సాక్షి, న్యూఢిల్లీ: ఎట్టకేలకు వాట్సాప్ వినియోగదారులకు తీపికబురు అందింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్లో ఒకరికంటే ఎక్కువమంది గ్రూప్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు వెర్షన్లలోనూ ఈ ఫీచర్ను విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఫేస్బుక్ డెవలపర్ కాన్ఫరెన్స్లో వాట్సాప్ వీడియో కాలింగ్ సదుపాయం ప్రవేశపెట్టబోతున్నట్లు ఫేస్బుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఒక గ్రూపులోని పలువురు సభ్యులు లేదా, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకుమించి సభ్యులు ఈ ఫీచర్ ద్వారా వీడియో ద్వారా సంభాషించుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బేటా 2.18.155 వెర్షన్ వాడుతున్న ఎంపిక చేయబడిన కొంతమంది వినియోగదారులకు తాజాగా ఒక వీడియో కాల్నుఫీచర్ను వినియోగించుకోవచ్చు. ఐవోఎస్ ఆధారిత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ 2.18.52 వెర్షన్లో ఈ గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు వాట్సాప్ వెల్లడించింది. ఇందుకోసం యూజర్లు వీడియో కాల్స్ ఆప్షన్ను ఎంచుకుని, మాట్లాడాలనుకున్న వారితో హ్యాపీగా మాట్లాడు కోవచ్చు. మరోవైపు ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుందని వాట్సాప్ ఫ్యావరెట్ సైట్ WaBetaInfo నివేదించింది. అయితే త్వరలోనే ప్రతి వినియోగదారుడికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. దీనికనుగుణంగానే చాలామంది వాట్సాప్ యూజర్లు ఈ కొత్త గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఇంకా తమకు అందుబాటులోకి రాలేదని రిపోర్టు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment