శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్వీటర్ 336 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ లో మొత్తం 4,100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో తొలగిస్తున్న ఉద్యోగులు 8%గా ఉన్నారు. కంపెనీ వ్యయాలను తగ్గించే దిశగా ట్వీటర్ సీఈవో జాక్ డార్సే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ట్వీటర్ నిధుల కొరతతో సతమతమౌతోంది. ట్వీటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డార్సే ఇటీవలనే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
వ్యయాలను తగ్గించుకోవడం వల్ల లాభాలు పెరగొచ్చు కానీ అదే సమయంలో ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడటం, కం పెనీ భవిష్యత్తు వంటి తదితర అంశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
ట్వీటర్లో 336 ఉద్యోగాల కోత
Published Wed, Oct 14 2015 12:41 AM | Last Updated on Sat, Aug 25 2018 6:41 PM
Advertisement
Advertisement