వైజాగ్‌ స్టీల్‌ ఆదాయ లక్ష్యం రూ.18,000కోట్లు | Vizag Steel revenue target is Rs. 18,000 crores | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ స్టీల్‌ ఆదాయ లక్ష్యం రూ.18,000కోట్లు

Published Mon, May 14 2018 1:19 AM | Last Updated on Mon, May 14 2018 1:19 AM

Vizag Steel revenue target is Rs. 18,000 crores - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలో సెయిల్‌ తర్వాత రెండో అతిపెద్ద స్టీల్‌ తయారీ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (వైజాగ్‌ స్టీల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.18,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఆదివారంనాడిక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ సీఎండీ పి.మధుసూదన్‌ తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో వైజాగ్‌ స్టీల్‌ రూ.16,625 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఇక, గడిచిన ఆర్థిక సంవత్సరంలో విక్రయించతగిన స్టీల్‌ ఉత్పత్తి 4.5 మిలియన్‌ టన్నులుగా ఉండగా, దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.7 మిలియన్‌ టన్నుల స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నట్టు మధుసూదన్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement