group
-
తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపర్చినట్లు కమిషన్ పేర్కొంది.8,180 పోస్ట్లకు డిసెంబర్ 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9 లక్షల 51 వేల 321 మంది దరఖాస్తు చేసుకోగా జూలై 1, 2023న జరిగిన నియామక పరీక్ష నిర్వహించారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన తర్వాత పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. -
వన ఉత్పత్తులకు.. దమ్మక్క బ్రాండ్!
అడవుల జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలు ఎదుగుతున్నారు. ఐదేళ్ల కిందట శిక్షణతో మొదలైన వారి ప్రయాణం నేడు ఈ కామర్స్ వాకిలి వరకు చేరుకుంది. వీరి విజయ గాథ...నైపుణ్య శిక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలు 2018లో హైదరాబాద్కు ఐటీడీఏ తరఫున వెళ్లారు. అక్కడ సబ్బులు, షాంపులు తయారు చేసే ఓ సంస్థలో మూడు నెలలు శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణతోనే సరిపెట్టుకోకుండా అదే కంపెనీ లో మరో తొమ్మిది నెలల పాటు పనిచేసి తమ నైపుణ్యానికి మరిన్ని మెరుగులు అద్దుకున్నారు. ఇందులో పదిహేను మంది సభ్యులు కలిసి దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్గా ఏర్పడ్డారు. రూ. 25 లక్షలతో షాంపూ, సబ్బుల తయారీ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకున్నారు.అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ..దమ్మక్క గ్రూప్ సభ్యుల ఉత్సాహం చూసి అప్పటి ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు బ్యాంకు అధికారులతో మాట్లాడి లోను ఇప్పించడంతో భద్రాచలంలో 2019 నవంబరులో షాంపూ తయారీ యూనిట్నుప్రారంభించారు. పనిలో చేయి తిరగడం అలవాటైన కొద్ది రోజులకే 2020 మార్చిలో కరోనా విపత్తు వచ్చి పడింది. లాక్డౌన్ లు, కరోనా భయాల వల్ల బయటకు వెళ్లి పని చేసేందుకు ఇంట్లో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఒక ఇబ్బందైతే, మరోవైపు తయారీ యూనిట్లో షాంపూ బాటిళ్లు పేరుకుపోయాయి. ఇంతలోనే ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు షాంపూ బాటిళ్లు కావాలంటూ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి ఆర్డర్ రావడంతో కొంత ఊతం లభించింది.’’ అంటూ దమ్మక్క గ్రూపు జాయింట్ సెక్రటరీ బేబీరాణి అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఊపందుకున్న అమ్మకాలు..షాంపూ కొనుగోలుకు జీసీసీ నుంచి మార్కెట్ అందుబాటులో ఉండటంతో పాటు షాంపూ నాణ్యత విద్యార్థులకు నచ్చడంతో క్రమంగా దమ్మక్క యూనిట్ పనితీరు గాడిలో పడింది. 100 మిల్లీలీటర్ల షాంపూ బాటిళ్ల తయారీ 2021లో యాభైవేలు ఉండగా 2022 ముగిసే నాటికి లక్షకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది ఏకంగా రెండు లక్షల బాటిళ్ల షాంపూలు తయారు చేసి విక్రయించారు. షాంపూల తయారీలో వచ్చిన అనుభవంతో ఈ ఏడాది మొదట్లో గ్లిసరిన్ ప్రీమియం సబ్బుల తయారీనిప్రారంభించి జీసీసీ స్టోర్లలో ప్రయోగాత్మకంగా అమ్మకాలుప్రారంభించగా... తొలి దఫాలో ఐదు వేల సబ్బులు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకున్నాయి.బ్యాంక్ రుణం కూడా తీర్చేశారు!యూనిట్ ఆరంభమైన తర్వాత ఏడాదిలో కేవలం మూడు నెలలే గ్రూపు సభ్యులకు పని దొరికేది. షాంపూ, సబ్బులకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది వరుసగా ఎనిమిది నెలలు అంతా పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బ్యాంకు రుణం కూడా తీర్చేశారు. ప్రతి సభ్యురాలికి ఖర్చులు పోను కనీసం రూ.10 వేల వరకు ఆదాయం వచ్చినట్టు గ్రూప్ ట్రెజరర్ పూనెం విజయలక్ష్మి తెలిపారు.ఈ కామర్స్ దిశగా..రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వేదికగా ఈ ఉత్పత్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు గ్రూపు అధ్యక్షురాలు తాటి రాజసులోచన తెలిపారు. ఈ మేరకు బ్రాండ్నేమ్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అది విజయవంతం అయితే మరెందరో కొత్త వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి, భద్రాచలంఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్!
న్యూఢిల్లీ: అకౌంటింగ్లో అవకతవకల ఆరోపణలతో అదానీ గ్రూప్ను కుదిపేసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ సంస్థల స్టాక్స్ విషయంలో అనుచిత వ్యాపార విధానాలను అమలు చేశారనే ఆరోపణల మీద జూన్ 27న తమకు 46 పేజీల నోటీసు వచ్చినట్లు హిండెన్బర్గ్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఇది అర్ధరహితమైన చర్యగా కొట్టిపారేసింది. కార్పొరేట్ అవినీతిని, మోసాలను బహిర్గతం చేసేవారిని భయపెట్టేందుకు భారత్లో అత్యంత శక్తిమంతులైన వారు చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానించింది.అదానీ గ్రూప్ స్టాక్స్లో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నాయనే విషయాన్ని అధ్యయన నివేదికను ప్రకటించినప్పుడే తాము వెల్లడించామని హిండెన్బర్గ్ పేర్కొంది. ఒక ఇన్వెస్టర్ తరఫున తీసుకున్న పొజిషన్లకు సంబంధించి 4.1 మిలియన్ డాలర్లు లభించాయని, సొంతంగా అదానీ అమెరికా బాండ్లను షార్ట్ చేయడం ద్వారా 31,000 డాలర్లు వచ్చాయని తెలిపింది. లీగల్ ఖర్చులు, అధ్యయనంపై చేసిన వ్యయాలకు అవి బొటాబొటీగా సరిపోయాయని వివరించింది. ఆర్థికంగా గానీ వ్యక్తిగత భద్రతపరంగా గానీ అదానీ గ్రూప్పై అధ్యయనం తమకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాకపోయినా ఇప్పటివరకు తాము చేసిన వాటిల్లో అత్యంత గర్వకారణమైనదిగా ఇది నిలిచిపోతుందని హిండెన్బర్గ్ తెలిపింది. కోటక్ గ్రూప్ పాత్ర .. అదానీ స్టాక్స్ను షార్ట్ చేసేందుకు తమ భాగస్వామ్య ఇన్వెస్టరు ఒకరు .. కోటక్ మహీంద్రా గ్రూప్నకు చెందిన ఆఫ్షోర్ ఫండ్ను ఉపయోగించినట్లు హిండెన్బర్గ్ తెలిపింది. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ పేరు బైటికి రాకుండా చూసేందుకే సెబీ తన నోటీసులో కోటక్ను ప్రస్తావించకుండా కే–ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐవోఎఫ్) అని మాత్రమే పేర్కొందని ఆరోపించింది. సెబీ నోటీసుల ప్రకారం హిండెన్బర్గ్ క్లయింట్ అయిన కింగ్డన్ క్యాపిటల్.. అధ్యయన నివేదిక విడుదలకు ముందు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్కి (కేఎంఐఎల్) చెందిన కేఐవోఎఫ్లో ఇన్వెస్ట్ చేసింది.అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కేఐవోఎఫ్ .. నివేదిక విడుదల తర్వాత పరిణామాలతో మొత్తం రూ. 183.24 కోట్ల లాభాలు ఆర్జించింది. మరోవైపు, కేఐవోఎఫ్, కేఎంఐఎల్కు హిండెన్బర్గ్ ఎన్నడూ క్లయింటుగా లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ ఇతర ఇన్వెస్టర్లకు, హిండెన్బర్గ్కు మధ్య ఉన్న సంబంధాల గురించి తమకు తెలియదని పేర్కొంది. అదానీ గ్రూప్లో షేర్లు, అకౌంట్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీ గ్రూప్ ఫొటో షేర్ చేసిన కంగనా
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ టికెట్పై పోటీ చేసిన కంగనా రనౌత్ విజయాన్ని అందుకున్నారు. ఆమె హిమాచల్లోని మండీ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై ఆమె విజయం సాధించారు. తన విజయంపై కంగనా స్పందిస్తూ ఇది ప్రధాని మోదీ వల్లే సాధ్యమయ్యిందని పేర్కొన్నారు.తాజాగా కంగనా రనౌత్ ఒక పోస్ట్ను షేర్ చేశారు. ఇది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రముఖ నేతలు ఉన్న గ్రూప్ ఫోటోను షేర్ చేశారు. పీఎం నరేంద్ర మోదీని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఏ) నేతగా ఎన్నుకోవడంపై కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు.కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందిరాగాంధీ పాలనా కాలంలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కంగనానే దర్శకత్వం వహించడం విశేషం. -
ఆ బ్లడ్ గ్రూప్ అయితే..చికెన్, మటన్ వద్దంటున్న వైద్యులు!
వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్వెజ్గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్ గ్రూప్ని బట్టి చికెన్ లేదా మటన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..! ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్ గ్రూప్ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్వెజ్ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు ఏదీ తింటే బెటర్ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్ గ్రూప్లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్వెజ్ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్వెజ్ తింటే బెటర్ అనేది సవివరంగా చూద్దాం!. 'ఏ' గ్రూప్.. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. 'బీ' గ్రూప్.. బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు. కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకునేలే మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా నిపుణుల సలహాలు, సూచనలతో అనుసరించడం ఉత్తమం. (చదవండి: పాపులర్ వీడియో గేమర్కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!) -
రాష్ట్రంలో ‘సింటెక్స్’ పెట్టుబడి రూ.350 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వెల్స్పన్ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్’ హైదరాబాద్లో రూ.350 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపొనెంట్స్, ఇతర పరికరాలను తయారుచేసే ఈ యూనిట్ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వెల్స్పన్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న చందన్వెల్లిలోనే సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటవుతుంది. ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావుతో పాటు వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా హాజరవుతారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిసున్న వెల్స్పన్ గ్రూప్ రాష్ట్రంలో మరింత విస్తరించనుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటులోని మౌలిక వసతుల వలన అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని కేటీఆర్ అన్నారు. -
రాష్ట్రంలో మార్స్ గ్రూప్ పెట్టుబడి మరో రూ.800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో పేరొందిన ‘మార్స్ గ్రూప్’తెలంగాణలో మరో రూ.800 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో శుక్రవారం మార్స్ చీఫ్ డేటా, అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. సిద్దిపేటలో ఇప్పటికే తమ పెంపుడు జంతువుల (పెట్స్) ఫుడ్ తయారీ ప్లాంట్ ద్వారా కార్యకలా పాలు నిర్వహిస్తున్నట్లు ఆ బృందం వెల్లడించింది. మొదట కేవలం రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించి, ఆ తర్వాత మరో రూ.500 కోట్లతో విస్తరించామని పేర్కొంది. తాజాగా మరో రూ.800 కోట్లతో విస్తరణ ప్రణాళికను చేపడతామని మార్స్ గ్రూప్ ప్రతినిధి బృందం వెల్లడించింది. పెట్ కేర్, పెట్ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో కేవలం తయారీకే కాకుండా పరిశోధన, అభివృద్ధి తదితర రంగాల్లో ఉన్న అవకాశాలను ఈ బృందం వివరించింది. కొత్త పెట్టుబడులు, విస్తరణలకు ప్రాధాన్యత కొత్త పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న సంస్థల విస్తరణ కార్యకలాపాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించిన మార్స్ గ్రూప్ పెట్టుబడులు విడతల వారీగా రూ.1500 కోట్లకు చేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్దన్రెడ్డి పాల్గొన్నారు. -
స్టార్టప్లలో లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అంకుర సంస్థల వ్యవస్థలోకి 2030 నాటికల్లా వార్షిక పెట్టుబడుల పరిమాణం 1 లక్ష కోట్ల డాలర్లకు చేరేలా కృషి చేయాలని స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూప్ నిర్దేశించుకుంది. ఇందుకోసం జీ20 దేశాధినేతలతో భేటీ కానుంది. ప్రస్తుతం స్టార్టప్ వ్యవస్థలోకి వార్షిక పెట్టుబడు లు 700 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. స్టార్టప్20 ఇండియా చెయిర్ చింతన్ వైష్ణవ్ ఈ విషయాలు తెలిపారు. పెట్టుబడుల తోడ్పాటుతో స్టార్టప్లు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధికి చోదకాలుగా నిలవగలవని ఆయన చెప్పారు. అంకుర సంస్థలకు అంతర్జాతీయంగా ప్రామాణికమైన నిర్వచనాన్ని రూపొందిస్తే వాటికి పెట్టుబడులు, నిపుణుల లభ్యత మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న భారత్.. జూలై 3–4న గురుగ్రామ్లో ’స్టార్టప్20 శిఖర్’ సదస్సు నిర్వహించనుంది. ఇందులో జీ20 సభ్యదేశాలకు చెందిన 700 పైగా అంకుర సంస్థలు పాల్గోనున్నాయి. -
జీ20 అభివృద్ధికి మన స్టార్టప్ మార్గదర్శనం
ఆవిష్కరణ–ఆధారిత ఆర్థిక పునరుద్ధరణ, పునర్నిర్మాణం, వృద్ధికి స్టార్టప్లు ఇంజిన్గా మారాయి. ప్రతి దేశంలో పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తు విలువ ఆధారిత పంపిణీ నిర్మాణంలో స్టార్టప్లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 90 ట్రిలియన్ల డాలర్లుగా ఉంది. దీనిలో స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 3 ట్రిలియన్ల డాలర్ల వరకు ఉంది. స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వేగంగా మారుతున్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి వినూత్న ఆవిష్కరణలు సహక రిస్తాయి. పరిస్థితులకు తగిన ఆవిష్కరణలను అందిం చగల సామర్థ్యం కేవలం స్టార్టప్లకు మాత్రమే ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో స్టార్టప్ల ప్రాధాన్యం, సామర్థ్యం స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. స్టార్టప్ల పాత్ర ప్రాణాలను రక్షించడంలో మాత్రమే కాకుండా తిరిగి ఆర్థిక చైతన్యం సాధించడానికి ఉపయోగపడింది. సుస్థిర ఆర్థిక లక్ష్యాల సాధనలో ఆర్థిక వ్యవస్థలకు స్టార్టప్లు సహాయం చేస్తున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా సహకారం, ఆవిష్కరణల రంగంలో స్టార్టప్లు పనిచేస్తున్నాయి. దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్లు వేదికలనూ, సాధనాలనూ అందిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, సాంకేతిక పురోగతి, దీర్ఘకాలిక వృద్ధి, సంక్షోభ నిర్వహణ పరంగా స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషించనున్నాయి. స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటుకు ‘జీ20’కి అధ్యక్షత వహిస్తున్న భారతదేశం చొరవ తీసుకుంది. స్టార్టప్లకు సహకారం అందించడం, స్టార్టప్లు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఇన్నోవేషన్ ఏజెన్సీలు, ఇతర కీలక పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య సహకారం పెంపొందించడానికి స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ కృషి చేస్తుంది. భారతదేశ స్టార్టప్ రంగంలో నేడు 107 యునికార్న్లు, 83,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన స్టార్టప్లు పనిచేస్తున్నాయి. వీటి అభివృద్ధికి అవసరమైన ఆవిష్కరణ రంగం సమర్థంగా పనిచేస్తోంది. భారతదేశ స్టార్టప్ రంగం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ రంగంగా గుర్తింపు పొందింది. కొత్తగా ప్రారంభించిన స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ద్వారా జీ20 దేశాలలో వ్యూహాత్మక సహకారం ద్వారా వినూత్న స్టార్టప్లకు సహకారం అందించి ప్రపంచంలో సమగ్ర స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. జీ20లో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనకు స్వయంగా చర్యలు అమలు చేస్తోంది. స్టార్టప్–20 ఎంగే జ్మెంట్ గ్రూప్ అన్ని సభ్య దేశాలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారం, సమ న్వయం సాధించి ఆర్థిక సహకారానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రారంభ సంవత్స రంలో అమలు చేయాల్సిన మూడు ప్రాధాన్యతా అంశాలను ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది: 1. పునాదులు, కూటముల ఏర్పాటు : జీ20 ఆర్థిక వ్యవస్థల అంతటా స్టార్టప్లకు బహుళ నిర్వచనాలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యతా అంశంగా ఏకాభి ప్రాయం ద్వారా స్టార్టప్ అంటే ఏమిటి అనే అంశానికి స్పష్టత నివ్వాలనీ, దీనికి సంబంధించిన పదజాలం రూపొందించాలనీ ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్ల కోసం హ్యాండ్ బుక్ను సిద్ధం చేయడానికి ఏకాభిప్రాయ ఆధారిత నిర్వచనాలు, పదజాలం అంచనా వేయబడతాయి. అంతేకాకుండా, జీ20 ఆర్థిక వ్యవస్థల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య ప్రపంచ సహకారం పెంపొందించడానికి వ్యవస్థను రూపొందించడం, దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం తన మొదటి లక్ష్యంగా స్టార్టప్– 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ పెట్టుకుంది. 2. ఆర్థిక అంశాలు: ఆర్థిక అంశాలను రెండవ ప్రాధాన్యతా రంగంగా స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్లకు సులువుగా నిధులు అందేలా చేయడం, సహకారం అందించడం, నూతన అవకా శాలు గుర్తించడం లాంటి అంశాలకు రెండవ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. 3. సమగ్ర, సుస్థిర అభివృద్ధి: కీలకమైన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు) వ్యత్యాసాలను తగ్గించి వేగంగా అభివృద్ధి సాధించడానికి అవసరమయ్యే పరిస్థితులు కల్పించే అంశాన్ని స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ మూడవ ప్రాధాన్యతా రంగంగా గుర్తిం చింది. దీనిలో భాగంగా ఒకే విధమైన ప్రయోజనాల కోసం వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థల మధ్య సమన్వయం (మహిళా పారిశ్రామికవేత్తలు లాంటివి) సాధించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. జీ20 దేశాల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యాన్ని సాధించడానికి స్టార్టప్–20 కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. స్టార్టప్ 20 దీనిలో భాగంగా 6 కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రారంభ కార్యక్రమం 2023 జనవరి 28న (హైదరాబాద్) జరుగుతుంది. శిఖరాగ్ర సదస్సు 2023 జూలై 3న (గురుగ్రామ్లో) జరుగుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అదనంగా, భారతదేశ స్టార్టప్ రంగం సాధించిన అభివృద్ధిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొని రావడానికి భారీ స్టార్టప్ షోకేస్ నిర్వహించాలన్న ఆలోచన కూడా ఉంది. జీ20 సభ్య దేశాలు ఆమోదించి అంగీకరించే విధాన ప్రకటనను స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ సిద్ధం చేసి అందజేస్తుంది. చర్చల ద్వారా మార్గ దర్శకాలు, ఉత్తమ విధానాలు, వ్యవస్థలు, ముఖ్యమైన తీర్మానాల లాంటి అంశాలకు సంబంధించి స్టార్టప్–20 ప్రచురణలు తీసుకు వస్తుంది. స్టార్టప్ రంగ అభివృద్ధికి దోహదపడే విధంగా ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన భారతదేశ పరిశీ లనలో ఉంది. అభివృద్ధి, సమన్వయ కార్యక్రమాలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ వేదికగా పనిచేస్తుంది. జీ20 అధ్యక్ష హోదాలో భారతదేశం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే స్ఫూర్తిని ప్రపంచానికి అందించాలని భావిస్తోంది. అదే స్ఫూర్తితో, స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ స్టార్టప్లకు సహకారం అందించి అన్ని దేశాల మధ్య సమన్వయం సాధించడానికి కృషి చేస్తుంది. విభిన్న భాగస్వామ్యం ద్వారా అందరి భవిష్యత్తులో స్టార్టప్ను ఒక భాగంగా చేయడానికి ప్రపంచ దృక్పథంతో పనిచేయాలని స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఆకాంక్షిస్తోంది. (క్లిక్ చేయండి: గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?) - డాక్టర్ చింతన్ వైష్ణవ్ మిషన్ డైరెక్టర్, అటల్ ఇన్నోవేషన్ మిషన్; స్టార్టప్–20 అధ్యక్షుడు -
టీపీసీసీ కొత్త కమిటీ ప్రకటన.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డి తొలగింపు..
-
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. ఏకంగా 165 మందికి జాక్పాట్! ఎలా ?
న్యూఢిల్లీ: ఎవరైనా ఒక వ్యక్తికి అనూహ్యంగా ఏదైనా మంచి జరిగితే కలిసి వచ్చిన అదృష్టం అనుకుంటాం. కానీ అనుకోకుండా అదృష్ట దేవత తలుపు తట్టడంతో గ్రామంలో ఏకంగా 165మందికి జాక్పాట్ తగిలింది. బెల్జియంలోని ఒక గ్రామంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీంతో క్రిస్మస్ ముందే వచ్చిందంటూ వారంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దాదాపు 165 మంది అకౌంట్లో ఏకంగా (15,11,83,056 డాలర్లు) ఒక్కొక్కరికీ రూ.7.50 కోట్లు జమ అయ్యాయి. ఇదేదో సినిమా స్టోరీలా అనిపించినా.. నిజంగా మిరాకిల్ జరిగింది. వివరాల్లోకి వెళితే ఆంట్వెర్ప్లోని ఉత్తర బెల్జియంలోని ఓల్మెన్ అనే చిన్న గ్రామానికి చెందిన 165 మంది వ్యక్తులు విజేతలుగా నిలిచారని యూరో న్యూస్ నివేదించింది. యూరో మిలియన్స్ లాటరీలో ఓల్మెన్ వాసులు దాదాపు 165 మందిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఓల్మెన్లో దాదాపు 4000 మంది జనాభా ఉండగా, ప్రతి 24 మందిలో ఒకరు విజేతలు. అయితే గ్రామానికి చెందిన ఒక్కొక్కరు కొంత మొత్తాన్నిచందాగా వేసుకుని ఉమ్మడిగా యూరో మిలియన్ లాటరీ టికెట్స్ను కొనుగోలు చేశారు. అంతే వారికి జాక్పాట్ తగిలింది. ఏకంగా రూ.1200 కోట్ల విలువైన నగదు గెలుచుకున్నారు. ఫలితంగా ఒక్కొక్కరి ఖాతాలో దాదాపు రూ.7.50కోట్లు జమయ్యాయి. దీంతో ఈ ఏడాది బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ అంటూ ఆ 165 మంది ఆనందంతో మునిగి తేలుతున్నారు. గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలుచేస్తున్నప్పటికీ ఇప్పటికి అదృష్టం వరించింది, మరోవైపు లాటరీ గెల్చుకున్నవారంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్నారని లాటరీ షాప్ యజమాని విమ్ వాన్ బ్రోకోవెన్ చెప్పాడు. ఇంతమందికి ఒకేసారి లాటరీ రావడం తనకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. విజేతలలో ఇరవై ఏళ్ల యువతి తనకు, తన కుక్కల కోసం ఇల్లు కొనాలని యోచిస్తోందని తెలిపాడు. ఇప్పటివరకు అతిపెద్ద గ్రూప్గా ఇంత పెద్దమొత్తంలోలాటరీ గెల్చుకోవడం ఇదే తొలిసారి అని బెల్జియం లాటరీ ప్రతినిధి జోక్ వెర్మోరే వ్యాఖ్యానించారు. అయితే విజేతల వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. కేవలం 15 యూరోల పెట్టుబడికిగాను ఈ నగదును గెల్చుకోవడం సంచలనంగా మారింది. -
Germany: ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చే భారీ కుట్ర భగ్నం
బెర్లిన్: జర్మనీలో భారీ కుట్ర భగ్నం అయ్యింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై వాళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. తనిఖీల్లో సుమారు 25 మందిని అరెస్టు చేశారు. అతివాదులు, మాజీ సైనిక దిగ్గజాలు ఈ కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టు ముట్టి, అధికారాన్ని చేజిక్కించుకోవాలని అతివాదులు ప్రయత్నిస్తున్నట్లు అనుమానించారు. రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హెన్రిచ్-13 ఈ ప్రణాళికలు వేసినట్లు అంచనా వేస్తున్నారు. సుమారు మూడు వేల మంది పోలీసులు.. 150 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర చేసిన బృందంలో సుమారు 50 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. రీచ్బర్జర్ తీవ్రవాదులు ఈ పన్నాగంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల..
-
Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు..
చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. మనం ఏం చేసినా అది మనకు తప్పక తిరిగి వస్తుందని భావిస్తుంటారు. ఎవరికైనా మంచి చేసినా లేదా హాని తలపెట్టినా దాని ఫలితం తప్పక అనుభవిస్తామని గట్టిగా నమ్ముతారు. అచ్చం ఇలాగే కొంత మంది తాము చేసిన ఘనకార్యానికి తక్షణ కర్మను ఎదుర్కొన్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్లో మార్చి 28న షేర్ చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్గా మారింది. ఇందులో అయిదుగురు వ్యక్తులు దున్నపోతు మీద కూర్చొని రోడ్డు మీద సవారీ చేస్తున్నారు. వీళ్లు రోడ్డుపై బైక్పై, గుర్రం మీద వెళుతున్న మరికొంతమందితో పోటీపడి రైడ్ చేస్తున్నారు. పక్కన వెళుతున్న వారు హారన్లు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తుండటంతో.. దున్నపోతు కూడా వేగంగా వెళ్లాలని దాని మీద ఉన్న వ్యక్తులు దున్నపోతును రెండు దెబ్బలు వేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. చదవండి: భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే.. దెబ్బలు తిన్న దున్నపోతు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కుడివైపుకు తిరిగింది. బండి చక్రాలలో ఒకటి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బండి మీదున్న అయిదుగురు వ్యక్తులు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జంతువులను చిత్ర హింసలు పెడితే తగిన శిక్ష అనుభవిస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ముగింపు ఇది. కర్మ తిరిగి పొందారు’ అని కామెంట్లు చేశారు. Karma 🙏 (Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO — Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022 -
రెండు గ్రూప్లు... జట్లకు సీడింగ్లు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో రెండు కొత్త జట్ల రాకతో 2022 సీజన్ మొత్తం 74 మ్యాచ్లతో కొత్తగా కనిపించనుంది. ఇప్పటి వరకు ప్రతీ జట్టు మిగతా 7 టీమ్లతో రెండు సార్లు తలపడి లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడేది. ఇప్పుడు కూడా ఒక్కో జట్టు గరిష్టంగా 14 మ్యాచ్లే ఆడనుండగా, ఫార్మాట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేరుకు హోం, అవే మ్యాచ్లు అని చెబుతున్నా... టోర్నీని నాలుగు వేదికలకే పరిమితం చేయడం తో ‘సొంత మైదానం’ అనే ప్రభావం కూడా ఉండకపోవచ్చు. మొత్తం లీగ్ మ్యాచ్ల సంఖ్య 70 కాగా, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లుంటాయి. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ నిర్వహిస్తారు. ఎలా ఆడతారు? ప్రతీ జట్టు తమ గ్రూప్లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు, మరో గ్రూప్లోని ఒక జట్టుతో (గ్రూప్లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్లు అవుతాయి. మరో గ్రూప్లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ ‘ఎ’ గ్రూప్లోని నాలుగు టీమ్లతో పాటు గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్తో రెండు మ్యాచ్లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కడ ఎన్ని మ్యాచ్లు? 70 లీగ్ మ్యాచ్లలో 20 మ్యాచ్లు ముంబై వాంఖెడే స్టేడియంలో, 20 మ్యాచ్లు ముంబై డీవై పాటిల్ స్టేడియంలో, 15 మ్యాచ్లు ముంబై బ్రబోర్న్ స్టేడియంలో, 15 మ్యాచ్లు పుణే స్టేడి యంలో నిర్వహిస్తారు. నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు అహ్మదాబాద్లో జరిగే అవకాశం ఉంది. ఏ గ్రూప్లో ఎవరు? ఐపీఎల్లో ఆయా జట్ల రికార్డును బట్టి ఒక్కో జట్టుకు సీడింగ్ కేటాయించారు. సాధించిన టైటిల్స్, ఫైనల్ చేరిన సంఖ్యను బట్టి దీనిని రూపొందించారు. దాని ప్రకారమే 1వ సీడ్ టీమ్ గ్రూప్ ‘ఎ’లో, రెండో సీడ్ గ్రూప్ ‘బి’లో... ఇలా పది టీమ్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్ (సీడింగ్–1), కోల్కతా నైట్రైడర్స్(3), రాజస్తాన్ రాయల్స్ (5), ఢిల్లీ క్యాపిటల్స్ (7), లక్నో సూపర్ జెయింట్స్ (9). గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్ (2), సన్రైజర్స్ హైదరాబాద్ (4), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6), పంజాబ్ కింగ్స్ (8), గుజరాత్ టైటాన్స్ (10). -
టీవీని అధిగమించనున్న డిజిటల్
ముంబై: టెలివిజన్ను అధిగమించి డిజిటల్ విభాగం 2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ఎమ్ అంచనా వేసింది. 2022లో మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లని లెక్కగట్టింది. ఈ మేరకు తన ‘ దిస్ ఇయర్, నెక్ట్స్ ఇయర్’ 2022 (టీవైఎన్వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్) అంచనాల నివేదికను ఆవిష్కరించింది. నివేదిక ప్రకారం యాడ్ వ్యయాల్లో వేగంగా పురోగమిస్తున్న 10 దేశాల్లో భారత్ ఒకటి. ఈ విషయంలో దేశం తొమ్మిదవ అతిపెద్ద మార్కెట్గా ఉంటుంది. ప్రకటనల వ్యయ పరిమాణాల పెరుగుదలకు సంబంధించి ఐదవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మొత్తం మాధ్యమంలో డిజిటల్ షేర్ 2022లో 45 శాతానికి చేరుతుంది. ఈ విభాగంలో 33 శాతం పురోగతి ఉంటుంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ప్రకటన ల వ్యయం 11% పెరిగి 850 బిలియన్ డాలర్లకు చేరుతుంది. డిజిటల్ వాటా ఇందులో 66%. భారత వినియోగదారు, పరిశ్రమ అభిరుచులను రూపుదిద్దే కొన్ని కీలక ధోరణులను కూడా గ్రూప్ఎమ్ తన నివేదికలో ప్రస్తావించింది. సంస్థాగత పరిస్థితులు, వినియోగదారు అభిరుచులు–స్థిరత్వం, డిజిటల్ అనుభవం, డేటా, వాణిజ్యం, పర్యావరణ వ్యవస్థ, క్రీడా వ్యాపార వృద్ధి, సాంకేతికత వినియోగం, మార్కెటింగ్ పనితీరు, టీవీ ప్రకటనల సాంకేతికత, ఆఫ్లైన్ మీడియా పరిణామం వంటి అంశాల్లో మార్పులు వినియోగదారు, పరిశ్రమలో కొత్త ట్రెండ్స్ను సెట్ చేస్తాయని నివేదిక విశ్లేషించింది. -
వాట్సాప్ యూజర్లకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కష్టకాలంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ప్రపంచానికి దూరంగా, ఇంటికే పరిమితమవుతున్న తరుణంలో వాట్సాప్ కీలక ఫీచర్ ను అపడేట్ చేసింది. ఇప్పటివరకు నలుగురికి మాత్రమే అవకాశం వున్న వీడియో కాలింగ్ పరిమితిని ఇపుడు ఎనిమిదికి పెంచింది. కరోనా విస్తరణ, లాక్ డౌన్ పరిస్థితుల్లో గ్రూప్ వీడియో, ఆడియో కాలింగ్ కు ఆదరణ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అవకాశాన్ని వాట్సాప్ సమయానుకూలంగా అప్ డేట్ చేసింది. వాబేటా ఇన్ఫో అందించిన సమాచారం ప్రకారం ఈ పెరిగిన పరిమితి ఆండ్రాయిడ్ వాట్సాప్ వీ2.20.133 బీటా, ఐఫోన్ వాట్సాప్ వెర్షన్ 2.20.50.25 బీటాలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. రెండు ప్లాట్ఫామ్లలోని బీటా వినియోగదారులకు ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం అయితే యూజర్లు సరికొత్త బీటా వెర్షన్ కలిగి ఉండాలని వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ తెలిపింది. వాట్సాప్లో గ్రూప్ కాల్ చేయడానికి, కుడి ఎగువన ఉన్న కాల్ బటన్ పై క్లిక్ చేయాలి. కాల్ అనంతరం యూజర్లను యాడ్ చేసుకోవాలి. గ్రూప్ కి సంబంధించి అయితే ఎనిమిది మందికి ఒకేసారి కాల్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రూపులో ఎనిమిదికంటే ఎక్కువ వుంటే.. అపుడు ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నారో వాట్సాప్ అడుగుతుంది. అలాగే కాంటాక్ట్ లో సేవ్ చేయని వారిని గ్రూపు కాల్ లోకి ఆహ్వానించలేం. 📞 WhatsApp is rolling out the new limit of participants in groups calls, for iOS and Android beta users!https://t.co/bKmyR7HQg1 The new limit is: 8 participants in group calls! — WABetaInfo (@WABetaInfo) April 21, 2020 -
రికార్డులకెక్కిన ‘గోదారోళ్ల కితకితలు’
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: గోదారోళ్ల కితకితలు పేరుతో ఏర్పాటు చేసిన ఫేస్బుక్ గ్రూప్ ఆదివారం నిర్వహించిన నాలుగో ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు ఏడు వేల మంది హాజరవడంతో భారత్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు సుబ్బరాజు తోటలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్ చీఫ్ ఎడిటర్ కె.అన్నపూర్ణ.. గ్రూప్ అడ్మిన్ ఈవీవీ సత్యనారాయణకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సుబ్బరాజుగారితోటలో... ‘గోదారోళ్ల కితకితలు’ ఫేస్బుక్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బొమ్మూరు జీపీఆర్ రోడ్డులోని సుబ్బరాజుగారితోటలో ఉత్సాహంగా జరిగింది. వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు ఏడువేల మంది ఈ కార్యక్రమానికి తరలిచ్చారు. బొమ్మూరు గ్రామానికి చెందిన ఈవీవీ సత్యనారాయణ 2015లో ఈ ఫేస్బుక్ గ్రూపును ప్రారంభించారు. మగవారు పట్టుపంచె, కండువా, ఆడవారు పట్టుచీరలు ధరించి హాజరయ్యారు. గోదావరి జిల్లాల ప్రత్యేకమైన తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకు, పెనుగొండ గజ్జికాయ, వివిధ రకాల పిండి వంటకాలను తయారీ చేసి గ్రూపు సభ్యులకు అందుబాటులో ఉంచారు. చిన్నారుల ఆడుకునేందుకు వివిధ రకాల ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. ఫేస్బుక్ మిత్రులు ఫొటోలు దిగేందుకు పూలతో వివిధ రకాల ఆకృతులను అందంగా అలంకరించారు. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నాం భోజనం వరకు గోదావరి రుచులను ఆత్మీయతతో కొసరి కొసరి వడ్డించారు. వివిధ రకాల తెలుగు వంటకాలను ఫేసుబుక్ మిత్రులకు రుచి చూపించారు. ఇది నాలుగో సమ్మేళనం గోదారోళ్ల కితకితలు నాలుగో ఆత్మీయ సమ్మేళనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గోదావరి ప్రాంత, యాస, హాస్యంతో బాబోయ్ ఇంక నవ్వలేం అన్నట్టుగా సాగింది. కితకితల సభ్యుల కలయిక. కేవలం ఫేస్బుక్లో మాత్రమే పోస్టింగులు చేసుకునే వీరంతా ప్రత్యక్షంగా కలవడంతో ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. గోదారోళ్ల కితకితలుపై వెటర్నరీ డాక్టర్ కోటి కాపుగంటి రాసిన పాటల సీడీని తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మొదట సీడీని ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజుకు అందజేశారు. గ్రూపు సభ్యురాలికి సీమంతం గ్రూపులోని సభ్యురాలైన రావులపాలెంనకు చెందిన గర్భిణి కల్యాణికి సీమంతం నిర్వహించారు. ముందుగా ఈవీవీ సత్యనారాయణ దంపతులు, అనంతరం గ్రూపుసభ్యులు అక్షింతలు వేసి ఆశీర్వాదించారు. సారి పెట్టి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనూహ్య స్పందన గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ గ్రూప్ సభ్యుల ఆత్మీయ కలయికకు సభ్యుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మన యాసపై ఉన్న మమకారంతో 2015లో గ్రూపును ప్రారంభించాను. ఇప్పటికి 1,16,127 మంది సభ్యులున్నారు. నాలుగోసారి నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం భారత్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు కావడం చాలా ఆనందంగా ఉంది. – ఈవీవీ సత్యనారాయణ, గ్రూప్ క్రియేటర్, బొమ్మూరు కలయిక అపూర్వం సోషల్ మీడియా ద్వారా ఇందరు ఒకే చోట కలవడం అపూర్వం. గోదావరి హాస్యానికి, యాసకు పెద్దపీట వేస్తూ గ్రూపు ముందుకు సాగడం అభినందనీయం. గ్రూపులో సభ్యుడిని కావడం ఆనందంగా ఉంది. – ఇరవ వెంకటసుబ్రహ్మణ్యం, హైదరాబాద్ తప్పకుండా వస్తాం గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్లో నేను కూడా ఓ అడ్మిన్. బంధువుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు వీలులేకపోతే మానేస్తాం గానీ, ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాత్రం రాకుండా ఉండం. ముందు నుంచే ఇంటిలో వారికి నచ్చచెప్పి వచ్చి సొంతి ఇంటిలో పండగలా నిర్వహిస్తాం. బంధువులు కంటే ఈ ఫేస్బుక్లోనే మిత్రులు ఆత్మీయులుగా ఉంటాం. – బోయపాటి పద్మ, హనుమాన్ జంక్షన్ బంధాలు పెరుగుతాయి ఆత్మీయ కలయిక ద్వారా బంధాలు పెరుగుతాయి. వేలాదిమంది తరలిరావడమే ఇందుకు నిదర్శనం. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తాం. అక్కా, బావ.. పిలుపులే మా గ్రూపులో వినిపిస్తాయి. దేశవ్యాప్తంగా మా గ్రూపులో వేల మంది సభ్యులున్నారు. – అన్నందేవుల దేవీలక్ష్మీ, రాజమహేంద్రవరం -
ఆ శక్తులపై విజయం సాధిస్తాం
గువాహటి: భారత్లో కొందరు వ్యక్తులు, కొన్ని బృందాలు గొడవపడే ధోరణితో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇలాంటి శక్తులపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు పైచేయి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అస్సాంలోని గువాహటిలో ఆదివారం హైకోర్టు ఆడిటోరియానికి శంకుస్థాపన చేసిన అనంతరం జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ..‘ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు, గ్రూపులు జగడాలమారితనంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు కొన్ని మినహాయింపులు మాత్రమే. మన న్యాయవ్యవస్థకున్న బలమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు అన్నివర్గాలకు సాయం చేస్తాయి. జడ్జీలు, న్యాయాధికారులు ఎల్లప్పుడూ ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్లే న్యాయవ్యవస్థ మనుగడ సాగిస్తోంది’ అని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్లకు మించి కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు వెయ్యికిపైగా ఉన్నాయని జస్టిస్ గొగోయ్ తెలిపారు. అలాగే 25 ఏళ్లకు మించి పెండింగ్లో ఉన్నవి 2 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. ఇలాంటి కేసుల విచారణను సత్వరం పూర్తిచేయాలని జడ్జీలను కోరారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 90 లక్షల సివిల్ కేసులు పెండింగ్లో ఉండగా, వీటిలో 20 లక్షల కేసుల్లో(23 శాతం) సమన్లు కూడా జారీ కాలేదన్నారు. జడ్జీల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న తన ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
గ్రూప్–4 ప్రశ్నపత్రంలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్– 4 పరీక్ష గందరగోళంగా జరిగింది. దీంతో ఆదివారం పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. పేపర్–1 సెట్ బీలోని ప్రశ్నలు సెట్–ఏలో కనిపించాయి. ప్రశ్నపత్రంలో తలెత్తిన తప్పుల వల్ల పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. పేపర్– 1 పరీక్షలో ఏ సిరీస్ ప్రశ్నపత్రంలో విద్యార్థులకు కొన్ని పేజీలు మిస్సయ్యాయి. మరోవైపు బీ సిరీస్ నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా కొన్ని రిపీట్ అయ్యాయని విద్యార్థులు ఆరోపించారు. ఏ సిరీస్ ప్రశ్నప్రత్రంలో బీ సిరీస్కు చెందిన 16, 17, 18, 19, 20, 21, 45, 46, 63, 64, 65, 73, 74, 75, 90, 91, 92, 93, 100, 101, 119, 120, 121, 122, 123, 124 తదితర ప్రశ్నలు ఒక సిరీస్కు బదులు మరో సిరీస్లో వచ్చాయి. ఏ సిరీస్, బీ సిరీస్ రెండూ ఒకే ప్రశ్నపత్రంలో ఉన్నందున పరీక్ష సరిగా రాయలేకపోయామని అభ్యర్థులు ఆరోపించారు. అయితే టీఎస్ పీఎస్సీ మాత్రం కొన్ని పొరపాట్లు దొర్లినందున అందుబాటులో ఉన్న మరో పేపర్ ఇచ్చి పరీక్ష రాయించామని తెలిపింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ ఈసీఐఎల్లోని శ్రీచైతన్య కళాశాలలో గ్రూప్– 4 పరీక్షలు రాస్తున్న 6 అభ్యర్థులకు ఏ–1 సిరీస్ ప్రశ్నపత్రంలో బీ సిరీస్ ప్రశ్నలు వచ్చాయి. దీంతో విషయాన్ని ఇన్విజిలేటర్లకు చెప్పగా వారు టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఒక దశలో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షలు పూర్తయినప్పటికీ తమకు న్యాయం చేయాలని వారు టీఎస్పీఎస్సీని కోరారు. 65 శాతం హాజరు..: గ్రూప్–4 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.80 లక్షల మందికిగాను 3.12 లక్షల (65 శాతం) మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. 1,046 కేంద్రాల్లో జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లా లో 75 శాతం మంది, ఆ తర్వాత వరంగల్, మహ బూబ్నగర్ జిల్లాల్లో 74 శాతం చొప్పున హాజరయ్యారని వెల్లడించారు. ఇక, ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం 12 శాతం మాత్రమే హాజరైనట్లు ఆమె వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బిల్ కలెక్టర్లు, టీఎస్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో వివిధ పోస్టులు, అలాగే టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. -
పదేళ్లు సడలింపు
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రూప్–4, మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితర పోస్టులకు ప్రభుత్వం పదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ శనివారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్లలో పేర్కొంది. వయోపరిమితి లెక్కింపునకు 2018 జూలై 1వ తేదీని కటాఫ్గా నిర్ణయించింది. జనరల్ అభ్యర్థులకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుకాగా.. తాజా సడలింపుతో 44 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి వర్తిస్తుంది. దీనికి ఆయా రిజర్వేషన్ల మేరకు అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఐదేళ్లు, ఎక్స్సర్వీస్మన్లకు మూడేళ్లు, ఎన్సీసీ వారికి మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల మేర అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అయితే ఆర్టీసీలోని 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం సాధారణ గరిష్ట వయోపరిమితికి, ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కలుపుకొని జనరల్ అభ్యర్థులకు 40 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుందని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్సర్వీస్మన్కు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుందని వెల్లడించింది. మొత్తంగా ఆర్టీసీలోని పోస్టులకు 45 ఏళ్లు దాటినవారు మాత్రం అనర్హులని స్పష్టం చేసింది. -
వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్..
సాక్షి, న్యూఢిల్లీ: ఎట్టకేలకు వాట్సాప్ వినియోగదారులకు తీపికబురు అందింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్లో ఒకరికంటే ఎక్కువమంది గ్రూప్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు వెర్షన్లలోనూ ఈ ఫీచర్ను విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఫేస్బుక్ డెవలపర్ కాన్ఫరెన్స్లో వాట్సాప్ వీడియో కాలింగ్ సదుపాయం ప్రవేశపెట్టబోతున్నట్లు ఫేస్బుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక గ్రూపులోని పలువురు సభ్యులు లేదా, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకుమించి సభ్యులు ఈ ఫీచర్ ద్వారా వీడియో ద్వారా సంభాషించుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బేటా 2.18.155 వెర్షన్ వాడుతున్న ఎంపిక చేయబడిన కొంతమంది వినియోగదారులకు తాజాగా ఒక వీడియో కాల్నుఫీచర్ను వినియోగించుకోవచ్చు. ఐవోఎస్ ఆధారిత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ 2.18.52 వెర్షన్లో ఈ గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు వాట్సాప్ వెల్లడించింది. ఇందుకోసం యూజర్లు వీడియో కాల్స్ ఆప్షన్ను ఎంచుకుని, మాట్లాడాలనుకున్న వారితో హ్యాపీగా మాట్లాడు కోవచ్చు. మరోవైపు ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుందని వాట్సాప్ ఫ్యావరెట్ సైట్ WaBetaInfo నివేదించింది. అయితే త్వరలోనే ప్రతి వినియోగదారుడికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. దీనికనుగుణంగానే చాలామంది వాట్సాప్ యూజర్లు ఈ కొత్త గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఇంకా తమకు అందుబాటులోకి రాలేదని రిపోర్టు చేయడం గమనార్హం. -
మత ఘర్షణల నుంచి రాజకీయాల వైపు...
కొలంబో : ముస్లిం వ్యతిరేక అల్లర్లు చెలరేగి మత ఘర్షణలకు దారి తీయగా, ఎమర్జెన్సీ తర్వాత శ్రీలంకలో ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అయితే ఘర్షణలకు కారణమైన సంస్థ ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. (ఘర్షణలకు కారణం ఏంటంటే...) మహసన్ బాలకాయ అనే సంస్థ ముస్లింలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు, వీడియోలు పోస్టు చేయటంతో అల్లర్లకు చెలరేగాయి. ఆ సంస్థే త్వరలో రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు ప్రకటించింది. ‘సింహళీయుల గౌరవాన్ని కాపాడే రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా లేవు. అందుకే మిగతా సింహళ సంస్థలను కలుపుకుని మహసన్ బాలకాయ పేరిట పార్టీని స్థాపించబోతున్నాం. ఇప్పటికే ఎన్నికల అధికారికి పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం’ అని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. కాగా, మహసన్ బాలకాయ సంస్థపై మత ఘర్షలతోపాటు ముస్లింలకు చెందిన స్థలాలను కబ్జా చేసిందంటూ పలు కేసులు ఉన్నాయి. క్యాండీ జిల్లాలో 70 శాతం ఉన్న సింహళ బౌద్ధులకు, 10 శాతం ఉన్న ముస్లింలకు మధ్య మార్చి6వ తేదీన అల్లర్లు చెలరేగటం.. అవి మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించటంతో ఎమర్జెన్సీని విధించింది శ్రీలంక ప్రభుత్వం. చివరకు పరిస్థితి సర్దుమణగటంతో మార్చి 18న అత్యవసర పరిస్థితిని ఎత్తేసినట్లు ప్రకటించింది. -
అధికార పార్టీలో..గుంపుల లొల్లి..!
ఆయా రాజకీయ పార్టీలనుంచి భారీ ఎత్తున చేరికలు జరిగాక అధికార టీఆర్ఎస్ కలగూర గంపలా తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు గ్రూపులు తయారయ్యాయి. దీంతో ఎవరికి వారు వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులకు కొన్నిచోట్ల పొసగడం లేదు. మరికొన్నిచోట్ల ఇన్చార్జ్, ఇతర నాయకులు కలిసి పనిచేయలేకపోతున్నారు. ఈ పరిణామాలతో కిందిస్థాయి కార్యకర్తల్లో అయోమయం నెలకొందని పేర్కొంటున్నారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా పరిధిలోని నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం నకిరేకల్, మునుగోడులను మాత్రమే దక్కించుకుంది. మిగిలిన నల్లగొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, దేవరకొండలో కాంగ్రెస్తో పొత్తుతో సీపీఐ విజయం సాధించాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. ఉన్న ఐదు నియోజకవర్గాల్లో చూడబోతే నాలుగు నియోజకవర్గాలు టీఆర్ఎస్ చేతిలో ఉండడంతో ఆ పార్టీ బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, ఆ ఐదు నియోజకవర్గాల్లో గ్రూపుల లొల్లి జరుగుతోంది. కలవని మనసులు పాత–కొత్త నాయకులు కలిసిపోయి పనిచేయాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పదే పదే చేస్తున్న సూచనలను పార్టీ నాయకులు చెవికి ఎక్కించుకోవడం లేదని టీఆర్ఎస్లోని తటస్థవర్గీయులు పేర్కొంటున్నారు. అంతా ఒక పార్టీ గొడుగుకింద ఉన్నట్లు కనిపిస్తున్నా, ఎవరికి గుంపును వారు వెనకేసుకుని సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు ఎమ్మెల్యేలు, ఇటు ఇన్చార్జులను కూడా లెక్కచేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నల్లగొండ : గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దుబ్బాక నర్సింహారెడ్డి నాలుగైదు నెలల కిందటి దాకా నల్లగొండ ఇన్చార్జ్గా వ్యవహరించారు. గతేడాది అక్టోబరులో టీడీపీనుంచి టీఆర్ఎస్లో చేరిన కంచర్ల భూపాల్రెడ్డికి ఇన్చార్జ్ పోస్టు ఇవ్వడంతో అంతర్గత పోరు మొదలైంది. వాస్తవానికి నల్లగొండలో కాంగ్రెస్నుంచి పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్లో చేరారు. అంతకు ముందు కొందరు టీడీపీ నేతలు సైతం గులాబీ కండువాలు కప్పుకున్నారు. వీరంతా దుబ్బాకతో కలిసి సర్దుకుపోయారు. కంచర్ల రాకతో సమస్య మొదలైందని, కాంగ్రెస్నుంచి టీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్లు కంచర్లకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మిర్యాలగూడ : కాంగ్రెస్నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే భాస్కర్ రావుకు, అక్కడ పోటీచేసి ఓడిపోయిన ఇన్చార్జ్ అలుగుబెల్లి అమరేందర్రెడ్డి మధ్య చేతులు కలవలేదు. దీంతో పాత టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వచ్చిన చేరిన నేతలు వేర్వేరుగానే కొనసాగుతున్నారు. నాగార్జున సాగర్ : ఇక్కడ పార్టీ చేతిలో ఎమ్మెల్యే పదవి లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నోముల నర్సింహయ్య ఇన్చార్జిగా ఉన్నారు. కానీ, ఇదే నియోజకవర్గంలో ఎంసీ కోటిరెడ్డి అనే నాయకుడు అదే స్థాయిలో పార్టీలో బలంగా ఉన్నారు. వీరద్దరి గ్రూపులు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన రామ్చందర్ నాయక్కు జిల్లా రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్గా పదవి దక్కింది. ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు కానీ, నియోజకవర్గ ఇన్చార్జి గైర్హాజరయ్యారు. దేవరకొండ : జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ టీఆర్ఎస్లో చేరడంతో గ్రూపుల గొడవ షురూ అయ్యింది. ఇప్పటికీ ఈ రెండు గ్రూపులు కలవడం లేదు. కార్యక్రమాలూ వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. పదవుల పంపకంలో వీరి గ్రూపులు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. మునుగోడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ల గ్రూపులు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. బయటకు అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా సంస్థాగతంగా అంత సవ్యంగా లేదని పేర్కొంటున్నారు. పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో నష్టం జరుగుతుందన్న ఆందోళన.. ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. -
ఫేస్బుక్లో కొత్త ఫీచర్..ఇలా చెక్ పెట్టొచ్చు!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోఅద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. మన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవారిని శాశ్వతంగా అన్ఫాలో లేదా అన్ ఫ్రెండ్చేయాల్సి అవసరం లేకుండానే తాత్కాలికంగా అన్ఫ్రెండ్ చేసే వెసులుబాటును కల్పిస్తోంది. అంటే ఫేస్బుక్లో కొంతమందిని అన్ఫ్రెండ్ చేయకుండానే వారి పోస్టులను తాత్కాలికంగా అంటే 30రోజులపాటు నిరోధించే అవకాశం కల్పించే ‘స్నూజ్’ అప్షన్ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఫేస్బుక్ బ్లాగ్పోస్ట్లో వెల్లడించింది. ఫేస్బుక్లో మన స్నేహితులను, పేజీలను లేదా గ్రూపులను తాత్కాలింకంగా నియంత్రించేలా ఈ సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది. అన్ఫాలో, హైడ్, రిపోర్ట్, సీ ఫస్ట్ తోపాటు స్నూజ్ అనే ఆప్షన్ను తీసుకొచ్చింది. ఈ స్నూజ్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఆ సమయంలో మీ న్యూస్ఫీడ్లోని వ్యక్తులు, పేజీలు లేదా గ్రూపులు షేర్ చేసిన కంటెంట్ను మీరు మ్యూట్ చేసుకోవచ్చని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజర్ శృతి మురళీధరన్ తెలిపారు. తాజా ఫీచర్ ప్రకారం ఎవరి పోస్టులైనా మనకు తాత్కాలికంగా నచ్చకపోతే వారిని 30 రోజుల పాటు ఆపవేసే అవకాశాన్ని ఇపుడు కల్పిస్తోంది. అంటే ఫేస్బుక్న్యూస్ఫీడ్లో 30 రోజులు మనకు నచ్చని వారి పోస్టులు మన దృష్టికిరావు. ఈ గడువు అనంతరం 'తాత్కాలిక వ్యవధి' ముగిసే సమయానికి ఫేస్బుక్ మనకి నోటిషికేషన్ ఇస్తుంది. అనంతరం వారి పోస్టులు తిరిగి పొందాలనుకుంటే పునరుద్ధరించుకోవచ్చు లేదంటే మరో 30 రోజుల పాటు అదే ఆప్షన్ కొనసాగించవచ్చు. -
గ్రూప్ అడ్మిన్లకు రిలీఫ్.. వాట్సాప్ కొత్త ఫీచర్
శాన్ఫ్రాన్సిస్కోః ఫేస్బుక్ సొంతమైన ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సౌలభ్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్లకు ఊరట కల్పించేలా సరికొత్త వెసులుబాటు కల్పిస్తోంది. . డిలిట్ ఫర్ ఎవ్రీ వన్ పేరుతో ఈ కొత్త ఫీచర్తో అప్ డేట్ చేస్తోంది. అతి త్వరలోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి తేనుంది. దీని ప్రకారం వాట్సాప్ లో పోస్ట్ అయిన మెసేజ్ను అడ్మిన్ ఎంచుకున్న గ్రూపు సభ్యుల్లో ఇతరులు డిలిట్ చేసే అవకాశాన్నికల్పిస్తోంది. వాబేటా ఇన్ఫో. కాం అందించిన సమాచారం ప్రకారం గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం వెర్షన్ 2.17.387 లో వాట్సాప్ సమర్పించింది. గ్రూప్ మేనేజ్మెంట్ కోసం, గ్రూప్ అడ్మిన్ రక్షించే ప్రయత్నంలో గ్రూప్ డీపీని మార్చడం సహా ఇతర విషయాలను ఎడిట్ చేసే సభ్యులను ఎంచుకునే అవకాశాన్నివ్వనుంది. దీని ద్వారా గ్రూపులో ఏదైనా పోస్ట్ను, మెసేజ్ను ఇతర గ్రూప్ అడ్మిన్లు డిలిట్ చేసే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తోందని నివేదించింది. ప్రస్తుతం పరీక్ష దశల్లో ఈ ఫీచర్ విజయవంతమైన అనంతరం యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు టెస్టింగ్ టీజర్ను ఒకటి విడుదల చేస్తుంది. అలాగే బ్యాంక్ టు బ్యాంక్ నగదు ట్రాన్స్ఫర్ చేసుకునేలా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపిఐ సర్వీసును కూడా త్వరలోనే ప్రారంభించనుందట. కాగా అన్సెండ్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఇటీవల వాట్సాప్ ప్రకటించింది. ఈ ఫీచర్ద్వారా దీనిద్వారా అయిదు నిమిషాల్లో టెక్ట్స్ మెసేజ్, ఇమేజ్,జిఫ్ లతోపాటు స్టేటస్ రిప్లైని కూడా డిలిట్ చేయవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
వారి దారి.. చెరోదారి
రచ్చకెక్కిన బీజేపీ రాజకీయం తీవ్రమైన రెండు వర్గాల పోరు ఉపరాష్ట్రపతి పదవికి ఎం.వెంకయ్యనాయుడు ఎన్నికైన తరువాత.. రాష్ట్రంలో బీజేపీ ప్రాభవం పెంచుకునేందుకు.. అవసరమైన టీడీపీతో మైత్రి కొనసాగకపోవచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో, బీజేపీలో రెండు వర్గాల విభేదాలు జిల్లాలో ముదిరిపాకన పడ్డాయి. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో, ఇంతవరకూ అంతర్గతంగా సాగుతోన్న వర్గాల పోరు ఇప్పుడు రచ్చ ఎక్కింది. టీడీపీతో పొత్తు విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని, నగరపాలక సంస్థ ఎన్నికలలో సొంతంగా పోటీ చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడి ప్రకటన.. ఆయన సొంత అభిప్రాయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీ సమావేశంలో స్పష్టం చేయడం.. టీడీపీతో పొత్తు విషయంపైనే పోరు సాగుతోందన్న అనుమానాలను ఈ రెండు వర్గాలు నివృత్తి చేసేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు వీరి పోరుకు వేదిక కావచ్చు. పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఈ రెండు వర్గాలు వేర్వేరుగా జాబితాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. బోట్క్లబ్ (కాకినాడ సిటీ) : జిల్లాలో బీజేపీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. 2016లో నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రెండు వర్గాలుగా చీలిపోయిన నాయకుల మధ్య పోరు ఇప్పుడు రసకందాయంలో పడింది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా కృష్ణమోహన్ అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవి విషయంలో చెరో అభ్యర్థిని పోటీకి దింపిన విషయం విదితమే. ఆ ఎన్నికలలో వీర్రాజు బలపర్చిన యెనిమిరెడ్డి మాలకొండయ్య గెలుపొందారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తూ వచ్చారు. ఆదివారం కాకినాడ శశికాంత్నగర్లోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంగరాల చినబాబు నివాసంలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గెలుపొందిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకు వీర్రాజు వర్గం హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాల్గొన్న విషయం విదితమే. పార్టీ కార్యాలయం ఏర్పాటుపై వివాదం తమకు ఆహ్వానం పంపకుండానే పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఇటీవల శాంతినగర్లో ఏర్పాటు చేయడంతో పైడా వర్గీయులు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోర్ కమిటీ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పలేదని పైడా వర్గం పార్టీ జాతీయ, రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య తన అనుచరులతోనే ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకొన్నారని, పార్టీకి సంబంధం లేదని వారు చెబుతున్నారు. ఈ విషయం రాష్ట్ర పార్టీ అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధం ఉన్నట్టు సమాచారం. పార్టీలో గ్రూపులు ఉన్నాయని ఇటీవల ఒక సమావేశంలో పాల్గొన్న పార్టీ జిల్లా ఇన్చార్జి పూడి తిరుపతిరావు అంగీకరించారు. రెండు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తుండడంతో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే పార్టీ రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టంచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ చెరో దారి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు విషయంలో రెండు వర్గాలు వేర్వేరుగా సన్నాహాలు చేసుకుంటున్నాయి రెండు వర్గాలు తమ అనుయాయులకు టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కూడా పైడా వర్గీయులు దూరంగా ఉన్నారు. రెండు వర్గాలతో పార్టీ కార్యాలయంలో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఆయన చెప్పినా, పార్టీ కార్యాలయానికి వచ్చేది లేదంటూ పైడా వర్గం భీష్మించుకుని కూర్చుంది. బీజేపీలో అంతర్గత పోరును టీడీపీ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. -
రెండుగా చీలిన టీడీపీ
- వడిశలేరులో విభేదాలు - ఇరువర్గాల మధ్య దూషణలు - గ్రామంలో ఉద్రిక్తత - కొనసాగుతున్న 144 సెక్షన్ అమలు - ఇరువర్గాలతో ఎమ్మెల్యే శాంతి చర్చలు వడిశలేరు(రంగంపేట): ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకేమాట, ఒకే బాటగా నడిచి గ్రామ సర్పంచి, ఎంపీటీసీలు రెండు స్థానాలు, జెడ్పీ వైస్చైర్మన్ పదవి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ పదవి, జిల్లా తెలుగు యువత ఉపా««ధ్యక్ష పదవి సాధనలో కృషి చేసిన జెడ్పీ తాజా మాజీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఆళ్ల గోవింద్ల అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. గత ఏడాది జనవరి 1న జెడ్పీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీ కాంత్కు శుభాకాంక్షలు చెప్పిన ప్లెక్సీలో జిల్లా తెలుగు యువత ఉపా«ధ్యక్షుడు ఆళ్ల గోవింద్ ఫొటో వేయకపోవడంతో ఇరువర్గాలుగా విడిపోవడానికి కారణమైందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే నాటి నుంచి నేటి వరకు అది బహిర్గతం కాకపోయినా, ఈ నెల 9వ తేదీన జెడ్పీ వైస్ చైర్మన్ పదవికి నళినీ కాంత్ రాజీనామా చేయడంతో ఆదివారం అర్ధరాత్రి ఆళ్ల వర్గీయులు కొంత మంది నళినీకాంత్ ఇంటికి, కారు డ్రైవర్ ఇంటికి వెళ్లి దుర్భాషలాడినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నళినీకాంత్ వర్గీయులు కూడా ఆళ్ల వర్గీయులపై దూషణలకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో పెద్దాపురం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్, రంగంపేట ఎస్సై ఎన్.సన్యాసి నాయుడు పోలీసు బలగాలతో వడిశలేరు గ్రామం చేరుకుని ఇరు వర్గాలను చెల్లా చెదురు చేశారు. సోమవారం ఉదయం నుంచి ఇరువర్గాల ఇళ్ల వద్ద తమ వర్గీయులు చేరుకోవడం, సాయంత్రం దూషణలతో ఘర్షణలకు దిగడంతో పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు, ముందస్తు చర్యగా 144వ సెక్షన్ అమలు చేశారు. ఎఎన్ఎస్ పోలీసు బలగాలను ఇద్దరి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈవిషయం తెలుసుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి సాయంత్రానికి వడిశలేరు చేరుకున్నారు. పెండ్యాల ఇంటి వద్ద విడిగా చర్చలు జరిపారు. చర్చలు విషయం చెప్పాలని అభిమానులు ఎమ్మెల్యే కారును వెళ్లకుండా అడ్డగించారు. పెండ్యాల కలుగజేసుకుని కారును వదలిపెట్టాలని వాదనకు దిగడంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, పక్కవీధిలోనే ఉన్న ఆళ్ల గోవింద్ ఇంటికి వెళ్లారు. రంగంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇరువర్గాలను రప్పించి ఎమ్మెల్యే చర్చల వివరాలు వెల్లడించారు. ఇతర గ్రామానికి చెందిన వ్యక్తిని గ్రామంలోకి రానీయకుండా చేయాలని, గొడవలు సృష్టించకుండా చూడాలని కోరినట్టు నళినీకాంత్ తెలుపగా, మా వర్గీయులతో ఏవిధమైన వాదనలకు దిగవద్దనిగోవింద్ చెప్పినట్లు విలేకరులకు తెలిపారు. ఈ విషయంమై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కోరగా ఇది కుంటుంబ తగాదాలాంటిదని, దీన్ని శాంతియుతంగానే పరిష్కరించామని సమా«ధానమిచ్చారు. రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా వడిశలేరు చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. పార్టీ భవిష్యత్ దృష్ట్యా ఎంటువంటి వివాదాలకు గురికావద్దని సూచించినట్లు తెలిసింది. ముందస్తు చర్యగా పోలీసు బందోబస్తును కొనసాగిస్తున్నామని డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు. -
మేసేస్తున్నారు
డ్వాక్రా మహిళల నుంచి బలవంతపు వసూళ్లు ప్రతి గ్రూప్ నుంచి రూ.1,300 చెల్లించాల్సిందే 65 వేల గ్రూపుల నుంచి రూ.8.45 కోట్లు లూటీ డ్వాక్రా మహిళలు అడుగడుగునా దగా పడుతున్నారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు చివరకు రిక్తహస్తం చూపించడంతో వడ్డీలు తడిసి మోపెడై మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో రుణమాఫీకి బదులుగా ఏటా రూ.3 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత ఏడాది పెట్టుబడి నిధి పేరిట రూ.3 వేల చొప్పున జమ చేసినా.. ఆ సొమ్మును బ్యాంక్ ఖాతాల నుంచి తీసుకునే అవకాశం లేకుండా చేశారు. ఈ ఏడాది పసుపు, కుంకుమ పేరిట రూ. 3 వేల చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించగా.. ఆ సొమ్ము తీసుకోవాలంటే తమ చేతులు తడపాలని యానిమేటర్లు.. గ్రామ, మండల సమాఖ్యల అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు. అదేమని అడిగితే.. ఆ సొమ్ములన్నీ పై అధికారులకు ముట్టజెప్పాల్సి ఉంటుందని చెబుతున్నారు. పాలకోడేరు : పసుపు, కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు ఇస్తున్న సొమ్ములో కమీషన్లు గుంజుతున్నారు. ఒక్కొక్క మహిళ నుంచి రూ.130 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆ సొమ్ము చెల్లిస్తేనే.. రూ.3 వేలను ఖాతాల్లో జమ అయ్యే ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇలా ప్రతి గ్రూపు నుంచి రూ.1,300 చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. జిల్లాలో 65 వేల గ్రూపులకు పసుపు, కుంకుమ నిధులు మంజూరు కాగా, ఒక్కొక్క గ్రూపు నుంచి రూ.130 చొప్పున రూ.8.45 కోట్లను మింగేసేందుకు జిల్లా స్థాయిలో పథకం రచించి.. వసూళ్ల కార్యక్రమాన్ని యానిమేటర్లతోపాటు గ్రామ, మండల సమాఖ్య అధ్యక్షులకు అప్పగించారు. వ్యక్తిగత ఖాతాల్లో జమకాని నిధులు పసుపు, కుంకుమ పేరిట ఇస్తున్న ఈ నిధులను డ్వాక్రా మహిళల వ్యక్తగత ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఈ మొత్తాలను గ్రూపు లీడర్ల ఖాతాల్లో వేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకుని ప్రతి గ్రూపు నుంచి రూ.1,300 చొప్పున వసూలు చేస్తున్నారు. కమీషన్ నగదు ముట్టచెప్పిన అనంతరమే పసుపు, కుంకుమ సొమ్మును ఆ గ్రూపు ఖాతాలో జమ చేయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో డ్వాక్రా సంఘం అధ్యక్షులు తమ గ్రూపులోని ప్రతి సభ్యురాలి నుంచి రూ.130 చొప్పున వసూలు చేసి ఐకేపీ సిబ్బందికి సమర్పించుకుంటున్నారు. డబ్బులిస్తేనే సొమ్ములిస్తారంట : విప్పర్తి జూలియమ్మ, మోగల్లు రుణమాఫీ పేరుతో ఒక్కొక్క మహిళ నుంచి రూ.130 చొప్పున యానిమేటర్లు వసూలు చేశారు. ఎందుకని అడిగితే ఇలా సొమ్ములిస్తేనే పసుపు, కుంకుమ నిధులు ఇస్తామంటున్నారు. ఈ ఒక్క దానికే కాదు.. ప్రతి పనికీ వాళ్ల చేయి తడపాల్సి వస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు పెనుమాల మరియమ్మ , మోగల్లు వాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వకపోతు ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మొదటి నుంచీ ఇలాగే వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీల విషయాలు మాత్రం మాకు తెలియనివ్వడం లేదు. డబ్బులు తీసుకుంటారు.. రుణాలివ్వరు బి.మార్త, మోగల్లు ప్రభుత్వ పరంగా ఇచ్చే సబ్సిడీలు, పథకాల గురించి మాకు తెలియడం లేదు. డబ్బులు వసూళ్లకైతే ఇంటికొచ్చి వచ్చి మరీ అడుగుతారు. రాయితీలతో కూడిన రుణాలు మాత్రం మాకు ఇవ్వడం లేదు వసూళ్లకు ఆస్కారం ఉండదు డ్వాక్రా గ్రూపులకు మంజూరైన పసుపు, కుంకుమ నిధులు సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యాయి. అలాంటప్పుడు వసూళ్లకు ఆస్కారం ఉండదు. ఎవరైనా డబ్బులు అడిగినా, తీసుకున్నా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. కె.శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఆర్డీఏ -
తెలుగు తమ్ముళ్ల మధ్య పింఛన్ల గొడవ
-తమవారికి తక్కువ ఇచ్చారంటూ ఎమ్మెల్సీ వర్గం ఆరోపణ -ఆదేం లేదని ఎమ్మెల్యే వర్గం - మాటామాటా పెరిగి తిట్ల దండకం అందుకున్న ఇరువురు ఆత్మకూరు: పింఛన్ల మంజూరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. ఒక దశలో ఇరువర్గాల నాయకుల మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగే పరిస్థితి తలెత్తింది. ఇందుకు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వేదికగా మారింది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం నియోజకవర్గానికి ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో 2000 పింఛన్లు మంజూరయ్యాయి. గొడవ రాకుండా వీటిని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చెరి సగం పంచుకున్నారు. అయితే, ఆత్మకూరు మండలానికి మంజూరైన 469 పింఛన్లలో ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ కేటాయించారని శుక్రవారం ఎమ్మెల్సీ వర్గానికి చెందిన కొందరు తమ్ముళ్లు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన పింఛన్ల జాబితా ఎందుకు అమలు కాలేదని, వాటిలో పేర్లను ఎవరు తొలగించారంటూ టైపిస్ట్ సలీంను నిలదీశారు. తనకు ఈ విషయం తెలియదని, అవకతవకలు జరిగి ఉంటే లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని సూచించారు. అదే వర్గానికి చెందిన కేశవరెడ్డి వడ్ల రామాపురం గ్రామానికి మంజూరైన పింఛన్లలో తమ వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని, తాను ఇచ్చిన పేర్లు కాకుండా ఇతరుల పేర్లు ఎలా వచ్చాయని గట్టిగ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి చెందిన వర్గీయులు నాగార్జునరెడ్డి మేము ఎందుకు తొలగిస్తాం. శిల్పా భువనేశ్వరరెడ్డి తొలగించారని చెప్పడంతో వారి మధ్య మాటా మాటా పెరిగిపోయింది. నిన్నమొన్న పార్టీలోకి వచ్చి జన్మభూమి కమిటీ ఇచ్చిన పేర్లనే మారుస్తారా అంటూ కేశవరెడ్డి కార్యాలయంలో చిందులేశారు. చివరకు ఇరువర్గాలు వాదులాటకు దిగాయి. అధికార పార్టీకి చెందిన గోవిందరెడ్డి, గిరిరాజులు కలగజేసుకుని ఘర్షణకు దిగిన వారిని తన్నుకోకుండా విడిపించారు. తరా్వత పార్టీ నేత శిల్పా భువనేశ్వరరెడ్డితో ఫొన్లో మాట్లాడించారు. వడ్లరామాపురంలో కొన్ని పేర్లు తానే తొలగించానని చెప్పడంతో వివాదం ముగిసింది. కాగా అధికార పార్టీకి చెందిన వారే తమవారికి కావాలంటే తమవారికి కావాలని కీచులాడుకుంటుంటే అర్హులైన పేదలకు పింఛన్ ఇంకెక్కడ వస్తుందని కార్యాలయం వద్ద కొందరు చర్చించుకోవడం కనిపించింది. నా సంతకం ఫోర్జరీ చేశారు వడ్లరామాపురం గ్రామంలో అధికార పార్టీ క్యాడర్ కీచులాట ఇలా ఉంటే ఆత్మకూరు పట్టణానికి చెందిన సంపత్ అనే జన్మభూమి కమిటీ సభ్యుడు నా సంతకం ఎవరో ఫోర్జరీ చేసి ఇచ్చిన జాబితాను అప్లోడ్ చేశారని మండల అధికారులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అయితే దీని వెనుకకూడా వర్గాల కుమ్ములాటే ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. -
వాట్సాప్ లింకులు ప్రమాదకరమే!
లండన్: వాట్సప్లో ప్రతిరోజూ వివిధ గ్రూపులలో వందలాది మెసేజిలు వస్తుంటారుు. కొంతమంది రకరకాల లింకులు పంపుతుంటారు. ఏవేవో ఆఫర్లు ఉన్నాయంటూ ఊదరగొడతారు. కానీ, అలా వచ్చిన లింకులన్నింటినీ ఓపెన్ చేసి చూశారో.. మీరు సైబర్ దాడుల బారిన పడటం ఖాయమని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సప్ యూజర్లందరినీ ఈ మేరకు హెచ్చరిస్తున్నారు. ప్రజలను మోసం చేసి, సులభంగా వారిని బుట్టలో పడేసేందుకు హ్యాకర్లు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్లు ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. వాట్సప్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వీడియో కాలింగ్ ఈమధ్య వచ్చింది. వాస్తవానికి గూగుల్ ప్లేస్టోర్లో వాట్సప్ను అప్డేట్ చేసుకుంటే చాలు.. ఈ వీడియో కాల్స్ వచ్చేస్తున్నారుు. కానీ, చాలామంది దానికి సంబంధించి ఓ లింకును విపరీతంగా ఫార్వర్డ్ చేశారు. పొరపాటున అలాంటి లింకులను ఓపెన్ చేస్తే వెంటనే మన ఫోన్ వాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఫోన్లో భద్రపరిచిన వ్యక్తిగత డేటా మొత్తం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. గ్రూప్ వీడియో కాలింగ్ పేరుతో కూడా కొన్ని లింకులు వస్తున్నాయని, ఇవన్నీ చాలా ప్రమాదకరమని చెప్పారు. -
ఎన్డీ దళ నేత అరెస్టు ప్రకటించిన డీఎస్పీ
ఆయుధాలతో సంచరిస్తే చర్యలు తప్పవు పిస్టల్, 7 తూటాలు స్వాధీనం ఇల్లెందు : ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆయుధాలు మినహా ఇతరులెవరూ అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే చర్యలు తప్పవని డీఎస్పీ ఆర్.వీరేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఇల్లెందు పోలీస్ స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూడెమోక్రసీ టే కులపల్లి ఏరియా దళ నేత కోరం వెంకటేశ్వర్లు అలియాస్ గణేష్ అరెస్టును ప్రకటించారు. గుండాల మండలం భాటన్ననగర్ సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న ట్లు సమాచారం అందుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. గణేష్ నుంచి ఒక కంట్రీమేడ్ పిస్టల్, ఏడు తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగూడెం మండలం అంజనాపురం గ్రామానికి చెందిన గణేష్ కొత్తగూడెం రామచంద్ర కళాశాలలో డిగ్రీ చదువుతూ 2004పీడీఎస్యూలో చేరాడు. అదే క్ర మంలో 2004లో సీపీయూఎస్ ఖమ్మం–వరంగల్ ఏరియా కమిటీ కార్యదర్శి యాదన్న, స్వరూపక్క దళంలో సభ్యుడిగా చేరాడు. 2004 హైదరాబాద్లో యాదన్న ఎ¯ŒSకౌంటర్లో మృతి చెందటంతో జనశక్తి ఏరియా కమిటీ సభ్యుడు నాగన్న దళంలో చేరా డు. జనశక్తి విస్తరణలో భాగంగా గణేష్ను తూర్పుగోదావరి జిల్లాకు పంపారు. ఈ క్రమంలో పోలవరం సమీపంలోని గడ్డపల్లి సమీపంలో జరిగిన ఎ¯ŒSకౌంటర్లో కిరణ్, వినోద్ అనే దళ సభ్యులు మృతి చెందారు. ఈ ఘటన నుంచి కోలుకోకముందే కుక్కునూరు మండలం నాయ కులగూడెం వద్ద జరిగిన ఎ¯ŒSకౌంటర్లో ముగ్గురు దళ సభ్యులు మృతి చెందారు. జనశక్తి తుడిచి పెట్టుకుని పోవటంతో న్యూడెమోక్రసీలో చేరాడు. గుండాల మం డలం ఆళ్లపల్లి ఏరియా దళనేతగా పని చే శాడు. ఈ క్రమంలో రాయిగూడెం వద్ద 2006లో పోలీసులతో జరిగిన ఎదురు కా ల్పుల్లో తప్పించుకున్నాడు. 2013–14లో జరిగిన ఎన్డీ చీలికలో రాయల వర్గం వైపు పని చేశాడు. ఆరు నెలల కిందట ఆనారోగ్యానికి గురి కాగా బయటకు వచ్చాడు. నాటి నుంచి పార్టీకి దూరంగా రహస్యంగా కాలం గడుపుతున్నాడు. ఈ క్రమంలో గుండాల మండలంలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్న సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గణేష్ మీద ఎదురు కాల్పుల ఘటన కేసులు, పలువురిని బెదిరించి చందాలు వసూలు చేసిన కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందజేసే పరిహారం పొంది సుఖశాంతులతో జీవించాలని కోరారు. సమావేశంలో ఇల్లెందు, గుండాల సీఐలు అల్లం నరేందర్, టి.రవికుమార్, కాచనపల్లి ఎస్సై ప్రవీణ్కుమార్, రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థ మార్పుకోసమే అజ్ఞాతం: గణేష్ పీడిత తాడిత ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే వ్యవస్థ మారాలని అప్పుడే ప్రజల కష్టాలు కడతేరుతాయని భావిం చి అందుకు అజ్ఞాతవాసమే మార్గమని ఆయుధం పట్టినట్లు గణేష్ తెలిపారు. విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన నాడే ప్రజల కష్టాలు కళ్లారా చూశానన్నారు. అయితే ప్రజలను చైతన్యం చేసేందుకు అజ్ఞాతంలోకి వెళ్లగా అనతి కాలంలోనే నాటి సీపీయూఎస్ఐ అంతమైందన్నారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న తాను లొంగిపోవాలని నిర్ణయించుకుని బయటకు వచ్చినట్లు గణేష్ వెల్లడించారు. -
ఇస్లాం మత బోధకుని తలపై వెల
లక్నో: వివాదాస్పద ఇస్లాం బోధకుడు బకీర్ నాయక్ తలకు ఓ సంస్థ వెల కట్టింది. అతన్ని చంపి తమవద్ద నుంచి రూ. 15 లక్షలు తీసుకెళ్లమని షియా వర్గానికి చెందిన హుస్సేని టైగర్స్ ఈ ఆఫర్ ప్రకటించింది. జకీర్ ఖల్ నాయక్(విలన్), కాఫీర్ అని తన బోధనలతో ఇస్లాం ప్రవక్త ను అవమాన పరుస్తున్నాడని అందుకే అతనిపై రివార్డు ప్రకటించామని ఆ సంస్థ ప్రతినిధి సయిద్ కబ్లే హుస్సేన్ నఖ్వి తెలిపారు. నఖ్వి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఉపాధ్యక్షుడు, ప్రముఖ మత పెద్ద సయిద్ ఖబ్లే సాదిక్ కుమారుడు. జులై 1 న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంటులో జరిగిన ఉగ్రదాడిలో 22 మందిని అతి కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు జకీర్ బోధనలతో ప్రభావితమయ్యారని నిర్ధారించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం అతనికి చెందిన పీస్ టీవీ ఛానల్ ను నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం జకీర్ పై విచారణకు ఆదేశించింది. -
హద్దు మీరిన వాట్సప్ పోస్టింగులతో ప్రమాదం
♦ అపరిచితులను గ్రూపులో చేర్చుకోవద్దు ♦ అడ్మినిస్ట్రేటర్కు చిక్కులు తప్పవంటున్న నిపుణులు టేక్మాల్: వాట్సాప్లో ఎడాపెడా గ్రూపులు క్రియేట్ చేసేస్తున్నారా? అడ్మినిస్ట్రేటర్గా గ్రేట్ అనుకుంటున్నారా? జాగ్రత్త. మీ గ్రూపులో ఎవరెవరు ఉంటున్నారో? వాళ్లు ఏమేమి పోస్టు చేస్తున్నారో? తెలుసుకోండి. ఎందుకంటే వాళ్లు చేస్తే ప్రతి పోస్టింగుకు మీరే బాధ్యులవుతారు. కాబట్టి అప్రమత్తంగా ఉండకపోతే చిక్కుల్లో పడొచ్చు. కేసు పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కితే మీ చేతికి బేడీలు పడొచ్చు. సో.. బీ కేర్ ఫుల్. డిజిటల్ యుగంలో సామాజిక మాద్యమాలు సమచార విప్లవానికి ఊపరిలూడుతున్నాయి. గతంలో తెగిపోయిన స్నేహ బంధాలను తిరిగి ముడి వేసుకోవడానికి, కొత్త మిత్రులను పరిచయం చేసుకోవడానికి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్.. తదితరాలు దోహదపడుతున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వినియోగం సర్వసాధారణం కావడంతో ఈ సోషల్ మాద్యమాల వినిమయం కూడా ఎక్కువైంది. ఏదైనా సమాచారాన్ని పంపిచుకోవాలన్నా.. లేక ఫొటోలను అందిపుచ్చుకోవాలన్నా క్షణాల్లో జరిగిపోతోంది. ఈక్రమంలో వాట్సప్పై ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. జిల్లాలో 90 శాతం జిల్లాలో 90 శాతానికిపైగా ప్రజలు స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు. అందునా వాట్సప్లో ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువతీ.. యువకులు, రైతులు ఇలా ప్రతిఒక్కరూ వాట్సప్లో గ్రూపులో ఏర్పాటుచేసుకుంటున్నారు. అవసరం మేరకు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. బాధ్యత తప్పదు ఎడాపెడా గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, గంటల తరబడి చాటింగ్ చేయడం పరిపాటిగా మారింది. కొందరికి వ్యసనంగా ఆవహించింది. స్నేహితులను పెంచుకోవడం, మధురమైన పోస్టింగులు చేస్తే ఓకే కానీ.. అప్రమత్తంగా లేకపోతే చిక్కులు తప్పవు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటర్ గ్రూప్పై ఓ కన్ను వేసి ఉంచాల్సిందే! లేకపోతే ఎవరూ చేసిన అసభ్యకర, దేశ సమగ్రతను దెబ్బతీసే పోస్టింగులకు అడ్మినిస్ట్రేటర్ బాధ్యత వహించక తప్పదు. భాతర ఐటీ చట్టం ప్రకారం ఆన్లైన్ గ్రూపునకు బాధ్యులుగా ఎవరు ఉంటే వారినే బాధ్యుడిని చేస్తారు. కాబట్టి తెలిసిన స్నేహితులనే సభ్యులుగా చేర్చుకోవడం ఉత్తమం. చట్టం ఏం చెబుతుంది? భారత ఐటీ చట్టం 2000 ప్రకారం కఠినమైన శిక్షలుంటాయి. అభ్యంతకర విషయాలను పోస్టు చేస్తే ఐపీసీ సెక్షన్ 505, 1(బీ) కింద కేసులు నమోదు చేస్తారు. ఐటీ చట్టం 153, 34,67, సెక్షన్లూ వర్తిస్తాయి. ఈక్రమంలో వాట్సప్ గ్రూపు నుంచి సభ్యులను తొలగించారన్నా కారణంగా ద్వేషాలు పెంచుకోవడం, అడ్మిన్లపై దాడి జరిగిన సంఘటనలు సైతం ఇటీవల పెరిగాయి. వాట్సప్ను ఎవరు దుర్వినియోగం చేసినా ఐటీ చట్టం అడ్మిన్పైనే గురి పెడుతోంది. ఎందుకంటే వాట్సప్లో మెసేజ్ ఎవరు సృష్టించారో తెలుసుకునే అవకాశం లేదు. అయితే, దాన్ని వ్యాప్తి చేసేవారిని గుర్తు పెట్టుకోవడం చాలా సులువు. ఇదే దర్యాప్తులో లూప్హోల్. మరో వైపు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది కాదూ.. ఎవరు పోస్టు చేశారన్నదే కీలకం. ఎవరో పంపితే పొస్టు చేశానంతే.. అంటే చట్టం ఒప్పుకొదు. కాబట్టి అడ్మిన్కే చిక్కులు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ♦ దేశ భద్రతకు ప్రమాదమైన, ఐటీ చట్టాలను ఉల్లంఘించే అభ్యతరకర పోస్టులు ఎట్టొద్దని మీ గ్రూపు సభ్యులకు చెప్పుకోవాలి. ♦ ఎవరైనా సభ్యులు పరిధి దాటి ప్రవర్తిస్తే ఆ విషయాన్ని ముందుగానే పోలీసులకు చెప్పాలి. లేదంటే అడ్మిన్ చేతికి బేడీలు తప్పవు. ♦ గ్రూపు లో మీ ప్రమేయం, ఇష్టం లేకుండా ఒక అడ్మిన్ మిమ్మల్ని కూడా అడ్మినిస్ట్రేటర్గా మారిస్తే ఆ గ్రూపు నుంచి బయట పడటం ఉత్తమం. లేదంటే చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ♦ మెసేజ్ తీవ్రతను బట్టి సభ్యులు కానివారు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ♦ పేరున్న రాజకీయ నాయకులు, ప్రముఖులను దూషించే విధంగా పోస్టు చేయరాదు. ♦ కాాపీరైట్ చట్టం కింద ఇంటర్నెట్, ఇతర ప్రసార మాద్యమాల్లో అంశాలను ♦ కాపీ చేసి వాటిని వాట్సప్లో పోస్టు చేయడం కూడా నేరమే. -
‘మౌలిక’ గ్రూప్ అంతంతే..!
అక్టోబర్లో ఎనిమిది కీలక పరిశ్రమల వృద్ధి రేటు 3.2 శాతం 2014 ఇదే నెలలో ఈ రేటు 9 శాతం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ అక్టోబర్లో 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 9 శాతం. సెప్టెంబర్లో కూడా ఈ గ్రూప్ వృద్ధి రేటు 3.2 శాతం కావడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఎనిమిది పారిశ్రామిక విభాగాల వెయిటేజ్ 38 శాతం. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు వీటిలో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్, స్టీల్ ఉత్పత్తి పేలవ పనితీరు మొత్తం మౌలిక రంగం గ్రూప్ మందగమన స్థితికి కారణమైంది. అక్టోబర్లో ఎనిమిది రంగాల పనితీరునూ వార్షిక ప్రాతిపదికన వేర్వేరుగా చూస్తే... వృద్ధిలో 4... బొగ్గు: వృద్ధి రేటు 16.4 శాతం నుంచి 6.3 శాతానికి పడింది. సిమెంటు: క్షీణత (-1.2%) లోంచి 11.7% వృద్ధిలోకి మళ్లింది. ఎరువులు: భారీ వృద్ధిని నమోదుచేసుకుంది. -7 శాతం క్షీణతలోంచి 16.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. విద్యుత్: వృద్ధి 13.7 శాతం నుంచి 8.8 శాతానికి తగ్గింది. క్షీణతలో 4... క్రూడ్ ఆయిల్: 2014 అక్టోబర్లో ఈ రంగం 1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే 2015 అక్టోబర్లో అసలు వృద్ధిలేకపోగా -2.1 క్షీణతలోకి జారింది. రిఫైనరీ ప్రొడక్టులు: క్రూడ్ ఆయిల్ తరహాలోనే ఈ రంగం కూడా 4.2% వృద్ధి రేటు నుంచి -4.4 % క్షీణతలోకి జారింది. సహజవాయువు: -3.9 క్షీణత... -1.8 శాతానికి తగ్గింది. స్టీల్: 14.2 శాతం వృద్ధి రేటు -1.2 శాతం క్షీణతలోకి జారింది. ఏడు నెలల్లో ఇలా... 2015-16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ చూస్తే... ఈ గ్రూప్ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంది. 2014-15 ఇదే ఏడు నెలల కాలంలో ఈ వృద్ధి రేటు 5.6 శాతం. -
నకిలీ నోట్ల ముఠా అరెస్టు
మల్కాజిగిరి(హైదరాబాద్): వెయ్యి రూపాయల దొంగనోట్లను చలామణీ చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులతో పాటు వారికి సహకరించిన ఇద్దరిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీపీ రమారాజేశ్వరి, ఏసీపీ రవిచందన్రెడ్డి వివరాలు వెల్లడించారు. సోహాన్ చోయల్ అనే వ్యక్తి యాదవనగర్లోని జేబీఎస్ స్టీల్ సామాన్ల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నెల 1వ తేదీ ఒక యువకుడు అతని వద్దకు వచ్చి వంద రూపాయల సామాన్లు కొని, వెయ్యిరూపాయల నోటు ఇచ్చాడు. నోటుపై అనుమానం వచ్చిన చోయల్ దగ్గరలోని మరో దుకాణంలో దొంగనోట్లు గుర్తించే మిషన్లో చెక్ చేయడంతో నకిలీదిగా తేలింది. దీంతో మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు బండ్లగూడలో ముఠా సభ్యులు ఉన్న ఇళ్ల పై దాడి చేశారు. ఝార్ఖండ్ రాష్ట్రం సాహెబ్గంజ్ జిల్లాకు చెందిన సయ్యద్అలీ(25), షేక్బాకర్(20), సుల్తాన్ షేక్(23), ఆలం(23), సనాల్(22), మహ్మద్ షమీం షేక్(21) పశ్చిమబెంగాల్ మాల్దా జిల్లాకు చెందిన జియా ఉల్హక్(32) తో పాటు ఇంటిని అద్దెకు ఇచ్చిన బండ్లగూడకు చెందిన బిల్డింగ్ మెటీరియల్ సప్లై వ్యాపారి షేక్ సుల్తాన్(57), ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా నకిలీ పత్రాలతో నిందితులకు మూడు ఎయిర్టెల్ సిమ్లు అమ్మిన బండ్లగూడకు చెందిన సహస్ర మొబైల్స్ యజమాని మల్లారెడ్డి(26)లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి లక్షా యాబై వేల రూపాయల నకిలీ వెయ్యి రూపాయల నోట్లు, ఇరవై వేల ఏడు వందల రూపాయల నగదు, ఏడు సెల్ఫోన్లు, సెల్ఫోన్ దుకాణ యజమాని మల్లారెడ్డికి చెందిన కంప్యూటర్, పింటర్, స్కానర్ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక టీం ఏర్పాటు: డీసీపీ దొంగనోట్ల చలామణీకి పాల్పడున్న ముఠాలో ప్రధాన నిందితుడు సబాన్షేక్, బర్కత్షేక్, సామ్యూల్తో పాటు ఇంటిని అద్దెకు ఇచ్చిన రాజ్ మహ్మద్, ఎయిర్టెల్ డీలర్ రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నవీన్లను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. ముఠాలోని సభ్యులకు సభాన్షేక్ దొంగనోట్లను అందజేసేవాడని వాటిని మార్చిన తర్వాత వచ్చిన నగదును అతను చెప్పిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసే వారన్నారు. సైబరాబాద్ కమిషనర్ ప్రత్యేక సూచనలు జారీ చేశారని ఇంటికి అద్దెకు ఇచ్చేముందు టెనెంట్ వెరిఫికేషన్ ఫారంను తప్పకుండా తీసుకోవాలన్నారు. అవసరమైతే వారి వివరాలను పోలీసులకు అందజేయాలన్నారు. సిమ్కార్డులు అమ్మే దుకాణ యజమానులు కూడా వినియోగదారుడి వివరాలు పూర్తిగా తెలుసుకొని విచారించిన తర్వాతనే సిమ్ కార్డులు అందజేయాలన్నారు. -
ఆ ముఠా గుట్టురట్టు
హయత్నగర్(హైదరాబాద్): అద్దె ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేసిన సంఘటన మంగళవారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గుంటూరుకు చెందిన సత్యవతి పెద్దఅంబర్పేటలోని సాయినగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం గృహం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన దొండ మధుసూదన్రెడ్డి, రాజేందర్రెడ్డి అనే విటులతో పాటు బెంగాలికి చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మహిళను, నిర్వాహకురాలు సత్యవతిలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, ఓ బైకు, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హనుమాన్ భక్తుల ధర్నా!
నిజామాబాద్: రెంజల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆంజనేయ స్వామి భక్తులు ఆదివారం ధర్నాకు దిగారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కందకుర్తి గ్రామంలో గంగాధర్ అనే వ్యక్తిని కొట్టడంతో.. గొడవ ఆపడానికి వెళ్లిన ఆంజనేయ స్వామి భక్తుల్ని తోసేశారు. ఈ ఘటనలో ఆంజనేయస్వామి భక్తులకు కూడా చిన్నపాటి దెబ్బలు తగిలాయి. గంగాధర్ అనే వ్యక్తి ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో 13 మందిని అరెస్టు చేయాలని రెంజల్ మండలంలోని సుమారు 100 మంది భక్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. (రెంజల్) -
ఇంటర్లో గ్రూప్ ఎంపిక ఇలా..
ఇంటర్మీడియెట్.. ప్రతి విద్యార్థి జీవితంలో కీలక దశ.ఈ దశలో ఎంచుకున్న గ్రూపు ఆధారంగానే భవిష్యత్తు కెరీర్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. క్రేజీ కెరీర్స్గా పేరొందిన ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ప్రవేశించాలన్నా.. ఆయా రంగాల్లో నిష్ణాతులుగా మారి ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నా.. పునాది ఇంటర్మీడియెట్లో ఎంపిక చేసుకున్న గ్రూప్లే! అందుకే ఈ గ్రూప్ల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. పదో తరగతి ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్లో విద్యార్థులు ఏ గ్రూప్ను ఎంచుకోవాలి.. ఏ నైపుణ్యాలున్న విద్యార్థులకు ఏ గ్రూప్ సరిపోతుంది?! ఏ గ్రూప్ ఎంచుకుంటే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి.. తదితర అంశాలపై నిపుణుల విశ్లేషణ.. వాట్ ఆఫ్టర్ టెన్త్?! ఇంటర్మీడియెట్.. ఇంటర్మీడియెట్లో ఏ గ్రూప్..! ఇంకేముంది.. అయితే ఎంపీసీ.. లేకపోతే బైపీసీ.. నేటి విద్యార్థి లోకంలో, వారి తల్లిదండ్రుల్లో స్థిరపడిపోయిన అభిప్రాయం. ఈ రెండు గ్రూపుల్లో చేరితే భవిష్యత్తులో సత్వర ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఇంజనీరింగ్ లేదా మెడికల్ ప్రొఫెషన్లో స్థిరపడొచ్చని నిశ్చితాభిప్రాయం! అయితే.. ఇంటర్మీడియెట్లో గ్రూప్ ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు నిపుణులు. కేవలం కోర్సులకున్న క్రేజ్నే దృష్టిలో పెట్టుకుని గ్రూప్ల ఎంపిక సరికాదని సూచిస్తున్నారు. విద్యార్థుల సహజ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా గ్రూప్ను ఎంచుకుంటే.. ప్రస్తుతం అనేక అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అన్ని గ్రూపులకు ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలున్నాయని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియెట్లో ఉన్న గ్రూప్లు.. వాటిలో రాణించేందుకు కావాల్సిన అకడెమిక్, పర్సనల్ స్కిల్స్.. ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్లు ప్రధానాంశాలుగా ఉండే ఎంపీసీ గ్రూప్లో చేరే విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థుల్లో దాదాపు 35 నుంచి 40 శాతం మధ్యలో ఉంటోంది. ఈ గ్రూప్లో ఉత్తీర్ణత ఆధారంగా ఎంసెట్లో అర్హత సాధించి.. భవిష్యత్తులో ఇంజనీరింగ్ కోర్సులో అడుగుపెట్టొచ్చు. ఈ గ్రూప్లో చేరే విద్యార్థులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఎన్నో కాన్సెప్ట్లు, థియరీస్, ఫార్ములాలతో ఉండే ఈ గ్రూప్లో అకడెమిక్గా రాణించాలంటే.. గంటలకొద్దీ ప్రాక్టీస్ చేయగల నేర్పు, ఓర్పు ఎంతో అవసరం. అదేవిధంగా హార్డ్వర్క్తోపాటు స్మార్ట్వర్క్ తోడైతేనే ఇందులో రాణించడం సులువవుతుంది. వీటితోపాటు సూక్ష్మగ్రాహ్యక శక్తి, మెమొరీ స్కిల్స్ అత్యంత ప్రధానం. ప్రాక్టికల్ అప్రోచ్ బాగా ఉన్న విద్యార్థులే ఈ గ్రూప్లో రాణించగలరు. అప్పుడే ఎంపీసీ గ్రూప్తో ఆశించిన ఫలితాలు సాధ్యం. కోర్సు పూర్తయ్యాక ఇంజనీరింగ్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్తోపాటు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ వంటి పోటీ పరీక్షలకు కూడా అర్హత లభిస్తుంది. కేవలం ఇంజనీరింగ్ కోర్సులే కాకుండా.. డిగ్రీ స్థాయిలో బీఎస్సీలోనూ పలు వినూత్న కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఉన్నత విద్యనభ్యసించి మంచి కెరీర్ సొంతం చేసుకోవచ్చు. బైపీసీ.. ఆసక్తితోనే అడుగులు ఇంటర్మీడియెట్లో ఎంపీసీ తర్వాత విద్యార్థులు ఎక్కువగా చేరుతున్న కోర్సు బైపీసీ. భవిష్యత్తులో మెడికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్లో కెరీర్కు ఈ కోర్సు ఎంతో దోహదపడుతుంది. అయితే, ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు సహజమైన ఆసక్తి ఉంటేనే అడుగుపెట్టడం మంచిది. ముఖ్యంగా పరిసరాల అధ్యయనం, ఆయా జీవరాసులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత బైపీసీ గ్రూప్ విద్యార్థులకు చాలా అవసరం. అకడెమిక్గా.. ఎంపీసీతో పోల్చితే ప్రాక్టికల్ అప్రోచ్ కోణంలోనూ సునిశిత పరిశీలన కీలక పాత్ర పోషిస్తుంది. నిరంతర అధ్యయనం, నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్గా అన్వయించే నేర్పు కూడా కావాలి. బైపీసీలో జీవసంబంధ అంశాలపై పరిజ్ఞానం పెంచుకుంటేనే అకడెమిక్గా ముందుండటం వీలవుతుంది. ఈ పరిజ్ఞానానికి ముఖ్య సాధనాలు ప్రాక్టికల్స్ మాత్రమే. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను లేబొరేటరీల్లో ప్రాక్టికల్గా అన్వయించడం నిరంతర ప్రక్రియ. కేవలం థియరాటికల్ అప్రోచ్తో ముందుకెళ్లొచ్చు అనే అభిప్రాయం ఏ మాత్రం సరికాదు. ఈ దృక్పథం మార్కులు తెచ్చిపెట్టేందుకు దోహదపడినప్పటికీ.. భవిష్యత్తులో కెరీర్పరంగా అవసరమైన నైపుణ్యాలు అందించలేదు. బైపీసీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. బైపీసీ పూర్తిచేస్తే కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సులే కాకుండా.. మరెన్నో కొత్త కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ వంటి కొత్త కాంబినేషన్లు ఉన్నాయి. వీటిద్వారా భవిష్యత్తులో మెడికల్ అనుబంధ రంగాలైన హెల్త్కేర్ ప్రొడక్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు, ఫార్మాస్యూటికల్ సంస్థల్లో అడుగుపెట్టొచ్చు. సీఈసీ- విశ్లేషణ నైపుణ్యాలు సీఈసీ.. కెరీర్ పరంగా కామర్స్, మేనేజ్మెంట్ రంగాల్లో భవిష్యత్తుకు పునాది. ఇటీవల కాలంలో క్రమేణా విద్యార్థి లోకంలో క్రేజ్ పెరుగుతున్న కోర్సు. అంకెలు, గణాంకాలు, దత్తాంశాలు నిండి ఉండే ఈ గ్రూప్లో చేరాలనుకునే విద్యార్థులకు ఆయా అంశాల విశ్లేషణ, విశదీకరణ నైపుణ్యాలు ఉండాలి. నిర్దిష్ట గణాంకాల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలు రూపొందించే నైపుణ్యం.. కంప్యూటేషన్ స్కిల్స్ ఈ కోర్సు ఔత్సాహికులకు చాలా అవసరం. అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అకౌంట్స్, కామర్స్ వంటి సబ్జెక్టులకు సంబంధించి అప్లికేషన్ ఓరియెంటేషన్ అప్రోచ్ కూడా ఉండాలి. సైన్స్ గ్రూప్లతో పోల్చితే ఈ గ్రూప్లో ప్రాక్టికల్స్ ఉండవు. అయితే నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందేందుకు విద్యార్థులు స్వయంగా ప్రయత్నించాలి. అప్పుడే ఈ కోర్సుల్లో రాణించగలరు. సీఈసీ పూర్తి చేసిన విద్యార్థులు అటు మేనేజ్మెంట్, ఇటు కామర్స్ సంబంధిత రంగాల్లో కెరీర్స్ సొంతం చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతోనే చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), ఐసీడబ్ల్యుఏ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫౌండేషన్ దశలో అడుగుపెట్టొచ్చు. సీఈసీ అర్హతగా బీకాం పూర్తిచేయొచ్చు. తర్వాత ఐసెట్, క్యాట్, ఎక్స్ఏటీ వంటి ప్రవేశ పరీక్షలు రాసి ప్రముఖ సంస్థలలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. హెచ్ఈసీ.. సామాజిక అవగాహన సామాజిక - ఆర్థిక అంశాలపై అవగాహన, పరిశీలన నైపుణ్యాలున్న విద్యార్థులకు కచ్చితంగా సరిపడే కోర్సు హెచ్ఈసీ. అంతేకాకుండా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మరింత కలిసొచ్చే కోర్సు ఇది. సమాజంలో నిత్యం ప్రతిబింబించే అంశాలైన ఆర్థిక, రాజకీయ అంశాలు, చరిత్ర సంబంధిత విషయాలతో కూడి ఉండే ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు అకడెమిక్గా సునిశిత పరిశీలన శక్తి అవసరమవుతుంది. విస్తృత స్థాయిలో ఉండే అంశాల నుంచి అవసరమైన మేర మాత్రమే గ్రహించగల నైపుణ్యాలు, నిర్దిష్ట అంశం నేపథ్యంపై అవగాహన, అదే అంశానికి సంబంధించి సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయగల సామర్థ్యం కూడా ఈ కోర్సు ఔత్సాహికులకు ఎంతో అవసరం. కెరీర్ పరంగా ప్రభుత్వ విభాగంలో ఆయా ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు హెచ్ఈసీలో పరిజ్ఞానం ఎంతో తోడ్పడుతుంది. హెచ్ఈసీ పూర్తి చేసి బీఏలో అడుగుపెడితే.. ఆ కోర్సు అర్హతగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు సులువుగా సన్నద్ధం కావచ్చు. అంతేకాకుండా బీఏ స్థాయిలో ఇప్పుడు కొత్తగా ఆవిష్కృతమవుతున్న కాంబినేషన్ల ఆధారంగా ప్రైవేటు రంగంలోనూ సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ వర్క్, సోషియాలజీ, పబ్లిక్ పాలసీ తదితర గ్రూప్ సబ్జెక్ట్లు చదివిన వారికి కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల్లో కొలువులు ఖాయమవుతున్నాయి. ఎంపీసీ, సీఈసీ సమ్మేళనంగా ఎంఈసీ ఇటీవల కాలంలో ఆదరణ పొందుతున్న గ్రూప్.. ఎంఈసీ. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉండే ఈ గ్రూప్.. భవిష్యత్తులో కామర్స్ విభాగంలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు బాగా కలిసొస్తున్న కోర్సు. ఒకే సమయంలో మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్, డేటా అనాలిసిస్ నైపుణ్యాలు అందించే ఈ కోర్సు సీఏ, ఐసీడబ్ల్యుఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు చక్కటి పునాది. అయితే ఈ గ్రూప్ ఔత్సాహికులకు అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్ ప్రధానంగా అవసరమైన సహజ లక్షణాలు. సమయ నిబంధనలు లేకుండా కష్టించే తత్వం, నిరంతర అధ్యయనం చేయగల నేర్పు కూడా అవసరం. ఇవి ఉంటేనే ఈ కోర్సులో రాణించగలరు. భవిష్యత్తు పరంగా ఎంఈసీ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులతోపాటు డిగ్రీ స్థాయిలో బీకాంలో ప్రవేశించొచ్చు. సీఈసీ విద్యార్థులకు లభించే అవకాశాలన్నీ వీరికి లభిస్తాయి. గ్రూప్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులు. సదరు గ్రూప్లో ఉండే సబ్జెక్ట్లు, వాటిలోని ప్రాథమిక అంశాలపై అవగాహన స్థాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు.. ఎంపిక చేసుకోనున్న గ్రూప్ ద్వారా లభించే అవకాశాల విశ్లేషణ. సదరు గ్రూప్నకు సంబంధించిన రంగంలో ప్రస్తుత ఉపాధి అవకాశాలు. వాస్తవానికి పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్థాయిలో విశ్లేషణలు చేసుకునే మానసిక పరిపక్వత ఉండదు. దాంతో తల్లిదండ్రులే పిల్లల ఆసక్తుల ఆధారంగా వీటిని చేపట్టాలని నిపుణుల సలహా. ఈ ఆసక్తిని పిల్లల వ్యవహార శైలి ద్వారా గమనించొచ్చని సూచిస్తున్నారు. నిపుణుల సలహా సైన్స్ కోర్సుల్లో చేరే వారికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం ఇంటర్మీడియెట్లో సైన్స్, మ్యాథమెటిక్స్ గ్రూప్స్లో చేరే విద్యార్థులకు మిగతా గ్రూప్లతో పోల్చితే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. అవి.. ప్రాక్టికల్ స్కిల్స్, అప్లికేషన్ ఓరియెంటేషన్. లేబొరేటరీల్లో గడిపేందుకు ఆసక్తి, ఓర్పు వంటి సహజ లక్షణాలు అవసరం. ఇవి ఉంటేనే ఎంపీసీ, బైపీసీ గ్రూప్లలో రాణించి.. భవిష్యత్తులో సమున్నత స్థానాలు అధిరోహించొచ్చు. ఎంపీసీ, బైపీసీ అంటే.. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులకు మాత్రమే పునాది అని భావించొద్దు. ఇప్పుడు అప్లైడ్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, అగ్రికల్చర్, వెటర్నరీ సెన్సైస్లోనూ ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలతో ఈ రంగాల్లో పరిశోధనలు చేసి ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. - డాక్టర్॥సి.వి.ఎల్.ఎన్. మూర్తి, ప్రిన్సిపాల్, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, నాగార్జునసాగర్. కొలువులు ఖాయం చేసే కామర్స్ ఇంటర్మీడియెట్లో సీఈసీ గ్రూప్ ఎంపిక ద్వారా భవిష్యత్తులో కామర్స్ విభాగంలో ఉజ్వల భవిష్యత్ను సొంతం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ కోర్సుల పట్ల పెరుగుతున్న క్రేజ్, పబ్లిసిటీ ఆధారంగా చాలామంది విద్యార్థులు వీటిలో అడుగుపెట్టేందుకు సీఈసీని ఎంపిక చేసుకుంటున్నారు. ఇంటర్మీడియెట్లో ఉత్తీర్ణత సులభమే. కానీ ఈ కోర్సు అర్హతగా ప్రవేశం పొందే ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించాలంటే గంటలకొద్దీ శ్రమించగల ఓర్పు, నిరంతరం మార్పుచేర్పులు జరుగుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలపై అవగాహన అవసరం. ఈ స్కిల్స్ లేక అనేకమంది విద్యార్థులు ఆయా ప్రొఫెషనల్ కోర్సుల మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. అందువల్ల కేవలం క్రేజ్ను దృష్టిలో పెట్టుకోకుండా.. ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా భవిష్యత్తు లక్ష్యాలకు సరితూగే కోర్సులను ఎంచుకోవాలి. - టి.ఎల్.ఎన్. స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్, హైదరాబాద్ ప్రధానంగా ప్రాక్టికల్ అప్రోచ్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మ్యాథ్స్, సైన్స్ మాత్రమే కాకుండా.. ఆర్ట్స్, హ్యుమానిటీస్ వరకు అన్ని విభాగాల్లో ప్రాక్టికల్ అప్రోచ్, అప్లికేషన్ ఓరియెంటేషన్లు కీలకంగా మారుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఏ గ్రూప్లో చేరాలనుకున్నప్పటికీ సంబంధిత సబ్జెక్టుల్లో నేర్చుకున్న అంశాలను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించే నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. చదివే ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో బేరీజు వేసే తులనాత్మక అవగాహన కూడా ఎంతో అవసరం. ఈ నైపుణ్యాలు ఏ అంశంలో ఎక్కువగా ఉన్నాయో స్వీయ విశ్లేషణ చేసుకుని ఆ గ్రూప్ను ఎంచుకోవడం భవిష్యత్తులో లాభిస్తుంది. సైన్స్ గ్రూప్ల విషయానికొస్తే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు కూడా ఇప్పటివరకు తమ పిల్లలు ఆసక్తి చూపిన అంశాలేంటో గమనించి దానికి అనుగుణంగా ప్రోత్సహించాలి. - కె. శరత్ చంద్ర, కో-ఫౌండర్, బటర్ఫ్లై ఫీల్డ్స్ ఇన్స్టంట్గా కాదు.. ఇంట్రెస్ట్ ఆధారంగా ఇంటర్మీడియెట్ గ్రూప్ ఎంపికలో.. ఆయా కోర్సుల ద్వారా లభించే ఉద్యోగావకాశాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. సహజ ఆసక్తికి కూడా పెద్దపీట వేయాలి. అప్పుడే కెరీర్ గమ్యం దిశగా సరైన అడుగులు పడతాయి. కెరీర్ అంటే.. కేవలం ఇంజనీరింగ్, మెడికల్ అనే అపోహను వీడాలి. నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా కెరీర్పరంగా బహుముఖ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటికీ పునాది ఇంటర్మీడియెట్లో ఎంచుకున్న గ్రూప్ మాత్రమే. కాబట్టి సుదీర్ఘ ప్రణాళిక, వ్యూహాలతో గ్రూప్ను ఎంచుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల దృక్పథమూ మారాలి. తమ పిల్లల సహజ ఆసక్తులు ఏంటో గుర్తించి.. అందుకు తగ్గ కోర్సులను ఎంచుకునే దిశగా ప్రోత్సహించాలి. అప్పుడు ఎలాంటి గ్రూప్ అయినా.. కోర్సు అయినా భవిష్యత్తులో చక్కటి అవకాశాలు లభిస్తాయి. - ఎం. రామకృష్ణ, ఎండీ, జడ్సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్