాతంగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 17 శాతానికి చేరింది. హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి పెద్ద నగరాల్లో అట్రిషన్ రేటు అధికంగా ఉండగా.. నాగ్పూర్, భువనేశ్వర్ వంటి ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో ఉందని గుర్నానీ చెప్పారు. సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ 14,000 మంది పైచిలుకు ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.41 లక్షలకు చేరినట్లు గుర్నానీ చెప్పారు. సోమవారం బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేరు స్వల్పంగా పెరిగి రూ. 1,524 వద్ద క్లోజయ్యింది. -
‘వండర్ఫుల్ కేటీఆర్’.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతున్న మంత్రి కేటీఆర్ దేశవ్యాప్తంగా ప్రముఖులను ఆకట్టుకుంటున్నారు. నిన్న ఐటీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తరఫున బెంగాల్ ఎంపీ మహువా మెయిత్రా కేటీఆర్ను అభినందించగా తాజాగా ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా మంత్రి కేటీఆర్ను మెచ్చుకున్నారు. గొడుగు పట్టిన మంత్రి టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ఇటీవల హైదరాబాద్లో పర్యటించారు. నగరంలోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించడంతో పాటు ఏటూరునాగారం ఆస్పత్రికి అంబులెన్సును టెక్ మహీంద్రా తరఫున అందించారు. అయితే కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ సీపీ గుర్నానీ తడవకుండా గొడుగు పట్టారు. Wonderful… @KTRTRS you are setting a phenomenal example. You’re demonstrating that leadership and humility are inseparable. 👏🏽👏🏽👏🏽 https://t.co/m4SRRfBSSK — anand mahindra (@anandmahindra) September 10, 2021 గుర్నానీ ట్వీట్ తాజాగా మంత్రి కేటీఆర్ తనకు గొడుకు పట్టిన ఫోటోను ట్విట్టర్లో గుర్నానీ షేర్ చేశారు. ‘మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో బాగుంది కేటీఆర్. మీరు మనస్ఫూర్తిగా వ్యవహరించిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అసలు, మీ స్థాయి వ్యక్తి నాకు గొడుగు పట్టడం అనేది ఎంతో అరుదైన విషయం... ఇది ప్రతి రోజు జరిగే పని కాదు. అందుకు నా కృతజ్ఞతలు’ అంటూ గుర్నానీ కామెంట్ చేశారు. ఆనంద్ మహీంద్రా స్పందన టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ట్వీట్కు ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘వండర్ఫుల్ కేటీఆర్. నాయకత్వం, వినయం అనేవి విడదీయరాని అంశాలను అనడానికి మీరొక అసాధారణమైన ఉదాహారణగా నిలిచారు’ అంటూ కామెంట్ చేశారు. Kind words @anandmahindra Ji 🙏 Thanks https://t.co/nifDnm9jGN — KTR (@KTRTRS) September 10, 2021 థ్యాంకు ఆనంద్ మహీంద్రా ఆనంద్ మహీంద్రా ట్వీట్కి మంత్రి కేటీఆర్ స్పందించారు. కైండ్ వర్డ్స్ @ఆనంద్మహీంద్రా జీ అంటూ నమస్కారం పెట్టే ఎమోజీని పోస్ట్ చేశారు. చదవండి: టీ హబ్కి ఎంపీలు ఫిదా.. మంత్రి కేటీఆర్ని మెచ్చుకున్న ఫ్రైర్బ్రాండ్ -
మెప్పించిన టెక్ మహీంద్రా
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయమైన పనితీరును ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 43 శాతం వృద్ధి చెంది రూ.1,366 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.956 కోట్లతో పోల్చినా లేక ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.1,206 కోట్లతో చూసినా వృద్ధి చెందింది. లాభాల్లో మార్జిన్ 15.3 శాతానికి విస్తరించడం వల్ల పన్నుకు ముందస్తు లాభంలో 39 శాతం వృద్ధి నమోదైంది. కన్సాలిడేటెడ్ ఆదాయం 10 శాతం పెరిగి రూ.10,485 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్గా ఆదాయం (మార్చి క్వార్టర్తో పోలిస్తే) 10 శాతం వృద్ధిని చూపించింది. డాలర్ మారకంలో చూస్తే నికర లాభం 42 శాతానికి పైగా వృద్ధితో 183.2 మిలియన్ డాలర్లుగాను, ఆదాయం 14.6 శాతం వృద్ధితో 1,383 మిలియన్ డాలర్లుగాను ఉన్నాయి. కంపెనీ ఉద్యోగులు సీక్వెన్షియల్గా (మార్చి త్రైమాసికంతో పోల్చినప్పుడు) జూన్ క్వార్టర్లో 5,209 మంది పెరిగారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,26,263కు చేరింది. సుమారు 13,544 కోట్లు (183 మిలియన్ డాలర్లు) నగదు, నగదు సమాన నిల్వలున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభాన్ని జూన్ క్వార్టర్లో నమోదు చేసినట్టు సీఎఫ్వో మిలింద్ కుల్కర్ణి తెలిపారు. 815 మిలియన్ డాలర్ల (రూ.6 వేల కోట్లకు పైగా) విలువైన నూతన వ్యాపార ఒప్పందాలను సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరును సాధించినట్టు చెప్పా రు. డిజిటల్పై పెరుగుతున్న వ్యయాలను అవకాశాలుగా మలుచుకుని రానున్న కాలంలో ఇదే వృద్ధిని లేదంటే ఇంతకుమించి మెరుగైన పనితీరును నమోదు చేస్తామన్న ఆశాభావాన్ని కంపెనీ ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. -
టెక్ మహీంద్రా లాభం హైజంప్
ముంబై: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం ఎగసి రూ. 1,081 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 804 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం స్వల్పం గా 2.5 శాతం పుంజుకుని రూ. 9,730 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి నికర లాభం 10 శాతం పురోగమించి రూ. 4,428 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 2.7 శాతం వృద్ధితో రూ. 37,855 కోట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల స్థాయిలో పుంజుకునే వీలున్నట్లు కంపెనీ తాజాగా అంచనా వేసింది. ఆగస్ట్ 11న డివిడెండ్... టెక్ మహీంద్రా బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున తుది డివిడెండును సిఫారసు చేసింది. దీనిలో రూ. 15 ప్రత్యేక డివిడెండు కలసి ఉంది. ఆగస్ట్ 11కల్లా డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో కలిపి గతేడాదికి కంపెనీ మొత్తం రూ. 45 డివిడెండును చెల్లించినట్లవుతుంది. క్యూ4లో 847 మంది ఉద్యోగులు వైదొలగడంతో 2021 మార్చికల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 1,21,054కు పరిమితమైంది. ఈ ఏప్రిల్ నుంచీ ఉద్యోగులకు వేతన పెంపును చేపడుతున్నట్లు కంపెనీ సీఎఫ్వో మిలింద్ కులకర్ణి వెల్లడించారు. గతేడాది మార్జిన్లు 2.6 శాతం బలపడి 18.1 శాతానికి చేరటంతోపాటు.. క్యాష్ఫ్లో మెరుగుపడినట్లు పేర్కొన్నారు. ఒక ఆసుపత్రితో ఒప్పందం ద్వారా నోయిడాలోని క్యాంపస్లో 50 పడకల కోవిడ్ కేర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో గుర్నానీ వెల్లడించారు. బీపీఎస్లో పట్టు కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులందించే యూఎస్ కంపెనీ ఎవెంటస్ సొల్యూషన్స్ గ్రూప్ను సొంతం చేసుకున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ మేనేజ్మెంట్ విభాగాల్లో కంపెనీ మరింత పట్టుసాధించనున్నట్లు తెలియజేసింది. బిజినెస్ ప్రాసెస్ సర్వీస్(బీపీఎస్) విభాగంలో మరింత సమర్థవంత సేవలందించనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ఎన్ఎస్ఈలో 2% ఎగసి రూ. 970 వద్ద ముగిసింది. అత్యున్నత సాంకేతికతలపై ప్రత్యేక దృష్టితో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. దీంతో క్యూ4లో భారీ డీల్స్ దక్కాయి. ఇవి రెట్టింపునకు ఎగసి 100 కోట్ల డాలర్లకు చేరాయి. ఇకపై వృద్ధి బాటలో సాగనున్నాం. ఐటీ సేవలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తోంది. వచ్చే రెండు త్రైమాసికాలలో 8–10% మేర ఉద్యోగ కల్పన చేపట్టనున్నాం. 5జీ, క్లౌడ్ తదితర విభాగాలలో అధిక వృద్ధికి వీలుంది. – సీపీ గుర్నానీ, టెక్ మహీంద్రా సీఈవో -
'5జీ'తో ఐటీ దిగ్గజాలకు కాసుల పంట
న్యూఢిల్లీ: టెలీ కమ్యూనికేషన్ రంగం భవిష్యత్ లో భారత ఐటీ దిగ్గజాలకు కాసుల పంట పండించనున్నది. కరోనా మహమ్మారి పుణ్యమా? అని 5జీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఒకవేల కనుక ప్రపంచంలోని దేశాలన్నీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకోని వస్తే క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత కంపెనీలకు పెద్ద పెద్ద అవకాశాలు రానున్నాయి. ఈ 5జీ టెక్నాలజీ వల్ల మన దేశంలోని ఐటీ దిగ్గజాలకు 30 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాలు లభిస్తాయని అంచనా. భారతదేశంలో 5జీ రంగంలో పని చేస్తున్న టెక్ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజాలకు భారీగా లబ్ధి పొందనున్నాయి. తొలిదశలో టెలికాం ప్రొవైడర్ల నెట్వర్క్ ఆధునీకరణ, ఎక్విప్మెంట్ రూపకల్పన వంటి కార్యక్రమాలు చేపట్టాలి. టెక్నాలజీలో ఎటువంటి మార్పులు సంభవించిన పరికరాల తయారీదారులకు, సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశాలు లభిస్తాయి. 5జీ టెక్నాలజీ వల్ల కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి, నూతన సేవలు అందుబాటులోకి తేవడానికి భారీగా వాల్యూక్రియేషన్ అవకాశాలు ఐటీ దిగ్గజాలకు లభిస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండస్ట్రీ గ్రూప్ అధ్యక్షుడు కమల్ భాడాడా వ్యాఖ్యానించారు. హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ సాఫ్ట్వేర్ కోసం టీసీఎస్ కసరత్తు చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు -
5,000 మందికి టెక్ మహీంద్రా ఉద్వాసన
ముంబై: ఐటీ రంగంలో ఉన్న టెక్ మహీంద్రా.. బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ (బీపీఎస్) విభాగంలో పనిచేస్తున్న 5,000 మందిని 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో నుంచి తీసివేయనుంది. ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ కంపెనీ ఇలా ఉద్యోగులకు ఉద్వాసన పలకనుండడం గమనార్హం. ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ ఆధారంగా పనులను పూర్తి చేస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డిసెంబరు త్రైమాసికంలో సుమారు 2,500 మందిని తీసివేయగా, వీరిలో అత్యధికులు బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ విభాగానికి చెందినవారు. ‘గతేడాది మార్చినాటికి బీపీఎస్లో 43,000 మంది ఉండేవారు. ఈ ఏడాది మార్చికల్లా ఈ సంఖ్య 38,000లకు చేరనుంది. ఉత్పాదకతతోపాటు ఆదాయమూ పెరగడమే ఇందుకు కారణం’ అని టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సి.పి.గుర్నాని తెలిపారు. ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ, సిబ్బందిని తగ్గించే ధోరణి రాబోయే కాలంలో కొనసాగకపోవచ్చని ఆయన అన్నారు. డిసెంబరు త్రైమాసికంలో బీపీఎస్ విభాగం ఆదాయం 11% వృద్ధి చెందింది. -
3 ప్రముఖ సంస్థలతో ‘స్కిల్స్’పై ఒప్పందాలు
సాక్షి, అమరావతి: పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నిపుణులైన మానవ వనరులను సమకూర్చడమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు పెద్దపీట వేస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో భాగస్వామ్యం కోసం కార్పొరేట్ సంస్థలు ముందుకు రావటంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్రెడ్డి సమక్షంలో మూడు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంతో కలసి పనిచేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, టెక్ మహీంద్ర ఫౌండేషన్ సీఈవో రాకేష్ సోని, బయోకాన్ అకాడమీ ప్రోగ్రామ్ డీన్ బిందు అజిత్, స్నైడర్ ఎలక్ట్రిక్ ఎడ్యుకేషన్ హెడ్ సాయికృష్ణరావు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. నైపుణ్యాల పెంపుపై సీఎం ప్రత్యేక దృష్టి – ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు సైతం సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోవటాన్ని గుర్తించి నైపుణ్యాలను పెంపొందించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి మేకపాటి తెలిపారు. – యువతకు స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి లక్ష్య సాధనలో టెక్ మహీంద్ర ఫౌండేషన్, బయోకాన్ అకాడమీ, స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థలు పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. – ఇటీవల ‘ఇకిగయ్’ అనే ఓ పుస్తకం చదివా. ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందనేది అందులోని అంతరార్థం. సీఎం జగన్ నిర్దేశించిన 30 స్కిల్ కాలేజీల ఏర్పాటు కూడా అలాంటిదే. ఇవీ ఒప్పందాలు... – తాజా ఒప్పందాల ప్రకారం టెక్ మహీంద్రా ఫౌండేషన్ విశాఖలో లాజిస్టిక్స్ సెక్టార్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను నెలకొల్పనుంది. పరిశ్రమల్లో పనిచేసేందుకు అనువైన కోర్సులు, సిలబస్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్, స్కిల్ కాలేజీల్లో డిజిటల్ టెక్నాలజీ, హెల్త్కేర్ విభాగాల్లో సర్టిఫికేషన్ కోర్సులను అందించనుంది. – ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్కు చెందిన బయోకాన్ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో లైఫ్ సైన్సెస్ విభాగంలో నాలెడ్జ్ పార్టనర్గా వ్యవహరించేలా ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలకు అవసరమైన కోర్సుల్లో శిక్షణ, పాఠ్యాంశాలను రూపొందించడంలో బయోకాన్ భాగస్వామ్యం కానుంది. – బహుళజాతి సంస్థ స్నైడర్ ఎలక్ట్రిక్, ఎనర్జీ, ఆటోమేషన్, డిజిటల్ సొల్యూషన్స్ విభాగాల్లో కలసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ నెల్లూరు స్కిల్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇతర జిల్లాల్లోని 12 స్కిల్ సెంటర్లలోనూ ఆటోమేషన్, ఎనర్జీ, మేనేజ్మెంట్ రంగాల్లో భాగస్వామి కానుంది. -
ఇది ఆరంభం మాత్రమే
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ ఐటీరంగం విస్తరణలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతోంది. వరంగల్లో టెక్ మహీంద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇది ఆరంభం మాత్రమే. ఈ రెండు కంపెనీలు రావడంతోనే సంతృప్తి చెందట్లేదు. హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం వరంగల్. ఇంకా చాలా కంపెనీలు రావాలి. వేలాది మందికి ఉద్యోగాలు లభించాలి. వరంగల్కు తొలుత ఒక్క సైయంట్ కంపెనీ వచ్చింది. ఆ తర్వాత టెక్ మహీంద్రా వచ్చింది. ఒక దాని తర్వాత మరో కంపెనీ వస్తుంది. హైదరాబాద్, వరంగల్ కాదు.. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మంతో పాటు దశల వారీగా అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తాం. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించాలన్నదే సీఎం కేసీఆర్ కల. ఈ కల సాకారం కానుంది’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఐటీ సెజ్లో ఏర్పాటు చేసిన టెక్ మహీం ద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ సెంట ర్లను కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మడికొండలోని ఐటీ సెజ్లో టెక్ మహీంద్రా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సీఈఓ గురునాని, మంత్రి కేటీఆర్ పారిశ్రామిక కారిడార్.. ‘రెండేళ్ల కిందట ఆనంద్ మహీంద్రా, బీవీఆర్ మోహన్రెడ్డిని కలిసి వరంగల్లో కంపెనీ పెట్టాలని కోరాం. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారు కంపెనీలు పెట్టారు. ఐటీ తెలం గాణ జిల్లాల కు విస్తరించడం వరంగల్ నుంచి ప్రారంభమైంది. టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీ ల ఏర్పాటు ద్వారా హైదరాబాద్ కాకుండా తెలంగాణ జిల్లాల్లో శ్రీకారం జరిగింది. ఈ కంపెనీల ద్వారా వరంగల్లో 10 వేల మందికి ఉపాధి కల్పించాలి’అని కేటీఆర్ కోరారు. హైదరాబాద్–వరంగల్ మార్గం పారిశ్రామిక కారిడార్గా మారబోతోందని స్పష్టం చేశారు. ఆలేరు, భువనగిరి, జనగామ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబాబాద్లో ఆహారశుద్ధి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐటీ, వ్యాపార, పరిశ్రమల వరంగల్ ప్రాంతాలను మరింత విస్తరించేందుకు మామునూరు ఎయిర్పోర్టును తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేస్తామన్నారు. జీఎంఆర్ సంస్థనే ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వివరించారు. ఈ దిశగా సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని, సానుకూలంగా స్పందించే అవకాశముందన్నారు. అప్పటి వరకు హెలీపోర్ట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. మరో హరిత విప్లవం.. రాష్ట్రంలో త్వరలోనే రెండో హరిత విప్లవం రాబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సాగు, తాగు నీటి విషయంలో సీఎం కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు విప్లవాత్మకమైన మార్పులతో టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాలు యజ్ఞంలా కొనసాగుతున్నాయని, కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడి నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాల భూమి సాగులోకి రానుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టామని, ఇప్పటికీ 12 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చామని, తద్వారా రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 13 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించామని వివరించారు. కొరియాకు చెందిన యంగ్టక్ కంపెనీ 8 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని తెలిపారు. మరో 18 సంస్థలు టెక్స్టైల్స్ పార్కులో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్లు దాస్యం వినయ్భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్రెడ్డి, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్ నాని, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మడికొండ ఐటీ సెజ్లో మహీంద్రా కేంద్రాల ప్రారంభం
సాక్షి, మడికొండ(వరంగల్): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అంతే వేగంగా అభివృద్ధి సాధిస్తున్న నగరంగా వరంగల్కు పేరు ఉంది. అయితే, కొన్నేళ్ల క్రితం నుంచి అభివృద్ధి పరుగులు తీస్తున్నా బహుళ జాతి కంపెనీలు వరంగల్లోకి అడుగు పెట్టడం లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను పరిచయం చేయాలన్న భావనతో కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు తొలిసారి జిల్లాలోని మడికొండలో ఉన్న పారిశ్రామిక వాడలో ఐటీ సెజ్ ఏర్పాటుచేయగా.. టీఎస్ఐఐసీ ఆధ్వర్యాన ఇంక్యుబేషన్ సెంటర్ మొదలైంది. అక్కడ తొలుత 2016లో సైయంట్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించగా..ఆ కంపెనీ అయిదు ఎకరాల్లో కొత్త సెంటర్ ఏర్పాటుచేసింది. దీనికి తోడు టెక్ మహీంద్రా కూడా తన సెంటర్ను అందుబాటులోకి తీసుకురాగా.. ఈ రెండు కేంద్రాలను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రాంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్లోనే ప్రారంభించాల్సి ఉన్నా... మడికొండ ఐటీ సెజ్లో నిర్మించిన టెక్ మహేంద్ర, సైయంట్ ఐటీ సెంటర్లను మంగళవారం మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ప్రారంభించనున్నారు. సైయంట్ సంస్థ కార్యాలయాన్ని ఆక్టోబర్లోనే ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. అప్పట్లో అనివార్య కారణాలతో ప్రారంభోత్స వం వాయిదా పడింది. ఇంతలోనే టెక్ మహీంద్ర సంస్థ సైతం తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం రెండు కేంద్రాలను కేటీఆర్ ప్రారంభి స్తారు. సైయింట్ ఐదు ఎకరాల స్థలంలో సుమారు రూ.25కోట్లతో సెంటర్ నిర్మించింది. ఇందులో ప్రస్తుతం 120 మందితో కార్యకలాపాలు సాగుతుండగా.. ఆరు బ్లాక్ల్లో 800 వరకు పని చేయడానికి అనుకూలంగా ఉందని కంపెనీ సీనియర్ మేనేజర్ కే.తిరుపతిరెడ్డి తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, చీఫ్ విప్ సైయంట్, టెక్ మహీంద్ర సంస్థల కార్యాలయాలను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించనున్న క్యాబిన్లు, సమావేశ హాల్లు పరిశీలించిన అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా ప్రాంగణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ వెంకారెడ్డి, తహసీల్దార్ నాగేశ్వర్రావు, కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు దువ్వ కనుకరాజ్, పల్లపు నర్సింగరావు, రాజేందర్, వినోద్ పాల్గొన్నారు. ఐటీ హబ్గా తీర్చిదిద్దుతాం.. హన్మకొండ: ఐటీ హబ్గా వరంగల్ను తీర్చిదిద్దనున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి మాట్లాడారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి విద్యార్థులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించిన ప్రభుత్వం సైయంట్, టెక్ మహీంద్రా కంపెనీల సెంటర్లు ఏర్పాటుచేసేలా కృషి చేసిందని తెలిపారు. ఈ కంపెనీలను కేంద్రాలను మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని వినయ్భాస్కర్ పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు బోయినిపల్లి రంజిత్రావు, వేము ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు సంగంరెడ్డి సుందర్రాజు, మాడిశెట్టి శివశంకర్, బొర్ర అయిలయ్య, నయీముద్దీన్ పాల్గొన్నారు. -
టెక్ మహీంద్రా లాభం 1,124 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) సెపె్టంబర్ క్వార్టర్లో రూ.1,124 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం(రూ.1,064 కోట్లు)తో పోలి్చతే 6 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా ఎమ్డీ, సీఈఓ సీపీ గుర్నాని తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.8,630 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.9,070 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆదాయం 128 కోట్ల డాలర్లకు.... డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 14 శాతం వృద్ధితో 16 కోట్ల డాలర్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో 128 కోట్ల డాలర్లకు పెరిగాయి. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 4 శాతం పెరిగింది. డిజిటల్ విభాగం ఆదాయం సీక్వెన్షియల్గా 12 శాతం ఎగసింది. నిర్వహణ లాభం 7 శాతం తగ్గి రూ.1,501 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్ 2.3 శాతం తగ్గి 16.50 శాతానికి చేరింది. అయితే సీక్వెన్షియల్గా చూస్తే, నిర్వహణ లాభం 14 శాతం, నిర్వహణ లాభ మార్జిన్ 1.3 శాతం చొప్పున పెరిగాయి. ఏటీఅండ్టీ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని ఈ క్యూ2లో కుదుర్చుకుంది. ఈ క్యూ2లో కంపెనీ నికరంగా 5,749 ఉద్యోగాలిచి్చంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,31,522కు పెరిగింది. ఉద్యోగుల వలస(ఆట్రీషన్ రేటు) ఎలాంటి మార్పు లేకుండా 21 శాతంగా ఉంది. టెక్ మహీంద్రా చేతికి బార్న్ గ్రూప్... అమెరికాకు చెందిన బార్న్ గ్రూప్ కంపెనీని రూ.671 కోట్లకు టెక్ మహీంద్రా పూర్తి అనుబంధ సంస్థ, టెక్ మహీంద్రా (సింగపూర్) పీటీఈ లిమిటెడ్ కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ ఈ నెల 15 కల్లా పూర్తవ్వనున్నది. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి లండన్, సింగపూర్, హాంకాంగ్, భారత్ల్లో కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,100గా ఉంది. -
‘ఆ బృందం క్రేజీ ఆఫర్ దక్కించుకుంది’
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేందుకు ‘నేషనల్ అండర్గ్రాడ్యుయేట్ రీసెర్చ్ సింపోజియం’ పేరిట తాము నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైందని మహీంద్ర ఎకోలే సెంట్రల్(ఎంఈసీ) ఇంజనీరింగ్ విద్యా సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 300కు పైగా విద్యార్థులు హాజరయ్యారని పేర్కొంది. ఇందులో భాగంగా పరిశోధనా విభాగానికి సంబంధించి 12 మౌఖిక, 30 పోస్టర్లను విద్యార్థులు సమర్పించారని తెలిపింది. వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు 65 వేల రూపాయల విలువైన బహుమతులు అందజేసినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత ప్రొఫెసర్ అజయ్ ఘటక్, సైబర్ భద్రతా విభాగం సీఈఓ డాక్టర్ శ్రీరామ్ బిరుదవోలు ముఖ్య అతిథులుగా హాజరై... స్టార్టప్లు, ఎంటర్ప్రెన్యూర్ నాయకత్వాల గురించి విద్యార్థులకు వివరించినట్లు పేర్కొంది. నేషనల్ అండర్గ్రాడ్యుయేట్ రీసెర్చ్ సింపోజియం’ లో భాగంగా టెక్ మహీంద్ర మెషీన్ లెర్నింగ్తో కలిసి ఎంఈసీ క్లబ్ ఎనిగ్మా12 గంటల కోడింగ్ ఛాలెంజ్ను నిర్వహించినట్లు ఎంఈసీ తెలిపింది. అదే విధంగా స్టార్టప్ ఐడియా కాంటెస్ట్ కూడా నిర్వహించామని..ఈ పోటీకి పారిశ్రామికవేత్తలు డాక్టర్ ఎ.శ్రీనివాస్(ఏఐపీఈఆర్ వ్యవస్థాపక డైరెక్టర్), రాఘవేంద్ర ప్రసాద్(ఫారిగేట్ అడ్వైజరీ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్), శ్రీచరణ్ లక్కరాజు(స్టమాజ్ సీఈఓ) న్యాయ నిర్ణేతలుగావ్యవహరించారని పేర్కొంది. ఈ పోటీలో గెలుపొందిన ఓ విద్యార్థి బృందం.. స్టార్టప్ పెట్టుబడులకై జడ్జీల నుంచి ఆఫర్ను సైతం సొంతం చేసుకుందని వెల్లడించింది. అదే విధంగా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన డిజైన్ అండ్ ప్రొటోటైప్ కాంటెస్ట్లో 12 బృందాలు పాల్గొన్నాయని వెల్లడించింది. ఈ కార్యక్రమం గురించి ఎంఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ యాజులు మెడ్యూరీ మాట్లాడుతూ..‘2018లో నిర్వహించిన సింపోజియంకు మంచి ఆదరణ లభించింది. అందుకే ఈసారి జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించాం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు యువ పారిశ్రామికవేత్తలను వెలికితీసేందుకు దోహదపడతాయి’ అని పేర్కొన్నారు. కాగా మహీంద్ర గ్రూప్లో భాగమైన అంతర్జాతీయ కళాశాల ఎంఈసీని మహీంద్ర యాజమాన్యం 2013లో హైదరాబాద్లో నెలకొల్పిన సంగతి తెలిసిందే. -
టెక్ మహీంద్రాకు భారీ డీల్
పుణే: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా భారీ డీల్ను సాధించింది. అమెరికాకు చెందిన టెలికం కంపెనీ ఏటీ అండ్ టీ, నుంచి ఈ కాంట్రాక్ట్ను సాధంచామని టెక్ మహీంద్రా తెలిపింది. ఏటీ అండ్ టీ కంపెనీ తన ఐటీ నెట్వర్క్ను అధునికీకరించడం కోసం ఈ డీల్ను కుదుర్చుకుందని టెక్ మహీంద్రా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మనోజ్ భట్ పేర్కొన్నారు. డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ వంద కోట్ల డాలర్లకు మించి ఉంటుందని అంచనా. దాదాపు ఆరేళ్ల కాలంలో తాము సాధించిన అతి పెద్ద డీల్ ఇదేనని భట్ పేర్కొన్నారు. ఈ డీల్ కాలపరిమితి ఆరున్నర సంవత్సరాలని తెలిపారు. 2013లో ఈ కంపెనీ బ్రిటిష్ టెలికం కంపెనీ బీటీతో వంద కోట్ల డాలర్లకు మించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మరింత మెరుగైన సేవలు.... టెక్ మహీంద్రాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మరింత మెరుగైన సేవలను అందించగలుగుతామని ఏటీ అండ్ టీ సీఐఓ జాన్ సమ్మర్స్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్కల్లా అమెరికా వ్యాప్తంగా 5జీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్న తమ లక్ష్యం సులభంగానే సాకారం కాగలదని వివరించారు.కాగా టెక్ మహీంద్రా కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్ల డాలర్ల మేర ఉంటుంది. దీంట్లో 21 శాతం వరకూ ఏటీ అండ్ టీ, బీటీ వంటి అగ్రశ్రేణి కంపెనీల నుంచే వస్తోంది. ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం వాటా 40 శాతానికి మించి ఉంటుంది. -
మళ్లీ 11,000 పైకి నిఫ్టీ
కీలక రేట్ల విషయమై ఆర్బీఐ విధానం మారవచ్చనే అంచనాలతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. వడ్డీ రేట్ల ప్రభావిత రంగ షేర్లతో పాటు ఇతర రంగాల షేర్లలో కూడా కొనుగోళ్లు జోరుగా సాగాయి. స్టాక్ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ లాభపడ్డాయి. స్టాక్ సూచీలు రెండూ ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్లపైకి ఎగబాకగా, బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 37,000 పాయింట్లపైకి చేరింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో ఐటీ, లోహ, ఆర్థిక, ఇంధన, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 358 పాయింట్లు పెరిగి 36,975 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 11,062 పాయింట్ల వద్ద ముగిశాయి. నేడు ఆర్బీఐ పాలసీ.. మంగళవారం ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేడు (గురువారం) ముగియనుంది. కీలక రేట్లపై నిర్ణయాన్ని ఆర్బీఐ నేడు వెల్లడిస్తుంది. రేట్ల కోత ఉండకపోవచ్చని, అయితే ద్రవ్యోల్బణం దిగివస్తుండటంతో రేట్ల విషయమై ఆర్బీఐ వైఖరి ‘తటస్థ’ విధానానికి మారవచ్చని అంచనాలున్నాయి. బాండ్ల రాబడులు తగ్గడం, రూపాయి స్వల్పంగా బలపడటం ఈ అంచనాలకు మరింత బలాన్నిచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముడి చమురు ధరలు తగ్గడం, ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,624 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరపడం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి సాధించగలమని కేంద్రం పేర్కొనడం... సానుకూల ప్రభావం చూపించాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 388 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. జపాన్ మార్కెట్ స్వల్పంగా పెరగ్గా, చైనా, దక్షిణ కొరియా మార్కెట్లు చాంద్రమాన కొత్త సంవత్సరాది కారణంగా పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆల్టైమ్ హైకి టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఈ క్యూ3లో నికర లాభం 28 శాతం పెరగడంతో టెక్ మహీంద్రా షేర్ భారీగా లాభపడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.814ను తాకిన ఈ షేర్ చివరకు 8 శాతం లాభంతో రూ.811 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,995 కోట్లు పెరిగి రూ.79,588 కోట్లకు ఎగసింది. ఈ షేర్తో పాటు ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, బాటా ఇండియా తదితర షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఆగని అనిల్ షేర్ల పతనం... అనిల్ అంబానీ షేర్ల పతనం కొనసాగింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ ఇంట్రాడేలో 38 శాతం క్షీణించి రూ.142ను తాకింది. చివరకు 32 శాతం నష్టంతో రూ.154 వద్ద ముగిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ ఇంట్రాడేలో 11 శాతం తగ్గి ముఖ విలువ రూ.5 కంటే దిగువకు, రూ.4.85ను తాకింది. చివరకు 1 శాతం లాభంతో రూ.5.48 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇతర గ్రూప్ కంపెనీలు–రిలయన్స్ పవర్ 14 శాతం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 12 శాతం, రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ 11 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు రోజుల్లో రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ షేర్ మినహా అనిల్ అంబానీ గ్రూప్నకు చెందిన ఆరు షేర్లు 22 శాతం నుంచి 53 శాతం రేంజ్లో పడిపోయాయి. మూడు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు 31 సెన్సెక్స్ షేర్లలో కేవలం మూడు– యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ.. మాత్రమే నష్టపోగా మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. స్టాక్ సూచీలు భారీగా లాభపడినప్పటికీ, దాదాపు 400 షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అరవింద్, ఏబీజీ షిప్యార్డ్, ఇక్రా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
టెక్ మహీంద్రా లాభం 1,064 కోట్లు
న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,064 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.836 కోట్లు నికర లాభం వచ్చిందని, 27 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా తెలిపింది. సీక్వెన్షియల్గా చూస్తే నికర లాభం 19 శాతం పెరిగింది. రూపాయి పతనం ప్రధాన కారణంగా మార్జిన్లు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని టెక్ మహీంద్రా సీఈఓ, ఎమ్డీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.7,606 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 13 శాతం వృద్ధితో రూ.8,630 కోట్లకు పెరిగిందని తెలిపారు. అయితే సీక్వెన్షియల్గా చూస్తే, ఆదాయ వృద్ధి 4 శాతమే పెరిగిందని, హెల్త్కేర్ సెగ్మెంట్ మందకొడి పనితీరే దీనికి కారణమని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 16 శాతం వృద్ధితో 15 కోట్ల డాలర్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో 121 కోట్ల డాలర్లకు పెరిగాయని చెప్పారు. ఎబిటా 46 శాతం (సీక్వెన్షియల్గా చూస్తే 19 శాతం) పెరిగి రూ.1,619 కోట్లకు పెరిగిందని, ఎబిటా మార్జిన్ 4.3 శాతం పెరిగి 18.8 శాతానికి చేరాయని వివరించారు. ఫలితాలు సంతృప్తికరం... ఈ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని గుర్నానీ తెలిపారు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్పై దృష్టి సారించడం వల్ల మంచి పనితీరు సాధించామని వివరించారు. కమ్యూనికేషన్ విభాగంలో మంచి డీల్స్ పొందామని, సీక్వెన్షియల్గా చూస్తే, డిజిటల్ విభాగం ఆదాయం 10 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఎబిటా మార్జిన్, ఆదాయాల్లో మంచి వృద్ధి సాధించామని వివరించారు. ఈ క్యూ2లో 55 కోట్ల డాలర్ల డీల్స్ను ఈ కంపెనీ సాధించింది. ఒక్క క్వార్టర్లో ఈ స్థాయిలో డీల్స్ సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి. రూ.7,900 కోట్ల నగదు నిల్వలు.. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.7,900 కోట్లుగా ఉన్నాయని గుర్నాని పేర్కొన్నారు. యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 930కు పెరిగిందని వివరించారు. ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 4,839 కొత్త ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.18 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. వీరిలో 72,534 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులని, 39,407 మంది బీపీఓ ఉద్యోగులని వివరించారు. ఈ క్యూ1లో 19 శాతంగా ఉన్న ఆట్రీషన్ రేటు ఈ క్యూ2లో 20 శాతానికి పెరిగింది. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేర్ 2.9 శాతం లాభపడి రూ.684 వద్ద ముగిసింది. -
తెలంగాణలో బ్లాక్చైన్ డిస్ట్రిక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో తొలిసారిగా బ్లాక్చైన్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసేందుకు టెక్నాలజీ కంపెనీ టెక్ మహీంద్రా, తెలంగాణ ఐటీ శాఖ చేతులు కలిపాయి. నూక్లియస్ విజన్, ఎలెవన్01 ఫౌండేషన్ ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నాయి. ఈ కేంద్రం బ్లాక్చైన్ టెక్నాలజీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా, ఇంక్యుబేటర్గా పాత్ర పోషించనుంది. అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. భారత్లో ఈ రంగంలో ఉన్న స్టార్టప్లు, కంపెనీలు వేగంగా వృద్ధి చెందేందుకు బ్లాక్చైన్ డిస్ట్రిక్ట్ తోడ్పడనుంది. ఇంటర్నేషనల్ బ్లాక్చైన్ కాంగ్రెస్ సందర్భంగా శుక్రవారమిక్కడ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నాని సమక్షంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎలెవన్01 ఫౌండేషన్ సీఈవో రామా అయ్యర్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సర్టిఫికెట్లకు బ్లాక్చైన్..: విద్యార్హత పత్రాల జారీలో బ్లాక్చైన్ టెక్నాలజీని వినియోగించనున్నట్టు కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. బ్లాక్చైన్ను ఆసరాగా చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్టు చెప్పారు. ‘‘విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల సమాచారాన్ని బ్లాక్చైన్ ఆధారంగా భద్రపరుస్తారు. దీంతో యూనివర్సిటీలు, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలతోపాటు ఉద్యోగం ఇచ్చే ప్రైవేటు సంస్థలు విద్యార్థి సమర్పించిన పత్రాలను సరిచూసుకోవచ్చు. చిట్ఫండ్ సంస్థల లావాదేవీలను ట్రాక్ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు చేపట్టాం’’ అని వివరించారు. పట్టణాల్లోనూ ప్రక్షాళన..: అందరు భాగస్వాము లతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వ విభాగాలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశ్రమతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఇవన్నీ బ్లాక్చైన్ రంగం వృద్ధికి, ఈ రంగ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రముఖ కేంద్రంగా తెలంగాణ నిలిచేందుకు దోహదం చేస్తాయని వివరించారు. ధరణి పేరుతో 568 మండలాల్లో 10,875 గ్రామాల్లో ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన చేపట్టి, ఆ సమాచారాన్ని బ్లాక్చైన్ టెక్నాలజీతో భద్రపరిచామని పేర్కొన్నారు. పట్టణాల్లోనూ ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన చేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. -
టెక్ మహీంద్రా బ్లాక్ గీక్స్ పేరుతో ఉద్యోగులకు శిక్షణ
-
టెక్ మహీంద్రా లాభం రూ.943 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల సంస్థ, టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.943 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.856 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలియజేసింది. ఆదాయం రూ.7,558 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.7,776 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్గా చూస్తే నికర లాభం 13 శాతం, ఆదాయం 2 శాతం చొప్పున పెరిగాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేర్ 1.1 శాతం లాభంతో రూ.605 వద్ద ముగిసింది. -
వరంగల్లో టెక్ మహీంద్ర
-
వరంగల్లో టెక్ మహీంద్ర
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ ఐటీరంగ కంపెనీ టెక్ మహీంద్ర వరంగల్లో తమ కేంద్రాన్ని (టెక్ సెంటర్) ఏర్పాటు చేయనుంది. టెక్ మహీంద్ర కార్యకలాపాలు ప్రారంభించా లని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన విజ్ఞప్తికి కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ గురువారం మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, సీఈవో సీపీ గుర్నానీతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం–మహీంద్ర సంస్థల మధ్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి కోరగా, వరంగల్లో టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆనంద్ హామీ ఇచ్చారు. తొలుత 500 మందితో ఈ సెంటర్ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వరంగల్లో ఉన్న అవకాశాలు, టాలెంట్ పూల్ వంటి అంశాల గురించి మంత్రి వివరించారు. టెక్ మహీంద్ర సంస్థ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో రెండవ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లడంలో ప్రేరకంగా పనిచేస్తుందని, ఇందుకు గాను ఆనంద్ మహీంద్ర, సీపీ గుర్నానిలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును ఆనంద్ మహీంద్ర కలుస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులకు ఆహ్వానం ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలువురు ప్రముఖులు, వివిధ కంపెనీల ప్రతినిధు లను కలిశారు. ఎయిరో స్పేస్ దిగ్గజం లాక్ హీడ్ మార్టిన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రిచర్డ్ అంబ్రోస్తో సమావేశమయ్యారు. సంçస్థ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలు సాగిస్తోందని, స్పేస్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ అనుకూలంగా ఉందని వివరించారు. ఎయిరో స్పేస్ పార్కులు, మార్స్ ఆర్బిటర్ ప్రయోగంలో హైదరాబాద్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని తెలిపారు. బల్గేరియా టూరిజం మంత్రి నికోలినా అంగేల్ కోవాతో సమావేశమై ఇరు ప్రాంతాల మధ్య స్టార్టప్, పరిశోధనలు, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. ట్రినా సోలార్ ఉపాధ్యక్షురాలు రొంగ్ ఫాంగ్యిన్, ఫిలిప్స్ సంస్థ ప్రతినిధులు, అబ్రాజ్ గ్రూప్ మేనేజింగ్ పార్టనర్ కీటో డి బోయర్తో పాటు పలు కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్, హీరో మోటో కార్ప్ సీఈవో పవన్ ముంజాల్, ఉదయ్ కోటక్, వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా, కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ను దావోస్లో మంత్రి కేటీఆర్ కలిశారు. పారిశ్రామికవేత్తలతో భేటీ దావోస్లో మూడో రోజు పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశమై చర్చలు జరిపారు. సీఏ సంస్థ గ్లోబల్ సీఈవో మైక్ గ్రెగోరీతో కేటీఆర్ సమావేశమయ్యారు. కంపెనీ విస్తరణ చర్యల్లో హైదరాబాద్కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం హైదరాబాద్లో తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోందని, కంపెనీ వృద్ధిపట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నట్లు గ్రెగోరీ తెలిపారు. ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ అనుసంధానం, చవకైన మౌలిక వసతులున్నాయని హైదరాబాద్పై ప్రశంసలు కురిపించారు. అనంతరం ఫైజ ర్ వ్యాక్సిన్ అధ్యక్షురాలు సుసాన్ సిలబెర్మన్తో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సినేషన్ మ్యానుఫాక్చరింగ్ హబ్బులలో ఒకటిగా ఉందని, దాదాపు 25% ప్రపంచ వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని మంత్రి తెలి పారు. జీనోమ్ వ్యాలీ, ప్రభుత్వం ఏర్పా టు చేయనున్న ఫార్మాసిటీ గురించి వివరించారు. ఫైజర్ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలన్నారు. -
అంచనాలను బీట్ చేసిన టెక్ మహీంద్రా
సాక్షి,ముంబై: దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ సేవల టెక్ మహీంద్రా రెండవ త్రైమాసిక ఫలితాల్లో బుధవారం విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. బుధవారం ప్రకటించిన క్యూ2లో నికర లాభాలు సీక్వెన్షియల్ ప్రాతిపదికన 4.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన 30శాతం జంప్ చేసి రూ. 836కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 644.73 లాభాలను నమోదు చేసింది. రూపాయి ఆదాయం 3.7 శాతం పుంజుకుని క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆన్ రూ. 7006కోట్లను, డాలర్ రెవెన్యూ 3.6 పెరిగి 1179 మిలియన్ డాలర్లను ఆర్జించింది. కాగా రూ.740 కోట్ల లాభాలను, రూ. 7,551కోట్ల ఆదాయాన్ని సాధిస్తుందని ఎనలిస్టులు అంచనావేశారు. డేవిడ్ (డిజిటైజేషన్, ఆటోమేషన్, వెర్టికలైజేషన్, ఇన్నోవేషన్, డిసరప్షన్ ) వ్యూహంతో, త్రైమాసికంలో ఆదాయం, నికర లాభం, కొత్త వ్యాపారం లాభంలో మంచి వృద్ధి సాధించామని టెక్ మహీంద్ర సీఎండీ సీపీ గనర్ని చెప్పారు. ఈ త్రైమాసికంలో రూపాయి రెవెన్యూ 3.7 శాతం పెరిగి రూ .7,606 కోట్లకు చేరింది. డాలర్ రెవెన్యూ 3.6 శాతం పెరిగి 1,179.2 మిలియన్ డాలర్లకు చేరింది. ఎబిటా మార్జిన్లు 22.2 శాతం పెరిగి రూ .840 కోట్లకు పెరిగింది. 2017 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి 160 బేసిస్ పాయింట్లు పెరిగి మార్జిన్ 11 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో అగ్రిమెంట్ రేట్ (ఎల్టిఎమ్) గత త్రైమాసికంలో 17 శాతం నుంచి 16 శాతానికి పడిపోయింది. క్యూ2లో ఐటి వినియోగం 77 శాతం నుండి 81 శాతం పెరిగింది, ఐటి వినియోగం (ట్రినెస్ మినహాయించి) 81 శాతం వద్ద ఉంది. ఫారెక్స్ రెవెన్యూ 16.7 శాతం తగ్గి 227 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంలో రూ .322.2 కోట్లతో పోల్చుకుంటే 21.5 శాతం క్షీణించిందని పేర్కొంది . ఈ క్వార్టర్లో తమ కొత్త 21 క్లయింట్లతో మొత్త 885 మంది ఖాతాదారులున్నారు. అలాగే గత క్వార్టర్లోని అట్రిషన్ రేట్ 17శాతంతో పోలిస్తే ప్రస్తుతం16 శాతానికి తగ్గిందని తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ధర 1.6 శాతం లాభపడింది. -
లేఆఫ్స్పై లేబర్ కోర్టును ఆశ్రయించిన టెకీలు
సాక్షి, బెంగుళూరు: టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో మహారాష్ట్ర కార్మిక శాఖ విఫలం కావడంతో ఐటీ ఉద్యోగుల ఫోరం 11 వివాదాలకు సంబంధించి లేబర్ కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. బాధిత ఉద్యోగులు పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2 ఏ కింద పిటిషన్లు వేశారని ఫోరం కో-ఆర్డినేటర్ ఇలవరసన్ రాజా తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం ఏ ఉద్యోగినైనా సంస్థ తొలగించిన పక్షంలో దాన్ని పారిశ్రామిక వివాదంగా పరిగణిస్తారు. కాగా దీనిపై స్పందించిన టెక్ మహీంద్ర న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. గతంలో ఓ ఉద్యోగిని బలవంతంగా తొలగించేలా కంపెనీ హెచ్ఆర్ అధికారులు వ్యవహరించిన ఆడియో క్లిప్లు వెలుగు చూడటంతో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా క్షమాపణలు వేడుకున్న విషయం తెలిసిందే. పలు ఐటీ కంపెనీలు ఇటీవల ఉద్యోగులను పెద్దసంఖ్యలో తొలగిస్తున్నాయి. విప్రో, కాగ్నిజెంట్ సహా పలు ఐటీ కంపెనీలు సామర్థ్య మదింపు పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. -
తొలిసారి టాప్ ఐటీ కంపెనీల్లో తగ్గిన ఉద్యోగులు
బెంగళూరు : 154 బిలియన్ డాలర్ల దేశీయ ఐటీ రంగం అప్పట్లో ఉద్యోగాలకు పుట్టినిల్లు. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైన సంగతి తెలిసిందే. ఉద్యోగాలను కల్పించడంలోనూ ఈ రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మొట్టమొదటిసారి టాప్-5 ఐటీ కంపెనీలోని మూడు కంపెనీల్లో ఉద్యోగులు భారీగా తగ్గిపోయారు. జూన్30తో ముగిసిన క్వార్టర్లో ఈ విషయం వెల్లడైంది. టాప్-5 ఐటీ కంపెనీల్లో జూన్ క్వార్టర్ ముగిసేసరికి 984,913 మంది ఉద్యోగులున్నారు. అంటే వారి వర్క్ఫోర్స్ గత క్వార్టర్ మార్చితో పోలిస్తే 1,821 మంది తగ్గిపోయింది. కాగ, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్లో దేశీయ ఐటీ పరిశ్రమ 39 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ వెల్లడించింది. అంతేకాక కనీసం 150,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు నాస్కామ్ అంచనావేసింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే నాస్కామ్ అంచనాలు తప్పేలా కనిపిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసులు సంస్థగా పేరున్న టీసీఎస్ వర్క్ఫోర్స్ జూన్తో ముగిసిన క్వార్టర్తో 1,414 మంది తగ్గి, 385,809గా ఉంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ ఉద్యోగాలు నికరంగా 1,811 పడిపోయాయి. టెక్ మహింద్రాలో కూడా 1,713 మంది వర్క్ఫోర్స్ తగ్గిపోయారు. కేవలం విప్రో, హెచ్సీఎల్లు మాత్రమే తమ వర్క్ఫోర్స్లో నికర అడిక్షన్ను నమోదుచేశాయి. విప్రోలో ఇన్ఫోసర్వర్ కొనుగోలుతో కొత్తగా 200 మంది ఉద్యోగుల జాయిన్ అయ్యారు. అదనంగా మరో 1000 మంది ఉద్యోగులను తమ క్లయింట్ వర్క్ఫోర్స్ నుంచి తీసుకుంది. మిగతా ఐటీ కంపెనీలు ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్, మైండ్ట్రి లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్, హెక్సావేర్ లిమిటెడ్, సింట్ లిమిటెడ్లు ఈ క్వార్టర్లో 2,026 మంది ఉద్యోగులను కంపెనీల్లోకి తీసుకున్నాయి. కంపెనీ బిజినెస్ మోడల్లు మారడంతో ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడంలో తీవ్ర కఠినతరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిసింది. ఓ వైపు ట్రంప్ రక్షణాత్మక విధానాలు, మరోవైపు ఆటోమేషన్ ప్రభావంతో చాలా కంపెనీలు తమ ప్రస్తుత వర్క్ఫోర్స్ విషయంలో పునఃసమీక్షించుకోవడం మొదలుపెట్టాయి. ఈ ప్రభావంతో భారీగా వర్క్ఫోర్స్ను కంపెనీలు తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. ఈ ఏడాది టాప్-7 ఐటీ కంపెనీలు 56వేల మంది ఇంజనీర్లను కంపెనీలు విడిచిపెట్టి వెళ్లమని ఆదేశించవచ్చని మింట్ గతంలోనే రిపోర్టు చేసింది. ఈ సంఖ్య గతేడాది నుంచి రెండింతలు పెరుగుతుందని తెలిపింది. -
మరో కీలక మార్కును తాకిన నిఫ్టీ
ముంబై :దేశీయ స్టాక్మార్కెట్లో రికార్డుల పర్వం కొనసాగుతోంది. నిఫ్టీ ప్రారంభంలో మరో కీలకమార్కు 10,101.05ని తాకింది. ఆసియన్ మార్కెట్ల నుంచి వీచే సానుకూల పవనాలు, ఆర్బీఐ ఈసారి జరపబోయే ద్రవ్యపాలసీలో రేట్ల కోత ఉండొచ్చననే అంచనాలతో దేశీయ మార్కెట్లు మంగళవారం సెషన్లోనూ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 20.51 పాయింట్ల లాభంలో 32,535 వద్ద, నిఫ్టీ 11.20 పాయింట్ల లాభంలో10,088 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ రెండు రోజుల మీటింగ్ నేడే ప్రారంభం కాబోతుంది. బుధవారం రేట్ల కోతపై ఆర్బీఐ ఓ ప్రకటన చేస్తోంది. ద్రవ్యోల్బణ గణాంకాలు దిగిరావడంతో ఈసారి కచ్చితంగా రేట్ల కోత ఉంటుందని మెజార్టీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహింద్రా నికర లాభం 6.5 శాతం పెరగడంతో, ఆ కంపెనీ షేర్లు లాభాలు పండిస్తున్నాయి. టెక్ మహింద్రా షేరు 5 శాతం మేర పైకి జంప్ చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.4 శాతం పైకి ఎగిసింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 64.13 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 79 రూపాయల నష్టంలో 28,501 వద్ద కొనసాగుతున్నాయి. -
టెక్ మహీంద్రా ఉద్యోగి దుర్మరణం
నందిగామ: కృష్ణాజిల్లా నందిగామ వద్ద హైవేపై శనివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్పోర్ట్సు బైక్ ఇంజన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు. అదే సమయానికి వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొనడంతో నాగేంద్రరావు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వంశీకృష్ణ అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరు టెక్ మహీంద్రా ఉద్యోగస్తులు. కాగా హెల్మెట్ ఉన్నా బలంగా ఢీ కొనడంతో నాగేంద్రరావు మృతి చెందాడు. మృతుడి స్వస్థలం తాడేపల్లిగూడెం కాగా వంశీకృష్ణది విజయవాడలోని కృష్ణలంక అని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. -
2వేల మందిని పైగా నియమించుకుంటాం..
న్యూయార్క్ : డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు టెక్ దిగ్గజాలన్నీ అమెరికన్లకు భారీగా ఉద్యోగ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో దేశీయ సాఫ్ట్వేర్ సేవల సంస్థ టెక్ మహింద్రా కూడా ఈ ఏడాది అమెరికాలో 2,200 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. గతేడాది కూడా ఈ కంపెనీ ఇంతేమొత్తంలో ఉద్యోగులను నియమించుకుంది. తమ దేశంలో ఉద్యోగాలను సృష్టించాలని ఆ దేశ ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో టెక్ మహింద్రా ఈ నియామకాల ప్లాన్ను ప్రకటించినట్టు తెలిసింది. ముంబైకి చెందిన ఈ కంపెనీకి అమెరికాలో 6000 మంది ఉద్యోగులుండగా.. 400 మందికి పైగా క్లయింట్స్ ఉన్నారు. గత నాలుగేళ్లుగా కూడా ఈ కంపెనీ నియామకాలు కాలేజీల నుంచే జరుగుతున్నాయి. ''గతేడాది తాము సుమారు 2,200 మంది ఉద్యోగులను నియమించుకున్నాం. ఈ ఏడాది కూడా అంతేమొత్తంలో నియమించుకోవాలని చూస్తున్నాం'' అని టెక్ మహింద్రా అధ్యక్షుడు, స్ట్రాటజిక్ వెర్టికల్స్ లక్ష్మణన్ చిదంబరం చెప్పారు. అమెరికాలో నియామకాలకు ప్రధాన కారణంగా.. ఆ దేశ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు తమకు అందాయని, అమెరికాలో ఉద్యోగాలు కల్పించడంలో తాము అతిపెద్ద పాత్ర పోషించాలని వారు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్ మహింద్రాకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. అమెరికాలో మొత్తం 28 నగరాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. అంతేకాక 16 డెవలప్మెంట్ సెంటర్లను కలిగిఉంది. ప్రపంచవ్యాప్తగా ఈ కంపెనీకి 1.17 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఐటీ కంపెనీలు ఇటీవల అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో తీవ్ర కఠినతరమైన నిబంధనలను ఎదుర్కొంటున్నాయి. వ్యాపార వాతావరణంలోను, వర్క్ పర్మిట్లోనూ ఆ దేశాలు పరిమితులు విధిస్తున్నాయి.. కాగ, కంపెనీలు కూడా భారత్లో ఉద్యోగాల కోత విధించి, అమెరికాలో భారీగా నియామకాల ప్రక్రియకు తెరలేపినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ ఈ రిపోర్టులను టెక్ దిగ్గజాలు ఖండిస్తున్నాయి. -
టెక్ మహీంద్రకు హైకోర్టు నోటీసులు
ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ మహీంద్రకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు కూడా నోటీసులిచ్చింది. ఉద్యోగుల తొలగింపునకు సం బంధించిన పూర్తి వివరాలను తమ ముందుం చాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రామచంద్రరావు విచారణ జరిపారు. నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు... పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయ వాది ఎ.సత్యప్రసాద్ వాదనలు విని పిస్తూ... టెక్ మహీంద్ర కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవు పై వెళ్లాలని వేధిస్తోందని చెప్పారు. దీనిపై రంగా రెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన తర్వాత సదరు కంపెనీ ఉద్యోగుల్ని తొలగించిందన్నారు. కార్మిక శాఖకు చేసిన ఫిర్యాదు పెండింగ్లో ఉండగా ఉద్యోగులను తొల గించరాదని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 47(2) స్పష్టం చేస్తోందన్నారు. ఇటీవల పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొల గిస్తున్నాయని, ఒక నెలలోనే కార్మిక శాఖ కమి షనర్ దగ్గర 80 పిటిషన్లు దాఖలయ్యాయని సత్య ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న జడ్జి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. -
టెక్ మహీంద్రాకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ మహేంద్రకు ఉమ్మడి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు నోటీసులిచ్చింది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామచంద్రరావు ఇవాళ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, టెక్ మహేంద్ర కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవుపై వెళ్లాలని కూడా వేధిస్తోందని తెలిపారు. దీనిపై రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన తర్వాత సదరు కంపెనీ ఉద్యోగుల్ని తొలగించిందని వివరించారు. కార్మిక శాఖ జాయింట్ కమిషన ర్ చర్యలు తీసుకునేలోపే ఆ కంపెనీ ఉద్యోగుల్ని తొలగించడం అన్యాయమని, ఫిర్యాదు పెండింగ్లో ఉండగా తొలగించరాదని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 47(2) స్పష్టం చేస్తోందన్నారు. ఈ సెక్షన్ నుంచి ఐటీ కంపెనీలకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 22 అమలు కాకుండా హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చిందని, కాబట్టి ఈ నిబంధన ఐటీ కంపెనీలకు వర్తిస్తుందని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో పలు ఐటీ కంపెనీలు నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయని, ఒక నెలలోనే కార్మిక శాఖ కమిషనర్ దగ్గర 80 పిటిషన్లు దాఖలయ్యాయని సత్యప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న టెక్ మహీంద్ర కంపెనీతోపాటు తెలంగాణ కార్మిక శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. టెక్ మహీంద్రకు వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు పిటిషనర్కు అనుమతినిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఉద్యోగులకు సారీ: టెక్ మహీంద్రా
బెంగుళూరు: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానిలు ట్వీటర్ వేదికగా ఉద్యోగులకు క్షమాపణలు తెలిపారు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ఓ ఉద్యోగిని కంపెనీ నుంచి అర్ధాంతరంగా తొలగించారు. ఇందుకు సంబంధించి సదరు ఉద్యోగి కంపెనీ హెచ్ఆర్ వారితో జరిపిన సంభాషణలు ఆన్లైన్లో లీకయ్యాయి. తొలగింపునకు గురైన ఉద్యోగితో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏకంగా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. సదరు ఉద్యోగికి క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో ఏ ఉద్యోగిని ఇలాంటి ఇబ్బందికి గురి కానివ్వమని హామీ ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన కొద్ది సేపటి తర్వాత స్పందించిన సీఈవో సీపీ గుర్నాని.. ఉద్యోగితో హెచ్ఆర్ ప్రవర్తించిన తీరుకు తాను చాలా బాధపడుతున్నట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్ధితులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. I want to add my personal apology. Our core value is to preserve the dignity of the individual & we'll ensure this does not happen in future https://t.co/yBxAxvFZlc — anand mahindra (@anandmahindra) 7 July 2017 I deeply regret the way the HR rep & employee discussion was done. We have taken the right steps to ensure it doesn’t repeat in the future. pic.twitter.com/KKLt6tIBb6 — CP Gurnani (@C_P_Gurnani) 7 July 2017 -
టెక్ మహీంద్రా వాటాల విక్రయం
డీల్ విలువ సుమారు రూ. 33 కోట్లు న్యూఢిల్లీ: టెక్నాలజీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తాజాగా ఎల్సీసీ పాకిస్తాన్ సంస్థలో తమ అనుబంధ కంపెనీకి ఉన్న వాటాలను విక్రయించనున్నట్లు వెల్ల డించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ ఎల్సీసీ మిడిల్ ఈస్ట్ ఎఫ్జెడ్ సంస్థకు ఎల్సీసీ పాకిస్తాన్లో 100 శాతం వాటాలు వాటాలు ఉన్నాయి. వీటిని స్విట్జర్లాండ్కి చెందిన టాక్పూల్ ఏజీకి విక్రయించనుంది. ఈ ఒప్పందం విలువ 5.2 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 33.54 కోట్లు) ఉంటుందని టెక్ మహీంద్రా పేర్కొంది. అక్టోబర్ 31 నాటికి ఈ డీల్ పూర్తి కాగలదని తెలిపింది. 2008లో ప్రారంభమైన ఎల్సీసీ పాకిస్తాన్లో సుమారు 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు. పాకిస్తాన్లో కీలక నెట్వర్క్ సర్వీసుల సంస్థగా ఎదగడానికి టాక్పూల్ సంస్థకు.. ఎల్సీసీని కొనుగోలు ఉపయోగపడనుంది. -
కుప్పకూలిన ఐటీ దిగ్గజం: వేలకోట్ల సంపద ఆవిరి
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టెక్మహీంద్రా సోమవారం నాటి మార్కెట్లో భారీగా నష్టపోయింది. భారత ఐదవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ గతేడాది(2016-17) క్యూ4 ఫలితాల్లో అంచనాలను అందుకోక చతికిలపడిన నేపథ్యంలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో టెక్ మహీంద్రా షేరు ఈ ఒక్కరోజులోనే 17శాతానికిపైగా పతనమైంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే కంపెనీ మార్కెట్ వాల్యూ భారీగా క్షీణించింది. ఆరంభంలోనే భారీగా కుప్పకూలడంతో రూ. 7వేల కోట్ల వాటాదారుల సొమ్ము తుడిచి పెట్టుకుపోయింది. అమ్మకాల ధోరణి ఇంకా కొనసాగే అవకాశముందంటూ ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ముంబై ఆధారిత టెక్ సేవల సంస్థ టెక్ మహీంద్ర శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాలో నిరాశ పరిచింది. ఆపరేటింగ్ మార్జిన్ అంతకుముందు సంవత్సరం 16.7 శాతంతో పోలిస్తే ఈ మార్చి త్రైమాసికంలో 12 శాతానికి పడిపోయింది. ఈ కౌంటర్లో భారీ అమ్మకాలకు తెరలేచింది.. దీంతో మార్కెట్ ఆరంభంలోనే కుదేలై 43 నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. క్యూ4(జనవరి-మార్చి)లో కంపెనీ నికర లాభం 33 శాతంపైగా క్షీణించి రూ. 590 కోట్లకు పరిమితమైంది. ఎనలిస్టులు రూ.783కోట్లుగా అంచనా వేశారు. మొత్తం ఆదాయం కూడా తగ్గి రూ. 7495 కోట్లవద్ద అంతంతమాత్రంగానే ఆర్జించడం సెంటిమెంట్ను భారీగా దెబ్బతీసింది. కన్సాలిడేటెడ్ పన్ను ఖర్చులు 28 శాతం పెరిగి రూ. 232 కోట్లుకు చేరగా, సేవల వ్యయం 14.7 శాతం పెరిగింది. యూరోపియన్ బిజినెస్ పుంజుకోవడంతో ఏకీకృత ఆదాయంలో 10శాతం అభివృద్ధిని సాదించింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్తో తమకు మంచి మద్దతు లభించనుందని సీఈవో సీపీ గూర్నిని తెలిపారు. అలాగే నెట్ వర్కింగ్ బిజినెస్ ఒప్పందంనుంచి వైదొలగడంతో 20 మిలియన్ల డాలర్లనష్టం, బలపడుతున్న దేశీయ కరెన్సీ రుపీ, కంపెనీ రీ ప్రొఫైలింగ్ కారణంగా ఈ భారీ పతనమని సీఈవో మిలింద్ కులకర్ణి చెప్పారు .ఫలితాల ప్రకటన సందర్బంగా వాటాదారులకు రూ.9 డివిడెండ్ను సంస్థ ప్రకటించింది. కాగా నిర్మాణాత్మక బలహీనతలు, రెవెన్యూ క్షీణత తదితర కారణాలతో టెక్ మహీంద్రాలో సెల్ కాల్ ఇస్తున్నట్టు డొమెస్టిక్ బ్రోకరేజ్ సంస్థ నిర్మల్ బ్యాంగ్ పేర్కొంది. -
లాభనష్టాల మధ్య పటిష్టంగా మార్కెట్లు
ముంబై: దేశీ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అనంతరంఆరంభంలో భారీ సెల్లింగ్ ప్రెసర్ తో దాదాపు 150పాయింట్లకు పైగా మార్కెట్ పతనమైనంది. కానీ వెనువెంటనే కోలుకుని లాభాల బాటపట్టాయి. తీవ్ర లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఒక దశలో దాదాపు సెంచరీ లాభాలను సాధించిన సెన్సెక్స్ 63 పాయింట్లు ఎగిసి 31,090 వద్ద నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 9603వద్ద కొనసాగుతున్నాయి. అయితే బెంచ్ మార్క్లు రెండూ సాంకేతిక స్థాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. .మెటల్, ఎఫ్ఎంసిజి, చమురు, గ్యాస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా ఐటీ ఫార్మా భారీ పతనాన్ని నమోదు చేశాయి. సన్ ఫార్మా, టెక్ మహీంద్రా టాప్ లూజర్గా ఉన్నాయి. మార్చి త్రైమాసికం ఫలితాలు ప్రభావం చూపిస్తున్నట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ సూచీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అరబిందో ఫార్మా, అదానీ పోర్ట్స్, యస్ బ్యాంక్, లూపిన్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఒఎన్జిసి, విప్రో, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ కూడా నష్టపోయాయి. మరోవైపు హెచ్డిఎఫ్సి, హిందాల్కో, ఇండియాబూల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వేదాంత, బిపిసిఎల్ లాభపడ్డాయి. అటు డాలర్ మారకరంలో రూపాయి13 పైసలు క్షీణించి రూ.64.57వద్ద ఉంది. బంగారం ఎంసీఎక్స్మార్కెట్ లో భారీగా లాభపడింది. రూ.229 లుఎగిసి రూ. 28,890 వద్ద వుంది. -
అంచనాలు మిస్ చేసిన టెక్ మహీంద్రా
దేశంలో నాలుగో అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా అంచనాలను మిస్ చేసింది. అంచనావేసిన దానికంటే తక్కువ లాభాలను ప్రకటించింది. శుక్రవారం వెల్లడించిన మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ ఫలితాల్లో ఈ కంపెనీ నికర లాభాలు 30.2 శాతం పడిపోయి, రూ.589.6 కోట్లగా నమోదయ్యాయి. ముందటేడాది ఇదే క్వార్టర్ లో కంపెనీకి రూ.876 కోట్ల లాభాలున్నాయి. ఈ మార్చి క్వార్టర్ లో టెక్ మహింద్రా రూ.783 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాలను ఆర్జిస్తుందని థామ్సన్ రాయిటర్స్ సర్వేలో విశ్లేషకులు అంచనావేశారు. ఈ క్వార్టర్ లో రెవెన్యూలు స్వల్పంగా 0.8 శాతం పడిపోయి రూ.7,495కోట్లగా ఉన్నాయి. కానీ ఏడాది ఏడాదికి బేసిస్ లో ఇవి రూ.8.9 శాతం పెరిగాయి. ఈబీఐటీడీఏలు కూడా ఈ క్వార్టర్ లో ఏడాది ఏడాదికి 21.9 శాతం తగ్గి రూ.899కోట్లగా నమోదయ్యాయి. మార్జిన్లు 12 శాతం పైకి ఎగిశాయి. క్వార్టర్ ఫలితాలతో పాటు టెక్ మహీంద్రా 2017 వార్షిక ఫలితాలను కూడా ప్రకటించింది. ఈ ఏడాదిలో కంపెనీ నికర లాభాలు 6 శాతం పడిపోయి, రూ.2813 కోట్లగా రికార్డైనట్టు పేర్కొంది. రెవెన్యూలు 10 శాతం పెరిగి రూ.29,141 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ఈబీఐటీడీఏలు వార్షికంగా 2శాతం డౌనయ్యాయి. ఈ ఫలితాల ప్రకటన సందర్భంగానే ఒక్కో షేరుకు 9 రూపాయలు డివిడెంట్ ను బోర్డు ఆమోదించినట్టు తెలిపింది. క్లయింట్స్ వద్ద నుంచి మారుతున్న డిమాండ్లు, టెక్నాలజీ మార్పులు, అవసరమైన నైపుణ్యాలను ప్రస్తుతం ఇండస్ట్రి ఎదుర్కొంటుందని టెక్ మహీంద్రా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సీపీ గుర్నాని తెలిపారు. అవసరమైన మేరకు తమ వర్క్ ఫోర్స్ కు రీస్కిలింగ్, రీట్రైనింగ్ చేపడతామని తెలిపారు. వినూత్నావిష్కరణలను ప్రోత్సహిస్తామన్నారు. -
టాప్-20 గ్లోబల్ బ్రాండ్స్ లోకి ఆ టెక్ దిగ్గజం
బెంగళూరు : దేశీయ ఐటీ సంస్థ టెక్ మహింద్రా టాప్-20 గ్లోబల్ టెక్ సర్వీసుల బ్రాండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. వాల్యుయేషన్, స్ట్రాటజీ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ నివేదించిన 2017 రిపోర్టులో టెక్ మహింద్రాకు 14వ స్థానం దక్కినట్టు తెలిసింది. ముందటి ఆర్థిక సంవత్సరం కంటే 21 శాతం బలమైన వృద్ధితో టెక్ మహింద్రా 14వ స్థానాన్ని దక్కించుకున్నట్టు టెక్ మహింద్రా, బ్రాండ్ ఫైనాన్స్ రెండూ సంయుక్తంగా ఓ రిపోర్టు నివేదించాయి. '' టెక్ మహింద్రా 21 శాతం వృద్ధితో అమోఘమైన బ్రాండ్ విలువల వృద్ధిని నమోదుచేసింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్లేయర్ నుంచి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పార్టనర్ గా రూపాంతరం చెందడం నిజంగా గొప్ప పురోగతి'' బ్రాండ్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో డేవిడ్ హై తెలిపారు. కనెక్టెడ్ వరల్డ్, కనెక్టెడ్ ఎక్స్ పీరియన్స్, రైట్ బ్రాండు ఇన్వెస్టమెంట్స్ అనే కొత్త బ్రాండు వాగ్దానంతో, 2020లోపు టాప్-5 లోకి రావడమే ధ్యేయంగా టెక్ మహింద్రా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అనేక మీడియా గ్రూపులు, స్థానిక ప్రభుత్వాలు, ట్రేడ్ కౌన్సిలల్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి, పెద్ద మొత్తంలో బ్రాండ్ బిల్డింగ్ క్యాంపెయిన్ ను గ్లోబల్ గా నిర్వహిస్తున్నామని టెక్ మహింద్రా చెప్పింది. -
ఐటీలో మరో రెండేళ్లు ఉద్యోగాల కోత
♦ కొత్త టెక్నాలజీలు...అమెరికా తదితర దేశాల విధానాల ప్రభావం ♦ మెరుగుదిద్దుకునేందుకు అవకాశమని నిపుణుల సూచన న్యూఢిల్లీ/బెంగళూరు: డిజిటలీకరణ, యాంత్రీకరణ (ఆటోమేషన్)కు తోడు అమెరికా తదితర దేశాల్లో ఉద్యోగ వీసా విధానాలు మారిన ఫలితంగా ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహింద్రా తదితర ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు జరుగుతోందని, ఈ ధోరణి మరో ఒకటి రెండేళ్ల పాటు కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. ఏటా పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగా వేలాది మందికి పింక్ స్లిప్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇది నాణేనికి ఒకవైపే. వాస్తవానికి పలు దేశాల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న రక్షణాత్మక విధానాలు పెరిగిన క్రమంలో ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు జరుగుతోందన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవానికి ఇటీవలి కాలంలో అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఉద్యోగుల వీసా నిబంధనలు కఠినతరం కావడంతో దేశీయ ఐటీ కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో సరికొత్త టెక్నాలజీలు అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వాటివల్ల తక్కువ ఉద్యోగులతోనే ఎక్కువ పని సాధ్యమవుతోంది. దీంతో సాఫ్ట్వేర్ కంపెనీలు తమ విధానాలను తిరిగి సమీక్షించుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మాన్యువల్ టెస్టింగ్, టెక్నాలజీ సపోర్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంటోంది. ఈ పనులను ఆటోమేషన్ టెక్నాలజీలతో నిర్వహించే అవకాశం ఉండటమే అందుకు కారణం. అదే సమయంలో డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ డొమెన్ నైపుణ్యాలకు డిమాండ్ పెరిగిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. తొలగింపు సాధారణమే..: అందుబాటులో ఉన్న ఉద్యోగుల నైపుణ్యాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా లేవని, చాలా మంది తాము నిరుపయోగమని గుర్తిస్తున్నట్టు టీమ్లీజ్ సర్వీసెస్ ఈవీపీ, సహ వ్యవస్థాకులు రీతూపర్ణ చక్రవర్తి పేర్కొన్నారు. ‘‘కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది పరిశ్రమలో ప్రతీ 3–5 ఏళ్లకు ఒకసారి జరిగేదే. కానీ, విదేశీ ఐటీ ఉద్యోగుల విషయంలో అమెరికా తన విధానాలు మార్చడంతో ఈ సారి ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది’’ అని గ్లోబల్హంట్ ఎండీ సునీల్ గోయెల్ అన్నారు. ఈ క్రమబద్ధీకరణ రెండేళ్ల పాటు కొనసాగొచ్చన్నారు. కానీ, కొత్త తరం టెక్నాలజీలకు అనుగుణంగా మెరుగుదిద్దుకునేందుకు ఐటీ నిపుణులకు ఇదొక అవకాశమని సూచించారు. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహింద్రా, విప్రో కంపెనీల్లోని 7,60,000 ఉద్యోగాల్లో 2–3% కోత ఉంటుందని జపాన్కు చెందిన బ్రోకరేజీ సంస్థ నోమురా పేర్కొన్నారు. -
టెక్ మహీంద్రాలో వెయ్యిమందికి ఉద్వాసన
బెంగళూరు: కీలకమైన మార్కెట్లలో మారుతున్న పరిణామాలతో.. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశీ ఐటీ దిగ్గజాలు గణనీయంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ తదితర సంస్థల బాటలోనే తాజాగా సాఫ్ట్వేర్ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఈ నెలలో సుమారు 1,000 మందికి ఉద్వాసన పలికింది. పనితీరు ఆశించినంతగా లేని సిబ్బందిని తప్పించే ప్రక్రియ ఏటా జరిగేదేనని, ప్రస్తుత తొలగింపులు కూడా ఆ కోవకి చెందినదేనని సంస్థ ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,17,095గా ఉంది. సాఫ్ట్వేర్ విభాగంలో 80,895 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆటోమేషన్, కొంగొత్త టెక్నాలజీల రాక, ప్రధాన మార్కెట్లలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలంటూ పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు మొదలైనవి భారత ఐటీ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజా పరిస్థితులు సుమారు 10–15 సంవత్సరాల అనుభవం ఉన్న మధ్య స్థాయి సిబ్బందిపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వారు కొత్త నైపుణ్యాలు అలవర్చుకునేందుకు ఆసక్తి చూపకపోతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నాయి. -
భవిష్యత్ టెక్నాలజీలపై టెక్ మహీంద్రా ప్రయోగశాల
బెంగళూరు: తయారీ రంగానికి తోడ్పడే భవిష్యత్ టెక్నాలజీల రూపకల్పనకు ఉపయోగపడేలా టెక్ మహీంద్రా.. బెంగళూరులోని తమ క్యాం పస్లో అధునాతన ‘లాబొరెటరీని ‘ఫ్యాక్టరీ ఆఫ్ ది ఫ్యూచర్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్లో డిజిటల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్.. ఆటోమేషన్ తదితర టెక్నాలజీలపై పరశోధనలు జరుగుతాయి. రోబోలు, మనుషులు కలిసి పనిచేసే విధానాలు ఇప్పుడిప్పుడే పరిశ్రమకు పరిచయం అవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైనవి తయారీ రంగంలో మరింత కీలక పాత్ర పోషించనున్నాయని టెక్ మహీంద్రా ప్రెసిడెంట్ ఎల్ రవిచంద్రన్ చెప్పారు. అంతర్జాతీయంగా ఆటోమేషన్పై పెట్టుబడులు పెరుగుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయని, తయారీ రంగానికి టెక్నాలజీ వెన్నెముకగా నిలవనుందని ఆయన వివరించారు. -
టెక్ మహీంద్రా చేతికి అమెరికా కంపెనీ
డీల్ విలువ 8.95 కోట్ల డాలర్లు ముంబై: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా అమెరికాకు చెందిన ఐటీ సర్వీసుల కంపెనీని కొనుగోలు చేయనున్నది. అమెరికాకు చెందిన హెల్త్కేర్ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీ సీజేఎస్ సొల్యూషన్స్ గ్రూప్ ఎల్ఎల్సీని కొనుగోలు చేయనున్నామని టెక్ మహీంద్రా తెలిపింది. హెచ్సీఐ గ్రూప్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీలో 84.7% వాటాను 8.95 కోట్ల డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ సి.పి. గుర్నాని చెప్పారు. మిగతా 15.3% వాటాను మూడేళ్లలో కొనుగోలు చేస్తామన్నారు. ఆరో గ్య సంరక్షణ రంగంలో ఐటీ సేవలను మరింత విస్తరించడానికి, హెల్త్కేర్ కన్సల్టెంట్లకు మరింత మెరుగైన సేవలందించడానికి ఈ కంపెనీని కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. జాక్సన్విల్లె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్సీఐ గ్రూప్...ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ సాఫ్ట్వేర్, శిక్షణ, సపోర్ట్ సర్వీసులను అందిస్తోంది. -
టెక్ మహింద్రా ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
బెంగళూరు : పెరుగుతున్న వీసా వ్యయాలు, క్లయింట్ల నుంచి వస్తున్న సర్వీసు ధరల తగ్గింపు డిమాండ్లు టెక్ కంపెనీల ఉద్యోగులకు గండికొడుతోంది. వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలను అడియాసలు చేస్తూ టెక్ మహింద్రా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల కంటే ఎక్కువ అనుభవమున్న ఉద్యోగుల అప్రైజల్ సైకిల్ను నిలిపివేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ మేనేజ్మెంట్ సమీక్ష సందర్భంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎల్ రవిచంద్రన్ నేతృత్వంలో మరో ముగ్గురు టెక్ ఉద్యోగులు పాల్గొన్న వెబీనార్లో ఈ విషయాన్ని తెలిపారు. టీమ్ లీడర్లు, ఆపై స్థాయి వారు దీనికి ప్రభావితవంతులవుతారని వారు పేర్కొన్నారు. వేతన పెంపును ఆశిస్తున్న వారు కనీసం మరో రెండు త్రైమాసికాలైనా వేచిచూడాలని పేర్కొన్నారు. దీన్ని ధృవీకరించిన టెక్ మహిద్రా, అప్రైజల్స్ను నిరవధికంగా వాయిదా వేయడం లేదని తెలిపింది. మేనేజ్మెంట్ సమీక్ష అనంతరం పెంపు గురించి ప్రభావిత ఉద్యోగులకు తాము తెలిపామని చెప్పింది. మూడో క్వార్టర్లో తమ ప్రదర్శనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, మేనేజ్మెంట్ సమీక్షలో భాగంగా ఇది చర్చకు వచ్చినట్టు టెక్ మహింద్రా అధికార ప్రతినిధి తెలిపారు. టెక్ మహింద్రకు మూడో క్వార్టర్లో రెవెన్యూ 4 శాతం మేర పెరిగింది. ఇతర ఉద్యోగుల పరిహారాలను మార్చిలో జరుగబోయే సమీక్షలో నిర్ణయిస్తామని, కానీ జూలై నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయన్నారు. టెక్ కంపెనీలకు ఆందోళనకరంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, క్లయింట్ల నుంచి వస్తున్న ధరల తగ్గింపు డిమాండ్లు ఉద్యోగుల వేతనాలకు గండికొడుతున్నట్టు తెలుస్తోంది. అనుభవమున్న వారికి ఎక్కువ వేతనాలు ఇవ్వడం కంటే, కొత్తగా వస్తున్న ప్రతిభావంతులైన వారికి వెచ్చించాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం. -
టెక్ మహీంద్రా లాభం జూమ్
క్యూ3లో 14% అప్; రూ.856 కోట్లు ఆదాయం రూ.7,558 కోట్లు; 13% వృద్ధి గ్లోబల్ డిజిటలైజేషన్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం... కంపెనీ వైస్చైర్మన్ వినీత్ నయ్యర్ న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.856 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ.751 కోట్లు)తో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా తెలిపింది. గత క్యూ3లో రూ.6,701 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 13 శాతం వృద్ధితో రూ.7,558 కోట్లకు చేరిందని కంపెనీ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ చెప్పారు. ఈ క్వార్టర్లో మంచి డీల్స్ సాధించామని, వ్యాపారం జోరుగా ఉందని వివరించారు. అంతర్జాతీయ డిజిటలైజేషన్ కార్యకలాపాల్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకునే స్థాయిలోనే ఉన్నామనడానికి తాము సాధించిన డీల్స్, జోరుగా ఉన్న వ్యాపారమే నిదర్శనాలని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 11 శాతం వృద్ధితో 13 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం వృద్ధితో 112 కోట్ల డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు. 4,209 కొత్త ఉద్యోగాలు... ఈ క్యూ3లో ఐటీ ఆదాయం రూ.7,031 కోట్లు, బీపీఓ ఆదాయం రూ.526 కోట్లకు పెరిగినట్లు వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. ఐటీ ఆదాయంలో అమెరికా వాటా 47 శాతం, యూరోప్ వాటా 29 శాతం, ఇతర దేశాల వాటా 24 శాతంగా ఉందని వివరించారు. ఈ క్యూ3లో కొత్తగా 4,209 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, గత ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,17,095గా ఉందని, వీరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య 80,858 అని తెలిపారు. ఉద్యోగుల వలస 18 శాతంగా ఉందని చెప్పారు. రూ.4,951 కోట్ల నగదు నిల్వలు.. ఈ క్యూ3లో అదనంగా చేరిన రూ.950 కోట్ల నగదుతో కలుపుకొని నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.4,951 కోట్లుగా ఉన్నాయని నయ్యర్ చెప్పారు. ఈ క్యూ3లో కొత్తగా 12 క్లయింట్లు లభించారని, మొత్తం క్లయింట్ల సంఖ్య 837కు పెరిగిందని తెలిపారు. నికర లాభం 14 శాతం పెరిగిన నేపథ్యంలో బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేర్ 1 శాతం లాభపడి రూ.471 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్రూ.483 కోట్లు పెరిగి రూ.45,903 కోట్లకు చేరింది. -
స్టాక్స్ వ్యూ
టెక్ మహీంద్రా కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: యస్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.430 టార్గెట్ ధర: రూ.520 ఎందుకంటే: టెక్ మహీంద్రా ఆదాయం డాలర్ల పరంగా 4 శాతం, రూపారుుల్లో 5 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన) వృద్ధి చెందింది. వివిధ సంస్థల కొనుగోళ్ల కారణంగా కంపెనీ ఈ క్యూ2లో మంచి వృద్ధిని సాధించింది. పునర్వ్యస్ఠీకరణ వ్యయాల కారణంగా మార్జిన్లు మాత్రం ఫ్లాట్గా 16శాతంగా ఉన్నాయి. ఇతర ఆదాయం భారీగా తగ్గడంతో నికర లాభం 17 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 14 శాతం) క్షీణించింది. ఈ క్యూ2లో 32 కోట్ల డాలర్ల విలువైన మూడు పెద్ద డీల్స్ను కంపెనీ సాధించింది. డీల్స్ విషయమై క్లయింట్లతో చర్చలు జరుపుతున్నామని, ఈ కారణంగా గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న కమ్యూనికేషన్సవిభాగం రికవరీ సాధించగలదని యాజమాన్యం ఆశిస్తోంది. అలాగే ఎంటర్ప్రెజైస్ విభాగం కూడా నిలకడైన వృద్ధిని సాధించగలదని కంపెనీ భావిస్తోంది. కమ్యూనికేషన్స విభాగంలో కంపెనీల కొనుగోళ్లకారణంగా ఈ విభాగం మంచి వృద్ధి సాధించే అవకాశాలున్నాయి. ఎంటర్ప్రెజైస్ విభాగంలో కొనసాగుతున్న వృద్ధి, తయారీ, బీఎఫ్ఎస్ఐ విభాగాల్లో వృద్ధి, వ్యయ నియంత్రణ పద్ధతులు, అనుబంధ సంస్థల పనితీరు మెరుగుపడడం తదితర కారణాల వల్ల మార్జిన్లు మెరుగుపడే అవకాశాలున్నారుు. ఇటీవల కాలంలో ఈ షేర్కొంత కరెక్షన్కు గురై ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరలోనే లభిస్తోందని భావిస్తున్నాం. కమ్యూనికేషన్ విభాగంలో జోరు కారణంగా టెలికం రంగంలో తన అగ్రస్థానాన్ని కంపెనీ కొనసాగించవచ్చు. డిజిటల్ విభాగంలో కంపెనీ గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలాలు త్వరలో అందనున్నాయి. మార్జిన్లు మెరుగుపడడం, కంపెనీ కొనుగోలు చేసిన సంస్థల పనితీరు కూడా మెరుగుపడడం వంటి కారణాల వల్ల దీర్ఘకాలంలో కంపెనీ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నాం. కరెన్సీ ఒడిదుడుకులు, టెలికం విభాగానికి సంబంధించిన డీల్స్లో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశాలుండడం ప్రతికూలాంశాలు. మారుతీ సుజుకీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.5,715 టార్గెట్ ధర: రూ.6,765 ఎందుకంటే: భారత కార్ల మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ ఇది. 2013-14లో 42 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 47 శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.17,843 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్లు 218 బేసిస్పారుుంట్లు పెరిగి 17 శాతానికి చేరాయి. ప్రతికూలమైన కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ముడి పదార్ధాల వ్యయాలు 40 బేసిస్ పాయింట్లు పెరిగినప్పటికీ, నికర లాభం 60 శాతం వృద్ధితో రూ.2,398 కోట్లకు పెరిగింది. తగ్గుతున్న వడ్డీ రేట్లు, వర్షాలు విస్తారంగా కురియడం, ఏడవ వేతన సంఘం సిఫారసుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగడం, జీఎస్టీ అమలు కారణంగా కార్ల వ్యయాలు 4-5 శాతం వరకూ తగ్గే అవకాశాలుండడం,.. వివిధ మోడళ్లలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్లను అందించనుండడం, స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లను కూడా అందుబాటులోకి తేనుండడం, డిమాండ్ పెరుగుతుండటంతో డిస్కౌంట్ల భారం తగ్గనుండడం, గుజరాత్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే, (ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభం కావచ్చు) లాజిస్టిక్స్వ్యయాలు తగ్గే అవకాశాలుండడం... ఇవన్నీ కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశాలు. కార్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 16 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఎగుమతులు మాత్రం ఫ్లాట్గా ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. రెండేళ్లలో ఆదాయం 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ షేర్వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.308 ఉంటుందని అంచనాలతో ఏడాది కాలంలో ఈ షేర్ రూ.6,765కు చేరగలదని అంచనా వేస్తున్నాం. గమనిక: ఈ కాలమ్లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
పడిపోయిన టెక్ మహింద్రా
న్యూఢిల్లీ : ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహింద్రా లాభాల్లో పడిపోయింది. 2016 ఆర్థికసంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభాలు 19.2 శాతం కోల్పోయి, కేవలం రూ.643.4 కోట్ల నికరలాభాలను మాత్రమే ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.780.3 కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ రివ్యూ ఫలితాల్లో ఆపరేషన్స్ నుంచి వచ్చిన మొత్తం ఆదాయాలు ఎనిమిది శాతం ఎగిసి రూ.7,167.4 కోట్లగా నమోదైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. ఈ ఆర్థిక త్రైమాసికంలో తమ పనితీరు, కొత్త టెక్నాలజీల్లో తాము పెట్టిన పెట్టుబడుల, సామర్థ్యాల ఫలితమేనని టెక్ మహింద్రా వైస్ చైర్మన్ వినీత్ నాయర్ తెలిపారు. డాలర్ విలువలో ఆర్జించే పీఏటీలు(పన్నుల అనంతర లాభాలు) యేటికేటికీ 18.2 శాతం పడిపోయి, 96.5 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఈ క్వార్టర్ తమకు మంచి త్రైమాసికమేనని, కీలకమైన కమ్యూనికేషన్, ఎంటర్ప్రైజ్ బిజినెస్లు వృద్ధిని నమోదుచేయడానికి దోహదం చేశాయని కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. -
ఎకో టూరిజానికి టెక్ మహేంద్ర సుముఖత
శ్రీకాకుళం పాతబస్టాండ్ : గార మండలం కళింగపట్నం ప్రాంతంలోని రెండెకరాల స్థలంలో ఎకో – టూరిజం పార్కును ఏర్పాటు చేసేందుకు టెక్ మహేంద్ర సుముఖత వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టెక్ మహేంద్ర ప్రాజెక్టు అధికారి లక్ష్మణ్ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకో టూరిజం పార్కుకు కళింగపట్నం అనువైన ప్రాంతమని కలెక్టర్కు వివరించారు. ఇందుకు రెండెకరాల స్థలం అవసరముంటుందని, కళింగపట్నంలో ఉన్న టూరిజం రిసార్ట్స్ పక్కన ఉన్న స్థలం అనువుగా ఉంటుందని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాతూ పార్కుకు అవసరమైన స్థలం కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. టెక్ మహేంద్ర ఏర్పాటు చేయబోయే పార్కులో హోటల్, రీసార్ట్స్ వంటివి ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పార్కును సందర్శించే వారికి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, సంస్కృతి, సంప్రదాయాలు, దర్శనీయ స్థలాలు, హస్తకళలు, జలపాతాలు, పక్షుల ఆవాస కేంద్రాలు వంటివి దర్శించేలా ప్యాకేజీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో అనేక రకాల చేనేత వస్త్రాలు, హస్తకళలు, పురాతన గిరిజన నృత్యాలు, గ్రానైట్, దర్శనీయ స్థలాలు, ప్రముఖ దేవాలయాలు అమితంగా ఉన్నాయని, వీటన్నింటిని దర్శించేందుకు ఈ పార్కు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ నెల 20న టెక్ మహేంద్ర మేనేజింగ్ డైరెక్టర్ వచ్చిన అనంతరం సమగ్రంగా చర్చించి ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, సంయుక్త కలెక్టర్–2 పి. రజనీకాంతారావు, డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీకాకుళం, టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారులు బి. దయానిధి, ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
టెక్ మహీంద్రా నికరలాభాలు జూమ్
ముంబై: ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్ర లాభాల్లో దూసుకుపోయింది. 20.5 శాతం నికర లాభాలను ఆర్జించినట్టు సోమవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో పేర్కొంది. జూన్ 30, 2016 తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 20.5 శాతం వృద్ధితో రూ. 750 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ 622.5 కోట్లుగా ఉంది. నికర ఆదాయంలో 10శాతం వృద్ధితో రూ. 6,921 కోట్లుగా రిపోర్టు చేసింది. ఆపరేటింగ్ లాభం 13.7 శాతంతో రూ 1,029 కోట్ల వద్ద ఉంది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో సంస్థ ఆదాయం రూ 6.921 కోట్లుగా ఉంది. తమ వ్యాపార వృద్ధి బలహీనత ఉన్నప్పటికీ ఈ క్వార్టర్ నిలకడైన వృద్ధిని సాధించామని వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. వినియోగదారుల వృద్ధి, డిజిటల్ విజయాలు, బలమైన నగదు లావాదేవీల తదితర పారామీటర్ల కారణంగా ఆదాయంలో వృద్ధి సాధించిందనీ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో సీపీ గుర్నాని చెప్పారు. ఐటి సొల్యూషన్ ప్రొవైడర్ టెక్ మహీంద్ర ఆటోమేషన్, డెలివరీ సమర్థత రెండు రంగాలపై తమ ఫోకస్ ఉంటుందని పేర్కొన్నారు. -
విద్యుదాఘాతంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
దుండిగల్: విద్యుదాఘాతంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బహదూర్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ అబ్దుల్ వాహెద్ కుమారుడు సయ్యద్ ఇస్మాయిల్ (26) స్థానికంగా ఉన్న టెక్ మహేంద్రాలో క్యాడ్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఈనెల 27న ఉదయం 6 గంటలకు మూత్ర విసర్జన కోసం ఇంటి బయటకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ తెగి పడి ఉన్న విద్యుత్ వైర్ను గమనించకుండా తాకడంతో షాక్ గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఇస్మాయిల్ను సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్పించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వినీత్ నయ్యర్ పారితోషికం రూ.182 కోట్లు
2015-16లో టెక్మహీంద్రా వైస్ చైర్మన్ అత్యధిక ఆర్జన న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ 2015-16 సంవత్సరంలో అందుకున్న ప్యాకేజీ అక్షరాలా రూ.181.74కోట్లు. దేశంలో అత్యధికంగా పారితోషికం అందుకున్న ఎగ్జిక్యూటివ్గా ఆయన రికార్డు సృష్టించారు. ఈ వేతన ప్యాకేజీలో స్టాక్ ఆప్షన్లను నగదుగా మార్చుకున్న మొత్తం కూడా కలిపి ఉంది. వేతనం రూపంలో రూ.1.27 కోట్లు రాగా... మిగిలిన మొత్తం స్టాక్ ఆప్షన్లను విక్రయించడం వల్ల సమకూరినట్టు కంపెనీ వార్షిక నివేదిక తెలియజేసింది. టెక్మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా నయ్యర్ 2015 ఆగస్ట్ 9న పదవీ విరమణ చేయగా... ఆయనకున్న అనుభవం దృష్ట్యా తిరిగి అడిషనల్ డైరక్టర్గా నియమించి వైస్ చైర్మన్ హోదా కట్టబెట్టారు. కాగా, టెక్ మహీంద్రా ఎండీగా ఉన్న సీపీ గుర్నానీ సైతం గత ఆర్థిక సంవత్సరంలో రూ.45.27 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. -
టెక్ మహీంద్రా చేతికి బయో ఏజెన్సీ కంపెనీ
డీల్ విలువ 4.5 కోట్ల పౌండ్లు న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీ తాజాగా ఇంగ్లండ్కు చెందిన బయో ఏజెన్సీ కంపెనీని 4.5 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. బయో ఏజెన్సీని అంతా నగదులోనే కొనుగోలు చేశామని టెక్ మహీంద్రా తెలిపింది. ఈ కంపెనీ చేరికతో తమ డిజిటల్ సర్వీసుల పోర్ట్ఫోలియో మరింత శక్తివంతం అవుతుందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సి. పి. గుర్నాని చెప్పారు. ఈ డీల్ వచ్చే నెల మొదటి వారంలో పూర్తవుతుందని వివరించారు. బయో ఏజెన్సీ కొనుగోలు కారణంగా అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూరప్లో మరిన్ని సంస్థల నుంచి ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 2006, ఏప్రిల్లో ప్రారంభమైన బయో ఏజెన్సీ సంస్థ, గత ఆర్థిక సంవత్సరంలో 1.25 కోట్ల పౌండ్ల ఆదాయం ఆర్జించింది. -
మరిన్ని జాబ్ మేళాలు
♦ మా డేటాబేస్లో 6 లక్షల మంది అభ్యర్థుల రెజ్యూమెలు ♦ ప్లంబర్లు, సెక్యూరిటీగార్డుల వివరాలూ ఉంటాయ్ ♦ ఇళ్లకు అవసరమైనవారు కూడా తీసుకోవచ్చు ♦ ‘సాక్షి’తో సరళ్ రోజ్గార్ సీవోవో మయూఖ్ దాస్గుప్తా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశాలు మరింతగా చేరువ చేసేలా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు టెక్ మహీంద్రా గ్రోత్ ఇనీషియేటివ్స్లో భాగమైన సరళ్ రోజ్గార్ సంస్థ వెల్లడించింది. ఇటీవలే హైదరాబాద్లో నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో త్వరలో నెల్లూరు, విజయవాడ, వరంగల్ తదితర ప్రాంతాల్లోనూ వీటిని నిర్వహించనున్నట్లు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూఖ్ దాస్గుప్తా చెప్పారు. కార్పొరేట్ ఉద్యోగార్థులతో పాటు ఎంట్రీ స్థాయి, అసంఘటిత రంగ వర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు దాస్గుప్తా చెప్పారు. వడ్రంగులు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు మొదలుకుని డెలివరీ బాయ్స్, డ్రైవర్ల దాకా వివిధ వర్గాల వారి వివరాలు సైతం తమ డేటాబేస్లో లభిస్తాయని, గృహ వినియోగదారులు కూడా నిర్దిష్ట రుసుము చెల్లించి వాటిని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇటు సంస్థలు, అటు ఉద్యోగార్థులను అనుసంధానించే ప్లాట్ఫామ్గా సరళ్ రోజ్గార్ పనిచేస్తుందన్నారు. పదివేలకు పైగా క్లయింట్లు.. దేశవ్యాప్తంగా 500 పైగా ప్రాంతాల్లో ఆరు లక్షల మంది పైగా తమ సరళ్ రోజ్గార్ యోజనలో నమోదై ఉన్నారని, చిన్న తరహా నుంచి పెద్ద కార్పొరేట్ల దాకా 10,000 పైచిలుకు సం స్థలు క్లయింట్లుగా ఉన్నాయని దాస్గుప్తా చెప్పారు. తెలుగు, తమిళం, ఇంగ్లీషుతో పాటు తొమ్మిది ప్రాంతీయ భాషల్లో తమ కాల్సెంటర్ ద్వారా ఉద్యోగార్థులకు, రిక్రూటర్లకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పోర్టల్తో పాటు మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. సగటున ప్రతి నెలా 4,500 ఉద్యోగాల కల్పన జరుగుతోందని, ఎక్కువగా తయారీ, బీపీవో మొదలైన రంగాల్లో ఇవి ఉంటున్నాయని తెలిపారు. రోజ్గార్ కార్డు.. ఉద్యోగార్థులు తమ సర్వీసులు పొందాలంటే రూ. 100 కట్టి మూడు నెలల పాటు వర్తించే రోజ్గార్ కార్డు తీసుకోవాల్సి ఉంటుందని దాస్గుప్తా పేర్కొన్నారు. దీన్ని కొనుగోలు చేసిన వారు తమ టోల్ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే.. సుమారు 12-15 అంశాల గురించి వివరాలు సేకరించి, వారి రెజ్యూమెను రూపొందించడంతో పాటు అందుబాటులో ఉన్న అవకాశాల సమాచారాన్ని చేరవేస్తారని చెప్పారు. ఈ విధానంతో అటు సంస్థలకు కూడా రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించి సమయం ఆదా కావడమే కాకుండా వ్యయాలూ తగ్గుతాయని దాస్గుప్తా తెలిపారు. ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్తో పాటు మెదక్, వరంగల్, వంటి నాలుగు జిల్లాల్లోని 700 వెండార్స్ దగ్గర తమ రోజ్గార్ కార్డులు లభిస్తున్నాయని, వచ్చే త్రైమాసికంలో తెలంగాణలోని మొత్తం పది జిల్లాలకు విస్తరించాలని యోచిస్తున్నామని దాస్గుప్తా చెప్పారు. అలాగే, అటు మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లోనూ విస్తరణపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. -
టెక్ మహింద్రా చేతికి యూకే టార్గెట్ గ్రూప్
న్యూఢిల్లీ : సాప్ట్ వేర్ సర్వీసుల సంస్థ టెక్ మహీంద్రా, యూకేకి చెందిన టార్గెట్ గ్రూప్ ను 12 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసుల స్పేస్ లో తన స్థానాన్ని బలపర్చుకోవడానికి టార్గెట్ గ్రూప్ తో ఈ డీల్ కుదుర్చుకుంది. రుణాలు కల్పించడంలో ఆటోమేటెడ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ లకు, ఇన్వెస్ట్ మెంట్లకు, ఇన్సూరెన్సు మార్కెట్ లకు ఈ డీల్ సహకరించనుంది. ఈ ఒప్పందం వల్ల యూకే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ కంపెనీల్లో సాప్ట్ వేర్ సర్వీసులు అందించడానికి టెక్ మహింద్ర వార్షికంగా 45-60 బిలియన్ పౌండ్ లను వెచ్చించనుంది. దీంతో యూకే ఆర్థిక సేవలు అందిస్తున్న షేరును అధిక మొత్తంలో టెక్ మహింద్రానే కలిగిఉంటుంది. టార్గెట్ గ్రూప్ విలువ 112 మిలియన్ పౌండ్లతో పాటు, సర్ ప్లస్ నగదు 8 మిలియన్ పౌండ్లను వెచ్చిస్తూ టెక్ మహింద్రా ఈ సంస్థను సొంతంచేసుకోనుంది. ముందస్తుగా 64 మిలియన్ పౌండ్లను టెక్ మహింద్రా, టార్గెట్ గ్రూప్ కు చెల్లించనుంది. అనంతరం 2017లో 16.28 మిలియన్ పౌండ్లను మహింద్రా చెల్లిస్తుంది. ఈ ఒప్పందంతో టెక్ మహింద్రా యూకే లో ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థల్లో టాప్-3 స్థానాన్ని దక్కించుకోనుంది. -
టెక్ మహీంద్రా లాభం రెట్టింపు!
♦ రూ.472 కోట్ల నుంచి రూ.897 కోట్లకు ♦ చెల్లింపు బ్యాంక్ రేసు నుంచి నిష్ర్కమణ న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ టెక్ మహీంద్రా నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి దాదాపు రెట్టింపయింది. 2014-15 క్యూ4లో రూ.472 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.897 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.6,117 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.6,884 కోట్లకు పెరిగినట్లు టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సి.పి.గుర్నాని చెప్పారు. డాలర్ల పరంగా చూస్తే, లాభం 77 శాతం వృద్ధితో 13 కోట్ల డాలర్లకు, ఆదాయం 4 శాతం వృద్ధితో 102 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. డిజిటల్, ఆటోమేషన్, వెర్టికాలిజేషన్, తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సంవత్సరంలో 19 శాతం అప్ ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 19 శాతం వృద్ధి చెంది రూ.3,118 కోట్లకు, ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.26,494 కోట్లకు పెరిగాయి. డాలర్ల పరంగా నికర లాభం 47 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం వృద్ధితో 403 కోట్ల డాలర్లకు పెరిగాయి. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,977 కోట్లు పెరిగి రూ.5,189 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,151 మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకున్నామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,05,432కు పెరిగిందని సంస్థ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 767గా ఉన్న యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 807కు పెరిగిందని తెలిపారు. లాభాలు ఉండవనే..: చెల్లింపు బ్యాంక్ ఏర్పాటు కోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆమోదం పొందినప్పటికీ, ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని గుర్నాని తెలిపారు. ఈ వ్యాపారం లాభాల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందని, మార్జిన్లు స్వల్పంగా ఉండడం వల్లే చెల్లింపు బ్యాంక్ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని వివరించారు. ఇప్పటికే సన్ ఫార్మా దిలిప్ సంఘ్వి, ఐడీఎఫ్సీ, టెలినార్, చోళమండలం తదితర సంస్థలు చెల్లింపు బ్యాంక్ల రేసు నుంచి వైదొలిగాయి. -
తిరుపతి ఐఐడీటీలో రొబోటిక్స్ విభాగం
సీఎం చంద్రబాబుకు టెక్ మహీంద్రా సీఈవో హామీ సాక్షి, విజయవాడ బ్యూరో: తిరుపతిలో ఏర్పాటుచేయనున్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్(ఐఐడీటీ)లో ‘సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ రొబోటిక్స్ అండ్ ఎనలిటిక్స్’ విభాగం ఏర్పాటు చేయడానికి టెక్ మహీంద్రా సీఈఓ సీసీ గుర్నానీ అంగీకరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో గుర్నానీ ఇందుకు అంగీకరించినట్లు పేర్కొంది. దీంతోపాటు రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని టెక్మహీంద్రా తరఫున హామీ లభించినట్లు వెల్లడించింది. అలాగే విశాఖ టెక్ మహీంద్రా ఫెసిలిటీ సెంటర్లో మరో వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అంగీకరించినట్లు వివరించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని గుర్నానీని కోరినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కోర్ టీమ్ సలహాదారుల్లో ఒకరుగా సేవలందించేందుకు గుర్నానీ అంగీకరించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి, టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఏఎస్ సత్యమూర్తి పాల్గొన్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
టెక్ మహీంద్రా ‘స్టార్టప్ గ్యారేజ్’ త్వరలో...
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తమ అంతర్గత స్టార్టప్ల కోసం ప్రత్యేకంగా ఒక ‘స్టార్టప్ గ్యారేజ్’ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే తమ సంస్థ నేతృత్వంలో ఎంట్రప్రెన్యూర్లు చాలా స్టార్టప్ కంపెనీలను నిర్వహిస్తున్నారని.. వీటన్నింటినీ ఒక గొడుగుకిందికి చేర్చడం కోసం దీన్ని నెలకొల్పుతున్నట్లు టెక్ మహీంద్రా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, ‘గ్రోత్ ఫ్యాక్టరీస్’ కార్యకలాపాల హెడ్ జగదీష్ మిత్రా పేర్కొన్నారు. స్టార్టప్లకు ఇది తొలి కార్పొరేట్ గ్యారేజ్గా నిలవనుందని కూడా ఆయన వెల్లడించారు. ‘ప్రస్తుతం మాకున్న 1.05 లక్షల మంది ఉద్యోగుల నుంచి దాదాపు 15 రకాల స్టార్టప్లు ఇప్పుడు నడుస్తున్నాయి. వీటికి విభిన్న వ్యాపార వాతావరణం అవసరం. అందుకే స్టార్టప్ గ్యారేజీ ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల స్టార్టప్లు స్వతంత్రంగా పనిచేసేందుకు వీలవుతుంది. వీటన్నింటినీ ఒకే చోటికి చేర్చడం వల్ల పర్యవేక్షణ కూడా సులువు అవుతుంది’ అని మిత్రా వివరించారు. స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం టెక్ మహీంద్రా ఇప్పటికే 15 కోట్ల డాలర్లతో ఒక ఫండ్ను కూడా నెలకొల్పింది. -
నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్రా చేయూత
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచితంగా శిక్షణ అందించేందుకు టెక్ మహీంద్రా సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థకు చెందిన స్మార్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ నిర్వాహకులు మెట్టుగూడ జీహెచ్ఎంసీ కమ్యూనిటీహాలులో అప్సా సంస్థ సహకారంతో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18- 27 ఏళ్ల యువతీయువకులు ఇందుకు అర్హులు. స్పోకెన్ ఇంగ్లిష్తోపాటు, ఇంగ్లిష్ టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ తదితర కోర్సుల్లో 3 నెలల పాటు ఇక్కడ శిక్షణ ఇస్తోంది. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేయడంతోపాటు, క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. త్వరలో కొత్తగా ప్రారంభించనున్న శిక్షణ గ్రూపుల్లో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 23వ తేదీలోపు చిరునామా, విద్యార్హతకు సంబంధించిన ధృవీకరణలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మెట్టుగూడ అయ్యప్ప దేవాలయం సమీపంలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీహాలులో నేరుగా సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం 90637 80995, 90637 80994 సెల్ ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చునని నిర్వాహకులు తెలిపారు. -
టెక్ మహీంద్రా లాభం 6శాతం డౌన్
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ టెక్ మహీంద్రా నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 6 శాతం క్షీణించింది. గత క్యూ3లో రూ.777 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.759కోట్లకు పడిపోయిందని టెక్ మహీంద్రా తెలిపింది. ఇతర ఆదాయం తగ్గడం, ఆదాయ వృద్ధి మందకొడిగా ఉండడం వల్ల నికరలాభం తగ్గిందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సి.పి. గుర్నాని చెప్పారు. సీక్వెన్షియల్గా చూస్తే నికర లాభం 4 శాతం క్షీణించిందని తెలిపారు. ఆదాయం మాత్రం రూ.5,752 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.6,701 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సీజనల్గా బలహీనంగా ఉండే ఈ క్యూ3లో వృద్ధి సాధించడానికి తగిన ప్రయత్నాలు చేశామని చెప్పారు. ఐటీ వ్యాపారం ఆదాయం రూ.6,172 కోట్లుగా, బీపీఓ విభాగం ఆదాయం రూ.529 కోట్లుగా ఉన్నాయని చెప్పారు. గత రెండు క్వార్టర్ల నుంచి మార్జిన్లు క్రమక్రమంగా మెరుగుపడుతున్నాయని టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ చెప్పారు. క్యూ3లో 1,902 మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,07,137కు చేరిందని తెలిపారు. -
మెట్రిక్స్ట్రీమ్తో టెక్మహీంద్రా జట్టు
బెంగళూరు: అమెరికాకు చెందిన మెట్రిక్స్ట్రీమ్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. గవర్నెన్స్, రిస్కు తదితర అంశాలకు సంబంధించి (జీఆర్సీ) సర్వీసులను మెట్రిక్స్ట్రీమ్ అందిస్తోంది. భాగస్వామ్య ఒప్పందం ప్రకారం టెక్మహీంద్రా ప్రత్యేకమైన మెట్రిక్స్ట్రీమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ని బెంగళూరులో ఏర్పాటు చేసింది. -
స్టాక్స్ వ్యూ
టెక్ మహీంద్రా : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.535 టార్గెట్ ధర: రూ.615 ఎందుకంటే: 1,690 కోట్ల డాలర్ల మహీంద్రా గ్రూప్కు చెందిన ఈ కంపెనీ వినూత్నమైన. వినియోగదారుడు కేంద్రంగా ఐటీ సర్వీసులను, సొల్యూషన్లను, కన్సల్టింగ్, ఎంటర్ప్రైజ్, టెలికాం సొల్యూషన్లను అందిస్తోంది. 390 కోట్ల డాలర్ల టెక్ మహీంద్రా కంపెనీ లక్షకు పైగా ఉద్యోగులతో 90 దేశాల్లో 788కి పైగా కంపెనీలకు తన సర్వీసులను ఆఫర్ చేస్తోంది. వీటిల్లో కొన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కంపెనీ నికర లాభం 9 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.రూ.720 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.786 కోట్లకు ఎగసింది. ఆదాయం రూ.5,488 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.6,615 కోట్లకు, ఇబిటా రూ.1,155 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1,266 కోట్లకు పెరిగాయి. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.8.16గా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.3,492 కోట్లుగా ఉన్నాయి. ఈ క్యూ2లో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 788కు పెరిగింది. నార్డిస్ సర్వీసెస్, ఒక అంతర్జాతీయ కార్ల కంపెనీ నుంచి భారీ డీల్స్ను సాధించింది. ఎయిర్క్రాఫ్ట్ గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్(ఏసీజీఎస్) డెవలప్ చేయడానికి గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీనే ఎంపిక చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్డ్ సర్వీసెస్ భాగస్వామిగా టెక్ మహీంద్రాను ఏషియన్ టెలికాం కంపెనీ ఎంచుకుంది. డేటా సర్వీసుల టెస్టింగ్,డిజైన్, యాక్టివేట్ వంటి కార్యకలాపాలకు ఒక ఉత్తర అమెరికా టెలికాం కంపెనీ కూడా టెక్ మహీంద్రానే ఎంచుకుంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 45 శాతం, నికర లాభం 43 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇటీలనే ఆర్బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్ లెసైన్స్ను పొందింది. సీఈఎస్ఈ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.542 టార్గెట్ ధర: రూ.668 ఎందుకంటే: ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. విద్యుత్తు టారిఫ్లు 8 శాతం పెరగడంతో ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.1,757 కోట్లకు పెరిగింది. విద్యుత్తు కొనుగోలు వ్యయం 58 శాతం, ఉద్యోగుల వ్యయం 7 శాతం చొప్పున పెరగడంతో ఇబిటా మార్జిన్లు స్వల్పంగా తగ్గి 24 శాతానికి పడిపోయాయి. ఇంధన వ్యయం 20 శాతం, ఇతర వ్యయాలు 14 శాతం చొప్పున తగ్గాయి. 2,325 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉన్న ఈ కంపెనీకి కోల్కత, హౌరాలకు డిస్ట్రిబ్యూషన్ లెసైన్స్ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 15.5 శాతం సాధిస్తోంది. ఏడాదికి రూ.500 కోట్ల నగదు నిలకడగా ఆర్జిస్తోంది. గత ఆరేళ్లుగా తన రిటైల్ విభాగం స్పెన్సర్స్లో రూ.1,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ఇలా పెట్టుబడులు పెట్టడం సీఈఎస్సీ నగదు స్థితిగతులపై ప్రభావం చూపినప్పటికీ, స్పెన్సర్ వ్యాపారం మెరుగుపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లోనే స్పెన్సర్స్ ఇబిటా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందన్న అంచనాలున్నాయి. రెండేళ్లలో స్పెన్సర్స్ ఆదాయం 23 శాతం, స్టోర్ ఏరియా 14 శాతం, స్టోర్ సేల్స్ 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. 2012-13లో ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీలో 57% వాటాను రూ.454 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్ కంపెనీ రుణభారం తగ్గడానికి, మార్జిన్లు పెరగడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. ఈ ఏడాదిమార్చి నాటికి ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్ స్థూల రుణం 11 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 5 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్న కంపెనీగా మారనున్నది. 600 మెగావాట్ల చంద్రపూర్ ప్రాజెక్ట్కు ఇటీవలనే అనుమతులు సాధించింది. హల్దియా ప్లాంట్ ఇటీవలనే కార్యకలాపాలు ప్రారంభించింది. అన్ని వ్యాపార విభాగాలన్నింటినీ కలిపి సీఈఎస్సీ టార్గెట్ ధరను నిర్ణయించాం. గమనిక: ఈ కాలమ్లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
ఉద్యోగ సమాచారం
కోల్కతా పోలీస్ విభాగంలో పోస్టులు కోల్కతా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ.. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 1167 (ఓసీ-642, ఎస్సీ-257, ఎస్టీ-70, ఓబీసీ198). దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 19. పూర్తి వివరాలకు kprb.kolkatapolice. gov.inచూడొచ్చు. నార్ త సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్లు నార్త సెంట్రల్ రైల్వే.. అప్రెంటిస్ల భర్తీకి ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 413 (ఫిట్టర్-220, వెల్డర్-102, మెకానిక్-19, మెషినిస్ట్-17, పెయింటర్-32, క్రేన్ ఆపరేటర్-4, ఎలక్ట్రీషియన్-17, సిస్టం అసిస్టెంట్-2). దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 29. పూర్తి వివరాలకు www.ncr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,513,515,765,1243,1244 చూడొచ్చు. మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్లో పోస్టులు మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్.. గ్రూప్ సీ (మేట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 480 (వెహికిల్ మెకానిక్-12, ఫిట్టర్ జనరల్ మెకానిక్-148, మ్యాసన్-23, ఎలక్ట్రీషియన్-156, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్-42, కార్పెంటర్-37, పెయింటర్-4, పైప్ ఫిట్టర్-58). దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 31. పూర్తి వివరాలకు www.mes.gov.in/Recruitment. ఞజిఞ చూడొచ్చు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే.. అప్రెంటిస్ల భర్తీకి ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 97 (ఫిట్టర్-30, షీట్ మెటల్ వర్కర్-9, వెల్డర్-12, మెషినిస్ట్-6, మెకానిక్-4, కార్పెంటర్-12, ఎలక్ట్రీషియన్-12, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్-4, వైర్మెన్-4, పెయింటర్-4). దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 18. పూర్తి వివరాలకు www.eastcoastrail. indianrailways.gov.inచూడొచ్చు. ఎన్పీసీసీలో ఇంజనీర్లు నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్పీసీసీ) లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 15 (సైట్ ఇంజనీర్లు- 8, జూనియర్ ఇంజనీర్లు-7). దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 6. పూర్తి వివరాలకు www.npcc.gov.inచూడొచ్చు. టెక్ మహీంద్రాలో జాబ్ ఓపెనింగ్స టెక్ మహీంద్రా సంస్థ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7 (టెక్ లీడ్-1, ప్రాజెక్ట్ లీడ్-1, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్-4, టెక్ ఆర్కిటెక్ట్-1). మొదటి మూడు పోస్టులకు జాబ్ లొకేషన్ హైదరాబాద్ కాగా చివరి పోస్టు జాబ్ లొకేషన్ పుణే. పూర్తి వివరాలకు www.techmahindra. com/pages/default.aspxచూడొచ్చు. హెచ్సీఎల్ టెక్నాలజీస్లో వివిధ పోస్టులు హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6 (లీడ్ కన్సల్టెంట్-1, స్పెషలిస్ట్ బిజినెస్ ఎనలిస్ట్-2, టెక్నికల్ లీడ్-3). పూర్తి వివరాలకు www.hcltech.com/careers/explore-hcl-indiaచూడొచ్చు. -
టెక్ మహీంద్రా లాభం రూ.786 కోట్లు
ఆదాయం 21 శాతం అప్ న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలానికి రూ.786 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.720 కోట్లు)తో పోలిస్తే 9 శాతం వృద్ఢి సాధించామని టెక్ మహీంద్రా తెలిపింది. గత క్యూ2లో రూ.5,488 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 21 శాతం వృద్ధితో రూ.6,616 కోట్లకు పెరిగిందని తెలిపింది. డాలర్ టెర్మ్ల్లో నికర లాభం 12 కోట్ల డాలర్లుగా, ఆదాయం 101 కోట్ల డాలర్లుగా నమోదైందని పేర్కొంది. గత క్యూ2లో 770గా ఉన్న తమ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య ఈ క్యూ2లో 788కు పెరిగిందని వివరించింది. ఈ క్యూ2లో కొత్తగా 1,562 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నామని, దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,05,235కు పెరిగిందని, వీరిలో 71,657 మంది సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారని, 26,513 మంది బీపీఓ రంగం ఉద్యోగులని తెలిపింది. c -
గతవారం బిజినెస్
నియామకాలు ♦ ఐటీ శాఖ కార్యదర్శి రామ్ సేవక్ శర్మను ట్రాయ్ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ♦ ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్గా గౌర గ్రూప్ ఎండీ గౌర శ్రీనివాస్ నియమితులయ్యారు. మార్కెట్ విస్తరణ దిశగా ఉబెర్ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ భారత్లో కార్యకలాపాలు భారీ ఎత్తున విస్తరించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం వచ్చే 6-9 నెలల వ్యవధిలో భారత్లో సుమారు రూ.6,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. భారత్లో జనరల్ మోటార్స్ పెట్టుబడులు అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీ భారత్లో దాదాపు రూ.6,400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. 20 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, తగినంత మార్కెట్ వాటా సాధించలేకపోయిన ఈ కంపెనీ తాజాగా ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయనున్నది. టర్న్అరౌండ్ ప్రణాళికలో భాగంగా ఐదేళ్లలో దేశీయంగా తయారయ్యే పది మోడళ్లను అందిస్తామని జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బర్రా చెప్పారు. 100 విమానాల కొనుగోలు దిశగా స్పైస్జెట్ దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికల్లో భాగంగా విమానయాన సంస్థ స్పైస్జెట్ తాజాగా సుమారు 100 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచి స్తోంది. ఇందుకోసం విమానాల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్బస్ మొదలైన వాటితో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ సీఎఫ్వో కిరణ్ కోటేశ్వర్ వెల్లడించారు. బొంబార్డియర్, ఏటీఆర్, ఎంబ్రేయర్ లాంటి చిన్న విమానాల కోసం చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. హెచ్సీఎల్లో వాటా విక్రయ దిశగా కేంద్రం డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సీఎల్)లో 15 శాతం వాటాను విక్రయించనుంది. హెచ్సీఎల్లో కేంద్రం వాటా 89.95 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ద్వారా రూ.69,500 కోట్ల నిధుల సమీకరణను లక్ష్యంగా నిర్దేశించుకుంది. 7 ఎఫ్డీఐ ప్రతిపాదనలకు ఆమోదం కేంద్రప్రభుత్వం రూ.981 కోట్ల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. వీటిలో హాత్వే కేబుల్ అండ్ డేటా కామ్, హైదరాబాద్కు చెందిన సీలన్ ల్యాబొరేటరీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, లాలియా ట్రేడింగ్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఉన్నాయి. 17 మంది పన్ను బకాయిలు.. 2 లక్షల కోట్లు దేశంలో 17 మంది వ్యక్తులు రూ.2.14 లక్ష ల కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీరిలో ప్రతి ఒక్కరూ రూ.1,000 కోట్లపైన పన్ను బకాయి పడినవారే. దేశంలోని 35 కంపెనీలు రూ.1,000 కోట్ల పైబడి కట్టాల్సిన మొత్తం పన్ను బకాయిలు రూ.90,568 కోట్ల కన్నా సంబంధిత 17 మంది వ్యక్తులు చెల్లించాల్సింది దాదాపు రెట్టింపు. ఐసీఐసీఐ లాభం రూ.2,976 కోట్లు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16,క్యూ1)లో స్టాండెలోన్ ప్రాతిపదికన(బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే) రూ.2,976 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,655 కోట్లతో పోలిస్తే లాభం 12 శాతం ఎగసింది. టెక్ మహీంద్రా లాభం రూ.676 కోట్లు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రై మాసికంలో రూ.676 కోట్ల నికర లాభం ఆర్జించింది.అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ. 631కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా పేర్కొంది. రూపాయి క్షీణతతో లాభాలు పెరిగాయని వివరించింది. ఐటీసీ నికర లాభం రూ.2,265 కోట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ... ఏప్రిల్-జూన్ క్వార్టర్కు రూ.2,265 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్కు సాధించిన నికర లాభం(రూ.2,186 కోట్లు)తో పోల్చితే 4% వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. సిగరెట్ల అమ్మకాలపై ఒత్తిడి, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్ అంతంత మాత్రంగా ఉండడం వల్ల నికర లాభంలో స్వల్ప వృద్ధి నమోదయ్యింది. మారుతీ సుజుకీ లాభం 56 శాతం అప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం (స్టాండెలోన్ ప్రాతిపదికన) ఏకంగా 56 శాతం పెరిగి రూ. 1,193 కోట్లుగా నమోదైంది. వాహన విక్రయాలు పెరగడం, విదేశీ మారక విలువలు సానుకూలంగా ఉండటంతో పాటు వ్యయ నియంత్రణ చర్యలు సత్ఫలితాలిస్తుంటడం దీనికి దోహదపడినట్లు సంస్థ తెలిపింది. సహారా మ్యూచువల్ ఫండ్ లెసైన్స్ రద్దు సహారా గ్రూప్కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మంగళవారం మరో షాక్ ఇచ్చింది. ఆ సంస్థ మ్యూచువల్ ఫండ్ లెసైన్సును రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఈ వ్యాపారం చేయడానికి సహారాకు తగినంత పటిష్ఠత లేదని పేర్కొంది. మరో ఫండ్ హౌస్కు సహారా మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలను బదిలీ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చింది. విండోస్ 10 వచ్చేసింది.. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బుధవారం తమ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 10’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఢిల్లీ సహా ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో దీన్ని ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్.. సుమారు 190 దేశాల్లో విండోస్ 10ను బుధవారం నుంచే అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లోకి విడుదలైన రెండు రోజుల్లోనే విండోస్ 10 ఓఎస్పై పనిచేస్తున్న కంప్యూటర్ల సంఖ్య 1.4 కోట్లకు చేరింది. అమెరికా జీడీపీ వృద్ధి 2.3 శాతం అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది 2వ క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో సానుకూల రీతిలో 2.3 శాతంగా నమోదయ్యింది. వినియోగ వ్యయం పెరగడం(అమెరికా ఆర్థిక క్రియాశీలతలో ఈ విభాగం వాటా దాదాపు 70 శాతం), ఎగుమతుల్లో వృద్ధి వంటి అంశాలు దీనికి కారణమని వాణిజ్య శాఖ గురువారం పేర్కొంది. డీల్స్.. ఇజ్రాయెల్ ఫార్మా దిగ్గజం తెవా.. అంతర్జాతీయ ఔషధ రంగంలో భారీ డీల్కు తెరతీసింది. ఐర్లాండ్ సంస్థ అలెర్గాన్ జనరిక్స్ను ఏకంగా 40.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో 33.75 బిలియన్ డాలర్లు నగదు రూపంలో, మిగతాది (6.75 బిలియన్ డాలర్లు) తెవా షేర్ల రూపంలో అలెర్గాన్ జనరిక్స్ మాతృ సంస్థ అలెర్గాన్ పీఎల్సీకి లభిస్తాయి. జ్యూయలరీ సంస్థ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ తాజాగా స్విట్జర్లాండ్కి చెందిన పసిడి రిఫైనరీ సంస్థ వాల్కాంబీని కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద ం విలువ సుమారు రూ. 2,560 కోట్లు. దివాలా తీసిన అమెరికన్ సంస్థ ఎరిక్ బ్యుయెల్ రేసింగ్ (ఈబీఆర్)కి సంబంధించిన కొన్ని వ్యాపారాలను దేశీ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ 2.8 మిలియన్ డాలర్లకు దక్కించుకోనుంది. దేశీ బ్రోకరేజి సంస్థ షేర్ఖాన్ను ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్పీ పారిబా కొనుగోలు చేయనుంది. డీల్ విలువ సుమారు రూ. 2,000 కోట్లు ఉండొచ్చని అంచనా. -
టెక్ మహీంద్రా లాభం రూ.676 కోట్లు
ముంబై: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.676 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ. 631కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా పేర్కొంది. రూపాయి క్షీణతతో లాభాలు పెరిగాయని వివరించింది. గత క్యూ1లో 1.1 కోట్ల డాలర్లుగా ఉన్న ఫారెక్స్ లాభాలు ఈ క్యూ1లో 1.47 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొంది. గత క్యూ1లో రూ.5,122 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 23 శాతం వృద్ధితో రూ.6,294 కోట్లకు పెరిగిందని వివరించింది. అంచనాలకనుగుణంగానే తమ ఆర్థిక ఫలితాలున్నాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ క్వార్టర్లో 392 మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,03,673కు పెరిగిందని కంపెనీ ఎండీ, సీఈఓ సి. పి. గుర్నాని చెప్పారు. -
ఈడీ కేసులో టెక్ మహీంద్రాకు ఊరట
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కేసుకు సంబంధించి ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రాకు ఊరట లభించింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వ్యవహారంలో టెక్ మహీంద్రా మీద అభియోగాలు మోపే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం నాలుగు నెలల్లోగా తేల్చాలని, అప్పటిదాకా కంపెనీపై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయరాదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మోసపూరితంగా సత్యం కంప్యూటర్స్లోకి వచ్చాయన్న ఆరోపణలపై ఈడీ రూ. 822 కోట్లు అటాచ్ చేయడం, కంపెనీపై కేసులు నమోదు చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపైనే కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గత మేనేజ్మెంట్ చేసిన తప్పిదాలను ప్రస్తుత యాజమాన్యానికి ఆపాదించరాదని ఈ సందర్భంగా టెక్ మహీంద్రా తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. -
ఐసీఐసీఐ నుంచి ‘ఎన్ఎఫ్సీ’ చెల్లింపు సర్వీసులు
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాతో కలసి ‘ట్యాప్ ఎన్ పే’ పేరిట చెల్లింపుల సేవలను ప్రారంభించింది. ఇందులో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ విధానంలో ఎన్ఎఫ్సీ టెక్నాలజీ గల మొబైల్ ఫోన్ లేదా ట్యాగ్ను ఆయా వర్తకుల కౌంటర్లోని ప్రత్యేక మెషీన్కు తాకించడం ద్వారా ఆన్లైన్ మాధ్యమంలో షాపు ఖాతాలోకి నగదు బదిలీ అవుతుంది. ఇందుకోసం వర్తకులు ముందుగా రిజిస్టరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ కస్టమర్లను జోడించుకోవాలి. ప్రస్తుతం ఆఫీస్ క్యాంటీన్లు వంటి కొన్ని చోట్లకు మాత్రమే ఇది పరిమితమని, దీన్ని డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులాగా అన్ని చోట్లా ఉపయోగించుకోవడానికి వీలు ఉండదని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. కేవలం తమ బ్యాంకు ఖాతాదారులే కాకుండా ఇతరత్రా ఏ బ్యాంకులో అకౌంటు ఉన్నవారైనా ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. -
దాచినా దాగని ‘సత్యం’
రాజు కుటుంబీకులతో పాటు అప్పట్లో కొన్నవారికీ లాభాలు ఐదారేళ్లపాటు నకిలీ లెక్కలు కొనసాగినా గుర్తించని ఆడిటర్లు మేటాస్ డీల్ ఓకే అయి ఉంటే స్కామ్ బయటపడేదే కాదు!! రియల్టీ విలువలు తగ్గినపుడు ఈ నిర్ణయం తీసుకోవటమూ ఓ కారణమే సాక్షి బిజినెస్ విభాగం సత్యం కంప్యూటర్స్ వ్యవహారంలో భారీగా దెబ్బతిన్నది, నష్ట పోయింది ఎవరైనా ఉంటే ఆ కంపెనీ షేర్లు కొనుక్కుని... కుంభ కోణం బయటపడ్డ వెంటనే భయంతో అమ్మేసిన ఇన్వెస్టర్లే. ఎందుకంటే రూ.540 చూసిన సత్యం షేరు... ఆ పతనంలో రూ.12కు పడిపోయింది. మరి మోసపూరిత లెక్కలతో లేని ఆస్తుల్ని, రాని లాభాల్నే కాక, లేని ఉద్యోగులను కూడా చూపించి షేరు విలువను అమాంతం పెంచేసిన ఈ వ్యవహారంలో లాభపడిందెవరు? అలా పెరిగిన సందర్భాల్లో వాటాలమ్ముకున్న ప్రతి ఒక్కరూ లబ్ధిదారులే. వారిలో ముందున్నది సత్యం వ్యవస్థాపక సీఈఓ రామలింగరాజు, ఆయన సంబంధీకులే. గురువారం ప్రత్యేక కోర్టు శిక్షను ప్రకటిస్తూ ‘‘ఇలాంటి నేరాల్లో శిక్షను ప్రకటించేటపుడు నేరగాళ్ల చర్యల ద్వారా దెబ్బతిన్న వారి ఆవేదనను దృష్టిలో పెట్టుకోవాలి’’ అని చెప్పింది కూడా అందుకే. అయితే ప్రభుత్వ వేలంలో వాటా కొనుక్కుని విలువైన కంపెనీని తక్కువ మొత్తానికే చేజిక్కించుకున్న టెక్ మహీంద్రా కూడా లాభపడినట్టే చెప్పుకోవాలి. ఐదారేళ్లుగా ఆడిటర్లేం చేసినట్లు? సత్యం వ్యవహారంలో గమనించాల్సినవెన్నో ఉన్నాయి. దాదాపు ఐదారేళ్లపాటు రాని ఆదాయాన్ని వచ్చినట్టుగా చూపిస్తూ వచ్చిన రామలింగరాజు... బ్యాంకు నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, వడ్డీతో సహా అన్నీ నకిలీ లెక్కలే చూపించారు. ఇలా నకిలీ మొత్తం రూ.5,040 కోట్లకు చేరుకోవటంతో దీనికి ముగింపు పలకాలనుకున్నారు. అందుకే తన కుటుంబానికి చెందిన మేటాస్ ఇన్ఫ్రా, మేటాస్ ప్రాపర్టీస్ను రూ.7,680 కోట్లకు కొనుగోలు చేసేలా సత్యం తరఫున తానే నిర్ణయం తీసుకున్నారు. ఆ డీల్ ఓకే అయితే అందులో రూ.5,040 కోట్లను మేటాస్కు చెల్లించకుండానే చెల్లించినట్లు చూపించాలని... అపుడు సత్యంలో కృత్రిమ లెక్కలకు తెరవేయవచ్చనేది ఆయన ఆలోచన. అన్నీ అనుకున్నట్టు జరిగితే బహుశా! ఈ మోసం ఎన్నటికీ బయటపడేది కాదేమో!! మరికొందరు చెబుతున్నట్లుగా రామలింగరాజు కనక మేటాస్ డీల్ నిర్ణయాన్ని 2009 జనవరిలో కాకుండా రియల్ ఎస్టేట్ ధరలు పతాక స్థాయిలో ఉన్న ఏ 2007 ఆఖర్లోనో, 2008 జనవరిలోనో తీసుకుంటే అంతా ఆ నిర్ణయాన్ని హర్షధ్వానాలతో ఆమోదించేవారేమో!! సరే! ఈ విషయాన్ని పక్కనబెడితే ఐదారేళ్లపాటు ఖాతాల్లో మోసాలకు పాల్పడుతున్నపుడు ఆడిటర్లేం చేశారనేదీ ప్రశ్నే. కార్పొరేట్ వ్యవస్థకు పోలీసు ల్లాంటి ఆడిటర్లే విఫలమైతే ఏమనుకోవాలి? ఎందుకంటే అంతకు ముందటి సంవత్సరమే... అంటే 2008లో ఉత్తమ కార్పొరేట్ పాలనకు గాను సత్యంకు ‘గోల్డెన్ పీకాక్’ అవార్డుతో అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది కూడా!!. ‘సత్యం’ ఒక్కటే కాదు.. సత్యం కుంభకోణం బయటపడ్డపుడు... ఇలా లాభాల్ని పెంచి చూపిస్తూ ఖాతాల్లో మోసాలకు తెరతీస్తున్న సంస్థలు చాలా ఉన్నాయని, మరెన్నో ‘సత్యం’లు బయటపడతాయని కార్పొరేట్ నియంత్రణ సంస్థలు వ్యాఖ్యానించటం తెలియనిది కాదు. సదరు ప్రమోటర్లు జాగ్రత్తపడ్డారో, నియంత్రణ సంస్థలు నెమ్మదించాయో కానీ ఆ తరవాత ఇలాంటివేవీ బయటపడలేదు. అయితే రాని లాభాల్ని చూపించిన తరహాలోనే లేని వ్యాపారాన్ని చూపించిన ‘సుజనా మెటల్స్’ వంటి సంస్థలూ రాష్ట్రానికి కొత్త కాదు. టర్నోవర్ కోసం లేని వ్యాపారాన్ని చూపించామని స్వయంగా పన్ను అధికారుల ఎదుట ప్రస్తుతం కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న సుజనా చౌదరి అప్పట్లో అంగీకరించటమూ తెలియని విషయం కాదు. ఇక్కడ సుజనాతో పోలిక ఎందుకంటే ఇదీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంస్థే. దీన్లో ఉన్నదీ ఇన్వెస్టర్లే. అయితే సత్యం కంప్యూటర్స్ అంత పెద్దది కాదు కనక ఈ నకిలీ లెక్కలతో మోసపోయిన వారి సంఖ్య కూడా తక్కువే. అలాగే మాయ మాటలతో ఇన్వెస్టర్లకు సినిమా చూపించి ‘ఐపీవో’ ద్వారా వేల కోట్లు దోచేసిన సంస్థలూ ఉన్నాయి. లిస్టయిన దగ్గర్నుంచి ఒక్కరోజు కూడా తాము కొన్న ధరను కళ్ల చూడలేని ఇన్వెస్టర్లకే ఆ సంస్థల పవర్ అర్థమయ్యేది. మొత్తంగా చూస్తే ఇలాంటి వాటిలో సత్యం కూడా ఒకటి. అంతేతప్ప ఇది ‘ఒకే ఒక్కటి’ కాదనే అనుకోవాలి. అలా ఎగసి... ఇలా పతనమై.. 2009లో ఈ కుంభకోణం బయటపడక ముందు... రామలింగరాజు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఆంధ్రప్రదేశ్ బిల్గేట్స్. ఐటీకి దిక్సూచి. పద్నాలుగేళ్ల కిందట అమెరికా అధ్యక్షుడి హోదాలో బిల్ కి ్లంటన్ హైదరాబాద్కు వచ్చినపుడు ఆయన పక్క సీటు రాజుదే. పశ్చిమగోదావరికి చెందిన ఈ రైతు బిడ్డ... 1977లో సత్యంను ఆరంభించాక... భవిష్యత్తును ముందే గమనించి నిర్ణయాలు తీసుకుంటూ ఆ కంపెనీని దేశ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. 1991లోనే అమెరికాకు ఆఫ్షోర్ సర్వీసులందించి ప్రథముడిగా నిలిచారు. ఇక 20వ శతాబ్దం అంతంలో కంప్యూటర్ల డేటా ఏమవుతుందో అన్న భయాలు చుట్టుముట్టినపుడు వై2కేకు పరిష్కారం అందించి సత్యంను అంతర్జాతీయంగా అగ్రస్థాయికి తీసుకెళ్లారు. సత్యం ఇన్ఫోవే ద్వారా ఇంటర్నెట్ బూమ్కు బాటలు వేశారు. 2001లో సత్యంను నాస్డాక్లో లిస్ట్ చేసి... 2006లో బిలియన్ డాలర్ల ఆదాయన్ని నమోదు చేసేలా తీసుకెళ్లారు. 2008 కల్లా రెండు బిలియన్ డాలర్లకు చేర్చారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపే. 2008 డిసెంబర్లోనే సత్యం పతనం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే మేటాస్కు చెందిన రెండు సంస్థలను కొనుగోలు డీల్ను వాటాదారులు వ్యతిరేకించటంతో వెనక్కి తీసుకున్నారు. అదే నెలలో డేటా చౌర్యం, బ్యాంకు అధికారులకు లంచమివ్వటం వంటి నేరాలపై ప్రపంచ బ్యాంకు సత్యంను 8 ఏళ్లపాటు తమ ప్రాజెక్టులు చేపట్టకుండా నిషేధించింది. ఈ చర్యలకు షేరు కుదేలైంది. అదే సమయంలో కుంభకోణం బయటపడింది. దీంతో సత్యంతో తన 22 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలుకుతూ రాజు రాజీనామా చేసినా... అకౌంటింగ్ మోసాలు బయటపడటంతో జైలు తప్పలేదు. అకౌంటింగ్ మోసాలు ఇవీ... సెబీ దర్యాప్తు ప్రకారం... తప్పుడు ఆర్థిక సమాచార వల్ల కలిగిన నష్టం రూ.12,320 కోట్లు. ఒకే ఎగ్జిక్యూటివ్ పేరిట దాదాపు 7,561 నకిలీ బిల్లులు బయట పడ్డాయి. ఈ నకిలీ ఇన్వాయిస్ల ద్వారానే కంపెనీ ఆదాయం దాదాపు రూ.4,783 కోట్ల మేర పెంచి చూపించారు. నకిలీ రుణ దాతలు రూ.500 కోట్లు రుణాలిచ్చినట్లు చూపారు. నకిలీ బ్యాంక్ బ్యాలెన్స్... రూ.1,732 కోట్లు నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్లు... రూ.3,308 కోట్లు రావాల్సిన వడ్డీ (నకిలీ)... రూ.376 కోట్లు లెక్కల్లో చూపించని ఆదాయం... రూ.1,425 కోట్లు లెక్కల్లో చూపించని చెల్లింపులు... రూ.195 కోట్లు -
నాస్కామ్ చైర్మన్గా బీవీఆర్ మోహన్రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్రెడ్డి 2015-16 సంవత్సరానికి గాను సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్గా బుధవారం ఎంపికయ్యారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఆర్.చంద్రశేఖరన్ ఉన్నారు. ఏప్రిల్ 9న మోహన్రెడ్డి బాధ్యతలు చేపడతారు. ఇక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా.. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కేవలం పెద్ద సంస్థలే కాకుండా చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), స్టార్టప్స్కి ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తానని మోహన్రెడ్డి తెలిపారు. 100 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ-బీపీఎం పరిశ్రమకు నాస్కామ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. -
అభియోగాల నమోదును కొనసాగించండి
టెక్ మహీంద్ర కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో టెక్ మహీంద్రపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మోపిన అభియోగాలను నమోదు చేసేందుకు కింది కోర్టుకు బుధవారం హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ చట్టం కింద ఈడీ కింది కోర్టులో తమపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టెక్ మహీంద్ర హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి, ఈడీ కేసును కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ ఈడీ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా బుధవారం చీఫ్జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అభియోగాల నమోదులో పాల్గొనాలని టెక్ మహీంద్రకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
టెక్ మహీంద్రా చేతికి స్విస్ కంపెనీ
న్యూఢిల్లీ: కన్సల్టింగ్ సేవల సంస్థ సాఫ్జెన్ హోల్డింగ్స్ను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తెలిపింది. అయితే, ఒప్పందం విలువ మాత్రం వెల్లడించలేదు. ఈ డీల్ మార్చి నాటికి పూర్తికాగలదని కంపెనీ వివరించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే సాఫ్జెన్.. కమర్షియల్, రిటైల్ బ్యాంకింగ్ తదితర రంగాల సంస్థలకు సేవలు అందిస్తోంది. ఇందులో 450 మంది ఉద్యోగులు ఉన్నారు. కస్టమర్లకు అత్యాధునిక కోర్ బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఈ డీల్ ఉపయోగపడగలదని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశీయంగా నాలుగో అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న టెక్ మహీంద్రా కొన్నాళ్లుగా పలు కంపెనీలను కొనుగోలు చేసింది. ఇటీవలే 240 మిలియన్ డాలర్లతో అమెరికాకు చెందిన లైట్బ్రిడ్జ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ను కొనుగోలు చేసింది. -
టెక్ మహీంద్రాపై కేసు తగదు..
ఈడీ కేసును కొట్టివేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి టెక్ మహీంద్రాకు హైకోర్టులో ఊరట లభించింది. సత్యం కుంప్యూటర్స్ కుంభకోణం విషయంలో టెక్ మహీంద్రాపై మనీ లాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సత్యం కంప్యూటర్స్లో జరిగిన అవకతవకలకు టెక్ మహీంద్రా బాధ్యత వహించాలనడం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. టెక్ మహీంద్రాపై ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ అభియోగాలన్నింటినీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ మేర టెక్ మహీంద్రాపై ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు సోమవారం తీర్పు వెలువరించారు. సత్యం కంప్యూటర్స్పై నమోదు చేసిన కేసును ఆ కంపెనీని విలీనం చేసుకున్న తరువాత కూడా ఈడీ తమపై కొనసాగించడాన్ని, చార్జిషీట్లో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాలు చేస్తూ టెక్ మహీంద్రా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సుదీర్ఘ వాదనలు విని తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి, సోమవారం మధ్యాహ్నం తీర్పునిచ్చారు. టెక్ మహీంద్రా మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ రుజువు చేయలేకపోయిందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు, ఆ కంపెనీకి చెందిన ఇతరులు చేసిన తప్పులను టెక్ మహీంద్రాకు ఆపాదించడం తగదని స్పష్టం చేశారు. అధికరణ 226 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేసే అధికారం హైకోర్టుకు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
మరో 30 వేల కొత్త కొలువులు: టెక్ మహీంద్రా
హైదరాబాద్: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా వచ్చే రెండేళ్లలో 30,000 మందిని కొత్తగా నియమించుకోనుంది. తద్వారా సంస్థ ఉద్యోగుల సంఖ్య 1.25 లక్షలకు ఎగబాకనుంది. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాలతోపాటు వైజాగ్, జైపూర్, భువనేశ్వర్ కేంద్రాల్లో ఈ విస్తరణ ఉంటుందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సి.పి.గుర్నాణి తెలిపారు. ‘వైజాగ్లో సుమారు 1,500 మంది పనిచేస్తున్నారు. ఈ నగరంలో కంపెనీకి కొత్తగా స్థల కేటాయింపులు పూర్తి అయ్యాయి. భువనేశ్వర్లో మరో బ్లాక్ను జోడిం చాం. గత కొన్నేళ్లుగా పరిశోధన, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. ఆదాయాల్లో 2-3 శాతం ఇందుకోసం వ్యయం చేస్తున్నాం’ అని చెప్పారు. టెక్ మహీంద్రాకు హైదరాబాద్ కేంద్రం అతిపెద్దదని, ఈ కేంద్రంలో 20,000 మందికిపైగా పనిచేస్తున్నారని వివరించారు. ఇక్కడికి సమీపంలోని బహదూర్పల్లి ఫెసిలిటీలో ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటుకు సుమారు రూ.600 కోట్ల మొత్తాన్ని వెచ్చించినట్లు ఆయన వెల్లడించారు. -
క్రాష్ మార్కెట్!
సెన్సెక్స్ 538 పాయింట్లు డౌన్ ⇒27,000 స్థాయి దిగువకు... ⇒ఏడాదిన్నర కాలంలో అతిపెద్ద పతనం ⇒152 పాయింట్లు దిగజారిన నిఫ్టీ ⇒ఐదున్నరేళ్ల కనిష్టానికి చమురు ధరలు ⇒సంక్షోభంలో రష్యన్ కరెన్సీ ‘రూబుల్’ ⇒నష్టాలలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ప్రపంచ స్టాక్ మార్కెట్ల నష్టాలకు తోడు తాజాగా కరెన్సీ ఆందోళనలు దేశీ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. దేశీయంగానూ పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, వాణిజ్యలోటు పుంజుకోవడం వంటి అంశాలు సెంటిమెంట్ను దెబ్బకొట్టాయి. వీటికి ఎఫ్ఐఐల అమ్మకాలు జత కలవడంతో సెన్సెక్స్ ఏడాదిన్నర కాలంలో లేనివిధంగా 538 పాయింట్లు పతనమైంది. 27,000 పాయింట్ల కీలక స్థాయికి దిగువన 26,781 వద్ద ముగిసింది. దాదాపు రెండు నెలల కనిష్టమిది! సెన్సెక్స్ ఇంతక్రితం 2013 సెప్టెంబర్ 3న మాత్రమే ఈ స్థాయిలో 651 పాయింట్లు కోల్పోయింది. ఏం జరుగుతోంది? ఇటీవల నాలుగేళ్ల కనిష్టానికి చేరిన మలేసియన్ కరెన్సీ రింగిట్కు జతగా రష్యన్ కరెన్సీ రూబుల్ తాజాగా డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచీ 50% విలువ కోల్పోయింది. దీంతో 1998 తరువాత మళ్లీ రష్యా హుటాహుటిన వడ్డీ రేటును 10.5% నుంచి ఏకంగా 17%కు పెంచివేసింది. అక్కడి స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ కూడా 14 శాతం పైగా కుప్పకూలింది. మరోపక్క రష్యా, మలేసియాసహా చమురు ఉత్పాదక దేశాల ఆదాయాన్ని దెబ్బతీస్తూ తాజాగా ముడిచమురు ధరలు ఐదున్నరేళ్ల కనిష్టాన్ని తాకడం కూడా ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ను బలహీనపరచింది. బ్రెంట్ చమురు బ్యారల్ ధర 58.5 డాలర్ల స్థాయికి దిగిరాగా, నెమైక్స్ రకం 54.5 డాలర్ల స్థాయిలో కదులుతోంది. ఇక ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న గణాంకాల నడుమ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పరపతి సమీక్షా సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే సంకేతాలు వెల్లడిస్తే డాలర్ నిధులు వెనక్కు మళ్లుతాయన్న భయాలు ఇప్పటికే వర్ధ మాన దేశాలను కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే చైనా తయారీ రంగ మందగమన ఆందోళనలు, జపాన్ మాంద్య పరిస్థితులు ఆసియా మార్కెట్లను వణికిస్తున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్లో యూరప్, అమెరికా మార్కెట్లు 2.5-1% మధ్య నష్టపోయాయి. మంగళవారం చైనా మినహా జపాన్ తదితర ఆసియా మార్కెట్లు కూడా నీరసించాయి. దేశీయంగానూ... దేశీయంగా చూస్తే నవంబర్లో వాణిజ్య లోటు 7 బిలియన్ డాలర్లమేర పెరిగి 18 నెలల గరిష్టాన్ని తాకింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 13 నెలల కనిష్టమైన 63.53కు చేరింది. మరోవైపు గత రెండు రోజుల్లో రూ. 1,325 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 1,250 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచ మార్కెట్ల బలహీనతలకుతోడు ఇలాంటి పలు అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేశాయి. దీంతో ట్రేడింగ్ గడిచేకొద్దీ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం 152 పాయింట్లు పడిపోయి 8,068 వద్ద నిలిచింది. ఇతర ప్రధాన అంశాలివీ... ⇒బీఎస్ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ 4-1.5% మధ్య పతనమయ్యాయి. డాలర్ బలోపేతంతో హెచ్సీఎల్టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా 4.5-1.5% మధ్య లాభపడ్డాయి. ⇒ప్రధానంగా మెటల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, హెల్త్కేర్ సూచీలు 4-3% మధ్య నీరసించాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు సైతం మార్కెట్లను మించుతూ 3% చొప్పున పడిపోయాయి. ⇒సెన్సెక్స్ దిగ్గజాలలో సెసాస్టెరిలైట్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ఎస్బీఐ, టాటా పవర్, ఐసీఐసీఐ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్యూఎల్, ఓఎన్జీసీ 8-2% మధ్య తిరోగమించాయి. ⇒ ప్రతికూల పరిస్థితులను ప్రతిబింబిస్తూ ట్రేడైన షేర్లలో 2,327 నష్టపోతే, కేవలం 541 లాభపడ్డాయి. ⇒రియల్టీ రంగానికి చెందిన షేర్లలో యూనిటెక్, హెచ్డీఐఎల్, అనంత్రాజ్, ఒబెరాయ్, డీబీ, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్ 11-4% మధ్య కుప్పకూలాయి. -
మహిళా ఉద్యోగులకు కార్పొరేట్ అలర్ట్స్
ఉబర్ క్యాబ్ ఘటన నేపథ్యంలో ఈ-మెయిల్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేస్తున్న కార్పొరేట్ సంస్థలు.. అటు స్వీయ జాగ్రత్తలూ పాటించాలంటూ ఉద్యోగులకు సూచనలిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఉబర్ క్యాబ్ సంఘటన నేపథ్యంలో కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ల రూపంలో సందేశాలను చేరవేశాయి. కంపెనీ సమకూర్చే క్యాబ్స్ను మాత్రమే ప్రయాణానికి వినియోగించాలని ఆ సందేశాల్లో సూచిస్తున్నాయి. ఒకవేళ ఇతర వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తే వాహనం నంబరును రాసుకుని, సంబంధీకులకు ఆ నంబరును చేరవేయాలని గుర్తు చేశాయి. అయితే భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించడమేగాక, ఉద్యోగులకు తరచూ సూచనలిస్తున్నట్టు కొన్ని కంపెనీలు వెల్లడించాయి. ఈ-మెయిల్ సందేశాలు.. మహిళా ఉద్యోగులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్యానాసోనిక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోటెక్, ఆర్పీజీ గ్రూప్, ఏజిస్, జెన్సర్ టెక్నాలజీస్ తదితర సంస్థలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ సందేశాలను పంపించాయి. కొన్ని కంపెనీలైతే సమావేశ మందిరాల్లో ఉద్యోగులకు సూచనలు చేస్తున్నాయి. రాత్రి వేళ త్వరగా పని ముగించుకుని, అవసరమైతే మర్నాడు ముందుగా రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నట్టు హైసియా ప్రెసిడెంట్, ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ ఇండియా ఎండీ రమేశ్ లోగనాథన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భద్రత చర్యలు, స్వీయ రక్షణ గురించి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) తరఫున అన్ని వేదికలపైనా చెబుతున్నామని అన్నారు. ‘కొన్ని క్యాబ్ కంపెనీలను నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. వేలాది అనధికార క్యాబ్స్ రోడ్లపై తిరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమే’ అని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. అలర్ట్స్ కొత్తేమీ కాదు.. భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు ఉద్యోగులకు గుర్తు చేస్తున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. ప్రతి శుక్రవారం అందరు ఉద్యోగులకు భద్రతపరమైన సందేశాలు పంపిస్తున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ‘రాత్రి 8 లోపే పనులను ముగిం చుకోవాలని మహిళా ఉద్యోగులకు చెబుతున్నాం. రాత్రి 8 తర్వాత వెళ్లేవారికి కంపెనీ కారులో గార్డు రక్షణతో పంపిస్తున్నాం. 10 ఏళ్ల నుంచి ఒకే క్యాబ్ ఆపరేటర్ సేవలందిస్తున్నారు. వాహనాలు, భద్రత ఏర్పాట్లను క్యాబ్ ఆపరేటర్తో కలసి తరచూ సమీక్షిస్తున్నాం’ అని వెల్లడించారు. ఉద్యోగుల భద్రత చర్యలు నిరంతర ప్రక్రియ అని టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణా రెడ్డి తెలిపారు. స్వీయ రక్షణ విషయంలో ఉద్యోగులకు కంపెనీ నుంచి అలర్ట్స్ కొత్తేమీ కాదన్నారు. -
బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ
దేశీ బ్యాంకింగ్ రంగానికి ఊపునిస్తూ కొటక్ మహీంద్రా, ఐఎన్జీ వైశ్యా మధ్య జరిగిన విలీన ఒప్పందం ఇన్వెస్టర్లకు జోష్నిచ్చింది. మరోవైపు చైనాసహా, యూరోపియన్ దేశాలు నామమాత్ర వడ్డీ రేట్లకే కట్టుబడటంతోపాటు సహాయక ప్యాకేజీలకు తెరలేపడం సెంటిమెంట్కు బలాన్నిచ్చింది. దీంతో మరిన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశముంటుందన్న అంచనాలు దేశీ స్టాక్ మార్కెట్లను మళ్లీ కొత్త రికార్డులవైపు పరుగు పెట్టించాయి. వెరసి 75 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 8,477 వద్ద నిలవగా, సెన్సెక్స్ 267 పాయింట్లు జంప్చేసి 28,335 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ గరిష్టంగా 28,361కు చేరగా, నిఫ్టీ 8,490ను తాకింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ 8,500, సెన్సెక్స్ 28,500 పాయింట్ల మైలురాళ్ల సమీపానికి చేరాయి. బీఎస్ఈలో బ్యాంకింగ్ రంగం అత్యధికంగా 2.5% ఎగసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు తెరలేపుతుందన్న అంచనాలు కూడా కొనుగోళ్లకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరిన్ని విశేషాలివీ.... ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ను విలీనం చేసుకోనున్న కొటక్ మహీంద్రా షేరు మరోసారి 4% పుంజుకోవడం ద్వారా రూ. 1,200 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9% జంప్చేసి రూ. 1,261కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, యాక్సి స్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంక్ 1.5-4% మధ్య పురోగమించాయి. ఈ బాటలో సౌత్ ఇండియా బ్యాంక్, కర్టాటక బ్యాంక్, యస్ బ్యాంక్ సైతం 5.5-4% మధ్య ఎగశాయి. గతంలో నిలిపివేసిన కేటాయింపులను విడుదల చేసేందుకు రైల్వే బోర్డు నిర్ణయించడంతో రైలు షేర్లు లాభాల పరుగందుకున్నాయి. సిమ్కో 20%, టిటాగఢ్ వ్యాగన్స్ 11%, టెక్స్మాకో 5%, కాళిందీ రైల్ 4% చొప్పున దూసుకెళ్లాయి. మరిన్ని విలీనాలకు అవకాశముందన్న అంచనాలతో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ షేర్లు పుంజుకుంటే, అవసరమైనమేర పెట్టుబడులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించడంతో ప్రభుత్వ బ్యాంకింగ్ షేర్లు పురోగమించాయి. ఇక ఎఫ్ఐఐల తాజా పెట్టుబడులకు ఆర్బీఐ అనుమతించడంతో యస్ బ్యాంక్ షేరు ఊపందుకోగా, రూ. 10 ముఖవిలువగల షేరుని రూ. 2 ముఖ విలుగల 5 షేర్లుగా విభజించేందుకు డిసెంబర్ 5ను రికార్డు డేట్గా ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంక్ జంప్ చేసింది. యస్ బ్యాంక్లో పరిమితికంటే దిగువకు ఎఫ్ఐఐల పెట్టుబడులు చేరుకోవడంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. స్పైస్జెట్ షేరు జూమ్ స్పైస్జెట్లో ప్రమోటర్లకున్న వాటాను పూర్తిగా లేదా కొంతమేర విక్రయించనున్నట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కంపెనీలో సన్ గ్రూప్నకు 53.4% వాటా ఉంది. అయితే స్పైస్జెట్ ప్రమోటర్ కళానిధి మారన్ ఎంతమేర వాటా విక్రయించేదీ స్పష్టంకాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో స్పైస్జెట్ షేరు 15% జంప్చేసింది. -
టెక్ మహీంద్రా చేతికి ఎల్సీసీ కంపెనీ
న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కంపెనీ అమెరికాకు చెందిన లైట్బ్రిడ్జ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్(ఎల్సీసీ)ని 24 కోట్ల డాలర్లు(రూ.1,468 కోట్లకు పైగా)కు కొనుగోలు చేయనున్నది. వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తయ్యే ఈ డీల్ ఈ ఏడాది అతి పెద్ద ఐటీ డీల్ అని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఎల్సీసీని పూర్తిగా నగదుతోనే టక్ మహీంద్రా కొనుగోలు చేయనున్నది. కాగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే టెక్ మహీంద్రా కంపెనీ మొత్తం ఏడు కంపెనీలను కొనుగోలు చేసింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్, హచిసన్ గ్లోబల్ సర్వీసెస్, కామ్వివా టెక్నాలజీస్ వంటివి వాటిల్లో కొన్ని. టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో నెట్వర్క్ ఇంజినీరింగ్ సర్వీస్లను అందిస్తున్న అంతర్జాతీయ పెద్ద కంపెనీల్లో ఎల్సీసీ ఒకటి. వర్జీనియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఎల్సీసీ 50 దేశాల్లో 5,700 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ వార్షికాదాయం 43 కోట్ల డాలర్లు. కాగా ఈ కంపెనీ కొనుగోలుకు అవసరమైన వనరులను అంతర్గతంగానే సమకూర్చుకుంటున్నామని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. -
టెక్ మహీంద్రా లాభం 720 కోట్లు
ఆదాయం రూ. 5,488 కోట్లు ముంబై: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి రూ. 720 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 718 కోట్లతో పోలిస్తే ఇది నామమాత్ర వృద్ధి. అయితే గత లాభాల్లో ఒక భారీ డీల్ కారణంగా లభించిన 9 మిలియన్ డాలర్లు(రూ. 54 కోట్లు) కలసి ఉన్నట్లు కంపెనీ సీఎఫ్వో మిలింద్ కులకర్ణి తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత లాభాలను రూ. 46 కోట్ల ఫారెక్స్ నష్టాలు కూడా ప్రభావితం చేసినట్లు తెలిపారు. ఇటీవల హెడ్జింగ్ వ్యూహాన్ని మార్చుకున్నామని, కరెన్సీ ఒడిదుడుకుల రక్షణ కాలాన్ని ఐదేళ్ల నుంచి రెండేళ్లకు కుదించామని చెప్పారు. డాలరుతో మారకంలో రూపాయి భారీ హెచ్చుతగ్గులకు లోనుకావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ఆదాయం మాత్రం 15% ఎగసి రూ. 5,488 కోట్లకు చేరింది. గతంలో రూ. 4,772 కోట్ల ఆదాయం నమోదైంది. డాలర్లలో చూస్తే నికర లాభం 11.8 కోట్లు, ఆదాయం 90 కోట్ల డాలర్లుగా నమోదైంది. వ్యూహాత్మక పెట్టుబడుల కొనసాగింపు ద్వారా కీలక విభాగాల్లో వృద్ధి సాధించగలిగామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక కాంట్రాక్ట్లను పొందడంపై ఆశావహంగా ఉన్నట్లు వినీత్ చెప్పారు. 95,309కు సిబ్బంది సంఖ్య క్లయింట్ల సంఖ్య 17 పెరిగి 649కు చేరగా, 2,580 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 95,309ను తాకింది. వీరిలో సాఫ్ట్వేర్ బిజినెస్లో 66,175 మంది, బీపీవో విభాగంలో 22,433 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఉద్యోగవలస(అట్రిషన్) 16% నుంచి 18%కు పెరిగింది. నగదు, తత్సమాన నిల్వలు రూ. 3,434 కోట్లుగా నమోదయ్యాయి. కమ్యూనికేషన్స్ డొమైన్, ఎంటర్ప్రైజ్ డొమైన్లలో కంపెనీకున్న ప్రత్యేకతల కారణంగా మార్కెట్లో మరింత విస్తరించగలుగుతున్నామని కంపెనీ ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 1% పెరిగి రూ. 2,397 వద్ద ముగిసింది. -
ఏపీలో ఐటీ రంగానికి తోడ్పాటు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ను ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తమవంతు సహకారం అందిస్తామని పలువురు ఐటీ రంగ ప్రముఖులు ప్రకటించారు. ఐటీ కంపెనీల సీఈవోలలో విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన సదస్సులో రాష్ట్రాన్ని డిజిటలైజ్ చేయడానికి గూగుల్ సంస్థ సహకారం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. విప్రో(రూ.150కోట్లు), టెక్ మహీంద్ర (రూ.250కోట్లు), సమీర్(రూ.80కోట్లు), టెస్సాల్వ్( రూ.250కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఆయా సంస్థల తరపున వాటి ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 16 సంస్థలకు విశాఖపట్నం, విజయవాడలలో కంపెనీలు ప్రారంభించేందుకు వీలుగా భూ కేటాయింపులు, ఇంక్యుబేషన్ సెంటర్లో స్థలాలు కేటాయించింది. ఈ సందర్భంగా ఐటీ రంగ ప్రముఖులు పలువురు తమ అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నిపుణులు రావాలి గ్రామీణ ప్రాంతాల నుంచి ఐటీ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలను రూపొందించాలి. స్టార్ట్ అప్ విలేజ్లు ఒక అద్భుత ప్రయోగం. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే విశాఖపట్నంతోపాటు ఏపీ అభివృద్ధి పథంలో సాగుతుంది. - క్రిష్ గోపాలకృష్ణన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవాలి మన యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడకుండా ఉపాధి అవకాశాలు కల్పించేస్థాయికి చేరుకోవాలి. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు పాఠ్యాంశాలలో మార్పులు అవసరం. ఐటీ రంగంలో రాష్ట్రం వృద్ధికి కాస్మోపాలిటన్ నగరంగా ఉన్న విశాఖ మెట్రోపాలిటన్ నగరంగా ఎదగాలి. - బీవీ మోహన్రెడ్డి, నాస్కామ్ ఉపాధ్యక్షుడు ప్రపంచస్థాయి స్టార్ట్ అప్ ఎకోసిస్టమ్ ఇంక్యుబేటర్ విధానం ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడింది. కేరళలో విజయవంతమైన ఈ విధానాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏపీలో అమలు చేస్తాం. స్టార్ట్ అప్ విలేజ్ విధానంతో విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. - సంజయ్ విజయ్కుమార్, సీఈవో, మోబ్మీ ఏపీ డిజిటలైజ్కు కార్యాచరణ ఏపీనీ డిజిటలైన్ చేసేందుకు 4 ప్రధాన అంశాలతో కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం. మొదటగా ఇంటర్నెట్ సేవలను తెలుగులో అందుబాటులోకి తెస్తాం. ఈ ప్రక్రియలో తెలుగు పత్రికలు, మ్యాగజైన్లను భాగస్వాములుగా చేసుకుంటాం. 2. చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ఆన్లైన్ విధానంలోకి తీసుకువస్తాం. రానున్న రెండేళ్లలో లక్ష చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను ఆన్లైన్ విధానంలోకి తీసుకురావాలన్నది లక్ష్యం. 3. వినియోగదారులను ప్రత్యేకించి మహిళా వినియోగదారులను ఆన్లైన్ విధానంలోకి తీసుకువస్తాం. 4. అన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, ఇతరవాటిని మోబైల్ డివైజస్లోకి అందుబాటులోకి తెస్తాం. - రాజన్ అనందన్, గూగుల్ సంస్థ ఎండీ -
నో టెన్షన్స్
ఎప్పుడూ కంప్యూటర్లు.. ప్రాజెక్ట్ వర్క్లతో బిజీగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు సరదాగా స్టెప్పులేశారు. జాబ్ టెన ్షన్స్కు చెక్ పెట్టేసి.. ఎంచక్కా ఎంజాయ్ చేశారు. గొంతుకలు సవరించి వినసొంపైన పాటలను అందుకున్నారు. హైటెక్సిటీలోని ఇనార్బిట్మాల్లో రేడియో మిర్చి, హీరో మోటో కార్ప్ సంస్థలు సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ‘మిర్చి క్లాష్ ఆఫ్ ది కార్పొరేట్స్’ గ్రాండ్ ఫైనల్లో బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు అదిరిపోయే డ్యాన్స్తో టెకీలు ఉర్రూతలుగించారు. ఫ్యాషన్ షోలోహొయలొలికించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కల్చరల్ ఫెస్ట్లో మిస్టర్ కార్పొరేట్గా సీటెల్ కంపెనీకి చెందిన మొహనీశ్, మిస్ కార్పొరేట్ గా ఐబీఎం ఉద్యోగిని డింపుల్ గెలిచారు. చాంపియన్స్ ట్రోఫీని టెక్ మహీంద్రా గెలుచుకుంది. -
2016-17 నాటికి 5 బిలియన్ డాలర్లు..
టెక్ మహీంద్రా ఆదాయ లక్ష్యం ఇది ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ హైదరాబాద్: సాఫ్ట్వేర్ సేవల సంస్థ టెక్ మహీంద్రా 2016-17 నాటికి 5 బిలియన్ డాలర్ల ఆదాయం లక్ష్యంగా చేసుకుంది. రానున్న రోజుల్లో తమ కంపెనీతోపాటు పరిశ్రమకూ సాఫ్ట్వేర్ రంగంలో సానుకూల ఫలితాలు ఉంటాయని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. ఇది మంచి సంకేతమని, సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ సమీపంలోని బహదూర్పల్లి వద్ద ఏర్పాటైన మహీంద్రా గ్రూప్కు చెందిన ప్రీమియర్ ఇంజనీరింగ్ కళాశాల మహీంద్రా ఇకోల్ సెంట్రల్ క్యాంపస్లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 3 బిలియన్ డాలర్ల ఆదాయంపై సుమారు 50 కోట్ల డాలర్ల నికర లాభం నమోదు చేసింది. భారీ కాంట్రాక్టుల మూలంగానే ఇంత మొత్తంలో ఆదాయం ఆర్జించగలిగామని ఆయన చెప్పారు. 4-5 బిలియన్లకు చేరుకోవడం అంత సులువేం కాదన్నారు. సత్యం కంప్యూటర్ స్కాంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నాం. సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. మాలాగే ప్రభుత్వం కూడా యోచిస్తే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. మాపై న్యాయపరమైన కేసు ఉండదని భావిస్తున్నాం. ఒకవేళ ఉంటే సవాల్ చేస్తాం’ అని స్పష్టం చేశారు. -
టెక్మహీంద్రా మొబైల్ జాబ్ ప్లాట్ఫామ్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా.. ఉద్యోగార్థుల కోసం జాతీయ స్థాయిలో మొబైల్ జాబ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో సరల్ రోజ్గార్ కార్డులను ప్రవేశపెట్టినట్లు బుధవారం ప్రకటించింది. రూ. 50 వెచ్చించి ఈ సరల్ రోజ్గార్ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సర్వీసులను పొందవచ్చని పేర్కొంది. తదనంతరం 1860-180-1100 నంబర్కు డయల్ చేసి తమకు నచ్చిన భాషలో వాయిస్కాల్ ద్వారా భారత్లోని ఏ ప్రదేశం నుంచైనా ఉద్యోగార్ధులు రిజిస్టర్ చేసుకోవచ్చని టెక్ మహీంద్రా మొబిలిటీ బిజినెస్ హెడ్ జగదీశ్ మిత్రా వెల్లడించారు. ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు, గ్రాడ్యుయేట్ కంటే కింది స్థాయిలోని(దినసరి వేతనంతో పనిచేసే వర్కర్లు, ఎంట్రీలెవెల్) కొలువుల కోసం వేచిచూసే అభ్యర్థుల మధ్య అనుసంధానకర్తగా ఈ మొబైల్ జాబ్ మార్కెట్ ప్లేస్ పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కార్పొరేట్, ప్రధాన కంపెనీలకు తమ అర్హతలను సరైన రీతిలో తెలియజేసేందుకు వీలుగా తొలిసారి రెస్యూమెలను రూపొందించుకునేవారికి తాము సహకారం కూడా అందిస్తామని మిత్రా చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)/ఎంట్రప్రెన్యూర్స్ కూడా ఈ సేవల ద్వారా రిజిస్టర్ అయినవారికి వాయిస్ కాల్స్ ద్వారా సంప్రదించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం 100కుపైగా ఉద్యోగ విభాగాల్లో లక్షకు పైబడి జాబ్స్ సరల్ రోజ్గార్ ద్వారా అందుబాటులో ఉన్నాయని టెక్ మహీంద్రా వైస్ప్రెసిడెంట్(మొబిలిటీ, వ్యాస్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో) వివేక్ చందోక్ చెప్పారు. రిటైల్, అకౌంటింగ్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషీన్ ఆపరేటర్, కుక్స్, సెక్యూరిటీగార్డులు, డెలివరీ బాయ్స్ వంటి కేటగిరీల్లో డిమాండ్ అధికంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా టెలికం రీచార్జ్ సేవలందించే రిటైల్ అవుట్లెట్స్ వద్ద ఈ సరల్ రోజ్గార్ కార్డులు లభిస్తాయని చందోక్ తెలిపారు. -
మార్కెట్ కింగ్... టీసీఎస్ రూ. 5 లక్షల కోట్లు
ముంబై: టాటా గ్రూప్నకు చెందిన సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) స్టాక్ మార్కెట్లలో సంచలనానికి తెరలేపింది. బుధవారం ట్రేడింగ్లో షేరు బీఎస్ఈలో 2% లాభపడి రూ. 2,587 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక రికార్డు ధరకాగా, తద్వారా దేశీ కార్పొరేట్ చరిత్రలోనే తొలిసారి రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి, కొత్త చరిత్రను సృష్టించింది. తొలిసారి 2004లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన టీసీఎస్ తొలిసారి 84 బిలియన్ డాలర్ల(రూ. 5,06,703 కోట్లు) విలువను అందుకున్న ఒక దేశీ కంపెనీగా కొత్త రికార్డును లిఖించింది. ఇందులో విశేషమేమిటంటే... దేశీ ఐటీ రంగంలో తరువాతి స్థానాల్లో ఉన్న ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రాల మొత్తం మార్కెట్ క్యాప్కంటే ఇది అధికం కావడ ం! ఇక టాటా గ్రూప్లోని ఇతర 16 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 3,06,334 కోట్లు మాత్రమే కావడం విశేషం! విశేషాలెన్నో... టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) మార్కెట్ క్యాప్లో 6% వాటాకు సమానం. దశాబ్దంక్రితం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్లో ఇది సగభాగం. 2004 జూలైలో ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 10 లక్షల కోట్లు. 2014 మే 9 - జూలై 23 కాలంలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 83,000 కోట్లమేర పెరిగింది. 2009 మార్చిలో నమోదైన రూ. 52,700 కోట్లతో పోలిస్తే ప్రస్తుత విలువ 10 రెట్లు ఎగసింది. అక్టోబర్ 2009లో కంపెనీ సీఈవోగా ఎన్.చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టాక కంపెనీ మరింత వృద్ధి బాటలో సాగుతూ వచ్చింది. దేశీ ఐటీ సేవలకు ద్వితీయ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ కంటే టీసీఎస్ ఆదాయం 2009-10లో రూ. 7,600 కోట్లు మాత్రమే ఎక్కువ. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఆదాయం కంటే టీసీఎస్ టర్నోవర్ రూ. 20,000 కోట్లు అధికం. ఇదే విధంగా ఇన్ఫోసిస్ నికర లాభం కంటే టీసీఎస్ లాభం 2010లో రూ. 782 కోట్లు మాత్రమే అధికం. 2013-14లో ఇన్ఫోసిస్ కంటే టీసీఎస్ రూ. 8,300 కోట్లు అధికంగా నికర లాభాన్ని ఆర్జించింది. ఇన్ఫోసిస్ సిబ్బంది సంఖ్య సుమారు 1.6 లక్షలుకాగా, టీసీఎస్లో 3 లక్షలకుపైగా సిబ్బంది ఉన్నారు. విఖ్యాత మ్యాగజీన్ ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచవ్యాప్త ఇన్నోవేటివ్ దిగ్గజాల జాబితాలో టీసీఎస్కు 40వ స్థానం లభించింది. టీసీఎస్ సంగతిదీ... 2004 ఆగస్ట్ తొలి వారంలో రూ. 850 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఆగస్ట్ 25న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. వాటాదారులకు రెండుసార్లు బోనస్ షేర్లను జారీ చేసింది. 2006 జూలైలో ఒకసారి, 2009 జూన్లో మరోసారి వాటాదారుల వద్దనున్న ఒక్కో షేరుకి మరో షేరును ఫ్రీ(బోనస్)గా ఇచ్చింది. అంటే ఐపీవోలో రూ. 85,000 ఇన్వెస్ట్చేసి 100 షేర్లను కొనుగోలు చేసిఉంటే ప్రస్తుతం ఆ విలువ రూ. 11,54,800కు చేరి ఉండేది! ఎలాగంటే ఐపీవోలో లభించిన 100 షేర్లు 2006లో 200 షేర్లుగా మారి ఉండేవి. ఆపై 2009లో మరోసారి ఈ 200 షేర్లు 400 షేర్లు అయ్యేవి. వెరసి 400 షేర్లను ప్రస్తుత ధర రూ. 2,887 తో గుణిస్తే వచ్చే విలువ రూ. 11.54 లక్షలు!! కంపెనీలో ప్రమోటర్ల వాటా 74%కాగా, విదేశీ ఇన్వెస్టర్లకు వాటా 16.5%. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 64,673 కోట్లు కాగా.. నికర లాభం 18,475 కోట్లుగా నమోదైంది. టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1లోనూ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 5.5% వృద్ధి చెందగా, డాలర్ల రూపేణా 5.7% పుంజుకుంది. ఇదే కాలంలో మరో దిగ్గజం ఇన్ఫోసిస్ ఆదాయం 2% మాత్రమే వృద్ధి చూపడం గమనార్హం. సాఫ్ట్వేర్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఈ ఏడాది ఐటీ రంగం 13-15% పురోగమించగలదని అంచనా వేసింది. ఈ బాటలో ప్రస్తుత ఏడాదికి నాస్కామ్ అంచనాలను మించిన పనితీరును చూపగలమని టీసీఎస్ ప్రకటించగా, 7-9% వృద్ధిని సాధించగలమని ఇన్ఫోసిస్ అంచనా వేసింది. తొలి క్వార్టర్లో టీసీఎస్లో ఉద్యోగుల వలస(అట్రిషన్) రేటు 12%కు చేరగా, ఇన్ఫోసిస్లో ఇది 19%పైగా నమోదైంది. గతేడాది(2013-14)లో 100 మిలియన్ డాలర్ల క్లయింట్లు 24కు చేరారు. ఇన్ఫీ 13 మంది క్లయింట్లను పొందగా, విప్రోకు 10 మంది లభించారు. దేశీ ఐటీ సర్వీసుల ఆదాయంలో కేవలం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 40% వాటాను ఆక్రమిస్తుండటం విశేషం! అయితే గతేడాది డాలర్ల రూపేణా టీసీఎస్ 16% జోరు చూపగా, ఇన్ఫీ 11.5%, విప్రో 6.4% వృద్ధిని సాధించాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి టీసీఎస్ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. టర్నోవర్లో ఉత్తర అమెరికా వాటా 53%. బ్రెజిల్, ఉరుగ్వే, చిలీ, కొలంబియా, పెరూ, అర్జెంటీనా వంటి లాటిన్ అమెరికా దేశాలలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఆఫ్రికాలో దేశాలలోనూ విస్తరణ పథంలో ఉంది. -
మళ్లీ 26 వేల పైకి సెన్సెక్స్..
మధ్య ప్రాచ్యం, ఉక్రెయిన్లలో చెలరేగిన సంక్షోభ పరిస్థితులు కొంతమేర చల్లబడటంతో ఆసియా, యూరప్ మార్కెట్లు ఊపిరి తీసుకున్నాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంట్ మెరుగైంది. మరోవైపు దేశవ్యాప్తంగా విస్తరించిన వర్షాలు, కార్పొరేట్ దిగ్గజాల ప్రోత్సాహకర ఫలితాలు వంటి అంశాలు ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నాయి. వెరసి వరుసగా ఆరో రోజు మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. సెన్సెక్స్ 311 పాయింట్లు ఎగసి చరిత్రలో రెండోసారి 26,000 పాయింట్లను అధిగమించింది. 26,026 వద్ద ముగిసింది. ఇంతక్రితం ఈ నెల 7న మాత్రమే తొలిసారి 26,100 వద్ద నిలవడం ద్వారా సెన్సెక్స్ రికార్డు సృష్టించింది. అయితే ఆ మర్నాడు అంటే జూలై 8న అత్యధికంగా 26,190 పాయింట్లను తాకింది. ప్రస్తుతం ఈ రికార్డుకు చేరువకావడం గమనార్హం. ఇక నిఫ్టీ సైతం 84 పాయింట్లు పుంజుకుని 7,768 వద్ద నిలిచింది. గత ఆరు రోజుల్లో సెన్సెక్స్ 1,018 పాయింట్లు లాభపడటం విశేషం! ఆసియా, యూరప్ మార్కెట్లు లాభపడటం దేశీయంగానూ సెంటిమెంట్కు బలాన్నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికి బ్లూచిప్ కంపెనీల ఆకర్షణీయ ఫలితాలు జత కలిశాయని తెలిపారు. దీంతో సమయం గడిచేకొద్దీ ఇండెక్స్ షేర్లకు డిమాండ్ పెరిగిందని విశ్లేషించారు. వెలుగులో టెలికం షేర్లు... ట్రాయ్ ప్రతిపాదనల నేపథ్యంలో టెలికం షేర్లు వెలుగులో నిలిచాయి. అన్ని కేటగిరీల స్పెక్ట్రమ్నూ టెలికం కంపెనీలు పంచుకునేందుకు ట్రాయ్ అంగీకరించడంతో టెలికం షేర్లకు డిమాండ్ పెరిగింది. దీనికితోడు ఐడియా ఆకర్షణీయ ఫలితాలు సాధించడం కూడా ఇందుకు దోహదపడింది. భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులర్ 5% జంప్చేయగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 4%, ఎంటీఎన్ఎల్ 2% చొప్పున పరోగమించాయి. దారి చూపిన ఆర్ఐఎల్ ప్రోత్సాహకర ఫలితాల కారణంగా ఆయిల్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ మరోసారి 3.4% ఎగసింది. మార్కెట్ల పురోగమనానికి దారి చూపింది. ఈ బాటలో బ్లూచిప్ షేర్లు హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, హిందాల్కో, విప్రో, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3-1.5% మధ్య లాభపడ్డాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో ఐదు మాత్రమే నీరసించాయి. మారుతీ, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, భెల్, యాక్సిస్ బ్యాంక్ 1-0.5% మధ్య నష్టపోయాయి. బీఎస్ఈ-500 సూచీలో ఇండొకో రెమిడీస్ 18% దూసుకెళ్లి రూ. 194 వద్ద ముగిసింది. గోవాలోని 2 ప్లాంట్లకు యూఎస్ ఎఫ్డీఏ అనుమతి లభించడం దీనికి కారణమైంది. ఈ బాటలో మిడ్ క్యాప్ షేర్లకు డిమాండ్ కనిపించింది. మిగిలిన షేర్లలో జేబీ కెమ్, ఫైనాన్షియల్ టెక్, టిమ్కెన్, జామెట్రిక్, నోవర్టిస్, వొకార్డ్, పీఐ ఇండస్ట్రీస్, మైండ్ట్రీ, ఎఫ్డీసీ, నాల్కో 10-6% మధ్య ఎగశాయి. సోమవారం రూ. 161 కోట్లు ఇన్వెస్ట్చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 412 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. -
కేంద్రానికి హైకోర్టులో చుక్కెదురు
టెక్ మహీంద్ర వ్యవహారంలో అప్పీళ్లు కొట్టివేత రూ.10వేల జరిమానా విధింపు ఇలాగైతే పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం తప్పదు సీఎల్బీ సభ్యుని తీరుపై హైకోర్టు మండిపాటు అతని తీరుపై కన్నేసుంచాలని కేంద్రానికి ఆదేశం హైదరాబాద్: టెక్ మహీంద్ర వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టెక్ మహీంద్ర, ఆ కంపెనీ సెక్రటరీ జయరామన్లపై వచ్చిన నేరారోపణలను మాఫీ(కాంపౌండ్) చేస్తూ చెన్నై కంపెనీ లా బోర్డు(సీఎల్బీ) ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ సహాయ డెరైక్టర్ డి.ఎ. సంపత్ దాఖలు చేసిన కంపెనీ అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. ఒక్కో అప్పీల్కు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. ఈ కేసులో కంపెనీ లా బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరును సైతం న్యాయమూర్తి తప్పుపట్టారు. టెక్ మహీంద్ర, ఆ కంపెనీ సెక్రటరీపై వచ్చిన ఆరోపణలను మాఫీ (కాంపౌండ్) చేసే సమయంలో హైకోర్టు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, మాఫీ ఉత్తర్వులు జారీ చేయడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను యథాతథంగా అమలు చేయడం నేర్చుకోవాలని సూచించారు. అలాచేయకపోతే ప్రజల్లో సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని, అలాగే కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనీ హెచ్చరించారు. చెన్నై కంపెనీ లా బోర్డు కార్యకలాపాలు సవ్యంగా సాగేందుకు ఆ సభ్యుని పనితీరుపై ఓ కన్నేసి ఉంచడం మంచిదని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శిని కూడా జస్టిస్ నాగార్జునరెడ్డి ఆదేశించారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో టెక్ మహీంద్రకు, జయరామన్కు సంబంధం లేదని తెలిసినా కేంద్రం అనవసరంగా ఈ అప్పీళ్లను దాఖలు చేసిందని, ఈ వైఖరి ఎంత మాత్రం సరికాదన్నారు. ఇటువంటి వైఖరి వల్ల సత్యం కంప్యూటర్స్లా ఇబ్బందుల్లో కూరుకుపోయిన కంపెనీలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తారన్నారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనిని సీబీఐ కూడా ధ్రువీకరించినందున, తమపై మోపిన ఆరోపణలను మాఫీ చేయాలంటూ టెక్ మహీంద్ర, జయరామన్లు 2011లో చెన్నై కంపెనీ లా బోర్డులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కంపెనీ లా బోర్డు ఇందుకు అంగీకరించకుండా వారి పిటిషన్లను కొట్టివేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, తిరిగి ఈ వ్యాజ్యాలను కంపెనీ లా బోర్డుకు నివేదించి, నేరారోపణలను మాఫీ చేయాలా? వద్దా? అన్న విషయంపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, సరైన కారణాలు వివరిస్తూ ఉత్తర్వులివ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కంపెనీ లా బోర్డు విచారణ జరిపి, నేరారోపణలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేయగా.. న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి వాటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. -
సత్యం కుంభకోణం కేసు...
టెక్ మహీంద్ర పిటిషన్పై 30న హైకోర్టు తీర్పు హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టెక్ మహీంద్ర దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు ఈ నెల 30న తీర్పు వెలువరిస్తానని స్పష్టం చేశారు. సత్యం కంప్యూటర్స్పై నమోదు చేసిన కేసును ఆ కంపెనీని విలీనం చేసుకున్న తరువాత కూడా ఈడీ తమపై కొనసాగిస్తూ చార్జిషీట్లో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాలు టెక్ మహీంద్ర హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపించారు. సత్యం కుంభకోణం తరువాత ఆ కంపెనీ బాధ్యతలు చూడాలని కేంద్రం కోరితేనే తాము ఆ బాధ్యతలు స్వీకరించామని, అటువంటి తమను నిందితుల జాబితాలో చేర్చడం ఎంత మాత్రం సరికాదని తెలిపారు. సత్యం కంప్యూటర్స్, టెక్ మహీంద్ర విలీనానికి ఆమోదముద్ర వేస్తూ ఇదే హైకోర్టు తీర్పునిచ్చిందని, సత్యంపై ఉన్న కేసులన్నింటికీ కూడా టెక్ మహీంద్ర బాధ్యత వహించాలని ఆ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. -
మూడు వారాల కనిష్టం
251 పాయింట్లు పతనం 25,063 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఆయిల్, రియల్టీ రంగాలు బోర్లా అదే బాటలో బ్యాంకింగ్, మెటల్ మళ్లీ భారీగా పెరిగిన టర్నోవర్ 7,493కు దిగిన నిఫ్టీ-76 పాయింట్లు డౌన్ సహజవాయువు ధరల పెంపు నిర్ణయాన్ని కేంద్రం 3 నెలలు వాయిదా వేయడంతో ఆయిల్ రంగ షేర్లు దెబ్బతిన్నాయి. మరోవైపు జూన్ డెరివేటివ్ కాంట్రాక్ట్ల ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో కొనుగోళ్లు కరువయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 25,063 వద్ద ముగిసింది. గత వారం రోజుల్లో ఇదే గరిష్ట పతనంకాగా, ఒక దశలో కనిష్టంగా 25,021ను తాకింది. ఇక నిఫ్టీ కూడా 76 పాయింట్లు క్షీణించింది. 7,500 పాయింట్ల కీలక స్థాయికి దిగువన 7,493 వద్ద నిలిచింది. మంగళవారంనాటి స్థాయిలో మరోసారి ఎక్స్ఛేంజీలలో టర్నోవర్ భారీగా పుంజుకుంది. ఎన్ఎస్ఈ ఎఫ్అండ్వోలో రూ. 4.29 లక్షలకోట్లకుపైగా నమోదుకాగా, బీఎస్ఈలో రూ. 2.31 లక్షల కోట్లు జరిగింది. వెరసి మొత్తం టర్నోవర్ రూ. 6.83 లక్షల కోట్లకు చేరింది. ఇది మార్కెట్ చరిత్రలో రెండో అత్యధిక టర్నోవర్ కావడం విశేషం! వర్షాభావ పరిస్థితులపై వాతావరణ శాఖ తాజా అంచనాలు కూడా సెంటిమెంట్ను దెబ్బకొట్టినట్లు అంచనా. ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ డీలా..: ఆయిల్ దిగ్గజాలలో ఓఎన్జీసీ 6% పతనంకాగా, ఆర్ఐఎల్ 4% దిగజారింది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, హెచ్పీసీఎల్, ఐవోసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్ 5-2% మధ్య నీర సించాయి. బీఎస్ఈ ఆయిల్ ఇండెక్స్ 4% పడిపోగా, రియల్టీ 3% క్షీణించింది. రియల్టీ షేర్లలో డీబీ దాదాపు 7% పతనంకాగా, యూనిటెక్, డీఎల్ఎఫ్, అనంత్రాజ్, ఇండియాబుల్స్, హెచ్డీఐఎల్ 4-3% మధ్య నష్టపోయాయి. కాగా, బ్యాంకింగ్, మెటల్ రంగాలు సైతం 1% చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు..: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 602 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ట్రేడైన షేర్లలో 1,539 నష్టపోగా, 1,490 లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్లో ఎస్ఈ ఇన్వెస్ట్మెంట్స్, శ్రేయుంజ్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్, బీఈఎంఎల్, సియట్, మహీంద్రా సీఐఈ, జిందాల్ స్టీల్ 7-4% మధ్య క్షీణించాయి. అయితే మరోవైపు కేశోరాం, బాష్, దివాన్ హౌసింగ్, శ్రేయీ ఇన్ఫ్రా, టాటా ఎలక్సీ, ఎస్సార్ ఆయిల్, హెచ్సీసీ, ఫినొలెక్స్ ఇండస్ట్రీస్, అబాన్ ఆఫ్షోర్, పేజ్ ఇండస్ట్రీస్, జీఎస్పీఎల్, యూనికెమ్ 8.5-4.5% మధ్య పుంజుకున్నాయి. -
టెక్ మహీంద్రా లాభం రూ. 614 కోట్లు
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా జనవరి-మార్చి(క్యూ4) కాలానికి దాదాపు 4% తక్కువగా రూ. 614 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 638 కోట్లను ఆర్జిం చింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఇదే కాలానికి కంపెనీ ఆదాయం మాత్రం 34%పైగా పుంజుకుని రూ. 5,058 కోట్లయ్యింది. అంతక్రితం రూ. 3,767 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీలో సత్యం కంప్యూటర్స్ విలీనమైన సంగతి తెలిసిందే. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 10.1 కోట్ల డాలర్లకు చేరగా, ఆదాయం 18%పైగా ఎగసి 82.5 కోట్ల డాలర్లను తాకింది. వేగంగా మారుతున్న ప్రపంచంలో కస్టమర్ల నుంచి డీల్స్ పొందడం, వృద్ధిని అందుకోవడం వంటి అంశాలలో పటిష్ట పనితీరును చూపుతున్నామని, ఈ విషయాన్ని ఫలితాలు వెల్లడిస్తున్నాయని కంపెనీ ఎండీ సీపీ గుర్నానీ వ్యాఖ్యానించారు. వాటాదారులకు షేరుకి రూ. 10 డివిడెండ్ను చెల్లించనుంది. పూర్తి ఏడాదికి పూర్తి ఏడాదికి(2013-14) మాత్రం కంపెనీ నికర లాభం దాదాపు 55% జంప్చేసి రూ. 3,029 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ. 1,956 కోట్ల లాభం నమోదైంది. ఇదే కాలానికి ఆదాయం కూడా 31%పైగా ఎగసి రూ. 18,831 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 14,332 కోట్ల ఆదాయాన్ని సాధించింది. డాలర్ల రూపేణా నికర లాభం 49.8 కోట్ల డాలర్లుకాగా, ఆదాయం దాదాపు 18% పుంజుకుని 309 కోట్ల డాలర్లుగా నమోదైంది. దేశీయంగా అతిపెద్ద విలీనాన్ని పూర్తిచేయడం ద్వారా సమీకృత కంపెనీగా ఎదిగినట్లు కంపెనీ వైస్చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. కొత్తగా 6,333 మందికి ఉద్యోగాలివ్వడం ద్వారా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 89,441ను చేరింది. దీనిలో సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య 60,997కాగా, బీపీవో విభాగంలో 21,830 మంది పనిచేస్తున్నారు. మార్చి చివరికల్లా రూ. 363 కోట్లమేర రుణాలు నమోదుకాగా, నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 3,599 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 1% లాభపడి రూ. 1,838 వద్ద ముగిసింది. -
స్టాక్ మార్కెట్లో హైటెన్షన్
ఎగ్జిట్ పోల్స్తో భారీ ఒడిదుడుకులు మార్కెట్ కదలికలపై స్టాక్ నిపుణుల అంచనాలు నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల శుక్రవారం ఉదయం నుంచి ఎన్నికల ఫలితాలు నేడు ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు గురువారం టోకు ధరల ద్రవ్యోల్బణం వివరాలు పీఎన్బీ, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా ఫలితాలు న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం(12న)తో ముగియనుంది. దీంతో సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన అర్థగంట తరువాత నుంచి వివిధ సంస్థలు నిర్వహించిన అభిప్రాయ సేకరణ (ఎగ్జిట్ పోల్) ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇవి ముగిశాక శుక్రవారం(16న) ఉదయం నుంచీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అసలు ఫలితాల లెక్కింపు మొదలుకానుంది. వెరసి ఈ వారం స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూసే అవకాశమున్నదని అత్యధిక శాతం నిపుణులు అంచనా వేశారు. సుస్థిర ప్రభుత్వమైతే ఓకే ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లు మెరుగుపడతాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ వైస్ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. ఇక ఆర్థిక అంశాల విషయానికివస్తే సోమవారం(12న) మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటితోపాటు ఏప్రిల్ రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు తెలియనున్నాయి. ఇక గురువారం(15న) టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. మరోవైపు మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు క్యూ4 ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ ఉన్నాయి. సీట్ బెల్ట్లు బిగించుకోవలసిందే.... ఆర్థిక గణాంకాలు, దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు, లోక్సభ ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లకు అత్యంత కీలకంగా నిలవనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లేదా బ్రోకర్లు ఎవరైనాగానీ మార్కెట్లో నమోదయ్యే వేగవంతమైన కదలికలను తట్టుకునేందుకు సీట్ బెల్ట్లు బిగించుకోవలసిందేనని వ్యాఖ్యానించారు. సోమవారం వెల్లడికానున్న ఎగ్జిట్ పోల్స్ కారణంగా మార్కెట్ ఆశ్చర్యకర కదలికలను నమోదు చేసే అవకాశముందని చెప్పారు. ఫలితాలదే పైచేయి కంపెనీల ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలున్నప్పటికీ మార్కెట్ ట్రెండ్ను నిర్దేశించేది ఎన్నికల ఫలితాలేనని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. ఈ అన్ని అంశాల నేపథ్యంలో మార్కెట్లలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నదని, అయితే సానుకూల ధృక్పథంతో కొనసాగవచ్చునని తెలిపారు. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా సమీప కాలంలో మార్కెట్ల కదలికలు ఉంటాయని అత్యధిక శాతం మంది నిపుణులు వివరించారు. ఈ వారం అత్యంత కీలకంగా నిలవనుందని చెప్పారు. ఫలితాలు వెల్లడయ్యే రోజు దగ్గరపడుతున్నకొద్దీ మార్కెట్లో సెంటిమెంట్ బలపడుతున్నదని, సానుకూల ఫలితాలను ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారని తెలిపారు. ఇన్వెస్ట్ చేయొచ్చు... ప్రస్తుతం ఈక్విటీలలో పెట్టుబడులకు అత్యంత అనువైన సమయమని ఏంజెల్ బ్రోకింగ్ చైర్మన్ దినేష్ ఠక్కర్ పేర్కొన్నారు. స్టాక్స్లో పెట్టుబడులను కొనసాగించవచ్చునని చెప్పారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలతో గడిచిన శుక్రవారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 650 పాయింట్లు హైజంప్ చేసిన విషయం విదితమే. ఫలితంగా స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 23,000 పాయింట్లను అధిగమించింది కూడా! రూ. 5,000 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ: ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లో రూ. 5,000 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు ప్రధానంగా జోష్ నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా సంస్కరణల అమలు వేగమందుకుంటుందని, పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్ఐఐలు ఆశిస్తున్నట్లు తెలిపారు. వెరసి గడిచిన వారంలో(2-9) నికరంగా రూ. 2,124 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, మరో రూ. 2,871 కోట్లను బాండ్లు తదితర డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేశారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 5,000 కోట్లు(83 కోట్ల డాలర్లు). మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. 9 దశలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటి(12)తో ముగియనుంది. ఫలితాలు శుక్రవారం(16న) వెల్లడికానున్నాయి. ఈ అంచనాలతో ఇటీవల ఎఫ్ఐఐల పెట్టుబడుల జోరు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్ఐఐల పెట్టుబడులు ఒక్క స్టాక్స్లోనే రూ. 33,923 కోట్లకు చేరుకున్నాయి. ఈ బాటలో రుణ మార్కెట్లో సైతం రూ. 29,217 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. -
ఎన్ఎస్ఈఎల్, జిగ్నేష్లపై సీబీఐ
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) కార్యాలయాలతోపాటు ప్రమోటర్ జిగ్నేష్ షా, తదితర అధికారులకు సంబంధించిన 15 ప్రాంతాలలో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఎన్ఎస్ఈఎల్కు ముంబైలోగల ప్రధాన కార్యాలయంతోపాటు, దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో ఈ తనిఖీలను చేపట్టింది. ప్రభుత్వ రంగ ట్రేడింగ్ సంస్థ పీఈసీ చేసిన పెట్టుబడుల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న కేసులో సీబీఐ ఈ సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ సంస్థను మోసం చేసిందన్న అభియోగాలపై ఎన్ఎస్ఈఎల్సహా, ప్రమోటర్ జిగ్నేష్ షాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎన్ఎస్ఈఎల్ మాజీ సీఈవో అంజనీ సిన్హా, పీఈసీ సీజీఎం రాజీవ్ చతుర్వేది తదితర అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. మోసం, లంచగొండితనం, ఫోర్జరీల కింద కేసును నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముంబైలోని తమ కార్యాలయానికి జిగ్నేష్ షాను తీసుకెళ్లిన సీబీఐ అధికారులు పలు విధాలుగా షాను ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పీఈసీ అధికారులకూ పాత్ర 2007-13 కాలంలో వ్యవసాయ కమోడిటీలకు సంబంధించి కృత్రిమ పద్ధతిలో లావాదేవీలను నిర్వహించడం ద్వారా కొంతమంది మోసానికి పాల్పడ్డారని, తద్వారా ప్రభుత్వానికి రూ. 120 కోట్లమేర నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. దీనిలో భాగంగా పీఈసీకి చెందిన ఐదుగురు అధికారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ముంబై ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించినట్లు సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈఎల్ను ప్రమోట్ చేసిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్, అదే గ్రూప్నకు చెందిన ఎంసీఎక్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 4.4% పతనమై రూ. 378 వద్ద నిలవగా, ఎంసీఎక్స్ సైతం 4.6% దిగజారి రూ. 516 వద్ద ముగిసింది. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్లకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను చేపట్టలేక సంక్షోభంలో చిక్కుకున్న ఎన్ఎస్ఈఎల్ గతేడాది జూలైలో మూతపడ్డ సంగతి తెలిసిందే. కాగా, పీఈసీ లావాదేవీలకుగాను డెలివరీ చేయాల్సిన సరుకు గోదాముల్లో ఉన్నట్లు, ఇందుకు సంబంధించిన పత్రాలను జారీ చేసినట్లు ఎన్ఎస్ఈఎల్ పేర్కొన్న విషయాలు కూడా సరికాదని సీబీఐ దర్యాప్తులో తేలింది. సెబీ మాజీ చైర్మన్ భవేపైనా... ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల సంక్షోభం కేసును పరిశోధిస్తున్న సీబీఐ, మరోవైపు సెబీ మాజీ చైర్మన్ సీబీ భవేపైనా దృష్టి పెట్టింది. ఎన్ఎస్ఈఎల్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షాకు చెందిన ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎక్స్)కు 2008లో లెసైన్స్ మంజూరు చేసిన అంశంలో భవేపై సీబీఐ ప్రాథమిక విచారణ(పీఈ) మొదలుపెట్టింది. భవేతోపాటు, సెబీ మాజీ సభ్యుడు కేఎం అబ్రహం, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఎంసీఎక్స్లపైనా పీఈకి తెరలేపింది. బోర్డు సభ్యుల రాజీనామా? సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టిన నేపథ్యంలో సంస్థ చైర్మన్ జీకే పిళ్లైతోపాటు, బోర్డు సభ్యులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం బోర్డు అత్యవసరంగా సమావేశమవుతోందని పిళ్లైసహా వైస్చైర్మన్ థామస్ మాథ్యూ తదితరులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశముందని సమాచారం. -
క్యూ3లో ఎఫ్ఐఐల భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ కాలం(క్యూ3)లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీ స్టాక్స్లో 600 కోట్ల డాలర్లను(రూ. 37,000 కోట్లకుపైగా) ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం ఏడాది ఇదే కాలం(2012-13 క్యూ3)లో నమోదైన 70 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇవి దాదాపు 9 రెట్లు అధికమని బ్యాంక్ అమెరికా ఆఫ్ మెరిల్లించ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అయితే ఇదే కాలంలో ఎల్ఐసీసహా దేశీ మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థలు నికర అమ్మకందారులుగా నిలవడం గమనార్హం. ఏప్రిల్లో జరగనున్న సాధారణ ఎన్నికలలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అంచనాలు ఇందుకు దోహదపడినట్లు తెలిపింది. కాగా, దేశీ మార్కెట్లలో వరుసగా ఐదో క్వార్టర్లో ఎఫ్ఐఐలు నికర పెట్టుబడిదారులుగా నిలిచినట్లు వెల్లడించింది. సాఫ్ట్వేర్ షేర్లలో ఎఫ్ఐఐలు అత్యధికంగా ఇన్వెస్ట్చేయగా, టెక్ మహీంద్రాలో 45.1 కోట్ల డాలర్లను, ఇన్ఫోసిస్లో 37.2 కోట్ల డాలర్లను, హెచ్సీఎల్ టెక్లో 25.7 కోట్ల డాలర్లను, విప్రో షేర్లలో 24.6 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసినట్లు నివేదిక వివరించింది. -
టెక్ మహీంద్రా లాభం 3 రెట్ల వృద్ధి
చెన్నై: ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 1,010 కోట్లకు చేరింది. టెలికం, ఫైనాన్షియల్, తయారీ రంగ విభాగాలలో సాధించిన వృద్ధి ఇందుకు దోహదపడినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు.గతేడాది(2012-13) ఇదే కాల ంలో కేవలం రూ. 322 కోట్ల లాభాన్ని ఆర్జి ంచింది. ఇక ఈ కాలంలో ఆదాయం సైతం దాదాపు 34% పుంజుకుని రూ. 4,898 కోట్లను అధిగమించింది. అంతక్రితం రూ. 3,668 కోట్ల ఆదాయం నమోదైంది. డాలర్లలోనూ...: డాలర్ల ప్రాతిపదికన కూడా కంపెనీ ఆదాయం 17%పైగా వృద్ధితో 79.1 కోట్ల డాలర్లను తాకింది. నికర లాభం 16.31 కోట్ల డాలర్ల నుంచి 17.57 కోట్ల డాలర్లకు చేరింది. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వ్యూహాలను, పెట్టుబడులను వినియోగిస్తున్నట్లు కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ చెప్పారు. డిజిటల్ ఎంటర్ప్రెజెస్కు అవసరమైన సొల్యూషన్లు అందించడంపై దృష్టిపెట్టడం ద్వారా వృద్ధిని సాధిస్తున్నట్లు వివరించారు. మరిన్ని విశేషాలివీ... క్యూ3లో నికరంగా 2,165 మందికి ఉద్యోగాలిచ్చింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 87,399కు చేరింది. ఉద్యోగుల్లో 57,601 మంది సాఫ్ట్వేర్ సేవల్లోనూ, 23,213 మంది బీపీవో కార్యకలాపాల్లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
భాగ్యనగరంలో చెస్ పండుగ
25 నుంచి గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: మీ పిల్లలను చెస్ ప్లేయర్ను చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. ప్రపంచ చెస్ చాంపియన్షిప్ భారత్లో జరుగుతున్నందున... దేశంలో నాలుగు చెస్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి హైదరాబాద్లో ఈ నెల 25 నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న చెస్ క్రీడాకారులందరికీ ఉపయోగపడేలా ఈ టోర్నీని ఒక పండుగలా నిర్వహించబోతున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్ లంక రవి, ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం కార్యదర్శి కన్నారెడ్డి ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 24న జార్జియా గ్రాండ్ మాస్టర్ సనికెడ్జె... పిల్లలకుచెస్లో మెళకువలు నేర్పుతారు. పదో తరగతి, ఇంటర్ చదువుకునే పిల్లలెవరైనా... తమ ఐడీ కార్డ్ తీసుకుని హైదరాబాద్ శివార్లలోని బహదూర్పల్లిలో ఉన్న టెక్ మహీంద్ర ఆఫీస్కు వెళితే చాలు. ప్రవేశం ఉచితం. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 11 గంటల నుంచి సాయంత్రం వరకు క్లాస్ ఉంటుంది. 25న గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీ ప్రారంభమవుతుంది. ఇందులో 15 దేశాల నుంచి సుమారు 90 మంది క్రీడాకారులు పాల్గొంటారు. 1900 రేటింగ్ కంటే ఎక్కువ ఉన్నవారు ఇందులో పాల్గొంటారు. ఈ టోర్నీ డిసెంబరు 3 వరకు జరుగుతుంది. లలిత్బాబు, దీప్సేన్ గుప్తా తదితర గ్రాండ్ మాస్టర్లు ఇందులో ఆడతారు. టోర్నీ జరిగే కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 25న సైబర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ర్యాపిడ్ చెస్ టోర్నీ నిర్వహిస్తారు. వయసుతో సంబంధం లేకుండా ఔత్సాహికులంతా పాల్గొనవచ్చు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకుంటే 24న సాయంత్రం 6 గంటల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వివరాలకు 9959988766 ఫోన్ నంబర్లో సంప్రదించాలి. 25న ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ ‘చార్మినార్ చాలెంజ్’ కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనాలంటే 24న రాత్రి 8 గంటల్లోగా రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. స్కూల్ ఐడీ, యూనిఫామ్, చెస్ బోర్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. వివరాలకు 9247188018, 9032455655 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. 26 నుంచి 2100 రేటింగ్ కంటే తక్కువ ఉన్న ఆటగాళ్ల కోసం టోర్నీ ప్రారంభమవుతుంది. రేటింగ్ పాయింట్లు లేని రాష్ట్ర క్రీడాకారులు పలువురు పాల్గొంటున్నారు. -
టెక్ మహీంద్రా లాభం 718 కోట్లు
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి(క్యూ2) ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం దాదాపు 58% ఎగసి రూ. 718 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో రూ. 456 కోట్లను మాత్రమే ఆర్జించింది. రిటైల్, ట్రావెల్, లాజిస్టిక్స్ తదితర విభాగాలకుతోడు యూరప్ దేశాల నుంచి పెరిగిన డిమాండ్ ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. ఇదే కాలానికి కంపెనీ ఆదాయం 35%పైగా పుంజుకుని రూ. 4,771 కోట్లకు చేరింది. గతంలో రూ. 4,103 కోట్లు నమోదైంది. కాగా, కంపెనీలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం మహీంద్రా సత్యం విలీనం నేపథ్యంలో కన్సాలిడేటెడ్ ఫలితాలపై ఆడిట్ నివేదికను కోరలేదని కంపెనీ పేర్కొంది. సత్యంను పూర్తిస్థాయిలో విలీనం చేసుకున్నట్లు ఈ ఏడాది జూన్లో టెక్ మహీంద్రా వెల్లడించిన విషయం విదితమే. ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ రూ. 26 కోట్లమేర ఫారెక్స్ నష్టాలను నమోదు చేసుకుంది. గతంలో ఈ పద్దుకింద రూ. 134 కోట్లను ఆర్జించింది. డాలర్ల ప్రాతిపదికన సైతం డాలర్ల ప్రాతిపదికన టెక్ మహీంద్రా ఆదాయం 17.6% పెరిగి 75.8 కోట్ల డాలర్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇది 4.7% అధికం. ఇక నికర లాభం మరింత ఎక్కువగా 36.4% జంప్ చేసి 11.4 కోట్ల డాలర్లకు చేరింది. ఫలితాల సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ వినీత్ నయ్యర్ మాట్లాడుతూ భవిష్యత్ తరం వినియోగదారులకు అవసరమైన సేవలను అందించడంతోపాటు, అన్ని విభాగాలనూ సమన్వయపరచడం ద్వారా పటిష్టమైన పనితీరును చూపగలమన్నారు. ఆలోచనాత్మక పెట్టుబడులు, కస్టమర్లపై నిరంతర దృష్టి వంటి అంశాలు భారీ డీల్స్కు తోడ్పడుతున్నాయని కంపెనీ ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. కంపెనీ షేరు బీఎస్ఈలో 0.5% బలపడి రూ. 1,580 వద్ద ముగిసింది. మరిన్ని విశేషాలివీ మొత్తం సిబ్బంది సంఖ్య 85,234 మందికాగా, సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య 55,432. రుణ భారాన్ని రూ. 412 కోట్ల నుంచి రూ. 335 కోట్లకు తగ్గించుకుంది. సెప్టెంబర్ చివరినాటికి నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 3,273 కోట్లుగా నమోదైంది. . -
టెక్ మహీంద్రా లాభం 27% అప్
ముంబై: తొలి క్వార్టర్కు టెక్ మహీంద్రా 27% అధికంగా రూ. 686 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో అంటే ఏప్రిల్-జూన్’12లో రూ. 540 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇదే కాలానికి ఆదాయం కూడా దాదాపు 22% ఎగసి రూ. 4,103 కోట్లకు చేరింది. గతంలో రూ. 3,373 కోట్లు నమోదైంది. దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద విలీనాన్ని సమర్ధవంతంగా పూర్తిచేశామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. డాలర్లలోనూ తొలి క్వార్టర్కు డాలర్లలో టెక్ మహీంద్రా నికర లాభం 22% పుంజుకుని 12.1 కోట్లను తాకింది. ఇక ఆదాయం కూడా దాదాపు 18% ఎగసి 72.4 కోట్ల డాలర్లుగా నమోదైంది. వైస్రాయ్ హోటల్స్ నష్టం రూ.3 కోట్లు హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి వైస్రాయ్ హోటల్స్ రూ.17 కోట్ల ఆదాయంపై (కన్సాలిడేటెడ్) రూ.3 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.16 కోట్ల ఆదాయంపై రూ. 2 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.