రెడ్‌మి 5, 5 ప్లస్‌ లాంచ్‌ | Xiaomi Redmi 5, Redmi 5 Plus launched with 18:9 display | Sakshi
Sakshi News home page

రెడ్‌మి 5, 5 ప్లస్‌ లాంచ్‌

Published Fri, Dec 8 2017 9:07 AM | Last Updated on Fri, Dec 8 2017 9:35 AM

Xiaomi Redmi 5, Redmi 5 Plus launched with 18:9 display - Sakshi

షావోమి సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది.  18:9 యాస్పెప్ట్‌ రేషియో డిస్‌ప్లేలతో రెడ్‌మి 5, రెడ్‌మి 5 ప్లస్‌   పేరుతో రెండు స్మార్ట్‌ఫోన్లను చైనాలో లాంచ్‌ చేసింది. రెడ్‌ మి 5 ను 2 జీబీ, 3జీబీ వేరియంట్స్‌,  5 ప్లస్‌ 3జీబీ, 4 జీబీ  రెండు వేరియంట్లలో  లభ్యంకానుంది. అలాగే బ్లాక్‌,గోల్డ్‌, లైట్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ కలర‍్లలో  ఈ డివైస్‌లు అందుబాటులో ఉంటాయి.  మిగతా  మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి వచ్చేది షావోమి ఇంకా ధృవీకరించలేదు.

రెడ్‌మి 5ఫీచర్లు
5.7 అంగుళాల హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే
యాస్పెక్ట్‌ రేషియో 18:9, 720x1440 పిక్సెల్‌ రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.0
4జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌
స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం
12ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ  సెల్ఫీ కెమెరా
3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
దీని ధర సుమారు  రూ.12,700లు. 2 జీబీ వేరియంట్‌ ధర రూ.7,800గా ఉంటుంది.
 
రెడ్‌మి 5 ప్లస్‌  ఫీచర్లు
5.99  అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
1080x2160 పిక్సెల్‌ రిజల్యూషన్‌
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌,
3జీబీ ర్యామ్‌
32జీబీ స్టోరేజ్‌
స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం
12ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ  సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఇక దీని ధర విషయానికి వస్తే  భారత మార్కెట్లో  సుమారు రూ. 9,700గా ఉంటుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement