
సాక్షి, ముంబై: టెలికాం సంస్థ వొడాఫోన్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.69 ల ఒక కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. 28 రోజల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్లో 150 నిమిషాల వాయిస్ కాల్స్, 250 ఎంబీ డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది. అలాగే పలు సర్కిల్స్లో ఈ ప్లాన్లో ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, అస్సాం, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. తన ఆల్ రౌండర్ ప్రీ పెయిడ్ ప్లాన్లలో ఈ కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. తన పోర్ట్ఫోలియోలోఇప్పటికే లాంచ్ చేసిన రూ .45 , 35, 65, 95, రూ .145 ప్లాన్లకు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment