Xiaomi Company
-
అమ్మకాల్లో షావోమీ ఎలక్ట్రిక్ కార్ సరికొత్త రికార్డ్లు
చైనా టెక్ దిగ్గజం షావోమీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నట్లు తెలుస్తోంది. షావోమీ గతేడాది ఎస్యూ7 (ఎస్యూ అంటే స్పీడ్ ఆల్ట్రా) ను ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారును గత నెల చివరి వారంలో విడుదల చేసింది. టెస్లా, బీవైడీ కార్లను తట్టుకుని నిలబడేందుకు ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24,90లక్షలు)గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ మోడల్ కార్లను విడుదల చేసిన మొదటి నెలలో సుమారు 70వేల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ లీ జున్ మాట్లాడుతూ.. ఎస్యూ 7ను ఈ ఏడాది మొత్తం లక్ష యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కాగా షావోమీ ఎస్యూ7 సెడాన్ మూడు వేరియంట్ ధరల్లో లభ్యమవుతుంది. స్టాండర్డ్ ధర 215,900 యువాన్లు, హై ఎండ్ ఎస్యూ7 ప్రో 245,900 యువాన్లు, ఎస్యూ 7 మ్యాక్స్ 299,900 యువాన్లుగా ఉంది. -
షావోమీ దూకుడు: బిగ్ టీవీ, బడ్జెట్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్, స్మార్ట్టీవీ సెగ్మెంట్లో రారాజులో ఏలుతున్న చైనా స్మార్ట్ఫోన దిగ్గజం షావోమి ఎంఐ తాజాగా కొత్త ఎల్ఈడీ టీవీలను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 4కె పేరుతో వీటిని విడుదల చేసింది. వీటితోపాటు ఎంఐ సౌండ్ బార్నుకూడా ఆవిష్కరించింది. 20 వాట్ల స్టీరియో స్పీకర్లు, గూగుల్ వాయిస్ సెర్చ్, షావోమి సొంతమైన ప్యాచ్ వాల్ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ పేర్కొంది. ఇంకా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ను ఈ టీవీలలో అందిస్తున్నారు. ప్లే స్టోర్, క్రోమ్ క్యాస్ట్కు సపోర్ట్, హాట్ స్టార్, హంగామా, సోనీ లివ్, వూట్, ఈరోస్ నౌ, జీ5, హూక్, ఎపిక్ ఆన్ వంటి యాప్లు ఇన్బిల్ట్గా ఈ స్మార్ట్ టీవీల్లో పొందుపర్చింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 అంగుళాల టీవీలో 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్టులు, డీటీఎస్ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43 ఇంచ్ టీవీలో 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టులు తదితర ఫీచర్లను అందిస్తోంది. ధరలు: 43 ఇంచుల టీవీ ధర రూ.22,999 55 ఇంచుల టీవీ ధర రూ.39,999 సౌండ్బార్ ధర : రూ. 4999 ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్కార్ట్లో ఈ టీవీలు విక్రయానికి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. -
‘ఎంఐ ఏ 2’ ధరపై భారీ తగ్గింపు
షావోమి తీసుకొచ్చిన ఎంఐ ఏ 2 స్మార్ట్ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఈ మేరకు షావోమి ట్విటర్లో వివరాలను షేర్ చేసింది. ఇంతకుముందెన్నడూ లేని తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఎంఐ ఏ2 స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లపై ఈ తగ్గింపును వర్తింప చేయనుంది. ఎంఐ ఏ2 4జీబీ ర్యామ్, 64 జీబీ ధరను రూ. 13, 999లకే అందిస్తోంది. ఎంఆర్పీ ధర రూ.17,999. 6జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 15,999 కే లభ్యమవుతోంది. అసలు ధర ధర రూ. 20,500. అమెజాన్, ఎం.కామ్ అన్లైన్ స్టోర్లతోపాటు, ఎంఐహోమ్ ఆఫ్లైన్ ద్వారా ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు సేల్ ప్రారంభం. ఇదే అతి పెద్ద హై ఫై (5) ప్రకటన అని షావోమి ఇండియా ట్వీట్ చేసింది. ఇంకా ఇలాంటి ఆఫర్లను ఇంకా నాలుగు ప్రకటించనుంది. Mi fans! Here's the 1st BIG #High5 announcement! Get #MiA2 at a never before price. Massive discount of ₹4,500! Get yours starting 12 noon from https://t.co/D3b3Qt4Ujl, @amazonIN, Mi Home & offline stores! RT if you're getting one & stay tuned for 4 more amazing announcements. pic.twitter.com/uNP2cmOl82 — Mi India (@XiaomiIndia) January 7, 2019 -
బడ్జెట్ ధరల్లో శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు త్వరలో
సౌత్ కొరియాఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో మొబైల్ ఫోన్లను తీసుకురానుంది. తద్వారా భారతీయస్మార్ట్ఫోన్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో పాగావేసిన చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమిని సవాల్ చేయనుంది. ఎం సిరీస్ గెలాక్స్ ఫోన్లపై గత ఏడాది డిసెంబరులోనే న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ నివేదించడం గమనార్హం. తక్కువ ధరలకే అద్భుతమైన ఫీచర్లతో సరికొత్తగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని శాంసంగ్ ప్రణాళికలు రచిస్తోంది. మధ్య స్థాయి ధరల శ్రేణిలో ‘శాంసంగ్ గెలాక్సీ ఎం’ (ఎం=మిలినియల్స్) సిరీస్లో ఫోన్లను లాంచ్ చేయనుంది. అంటే లక్షలమందిని కస్టమర్లను ఆకర్షించాలనేది ప్లాన్. ముఖ్యంగా గెలాక్సీ ఎం సిరీస్లో ఎం10, ఎం20, ఎం30 పేరుతో మూడుస్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తేనుంది. ఇన్ఫినిటీ వినాచ్ డిస్ప్లేతో ఈ నెలలోనే వీటిని లాంచ్ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఎం10ను (6 అంగుళాల డిస్ప్లే) రూ.9500, ఎం20 (6.3 అంగుళాల డిస్ప్లే), ఎం30 ధరతో సుమారు రూ.12 నుంచి రూ.15వేల ధరకు తీసుకొచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎం30 డివైస్లో ట్రిపుల్ కెమెరా మెయిన్ ఫీచర్గా ఉండనుందట. భారత్లోనే గ్లోబల్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనుండటం మరో విశేషం. శాంసంగ్ సొంత ఎక్సినాస్ 7885 ప్రాసెసర్తో పాటు, 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.1ఓరియో, భారీ డిస్ప్లే, ఆకర్షణీయమైనకెమెరా, భారీబ్యాటరీతో ఈ ఫోన్లు మార్కెట్లో త్వరలోనే హల్చల్ చేయనున్నాయి. వీటి ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. ఎం10 : 6 అంగుళాల డిస్ప్లే, 8 ఎంపీసెల్పీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్; 7870 ఆక్టాకోర్ ప్రాససర్, ఆండ్రాయిడ్ ఓరియో, 3జీబీ ర్యామ్, 16/32జీబీ స్టోరేజ్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఎం 20 : 60.3 ఇంచెస్డిస్ప్లే, 3జీబీ ర్యామ్, 32జీబీ/64 స్టోరేజ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 13+5 డ్యుయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎం 30 : 6.3 ఇంచెస్డిస్ప్లే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 16 ఎంపీ సెల్పీ కెమెరా, 13+5+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమీ టీవీ ధరలు తగ్గాయ్!
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ మార్కెట్లో భారత్లో టాప్ నిలిచిన చైనా కంపెనీ టీవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంఐ స్మార్ట్టీవీల పేరుతోబడ్జెట్ ధరల్లో వీటిని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి స్మార్ట్టీవీల్లో కూడా నెం.1 బ్రాండ్గా నిలిచింది. తాజాగా షావోమి తన కస్టమర్లకు నూతన సంవత్సర కానుకను అందించింది. ఎంఐ టీవీలపై ధరలను తగ్గించినట్టు ప్రకటించింది. ఎంఐ టీవీల ధరలను తగ్గించినట్టు షావోమి వెల్లడింది. వెయ్యి నుంచి 2వేల రూపాయల దాకా ఈ తగ్గింపు ఉండనుంది. 32 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ధర రూ.1500 తగ్గింపుతో ప్రస్తుతం రూ.12,499లకు అందుబాటులో ఉంది. 32 అంగుళాల ఎంఐ టీవీ 4సీ ప్రొ ధర. రూ.13,999గా ఉంది. రూ.2 వేలను తగ్గించింది. 49 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఏ ప్రొ రూ.1000తగ్గి రూ. 30,999లకే అందుబాటులో ఉంది. Mi fans! There couldn't be a better beginning. Get your hands on TVs from India's #1 Smart TV Brand at an unbeatable price, starting today. How's this for a New Year gift? RT to spread happiness. pic.twitter.com/9ZWb2dYlyw — Mi India (@XiaomiIndia) January 1, 2019 -
ఇల్లంతా ‘ఎంఐ’ మయం..!
న్యూఢిల్లీ: చేతిలో ఎంఐ ఫోన్... హాల్లో ఎంఐ ఫ్రిజ్... కిచెన్లో ఎంఐ వాటర్ ప్యూరిఫయర్... బాల్కనీలో ఎంఐ వాషింగ్ మెషిన్... బెడ్ రూమ్లో ఎంఐ ఏసీ... భవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం!. చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఐ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లతో భారతీయులకు చేరువైన చైనా కంపెనీ ‘షావోమీ’... భారత మార్కెట్లో మరింతగా పాతుకుపోయే ప్రణాళికలను రచిస్తోంది. స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ నుంచి పూర్తి స్థాయి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీగా అవతరించనుంది. షావోమీ ఉన్నత స్థాయి ఉద్యోగ బృందం ప్రస్తుతం ఇదే పనిలో ఉంది. భారత మార్కెట్లో భారీ వృద్ధికి అవకాశం ఉన్న ఎయిర్కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్టాప్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వాటర్ ప్యూరిఫయర్ల విభాగాల్లో ఉత్పత్తులను తీసుకురావడంపై షావవోమీ దృష్టి సారించినట్టు సమాచారం. అన్ని ఉత్పత్తులను కూడా ఇంటర్నెట్ ఆధారితంగా నియంత్రించేందుకు (ఐవోటీ) వీలుండే స్మార్ట్గానే ఉంటాయని, రిమోట్గా వీటిని నియంత్రించుకోవచ్చని కంపెనీ ఉద్యోగులు తెలిపారు. వృద్ధి అవకాశాలు... భారత మార్కెట్లో షావోమీ ఏటా 100 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా మరింత వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది కంపెనీ ఆలోచన. స్మార్ట్ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా ఈ ఒక్క విభాగమే శాశ్వతం కాదనుకుని అదనపు వృద్ధి అవకాశాలపై కంపెనీ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. నిజానికి షావోమీ ఇప్పటికే భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, టీవీలతోపాటు మరికొన్ని గ్యాడ్జెట్లను కూడా విక్రయిస్తోంది. స్మార్ట్ టెలివిజన్ల విభాగంలో వచ్చే ఏడాది మరిన్ని ఉత్పత్తులను తీసుకురానుంది. షావోమీ ప్రస్తుతం తన ఉత్పత్తులను తొలుత ఆన్లైన్లో విడుదల చేసి, తర్వాత ఎంఐ స్టోర్లలో అందుబాటులోకి తెస్తోంది. ఇకపై పెద్ద ఎలక్ట్రానిక్, మొబైల్ రిటైల్ స్టోర్లలోనూ తన ఉత్పత్తులను అందుబాటులోకి తేనుందని పరిశ్రమకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఆఫ్లైన్లో భారీ విస్తరణ... షావోమీ దేశవ్యాప్తంగా కొత్తగా 500 పట్టణాల్లోకి వచ్చే ఏడాది తన కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికతో ఉంది. ప్రస్తుతం కంపెనీ దేశంలోని టాప్ 50 పట్టణాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. షావోమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ స్మార్ట్ టెలివిజన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రధాన కంపెనీలైన శామ్సంగ్, సోనీ, ఎల్జీ ఉత్పత్తులతో పోలిస్తే 30–50 శాతం చౌక ధరలకే ఆఫర్ చేయడం ద్వారా వాటికి గట్టి సవాల్ విసిరింది. తొలుత ఆన్లైన్లో ఆరంభించిన విక్రయాలను తర్వాత ఎంఐ స్టోర్లకు విస్తరించింది. స్థానిక కంపెలతో తయారీ ఒప్పందాలను చేసుకుంది. ఇదే తరహాలో హోమ్ అప్లయన్సెస్ విభాగంలోనూ మరిన్ని ఉత్పత్తులతో చొచ్చుకుపోవాలన్నది కంపెనీ వ్యూహం. ప్రధాన కంపెనీలకు దీటుగా ఫీచర్లన్నింటినీ ఇస్తూ, ధరల పరంగా చౌకగా అందుబాటులోకి తీసుకురావడం ఎంఐ విజయసూత్రంగా ఉంది. -
షావోమి ఎంఐ ఫ్యాన్ షేల్ షురూ!
సాక్షి,న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమి నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్ పేరుతో డిస్కౌంట్ అమ్మకాలను ప్రారంభించింది. నేటి (డిసెంబరు19వ తేదీ నుంచి 21వ తేదీ ) నుంచి మూడు రోజుల పాటు ఈ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, ఎంఐ ఎల్ఈడీ టీవీలు, ఇతర ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లతోపాటు రాయితీలను కూడా అందిస్తోంది. ఎంఐ ఆన్లైన్ స్టోర్తోపాటు, అమెజాన్, ఫ్లిప్కార్ట్లలోనూ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 5 ప్రొ, ఎం ఏ2, రెడ్ మీవై2 స్మార్ట్ఫోన్లతో పాటు ఎంఐటీవీలపై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఎంఐ ఎ2 6జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999లకే లభ్యం. ఎంఐ ఎ2 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,999 ధరకు అందుబాటులో ఉంది. రెడ్మీ నోట్ 5 ప్రొ 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.14,999 ధరకు లభ్యమవుతోంది. 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.12,999 ధరకు విక్రయిస్తోంది. రెడ్మీ వై2 4జీబీ ర్యామ్ వేరియెంట్ వెయ్యి రూపాయల తగ్గింపుతో రూ.10,999లభ్యం. 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.8,999 ధరకు లభ్యం. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ (49 ఇంచెస్) రూ.1వేయి తగ్గింపుతో రూ.30,999 ధరకు లభ్యం కానుంది. అలాగే ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ (43 ఇంచెస్) రూ.21,999 ధరకు, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సి ప్రొ (32 ఇంచెస్) రూ.14,999 ధరకు లభ్యం కానున్నాయి. అంతేకాదు ఈ సేల్లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు ఐటమ్స్ను కొనుగోలు చేస్తే రూ.50, రూ.100, రూ.200, రూ.500 విలువైన కూపన్లు ఇస్తారు. మొబిక్విక్ యూజర్లకు 10 శాతం ఇన్స్టంట్ సూపర్ క్యాష్ వస్తుంది. గూగుల్ పే యూజర్లు రూ.500, . పేటీఎం యూజర్లు రూ.300 క్యాష్బ్యాక్ అందిస్తోంది. అలాగే మొబిక్విక్ యూజర్లు 10శాతం దాకా డిస్కౌంట్ పొందే అవకాశం. Smartphone or a smart device, choose your pick. Because we've offers on your favourite products in #1MiFanSale. Check out for more offers here: https://t.co/uhKAPsvyYj pic.twitter.com/Qw9cjGQHLX — Mi India (@XiaomiIndia) December 17, 2018 -
48 ఎంపీ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్!
పదేళ్ల క్రితం నోకియా తన మొబైల్స్లో కెమెరాలను అప్డేట్ చేస్తూ మొబైల్ మార్కెట్ను శాసించిన పరిస్థితులను చూశాము. గత కొద్ది నెలలుగా రిలీజవుతున్న మొబైల్స్ను గమనిస్తే ఈ ట్రెండ్ మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. ప్రతీ మొబైల్ కంపెనీ తమ ఫ్లాగ్షిప్ ఫోన్లలో కెమెరాలను అప్డేట్ చేస్తున్నాయి. గతవారం హువావే 40 ఎంపీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ రిలీజ్ చేసింది. ఇదే క్రమంలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ ఇండియాలో భారీ మార్కెట్ను సాధించిన చైనా మొబైల్ దిగ్గజం షావోమీ జనవరిలో బెస్ట్ కెమెరాతో దుమ్మురేపే మొబైల్ను అందుబాటులోకి తీసుకురానుంది. 48 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో ఈ ఫోన్ను తయారు చేయనున్నట్లు షావోమీ ప్రెసిడెంట్ లిన్ బిన్ తెలిపారు. ప్రముఖ చైనా టెక్నాలజీ వెబ్సైట్ వీబోలో ఈ మేరకు వార్త వెలువడింది. తాను కొద్దివారాల పాటు ఈ మొబైల్ను ఉపయోగించినట్లు లిన్ వెల్లడించారు. 48 ఎంపీ సెన్సార్గా సోనీ ఐఎయ్ఎక్స్ 586ని గానీ శాంసంగ్ ఐసోసెల్ బ్రైట్ జీఎం1ని గానీ అమర్చే అవకాశముందని తెలిపారు. సోనీ సెన్సార్ సూపర్ స్లో మోషన్ను సపోర్ట్ చేయడం లేదని, అయితే ఏదో ఒకటి చేసి దానినే అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ కెమెరాలు రెండూ నాలుగు రెట్ల వరకూ దూరాన్ని జూమ్ ద్వారా స్పష్టంగా తీయగలవు. ఇప్పటివరకూ షావోమీ ఈ స్థాయి కెమెరా కలిగిన ఫోన్ తయారు చేయలేదు. ఇది ఎంతవరకు విజయం సాధించగలదో చూడాలంటే జనవరి వరకూ ఆగక తప్పదు. -
ఎంఐ స్పెషల్ సేల్ : భారీ డిస్కౌంట్లు
ఎంఐ ఫ్యాన్స్కు శుభవార్త. షావోమి ఇండియా ప్రమోషనల్ ఆఫర్ను అందుబాటులోకి తెస్తోంది. డిసెంబరు 6నుంచి 8వతేదీవరకుఈ స్పెషల్ సర్ప్రైజ్ సేల్ను నిర్వహించనుంది. అమెజాన్లో ప్రత్యేకంగా ఈ సేల్ ఉంటుంది. ముఖ్యంగా ఎంఐ ఏ2, రెడ్ మి వై2 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. ఎంఐఏ 2: 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజ్ వేరియంట్ను రూ. 14,999లకే అందిస్తోంది. ఎంఆర్పీ ధర రూ. 17,499. ఎంఐఏ 2 6జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ వేరియంట్ను రూ. 16,999లకే లభ్యం. ఎంఆర్పీ ధర రూ. 20,500. రెడ్మి వై2 ( 3/2జీబీ) వేరియంట్ రూ.8999కే లభ్యం కానుంది. ఎంఆర్పీ ధర రూ. 10,499. రెడ్మి వై2 ( 4జీబీ/64జీబీ) వేరియంట్ రూ.10,999కే లభ్యం కానుంది. ఎంఆర్పీ ధర రూ.13,499. వీటితోపాటు రెడ్ మి 6ఏ స్మార్ట్ఫోన్ డిస్కౌంట్ అనంతరం రూ.5999 లకే అందిస్తోంది. Mi fans! It is Selebration time. I ❤️ Mi sale on @amazonIN begins on December 6th. We have got huge discounts on your favourite Mi smartphones. 🎊🎉🎈 RT if you're excited! pic.twitter.com/EZr6zBjnvR — Mi India (@XiaomiIndia) December 4, 2018 -
పోకో ఎఫ్1 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: షావోమీ సబ్ బ్రాండ్ లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ఫోన్ పోకో ఎఫ్1 భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఫ్లాష్ సేల్లో రికార్డు విక్రయాలను నమోదు చేసిన పోకోఎఫ్1 పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో 5వేల రూపాయల తగ్గింపు ధరలో లభిస్తోంది. డిసెంబరు ఆరునుంచి 8వ తేదీవరకు ఎంఐ.కాం, ఫ్లిప్కార్ట్లోఈ ఆఫర్ లభించనుంది. ట్విటర్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. ట్వీట్ల ద్వారా వినియోగదారులను గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న కంపెనీ ఎట్టకేలకు మొత్తం అన్ని వేరియంట్ల మీద ఈ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 ఇంచ్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ POCO community is live! Yes, you read it right. We are launching POCO community, a place where POCO fans from around the globe can come together and feel at home. So what are you waiting for? Log on to https://t.co/d1eeZRKzSi and be a part of POCO community now! 🤟 pic.twitter.com/V7FgM9RmrT — POCO India (@IndiaPOCO) December 4, 2018 -
షావోమీ బడ్జెట్ ఫోన్ ఫ్లాష్ సేల్
షావోమీ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ' రెడ్మి 6ఎ' ఫోన్లకు బుధవారం (నవంబరు 28) మరోసారి ఫ్లాష్సేల్ నిర్వహించనుంది. అమెజాన్, ఎంఐ.కామ్ వెబ్సైట్లలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్సేల్ ప్రారంభం. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్ కొనుగోలుపై 5 శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే జియో వినియోగదారులకు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,200 ఇన్స్టాంట్ క్యాష్బ్యాక్తోపాటు, షరతులతో 100 జీబీ జియో 4జీ డేటా ఉచితం. ఇక ఈ ఫోన్ ధరల విషయానికొస్తే.. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.600 పెరిగి రూ.6,599గా ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.500 పెరిగి రూ.7,499 వద్ద లభ్యం. రెడ్మీ 6ఎ ఫీచర్లు 5.45 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే 18:9 యాస్పెక్ట్ రేషియో ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10 హీలియో ఏ 22 2జీబీ ర్యామ్,16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి నోట్ 6 ప్రో సెకండ్ ఫ్లాష్ సేల్ నేడే
మొదటి సేల్లో రికార్డు స్థాయిలో అమ్ముడు బోయిన రెడ్మి నోట్ 6ప్రో రెండవసారి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు (నవంబరు 28) మధ్యాహ్నం 12గంటలనుంచి ఫ్లాష్సేల్ ప్రారంభం. ఎంఐ.కామ్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ సేల్ ఉంటుంది. చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి నోట్ సిరీస్లో కొత్త ఫోన్ రెడ్మి నోట్ 6ప్రోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనవంబరు 23న మధ్యాహ్నం 12, 3, 6, 9 గంటలకు వరుసగా స్పెషల్ సేల్ నిర్వహించింది. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో తమ స్మార్ట్ఫోన్ నిమిషాల్లో ఔట్ ఆఫ్ స్టాక్గా నిలిచిందని షావోమీ చీఫ్ మను జైన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెడ్మి నోట్ 6ప్రో ఫీచర్లు 6.26 ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వరుస ఫ్లాష్ సేల్స్ : హాట్కేకుల్లా రెడ్మి నోట్ 6ప్రో
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి నోట్ సిరీస్లో కొత్త ఫోన్ రెడ్మి నోట్ 6ప్రో ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు (నవంబరు 23) న స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 12, 3, 6, 9 గంటలకు వరుసగా స్పెషల్ సేల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 12 గంటల ఫ్లాష్సేల్లో తమ స్మార్ట్ఫోన్ నిమిషాల్లో ఐట్ ఆఫ్ స్టాక్గా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించిన షావోమీ చీఫ్ మను జైన్ వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లతో ఆసక్తి పుట్టించారు. అప్డేట్ 1: ఫ్లాష్సేల్ తర్వాత సుమారు ఒంటి గంటకు షావోమీ ఇండియా ఛీఫ్ మను జైన్ ట్విటర్లో 6 లక్షల యూనిట్ల సేల్ జరిగిందని పోస్ట్ చేశారు. కానీ కొద్ది నిమిషాల్లోనే దాన్ని డిలీట్ చేశారు. అప్డేట్2: మొదటి సేల్లో 6 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు మను జైన్ మరలా ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సెకండ్ సేల్లో కూడా అదే స్థాయిలో కొనుగోలు జరిగే అవకాశం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అప్డేట్3: మొదటి రెండు సేల్స్ మాత్రమే కాక సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు మరో రెండు సేల్స్ ఉంటాయని తెలిపారు. ఒకే రోజు నాలుగు ఫాష్సేల్స్ ఉండడంతో మొదటి రోజే మొబైల్ కొనాలనుకునే వారికి ఇదో సువర్ణావకాశమే అని చెప్పాలి. అదీ ఈ ఒక్క రోజే స్పెషల్ ధరలో ఈ స్మార్ట్ఫోన్లను విక్రయిస్తోంది. మరి మొదటి సేల్లోనే ఈ డివైస్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతే.. మిగిలిన మూడు సేల్స్లో ఇంకెన్ని యూనిట్ల సేల్స్ నమోదవుతాయో అనిటెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
షావోమి వేగం : మరో బిగ్ టీవీ లాంచ్
సాక్షి,ముంబై: మొబైల్స్ తయారీదారు షావోమీ టీవీ సెగ్మెంట్లో శరవేగంగా దూసుకుపోతోంది. ఇటీవీల టీవీ మార్కెట్పై దృష్టి పెట్టిన షావోమి వరుసగా లాంచ్లతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా 75 ఇంచులఎంఐ టీవీ 4ఎస్ను చైనా మార్కెట్లో విడుదల చేసింది, ఈ రోజు నుంచే సేల్స్ను ప్రారంభించింది. దీని ధరను రూ.82,100గా నిర్ణయించింది. ఇక ఈ టీవీ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే క్వాడ్కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, డీటీఎస్ హెచ్డీ డాల్బీ ఆడియో, బ్లూటూత్, వైఫై తదితరాలు లభిస్తున్నాయి. -
అదిరే ఫీచర్లతో రెడ్మి నోట్ 6 ప్రో
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను పొందుపరుస్తూ చైనా మొబైల్ తయారీదారు షావోమీ వినియోగదారుల ఆదరణను పొందింది. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన రెడ్మి నోట్ 5ప్రో కి కొనసాగింపుగా రెడ్మి సిరీస్లో మరో అద్భుతమైన ఫోన్ ‘రెడ్మి నోట్ 6ప్రో’ ను తీసుకొస్తోంది. ముందూ, వెనుక నాలుగు కెమెరాలతో ఈ డివైస్ను ఈ నెల 23న మార్కెట్లో విడుదల చేయనుంది. ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా దీనిని మార్కెట్లో రిలీజ్ చేయనున్నారు. దీని ఫీచర్లు ప్రధానంగా ఇలా ఉండనున్నాయి. 6.26 ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర వివరాలు అధికారికంగా ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయితే సుమారు రూ.15వేల లోపు ధరను నిర్ణయించే అవకాశం ఉందని అంచనా. -
షావోమి సరికొత్త ల్యాప్టాప్స్ లాంచ్
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి రెండుకొత్త ల్యాప్టాప్లను లాంచ్ చేసింది. ఎంఐ నోట్బుక్ ఎయిర్ ప్రొడక్ట్తో ల్యాప్టాప్ విభాగంలోకి కూడా ప్రవేశించిన షావోమీ తాజాగా ఈసిరీస్లో భాగంగా రెండు డివైస్లను చైనాలో విడుదల చేసింది. 13.3 అంగుళాలు , 15.6-అంగుళాల డిస్ప్లేలతో రెండు డివైస్లను ప్రారంభించింది. 8న జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్లను, గ్లాస్ టచ్ప్యాడ్, బ్యాక్లిట్ కీ బోర్డు ఈ కొత్త ల్యాప్టాప్ల్లో అమర్చింది. 1. ఎంఐ నోట్బుక్ ఎయిర్ 13.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1920x1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ 620 కార్డు 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్ ఫ్రంట్ఫేసింగ్ కెమెరా 40వాట్స్బ్యాటరీ ధర రూ. 41,500 2. ఎంఐ నోట్బుక్ ఎయిర్ 15.6 అంగుళాల డిస్ప్లే 1080x1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 1 టీబీ దాకా విస్తరించుకునే అవకాశం ధర : సుమారు రూ .35,500 భారతీయ మార్కెట్లో ఈ పరికరాలు ఎపుడు లాంచ్ అయ్యేది ఇంకా ప్రకటించలేదు. -
షావోమి మరో స్మార్ట్టీవీ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇంటా బయటా దూసుకుపోతున్ చైనా కంపెనీ షావోమి ఇటీవల టీవీ మార్కెట్పై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో సరసమైన ధరల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ ఎంఐ స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది. ఎంఐ టీవీ4 సిరీస్లో తాజాగా 65 ఇంచుల 4కె అల్ట్రా హెచ్డీ , ఏఐ ఆధారిత ఎంఐ టీవీ4ను చైనా మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ ప్లస్ డీటీఎస్, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ప్రధాన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సుమారు రూ.63,300 దీని ధరను నిర్ణయించింది. అయితే బారత మార్కెట్లో ఈ టీవీని ఎపుడు లాంచ్ చేసేదీ స్పష్టత లేదు. -
రెండున్నర రోజుల్లో 25 లక్షల డివైజ్లు అమ్మకం
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమి రికార్డులు బ్రేక్ చేసింది. కేవలం రెండున్నర రోజుల్లో 25 లక్షలకు పైగా ఎంఐ డివైజ్లను విక్రయించింది. ఈ డివైజ్ల్లో ఎంఐ ఎల్ఈడీ టీవీలు, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ పవర్ బ్యాంక్లు, ఎంఐ ఇయర్ఫోన్లు, ఎంఐ రూటర్లు, ఎంఐ ఎకో సిస్టమ్ డివైజ్లు, యాక్ససరీ ప్రొడక్ట్లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఎంఐ సూపర్ సేల్ల్లో భాగంగా షావోమి ఈ రికార్డులను బ్రేక్ చేసింది. ఫెస్టివల్ కానుకగా నిర్వహిస్తున్న ఈ మూడు సేల్స్లో అమేజింగ్ డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. షావోమి ఈ రికార్డును అక్టోబర్ 9వ తేదీ రాత్రి 12 గంటల నుంచి అక్టోబర్ 11వ తేదీ రాత్రి 7 గంటల మధ్యలో సాధించినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ వీపీ మను కుమార్ జైన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ అనూహ్యమైన స్పందనకు, ప్రేమకు ఎంఐ అభిమానులందరికీ మను కుమార్ జైన్ కృతజ్ఞతలు తెలిపారు. ఫెస్టివల్ సేల్స్లో భాగంగా షావోమి ప్రొడక్ట్లపై అందిస్తున్న ఆఫర్లు.... రెడ్మి నోట్ 5 ప్రొ రూ.2000 డిస్కౌంట్లో లభ్యమవుతుంది. హెచ్డీఎఫ్సీ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో మొత్తంగా ఈ ఫోన్ రూ.11,699కే అందుబాటులోకి వస్తోంది. రెడ్మి వై2(3జీబీ+32జీబీ) ఫోన్, రెడ్మి వై2(4జీబీ+64జీబీ) స్టోరేజ్ ఫోన్ రూ.1000, రూ.2000 డిస్కౌంట్లో విక్రయానికి వచ్చింది. ఎంఐ మిక్స్ 2 ధర రూ.7000 తగ్గింది. దీంతో ఇది రూ.22,999కే లభ్యమవుతుంది. ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(43) ధరలు రూ.500, రూ.2000 మేర తగ్గాయి. డిస్కౌంట్ అనంతరం ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(43)లు రూ.13,499కు, రూ.20,999కు విక్రయానికి వచ్చాయి. 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2ఐ రూ.699కే విక్రయిస్తున్నాయి. 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2ఐ రూ.1399కు లభ్యమవుతోంది. -
మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన షావోమి
స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం.. ‘స్మార్ట్ లివింగ్’ పోర్టుఫోలియోలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్స్ను, స్మార్ట్ సెక్యురిటీ సిస్టమ్ను, ఫిట్నెస్ బ్యాండ్లను, స్మార్ట్ టీవీలను ప్రవేశపెడుతూ.. కస్టమర్లను మరింత ఆకట్టుకుంటోంది. నేడు కూడా షావోమి ఐదు సరికొత్త ప్రొడక్ట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవేమిటంటే.. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ సిరీస్లను, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్, ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360, ఎంఐ లగేజీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. షావోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ- సిరీస్.... గురువారం షావోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ రేంజ్లో మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన టీవీలకు సక్సెసర్గా వీటిని తీసుకొచ్చింది. 32 అంగుళాలు, 49 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజ్లో ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొలు మార్కెట్లోకి వచ్చాయి. 32 అంగుళాల టీవీ ధర 14,999 రూపాయలు కాగ, 49 అంగుళాల మోడల్ ధర 29,999 రూపాయలు, 55 అంగుళాల మోడల్ ధర 49,999 రూపాయలు. ఈ కొత్త టీవీల ప్రత్యేకత పునరుద్ధరించిన సాఫ్ట్వేర్. ఆండ్రాయిడ్ సపోర్ట్తో ప్యాచ్వాల్ యూఐ రిఫ్రెస్తో ఈ టీవీలు పనిచేస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్ లేదా ప్యాచ్వాల్ ఏ విధంగానైనా టీవీ మోడ్లోకి వెళ్లవచ్చు. ఆండ్రాయిడ్ సపోర్ట్తో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త టీవీలకు క్రోమోకాస్ట్ సపోర్టు కూడా ఉంది. రిమోట్లోనే వాయిస్ సపోర్ట్ను ప్రవేశపెట్టింది. 55 అంగుళాల టీవీ 4కే ప్లస్ హెచ్డీఆర్ సపోర్ట్తో వచ్చింది. ప్రపంచంలో పలుచైన టీవీ ఇదే. డోల్బే ప్లస్ డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, 3 హెచ్డీఎంఐ పోర్ట్లు, 2 యూఎస్బీ 3.0 పోర్ట్లు, వైఫై, బ్లూటూత్ 5.0, 2జీబీ ర్యామ్, 8జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ వీటిలో ఫీచర్లుగా ఉన్నాయి. ఎంఐ బ్యాండ్ 3... షావోమి కొత్త ఫిట్నెస్ బ్యాండ్ ఇది. దీని ధర 1,999 రూపాయలు. ఎంఐ బ్యాండ్ 3 అతిపెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎస్ఎంఎస్లు, ఇతర మెసేజింగ్ అప్లికేషన్ల కంటెంట్ను ఇది చూపిస్తోంది. రిజెక్ట్ అయిన కాల్స్ను కూడా దీని స్క్రీన్పై చూడొచ్చు. హార్ట్-రేటు మానిటర్ను ఇది కలిగి ఉంది. 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెంట్ పవర్, 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. ఎంఐ ప్యూరిఫైయర్ 2ఎస్..... షావోమి నేడు తన సరికొత్త ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్ డిజిటల్ డిస్ప్లే, లేజర్ సెన్సార్, 360 డిగ్రీల ట్రిపుల్ లేయర్ ఫిల్టర్తో ఈ డివైజ్ రూపొందించింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ అమెజాన్ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ను ఆఫర్ చేస్తుంది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ తొలి సేల్ను సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది షావోమి కంపెనీ. దీన్ని ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, ఫ్లిప్కార్ట్లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఐ హోమ్, ఇతర ఆఫ్లైన్ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్అందుబాటులోకి రానుంది. ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360.... టూ-వే ఆడియోతో 360 డిగ్రీలు చూసే యాంగిల్లో ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరాను షావోమి తీసుకొచ్చింది. ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్, ఐదు రోజుల వరకు ఫుటేజీ స్టోరేజ్, ఇన్ఫ్రారెడ్ నైట్ వ్యూ, ఏఐ మోషన్ డిటెక్షన్, 64జీబీ వరకు స్టోరేజ్ను విస్తరించుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ దీనిలో ఉన్నాయి. ఎంఐ హోమ్ స్మార్ట్ఫోన్ యాప్ ద్వారానే సెక్యురిటీ కెమెరాను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంఐ లగేజ్... 20 అంగుళాలు, 24 అంగుళాల సైజుల్లో షావోమి ఎంఐ లగేజ్ను లాంచ్ చేసింది. చిన్న దాని ధర 2,999 రూపాయలు కాగా, 24 అంగుళాల మోడల్ ధర 4,299 రూపాయలు. గ్రే, బ్లూ, రెడ్ రంగుల్లో ఇది మార్కెట్లోకి వచ్చింది. -
ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ వచ్చేసింది..
న్యూఢిల్లీ : షావోమి నేడు మరో సరికొత్త ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్ డిజిటల్ డిస్ప్లే, లేజర్ సెన్సార్, 360 డిగ్రీల ట్రిపుల్ లేయర్ ఫిల్టర్తో ఈ డివైజ్ రూపొందించింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ అమెజాన్ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ను ఆఫర్ చేస్తుంది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ తొలి సేల్ను సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది షావోమి కంపెనీ. దీన్ని ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, ఫ్లిప్కార్ట్లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఐ హోమ్, ఇతర ఆఫ్లైన్ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం షావోమి ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ను కూడా రూ.8,999కే విక్రయిస్తున్నారు. -
రెడ్మి నోట్ 6 ప్రొ ధర లీక్
షావోమి స్టార్ పర్ఫార్మర్ రెడ్మి నోట్ 5 ప్రొకు సక్సెసర్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. రెడ్మి నోట్ 6 ప్రొ పేరుతో దీన్ని షావోమి రూపొందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించి గత కొన్ని వారాలుగా ఆన్లైన్లో రిపోర్టులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇన్ని లీకేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నా దాని అధికారిక లాంచ్ తేదీని మాత్రం ఇంకా రివీల్ కాలేదు. తాజాగా ఓ అంతర్జాతీయ రిటైల్ వెబ్సైట్లో రెడ్మి నోట్ 6 ప్రొ మరోసారి స్పాట్ అయింది. పాపులర్ ఇండియన్ టెక్ యూట్యూబర్ కూడా ఈ హ్యాండ్సెట్ వీడియోను అప్లోడ్ చేశాడు. తాజా రిపోర్టుల్లో రెడ్మి నోట్ 6 ప్రొ ధర లీకైంది. అంతర్జాతీయ ప్రముఖ వెబ్సైట్ పేర్కొన్న వివరాల ప్రకారం 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్తో వస్తున్న బేస్ వేరియంట్ ధర సుమారు రూ.25వేలుగా ఉండబోతుందని తెలిసింది. అంటే ప్రస్తుతమున్న రెడ్మి నోట్ 5 ప్రొ కంటే ఎక్కువే. ఈ లిస్టింగ్లోనే రెడ్మి నోట్ 6 ప్రొ అంతర్గత స్పెషిఫికేషన్లను కూడా పొందుపరిచింది. రెడ్మి నోట్ 6 ప్రొ స్మార్ట్ఫోన్ ఫీచర్లు... 1.8 గిగాహెడ్జ్ అక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 ఎస్ఓసీ, వెనుక వైపు డ్యూయల్ కెమెరా(12 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్), ముందు వైపు డ్యూయల్ కెమెరా(20 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్, 6.26 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో సాఫ్ట్వేర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డు సపోర్టు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు టెక్నికల్ గురుజి ఛానల్ నడుపుతున్న, భారత్ అతిపెద్ద యూట్యూబర్లలో ఒకరైన గౌరవ్ చౌదరి కూడా ఈ స్మార్ట్ఫోన్ గ్లోబల్ వెర్షన్ను లీక్ చేశాడు. అధికారిక లాంచింగ్ కంటే ముందే ఈ స్మార్ట్ఫోన్ దుబాయ్లో విక్రయానికి వచ్చిందని పేర్కొన్నాడు. వెనుక, ముందు డ్యూయల్ కెమెరాలు, 6.26 అంగుళాల డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్ఫోన్కు ఉన్నాయని వీడియో రివీల్ చేస్తుంది. అదేవిధంగా దుబాయ్లో విక్రయానికి వచ్చిన ఫోన్ ధర మన దేశ కరెన్సీ ప్రకారం రూ.14,800గా ఉందని యూట్యూబర్ చెప్పాడు. -
మరోసారి సేల్కు వచ్చిన షావోమి పోకో ఎఫ్1
మొబైల్ రంగంలో దూసుకెళ్తున్న చైనీస్ దిగ్గజం షావోమి. ఈ కంపెనీ తన సబ్బ్రాండ్ పోకో కింద పోకో ఎఫ్1 పేరుతో స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఇప్పటికే నాలుగుసార్లు విక్రయానికి వచ్చి అదరగొట్టింది. నేడు కూడా ఈ స్మార్ట్ఫోన్ మరోసారి విక్రయానికి వచ్చింది. పోకో ఎఫ్1 స్మార్ట్ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్లో విక్రయానికి ఉంచింది షావోమి కంపెనీ. మూడు వేరియంట్లు ఒకటి.. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్(ధర రూ.20,999), రెండు... 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఆప్షన్(రూ.28,999), మూడు.. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ స్పెషల్ ఎడిషన్(ధర రూ.29,999)ను అందుబాటులో ఉంచింది. గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ వేరియంట్లు ఫ్లిప్కార్ట్, షావోమి అధికారిక స్టోర్లో అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ప్రకటించింది. 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ఓపెన్ సేల్లో అందుబాటులో ఉంది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 అంగుళాల డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 845 ఎస్ఓసీ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ మాస్టర్ ఆఫ్ స్పీడ్ గా ఎఫ్1 స్మార్ట్ఫోన్ను పేర్కొన్నకంపెనీ ఐఆర్ ఫేస్ అన్లాక్, 1.4 మైక్రాన్ పిక్సెల్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ తదితర ఫీచర్లతో పోకోఫోన్ ఎఫ్1 అందుబాటులోకి తీసుకొచ్చింది షావోమి కంపెనీ. -
స్పెషల్ ఫీచర్లతో షావోమి స్మార్ట్ఫోన్లు
చైనా మొబైల్ మేకర్ షావోమీ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ వైపు మొగ్గు చూపింది. ఒప్పో, వివో స్మార్ట్ఫోన్ల తరహాలోనే ఐఆర్ ఫేస్ అన్లాక్ ప్రధాన ఫీచర్గా నూతన స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. భారీ స్క్రీన్, ఐఆర్ ఫేస్ అన్లాక్, ప్రెషర్ సెన్సిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఎంఐ 8 ఫ్యామిలీ కొనసాగింపుగా ఎంఐ 8ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్ఫోన్ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో భారత్లోనూ ఈ ఫోన్ను విడుదల చేయనుంది. రూ.33,945 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. హై ఎండ్ వేరియంట్ ధర 38,000 రూపాయలుగా ఉండనుంది. దీంతోపాటు ఎంఐ 8 లైట్ను యూత్ ఎడిషన్ కూడా విడుదల చేసింది. ఎంఐ8 ప్రొ ఫీచర్లు 6.21 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్, 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12+ 12ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంఐ8 లైట్(యూత్ ఎడిషన్) ఫీచర్లు 6.26 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 సాక్ 12 +5 ఎంపీ ద్వంద్వ వెనుక కెమెరా 24ఎంసీ సెల్ఫీ కెమెరా 3,350 ఎంఏహెచ్బ్యాటరీ 4జీబీ /64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 15వేలు, అలాగే 6జీబీ/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,000. అలాగే 6జీబీ /128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. సుమారు 21, 000 -
రెడ్ మి 6 ఫ్లాష్ సేల్ నేడే
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షావోమి భారత మార్కెట్లో ఇటీవల లాంచ్ చేసిన రెడ్మి 6 స్మార్ట్ఫోన్ ఫ్లాష్ సేల్ నేడు ప్రారంభం కానుంది. రెడ్ మి 6 సిరీస్లో భాగంగా విడుదల చేసిన రెడ్ మి 6 సేల్ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభం. ఫ్లిప్కార్ట్, ఎంఐ.కాం ప్లాట్ ఫాంలలో ఈ ఫ్లాష్సేల్ షురూ అవుతుంది. ధరలు : 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.7,999గా ఉండగా, 3జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,499గా ఉంది. కాగా మొదటి రెండు నెలలు మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. రెడ్మి 6 ఫీచర్లు : 5.45 అంగుళాల ఫుల్ స్క్రీన్ హెచ్డీ డిస్ప్లే, 12+5 ఎంపీ డ్యూయల్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లున్నాయి. -
రెడ్ కలర్లో రెడ్మి నోట్ 5 ప్రొ
రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్ ఇన్ని రోజులు లేక్ బ్లూ, బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లోనే అందుబాటులో ఉండేది. తాజాగా మరో కలర్ వేరియంట్ కూడా కస్టమర్ల ముందుకు వచ్చింది. రెడ్మి నోట్ 5 ప్రొ రెడ్ కలర్ వేరియంట్ను షావోమి లాంచ్ చేసింది. దీంతో మొత్తంగా ఐదు రంగుల్లో రెడ్మి నోట్ 5 ప్రొ లభ్యమవుతుంది. ఈ డివైజ్ ప్రస్తుతం షావోమి అధికారిక సైట్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్లో కూడా ఈ ఫోన్ త్వరలోనే లభ్యం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రెడ్మి నోట్ 5 ప్రొ లాంచ్ అయింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 చిప్సెట్ ఫీచర్తో వచ్చిన తొలి డివైజ్ ఇదే. షావోమి లాంచ్ చేసిన రెడ్మి నోట్ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్తో వచ్చిన తొలి నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది షావోమి. వీటి ధరలు రూ.14,999గా, రూ.16,999గా ఉన్నాయి. ఫేస్ అన్లాక్ ఫీచర్ను కూడా ఈ స్మార్ట్ఫోన్తో షావోమి తన యూజర్లకు ప్రవేశపెట్టింది. 20 మెగాపిక్సెల్తో సెల్ఫీ షూటర్ కలిగి ఉండగా.. వెనుకవైపు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. -
5 నిమిషాల్లో రూ. 200 కోట్లు
చైనా మొబైల్ తయారీదారు షావోమీ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఎదురులేని రారాజులా దూసుకుపోతోంది. ఇటీవల పోకో సబ్బ్రాండ్ ద్వారా లాంచ్ చేసిన పోకో ఎఫ్ 1 అపూర్వమైన సేల్స్ను నమోదు చేసింది. ఆగస్టు 29న ఫ్లిప్కార్ట్, ఎంఐ.కాం ద్వారా నిర్వహించిన ఫ్లాష్ సేల్లో కళ్లు తిరిగే ఆదాయాన్ని ఆర్జించింది. కేవలం ఐదు నిమిషాల్లో రూ. 200 కోట్ల విలువైన షావోమి పోకో ఎఫ్ 1 ఫోన్లు విక్రయించింది. పోకో ఎఫ్ 1 మొదటి ఫ్లాష్సేల్లో భారీ విక్రయాలను సాధించామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది బిగ్గెస్ట్, ఫాస్టెస్ట్ సేల్ అని పేర్కొంది. అలాగే తదుపరి ఫ్లాష్సేల్ సెప్టెంబరు 5న ఉంటుందని ప్రకటించింది. అయితే విక్రయించిన స్మార్ట్ఫోన్ల సంఖ్యను సంస్థ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ టాప్ వేరియంట్ స్మార్ట్ఫోన్లో 68వేల యూనిట్లను, 1 లక్షల దాకా బేస్ వేరియంట్ డివైస్లను వినియోగదారులు కొనుగోలు చేసినట్టు అంచనా. కాగా పోకో ఎఫ్ 1 స్మార్ట్ఫోనును మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 6జీబీర్యామ్/64 స్టోరేజ్ (బేస్ వేరియంట్) ధర .20,999 గానూ, 6జీబీర్యామ్/128 స్టోరేజ్ (రెండవ వేరియంట్)ధర 23,999 రూపాయలుగాను, 8జీబీర్యామ్/256 స్టోరేజ్ (టాప్ ఎండ్ వేరియంట్) రూ .28,999గా నిర్ణయించింది. దీంతో పాటు స్పెషల్ ఎడిషన్ రెడ్ వేరియంట్ రూ. 29,999 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ప్రారంభ అమ్మకాల్లోనే బ్రేకింగ్ రికార్డులతో దూసుకుపోతున్నషావోమి సబ్బ్రాండ్ పోకో గ్లోబల్ మార్కెట్లో లాంచింగ్ అనంతరం భారీ ప్రభావాన్నే చూపనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి -
పోకో ఎఫ్1 స్మార్ట్ఫోన్ వచ్చేసింది: జియో భారీ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ షావోమి సబ్బ్రాండ్ పోకో స్మార్ట్ఫోన్ అభిమానులకు ఆకట్టుకునేందుకు భారీ ప్రణాళితో వస్తోంది. భారత మార్కెట్లోకి సరికొత్త పోకో ఎఫ్1 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. భారత్లో పోకో ఫోన్ ఎఫ్1 ప్రారంభ ధర రూ.20999గా నిర్ణయించింది. ఆగస్టు, 29 మధ్యాహ్నం 12 గంటలనుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయానికి లభించనుంది. ఇక లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే రిలయన్స్ జియో భారీ ఆఫర్ అందిస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా రూ.8 వేల తక్షణ ప్రయోజనాలను కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. అదీ 6టీబీ హైస్పీడ్ డేటాతో. దీంతోపాటు హెచ్డీఎఫ్ఎసీ కార్డు ద్వారా కొనుగోళ్లపై వెయ్యి రూపాయల తగ్గింపును అందించనుంది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 అంగుళాల డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 845 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ మాస్టర్ ఆఫ్ స్పీడ్ గా ఎఫ్1 స్మార్ట్ఫోన్ను పేర్కొన్నకంపెనీ ఐఆర్ ఫేస్ అన్లాక్, 1.4 మైక్రాన్ పిక్సెల్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ తదితరఫీచర్లతో బ్లూ, గ్రే రంగుల్లో పోకోఫోన్ ఎఫ్1 అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. -
కేరళ వరదలు: షావోమి విరాళం ఏంటంటే..
తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు. వేలకోట్ల రూపాయలను నష్టపోయిన కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నారు. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమి నడుం బిగించింది. దేశీయ స్మార్ట్ఫోన్ రంగంలో రారాజులా వెలుగొందుతున్న షావోమి రంగంలోకి దిగడం విశేషం. వరద ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్ వినియోగదారులకు సాయపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఒకవైపు భారీ వర్షాలు, వరదలు, మరోవైపు కరెంటు కష్టాలతో అల్లాడిపోతున్న ప్రజల సహాయార్దం ముందుకు వచ్చింది. రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్న బాధితులకు పూర్తిగా చార్జింగ్ చేసిన వేలాది పవర్ బ్యాంకులను ఉచితంగా సరఫరా చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి బాక్స్ను వాలంటీర్లకు అందించామని షావోమీ ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పవర్ బ్యాంకులకు చార్జింగ్ చేసిన తమ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా గత శతాబ్ద కాలంలో లేని వరద పరిస్థితి కేరళను అతలాకుతలం చేస్తోంది. గత పదిరోజులుగా దయనీయమైన, అధ్వాన్నమైన వాతావరణం అక్కడి ప్రజలను బాధిస్తోంది. దాదాపు 13 జిల్లాల్లో ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. దాదాపు మూడున్నర లక్షలమంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. #Xiaomi is supplying thousands of fully charged Mi PowerBanks to relief camps in #Kerala, with help of @CNNnews18. Respect for our team members for charging these powerbanks & helping our countrymen! 1st box being handed over to a volunteer. #XiaomiWithKerala #KeralaFloods pic.twitter.com/BtoMbdVbPV — Manu Kumar Jain (@manukumarjain) August 18, 2018 -
తొలి సేల్కు వస్తున్న ఎంఐ ఏ2
షావోమి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్ ఎంఐ ఏ2 తొలి సేల్కు వస్తోంది. ఆగస్టు 16న అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆన్లైన్ స్టోర్లు, అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ను విక్రయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఎంఐ ఏ2 ధర భారత్లో 16,999 రూపాయలుగా ఉంది. ఈ వెబ్సైట్లలో ఎంఐ ఏ2ను పలు లాంచ్ ఆఫర్లతో లిస్ట్ చేశాయి. ఆగస్టులో ఈ ఫోన్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 9 నుంచే ఈ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్ కేవలం 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లోనే భారత్లోకి వస్తోంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ను తర్వాత మార్కెట్లోకి తీసుకురానుంది. ఆ తర్వాత ఆఫ్లైన్గా, ఇతర రిటైల్ స్టోర్లలో కూడా ఎంఐ ఏ2 అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ తెలిపింది. లాంచ్ ఆఫర్లు... ఎంఐ ఏ2 కొనుగోలుదారులకు 2,200 రూపాయల ఇన్స్టాంట్ క్యాష్బ్యాక్, 4.5టీబీ వరకు డేటాను రిలయన్స్ జియో ఆఫర్ చేయనుంది. ఎంఐ ఎక్స్చేంజ్ ప్రొగ్రామ్తో ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసుకోవచ్చు. పాత స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్లో తక్కువ ధరలో ఈ కొత్త డివైజ్ను యూజ్లు పొందవచ్చు. 999 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ఎంఐ ప్రొటెక్ట్ ప్లాన్లు, ఎంఐ ఏ2కు అందుబాటులో ఉంటాయి. ఎంఐ ఏ 2 ఫీచర్లు... 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 18:9 రేషియో, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 660 ఎస్వోసీ, ప్రాసెసర్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 లేయర్ ఆర్క్ డిజైన్తో అల్యూమినియం యూనిబాడీ ఆండ్రాయిడ్ వన్ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ 12+20 ఎంపి డ్యుయల్ రియర్ కెమెరా 20ఎంపీ ఫ్రంట్ కెమెరా 3010ఎంఏహెచ్ బ్యాటరీ -
స్మార్ట్ఫోన్ మార్కెట్లో రారాజు ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షావోమి తానే కింగ్నంటూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. భారత్లో స్మార్ట్ఫోన్ బ్రాండ్లో నెంబర్ వన్గా నిలిచింది. పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (ఐడీసీ) డేటా ప్రకారం వరుసగా నాల్గవసారి కూడా తన అత్యున్నత స్థానాన్ని నిలబెట్టుకుంది. 2018 రెండవ త్రైమాసికంలో దేశంలో 29.7 శాతం వాటాతో ఈ ఘనతను దక్కించుకుంది. 107.6 శాతం వృద్ధితో కోటి స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విక్రయించింది. అలాగే ఆన్లైన్ మార్కెట్లో కూడా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సెగ్మెంట్లో షావోమి 55.6 శాతం వాటా కైవసం చేసుకుంది. ఆన్లైన్ మార్కెట్లో వరుసగా ఏడవ క్వార్టర్లో ఈ ఘనతను సాధించింది. ఈ క్వార్టర్లో రెడ్ మీ 5ఏ, రెడ్ మి నోట్ ప్రో, రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 డివైస్ల టాప్ విక్రయాలతో ఈ రికార్డును దక్కించుకుంది. అయితే శాంసంగ్ మాత్రం రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. 23 శాతం మార్కెట్ షేర్తో 80 లక్షల స్మార్ట్ఫోన్లను షిప్మెంట్ చేసింది. ఐడిసి ప్రకారం, భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 20శాతం వృద్ధిని సాధించింది. 4.2 మిలియన్ల యూనిట్లు, 12.6 శాతంతో వివో మూడవ స్థానానంలో నిలిచింది. కాగా భారత మార్కెట్లోకి మొత్తం 33.5 మిలియన్ యూనిట్లు వచ్చాయి బలమైన ఉత్పత్తులతో ఆన్లైన్ బ్రాండ్ విక్రయాలు, ప్రత్యేకమైన లాంచింగ్ల ద్వారా ఈ వృద్ది సాధించినట్టు ఐడీసి వ్యాఖ్యానించింది. 2018లో చిన్న సంస్థలతో పోలిస్తే టాప్ 5 బ్రాండ్స్ 79 శాతం విక్రయాలు సాధించాయని ఐడీసీ ఇండియా అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి పేర్కొన్నారు. -
ఓపెన్ సేల్లో రెడ్మి నోట్ 5 ప్రొ
షావోమి పాపులర్ స్మార్ట్ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ ఎట్టకేలకు ఓపెన్ సేల్కు వచ్చింది. 24 గంటల పాటు ఈ స్మార్ట్ఫోన్ను అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో ఆరు నెలల పాటు కొనసాగిన రెడ్మి నోట్ 5 ప్రొ ఫ్లాష్ సేల్స్కు తెరపడింది. ప్రతి వారం నిర్వహించే ఫ్లాష్సేల్లో ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలుకు ఇబ్బందులు పడే కస్టమర్లు... ఇకపై ఎప్పుడైనా ఈ స్మార్ట్ఫోన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లాష్ సేల్ కి రాగానే నిమిషాల వ్యవధిలో ఈ ఫోన్ సేల్ అయిపోయి అవుట్ ఆఫ్ స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తుండటంతో కంపెనీ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. షావోమి అధికారిక వెబ్సైట్ ఎంఐ.కామ్, ఫ్లిప్కార్ట్ల ద్వారా ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉండనుంది. బ్లాక్, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో రెడ్మి నోట్ 5 ప్రొ మార్కెట్లోకి వచ్చింది. రెడ్మి నోట్ 5 ప్రొ బేస్ వేరియంట్ ధర రూ.14,999కాగ, హై-ఎండ్ వెర్షన్ ధర రూ16,999గా ఉంది. రెడ్మి నోట్ 5 ప్రొ లాంచ్ ఆఫర్లుగా 2,200 రూపాయల క్యాష్బ్యాక్, 4.5టీబీ అదనపు డేటాను జియో ఆఫర్ చేస్తోంది. 3 నెలల హంగామా మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ను కూడా లభించనుంది. యాక్సిస్ బ్యాంక్ బుజ్ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్ను కూడా ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు... 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
10వేల కంటే తక్కువకే 3 స్మార్ట్ఫోన్లు
భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనీస్ కంపెనీల హవా అంతా ఇంతా కాదు. ఎవరి చేతులో చూసిన ఒక చైనీస్ స్మార్ట్ఫోన్ కనిపించాల్సిందే అన్న చందాగా మారిపోయింది. చైనీస్ కంపెనీలు షావోమి, ఒప్పో, వివో, లెనోవోల సక్సెస్లు చూసిన తర్వాత మరో చైనీస్ కంపెనీ కూడా మన మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. షావోమి ప్రత్యర్థి గోమ్ ఎలక్ట్రానిక్స్ భారత్లో తన ప్రొడక్ట్లను మెగా లాంచ్ చేయబోతుందని తెలిసింది. ఇప్పటికే ఈ కంపెనీకి చైనాలో 1700 స్టోర్లు ఉన్నాయి. గోమ్ ఎలక్ట్రానిక్స్, గోమ్ టెలికాం ఈక్విప్మెంట్కు సబ్సిడరీ. ఈ కంపెనీ హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంది. తొలుత గోమ్ ఎలక్ట్రానిక్స్ రూ.10వేల తక్కువ ధరలో మూడు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతుంది. పండుగ సీజన్ను క్యాష్చేసుకునేందుకు ఈ స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను మల్టి బ్రాండ్ స్టోర్లు, ఆన్లైన్ల ద్వారా విక్రయించాలని ఆ కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో కూడా గోమ్ చర్చలు జరుపుతోంది. స్మార్ట్ఫోన్లను మాత్రమే కాక టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల లాంటి కన్జ్యూమర్ ప్రొడక్ట్ కేటగిరీలను విక్రయించాలని కూడా గోమ్ ప్లాన్ చేస్తోంది. దీని కోసం మల్టి బ్రాండ్ స్టోర్లతో కూడా భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో శాంసంగ్, టీసీఎల్, గోద్రెజ్, బజాజ్ లాంటి కంపెనీలకు ప్రత్యక్ష పోటీ ఇవ్వనుంది. భారత్ కార్యకలాపాల కోసం 2018 మార్చిలో పీయూష్ పురిని గోమ్ ఎలక్ట్రానిక్స్, భారత అధినేతగా నియమించింది. పురి, అంతకముందు మూడేళ్లు అమెరికా మల్టినేషనల్ దిగ్గజం ఫాక్స్కాన్ ఇన్-హౌజ్ బ్రాండ్ ఇన్ఫోకస్కు దేశీయ అధినేతగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఇన్ఫోకస్ మొబైల్ బ్రాండ్ను భారత్లో లాంచ్ చేయించింది కూడా ఈయనే. ఇన్ఫోకస్ తన ఆన్లైన్ విస్తరణ మరింత విస్తృతం చేసుకోవడానికి అమెజాన్తో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లైన్కు మరో బ్రాండ్ అంబాసిడర్గా రన్వీర్ సింగ్ను నియమించింది. -
షావోమి ఎంఐ ఏ2 లాంచ్ : లాంచింగ్ ఆఫర్లు
సాక్షి,ముంబై: చైనీస్ మొబైల్ తయారీ దిగ్గజం షావోమి నూతన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎంఐ ఏ2 పేరుతో రెండవ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ డివైస్ను ప్రస్తుతం లాంచ్ చేసింది. దీని ధరను రూ. 16,999గా నిర్ణయించింది. ప్రత్యేకంగా ఎంఐ, అమెజాన్ ద్వారా ప్రీ ఆర్డర్లు రేపు మధ్యాహ్నంనుంచి మొదలవుతాయి. ఆగస్టు 16నుంచి తొలి విక్రయాలు ప్రారంభం. త్వరలోనే 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ స్మార్ట్ఫోన్ను కూడా అందుబాటులోకి తేనుంది. దీని ధర రూ.22,000గా ఉండనుంది. ఎంఐ ఏ 2 ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 18:9 రేషియో, క్వాల్కం స్నాప్ డ్రాగన్ 660 ఎస్వోసీ, ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ 12+20 ఎంపి డ్యుయల్ రియర్ కెమెరా 20ఎంపీ ఫ్రంట్ కెమెరా 3010ఎంఏహెచ్ బ్యాటరీ ఇక లాంచింగ్ ఆఫర్ విషయానికి వస్తే రిలయన్స్ జియో ద్వారా రూ.2200 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. దీంతోపాటు 4.5 టీబీ డేటా కూడా ఉచితం. -
జియోఫోన్కు పోటీ : తక్కువ ధరకే షావోమి...
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించి, ఫీచర్ ఫోన్ మార్కెట్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు చెక్ పడబోతుంది. చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి, రిలయన్స్ జియోఫోన్కు పోటీగా వచ్చేస్తోంది. షావోమి అత్యంత తక్కువ ధరకు క్విన్ ఏఐ సిరీస్లో రెండు ఫీచర్ ఫోన్లను తన స్వదేశంలో లాంచ్ చేసింది. వీటిని భారత్లోనూ ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఏఐ ఆధారితంగా ఈ ఫీచర్ ఫోన్లు రూపొందాయి. జియో కియా ఓఎస్ను వాడితే, షావోమి ఒక స్టెపు ముందుకు వేసి దీనిలో ఆండ్రాయిడ్ ఓఎస్ను పొందుపరిచింది. క్విన్ 1, క్విన్ 1 ఎస్ పేరుతో ఈ ఫీచర్ ఫోన్లు వచ్చాయి. ఇవి కేవలం ఫీచర్ ఫోన్లు మాత్రమే కాదు. మరిన్ని స్మార్ట్ ఫీచర్లను వీటిలో షావోమి అందిస్తోంది. 17 రకాల అంతర్జాతీయ భాషలను ఇది సపోర్టు చేస్తోంది. క్విన్ 1 కేవలం 2జీ ఫోన్ కాగ, క్విన్ 1ఎస్ 4జీ ఎల్టీఈ, వాయిస్ఓవర్ ఎల్టీఈను సపోర్టు చేస్తుంది. క్విన్ 1 ధర సీఎన్ఐ 199 అంటే సుమారు భారత కరెన్సీలో 1,990 రూపాయలు. క్విన్ 1ఎస్ ధర సీఎన్వై 299 అంటే 2,990 రూపాయలు. ఈ రెండు ఫీచర్ ఫోన్లు బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో అందుబాటులోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి వీటి షిప్పింగ్స్ ప్రారంభమవుతాయి. స్పెషిఫికేషన్లు... 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ క్విన్ 1లో మీడియోటెక్ ఎంటీ6260ఏ చిప్ సెట్, ఏఆర్ఎం7 సీపీయూ కోర్ క్విన్ 1ఎస్లో డ్యూయల్ కోర్టెక్స్ ఏ53 కోర్స్తో స్ప్రెడ్ట్రమ్ ఎస్సీ9820 చిప్సెట్ క్విన్ 1లో 8 ఎంబీ ర్యామ్, 16 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ క్విన్ 1ఎస్లో 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరణ మెమరీ 1480 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో కెమెరాలు లేవు ఒకవేళ భారత మార్కెట్లోకి ఈ ఫోన్లు ప్రవేశిస్తే, కచ్చితంగా జియో ఫోన్కు గట్టి పోటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
భారత్లోకి షావోమి ఎంఐ ఏ2 స్మార్ట్ఫోన్
ఎప్పడికప్పుడు బడ్జెట్ స్మార్ట్ఫోన్ల లాంచింగ్తో చైనీస్ మొబైల్ తయారీ దిగ్గజం షావోమి కస్టమర్లను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం స్పెయిన్లో జరిగిన ఓ ఈవెంట్లో షావోమి ఎంఐ ఏ2, ఎంఐ ఏ2 లైట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. అయితే ఈ స్మార్ట్ఫోన్లలో ఒకదాన్ని ఎంఐ ఏ2 ను ఆగస్టు 8న భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్టు షావోమి తెలిపింది. ఇక రెండో స్మార్ట్ఫోన్ భారత్లో లాంచింగ్ గురించి అసలు ఇసుమంతైనా ఊసు ఎత్తలేదు. ఎంఐ ఏ2 ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చినప్పటికీ, అన్ని వేరియంట్లు కూడా మన మార్కెట్లోకి రావట. ఎంఐ ఏ2 మోస్ట్ అఫార్డబుల్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ను షావోమి భారత్లో లాంచ్ చేయడం లేదని తెలిసింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ను మాత్రమే దేశంలో ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తుందని వెల్లడైంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఆప్షన్ కూడా మన దేశంలో లాంచ్ అవుతుందట. గ్లోబల్గా లాంచ్ అయిన గోల్డ్, బ్లాక్, బ్లూ రంగుల్లో మాత్రమే కాకుండా.. రోజ్ గోల్డ్ రంగులో కూడా ఈ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో లభ్యం కానుంది. షావోమి ఎంఐ ఏ2 స్మార్ట్ఫోన్ను ఆగస్టు 8న భారత్లో లాంచ్ చేయనున్నామనే విషయాన్ని షావోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ ధృవీకరించారు. షావోమి ఎంఐ ఏ2 ధర... 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు భారత్కు రావడం లేదు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.22,500 ఉండొచ్చు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర సుమారు రూ.28,100 ఉండొచ్చు. స్పెషిఫికేషన్లు.. డ్యూయల్ సిమ్(నానో) ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రామ్ 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ గ్లాస్ గొర్రిల్లా గ్లాస్ 5 ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 660 ఎస్ఓసీ వెనుక వైపు 12 ఎంపీ, 20 ఎంపీతో డ్యూయల్ కెమెరా సెటప్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3010 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎంఐ మ్యాక్స్ 3 వచ్చేసింది
చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి తన లేటెస్ట్ బడ్జెట్ ఫాబ్లెట్ను మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. ఎంఐ మ్యాక్స్3ను చైనా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు షావోమి ప్రకటించింది. ఎంఐ మ్యాక్స్ 2 సక్సెసర్గా 14 నెలల తర్వాత ఈ ఫాబ్లెట్ను తీసుకొచ్చింది. ఈ ఫాబ్లెట్కు 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5500 బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. డిస్ప్లే నాచ్ ఈ హ్యాండ్సెట్కు లేదు. డార్క్ బ్లూ, డ్రీమ్ గోల్డ్, మెటోరైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫాబ్లెట్ను రూపొందించింది. ఎంఐ మ్యాక్స్ 3 ధర, అందుబాటు ఎంఐ మ్యాక్స్ 3 చైనాలో 1,699 సీఎన్వై(సుమారు రూ.17,300)గా కంపెనీ నిర్ణయించింది. ఇది బేస్ వేరియంట్ ధర. బేస్ వేరియంట్కు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ కలిగిన మరో వేరియంట్ ధర 1,999 సీఎన్వై(సుమారు రూ.20,400)గా కంపెనీ నిర్ణయించింది. జూలై 20 నుంచి చైనాలో విక్రయానికి రానుంది. ఎంఐ మ్యాక్స్ 3 స్పెషిఫికేషన్లు... 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే క్వాల్కామ్ ఆక్టా-కోర్ స్నాప్డ్రాగన్ 636 ఎస్ఓసీ 4 జీబీ/ 6 జీబీ ర్యామ్ వెర్టికల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వెనుకవైపు 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు ఎక్స్పాండబుల్ మెమరీ డ్యూయల్ 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ సపోర్టు ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ -
రేపే లాంచింగ్ : బిగ్ స్క్రీన్తో ఎంఐ మ్యాక్స్ 3
షావోమి తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఎంఐ మ్యాక్స్ 3ను రేపు విడుదల చేయబోతుంది. ఈ డివైజ్ గురించి మార్కెట్లో వస్తున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. గత కొన్ని వారాలుగా పలు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ.. కంపెనీ అధికారికంగా ఓ టీజర్ను విడుదల చేసింది. ఎంఐ మ్యాక్స్ 3 ఎలా ఉండబోతుందో తెలుపుతూ కంపెనీ ఈ టీజర్ను షావోమి అధికారిక వైబో అకౌంట్ ద్వారా ట్విటర్ యూజర్లకు రివీల్ చేసింది. ఈ వీడియోలో ఎంఐ మ్యాక్స్ 6.9 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండబోతుందని, 5500 ఎంఏహెచ్ సామర్థ్యంతో అతిపెద్ద బ్యాటరీతో ఇది రూపొందిందని పేర్కొంది. షావోమి విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన, కింద ఉన్న బెజెల్స్, చాలా పలుచగా ఉంటాయని కంపెనీ వీడియో టీజర్ ధృవీకరించింది. అంతేకాక ఈ స్మార్ట్ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉందని పేర్కొంది. వెనుకవైపు కెమెరాకు కింద, ఈ ఫోన్ ఫింగర్ప్రింట్ సెన్సార్ను కలిగి ఉందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎంఐ మ్యాక్స్ 3 స్మార్ట్ఫోన్ లాంచింగ్పై కంపెనీ అధికార ప్రతినిధి ఆసక్తికరమై ట్వీట్ చేసింది. ‘ఎంఐ ఫ్యాన్స్, సమ్థింగ్ బిగ్ వస్తోంది! బిగ్ స్క్రీన్, బిగ్ బ్యాటరీ’ అని ట్వీట్ చేస్తూ స్మార్ట్ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. పలు రిపోర్టుల ద్వారా తెలిసిన ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 చిప్సెట్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 18:9 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 12 ఎంపీ, 5 ఎంపీలతో రియర్ డ్యూయల్ కెమెరా చైనాలో దీని ధర 1,699 సీఎన్వై ఉండొచ్చని అంచనా. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు 17,700 రూపాయలు. #Xiaomi Max 3 Official first commercial pic.twitter.com/RVhMrtXqrn — duggtech@gmail.com (@TechNavvi) July 17, 2018 -
రూ.649కే రెడ్మి నోట్ 5 ప్రొ!!
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్, బిగ్ షాపింగ్ డేస్ ప్రమోషనల్ సేల్ ఈవెంట్కు తెరలేపిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ బిగ్ షాపింగ్ డేస్ నిర్వహిస్తోంది. అమెజాన్ ప్రైమ్ డేకు పోటీగా నిర్వహిస్తున్న ఈ సేల్, జూలై 19తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో షావోమి రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్ను ఫ్లిప్కార్ట్ అత్యంత తక్కువగా రూ.649కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ను కొనుగోలు చేద్దామని ఎప్పడి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న షావోమి ఫ్యాన్స్కు ఇది నిజంగా గుడ్న్యూస్. అంతేకాక తగినంత స్టాక్ను కూడా అందుబాటులో ఉంచింది. అసలు రెడ్మి నోట్ 5 ప్రొ బేస్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.14,999 కాగ, టాప్ ఎండ్ వెర్షన్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర 16,999 రూపాయలు. ఈ రెండు వెర్షన్లు ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. బిగ్షాపింగ్ డేస్ ప్రమోషనల్ సేల్ ఈవెంట్ సందర్భంగా బేస్ వెర్షన్ను రూ.649కు, టాప్-ఎండ్ వెర్షన్ను రూ.2,649కు ఫ్లిప్కార్ట్ అందుబాటులోకి తెచ్చింది. ఈ భారీ డిస్కౌంట్ను పొందడానికి కస్టమర్లు రెండు రకాల ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. ఒకటి మరో స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్లో దీన్ని కొనుగోలు చేయడం, మరొకటి ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉండటం. ఎక్స్చేంజ్పై 12,850 రూపాయల వరకు తగ్గింపును ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తుండగా.. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ను ఇస్తోంది. ఈ గరిష్ట డిస్కౌంట్ను పొందడానికి కొనుగోలుదారులు ఈ రెండు ప్రమాణాలను కలిగి ఉండాలి. మీరు ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్ఫోన్ రూ.12,850 డిస్కౌంట్కు అర్హత కలిగి ఉండి, ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉంటే చాలు రూ.649కు రెడ్మి నోట్ 5 ప్రొ మీకు లభ్యమైనట్టే. అయితే ఐఫోన్ 6ఎస్ను, లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 2ను, షావోమి ఎంఐ 5ను ఎక్స్చేంజ్ చేయడానికి వీలులేదు. కేవలం వన్ప్లస్ 5టీ ఎక్స్చేంజీని చేసుకోవచ్చు. దీని ఎక్స్చేంజ్తో రూ.12,850 డిస్కౌంట్ లభిస్తోంది. ఒకవేళ రెడ్మి నోట్ 4 ఎక్స్చేంజ్లో దీన్ని కొంటే రూ.3600 తగ్గింపు వస్తోంది. దాంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డును కలిగి ఉంటే, అదనంగా మరో రూ.1500 తగ్గుతోంది. దీంతో రెడ్మి నోట్ 5 ప్రొ ధర రూ.14,999 నుంచి రూ.9,899కు తగ్గిపోతుంది. -
4 రూపాయలకే ఎంఐ టీవీ, రెడ్మి స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ : భారత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మార్కెట్లో సంచలనాత్మక బ్రాండ్గా షావోమికి పేరొంది. ఈ కంపెనీ బడ్జెట్ ధరల్లో స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లను లాంచ్ చేస్తూ భారతీయ వినియోగదారులను తెగ ఆకట్టుకుంటోంది. దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలకు సైతం చెక్ పెడుతోంది. ఈ కంపెనీ మన మార్కెట్లోకి ప్రవేశించి రేపటికి నాలుగేళ్లు పూర్తవుతుంది. జూలై 10న మంగళవారం ఈ కంపెనీ గ్రాండ్గా తన నాలుగో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఎంఐ అభిమానుల కోసం షావోమి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంఐ.కామ్లో జులై 10న ప్రారంభమయ్యే ఈ వార్షికోత్సవ సేల్ 12 వరకూ కొనసాగనుంది. ఎంఐ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లో 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని, రెడ్మి వై2 (3జీబీ+32జీబీ)ను, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్ను కేవలం నాలుగు రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. 10, 11, 12వ తేదీల్లో సాయంత్రం 4 గంటలకు లక్కీ కస్టమర్లకు కేవలం నాలుగు రూపాయలకే ఈ ఉత్పత్తులు లభిస్తాయి. ఒకవేళ సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లాష్ సేల్స్ అవకాశం చేజారిపోతే, కోంబోలో సాయంత్రం ఆరు గంటలకు రెడ్మి నోట్ 5ను, ఎంఐ వీఆర్ ప్లే 2ను కేవలం రూ.9,999కే అందించనున్నట్టు షావోమి తెలిపింది. వీటి అసలు ధర రూ.11,298గా ఉంది. రెడ్మి వై1, ఎంఐ బ్లూటూత్ హెడ్సెట్లను కూడా 8,999 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ను 8,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆఫర్స్... మధ్యాహ్నం 12 గంటలకు బ్లాక్బస్టర్ ఆఫర్ కింద ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్టీవీని రూ.13,999కు, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్ను రూ.14,999కు విక్రయించనున్నట్టు షావోమి తెలిపింది. ఇక ఎంఐ మిక్స్2, ఎం మ్యాక్స్2లపై కూడా రాయితీని అందిస్తోంది. ఎస్బీఐ, పేటీఎం, మొబిక్విక్ల ద్వారా చెల్లింపులు చేసేవారు అదనంగా ఇంకొంత రాయితీని పొందవచ్చు. ఎస్బీఐ కార్డు ద్వారా కనీసం రూ.7,500 లావీదేవీపై రూ.500 రాయితీ అందించనుండగా, రూ.8,999 కొనుగోలుపై పేటీఎం ద్వారా చెల్లింపు చేసిన వారికి రూ.500 క్యాష్బ్యాక్, విమాన టికెట్ల బుకింగ్పై రూ.1,000, సినిమా టికెట్లపై రూ.200 రాయితీని షావోమి అందిస్తుంది. ఇక మొబిక్విక్ ద్వారా చెల్లింపు చేసేవారు 25శాతం వరకూ(రూ.2,500 సూపర్ క్యాష్) డిస్కౌంట్ లభిస్తుంది. ఎంఐ మిక్స్2 రూ.27,999(అసలు ధర రూ.29,999), ఎంఐ మ్యాక్స్2 రూ.14,999(అసలు ధర రూ.15,999) ట్రావెల్ బ్యాక్ప్యాక్ రూ.1,899(ఎంఆర్పీ రూ.1,999), ఎంఐ ఇయర్ఫోన్స్ రూ.649(అసలు ధర రూ.699) ఎంఐ బ్యాండ్ 2 రూ.1,599(ఎంఆర్పీ రూ.1,799) అందిస్తోంది. ఎంఐ ట్రావెల్ బ్యాక్ప్యాక్(రూ.1,999)కు, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్(రూ.1,299) ఎంఐ బ్యాండ్ స్ట్రిప్ బ్లూ(రూ.199) రెండింటినీ రూ.1,398 అందించనున్నట్టు షావోమి తెలిపింది. వీటితో పాటు ఇతర గ్యాడ్జెట్స్పై కూడా రాయితీని, కూపన్లను ఆఫర్ చేస్తుంది. -
భారత్కు షావోమి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షావోమి, మరో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కొత్త స్మార్ట్ఫోన్, భారత మార్కెట్లో హల్చల్ చేయబోతుందని ఎక్స్డీఏ డెవలపర్స్ రిపోర్టు చేసింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో రూపొందుతుందని, దీని కోడ్-నేమ్ ‘బెర్రిలియం’గా రిపోర్టు రివీల్ చేసింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 గ్రాఫిక్స్ కోసం ఆండ్రినో 630 జీపీయూతో మార్కెట్లోకి వస్తుందని, నాచ్తో ఎల్సీడీ డిస్ప్లేను, 18:9 యాక్స్పెప్ట్ రేషియోను ఇది కలిగి ఉందని రిపోర్టు పేర్కొంది. రహస్యమైన ఫోన్ బ్రాండ్ ‘పోకోఫోన్’ను ఇటీవలే షావోమి ట్రేడ్మార్కు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనికిందనే ఈ కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతుందని ఎక్స్డీఏ డెవలపర్స్ రిపోర్టు చేసింది. అంతేకాక క్వాల్కామ్ 845 ప్రాసెసర్, ఎల్సీడీ నాచ్ స్టయిల్ డిస్ప్లేలు ఆండ్రాయిడ్ ఓరియోతో పనిచేయనున్నాయని, ఈ ఫోన్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండబోతుందని పేర్కొంది. అయితే ఈ డివైజ్ గురించి ఇప్పటివరకు షావోమి ఇసుమంతైనా స్పందించలేదు. జూలై 24న షావోమి తన గ్లోబల్ ఈవెంట్ను నిర్వహించబోతుంది. ఈ సమయంలో షావోమి తన కొత్త ప్రొడక్ట్లను లాంచ్ చేస్తోంది. ఎంఐ ఏ2 కూడా అప్పుడే లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అద్భుత ఫీచర్లతో 'ఎంఐ 6ఎక్స్' లిమిటెడ్ ఎడిషన్
బీజింగ్: చైనా మొబైల్ మేకర్ షావోమి సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. గత ఏడాది ప్రారంభించిన మికు ఎడిషన్లో తాజాగా 'ఎంఐ 6ఎక్స్ హట్సన్ మికు' పేరుతో లిమిటెడ్ ఎడిషన్ను ప్రవేశపెట్టింది. ఎంఐ ఫాన్స్కోసం కేవలం 5వేల యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. ఈ స్మార్ట్ఫోన్తో పాటు 10వేల ఎంఏహెచ్ పవర్ బ్యాంకు, సెమి ట్రాన్సపరెంట్ కవర్, గిఫ్ట్కార్డు కూడా కస్టమర్లకు అందించనుంది. దీని ధర సుమారు రూ.21,900గా ఉంటుంది. ఇప్పటికే చైనాలో ప్రి బుకింగ్కు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ జూలై 3వ తేదీ నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అతి త్వరలోనే ఇది ఇండియన్ మార్కెట్లోకి రానుందని భావిస్తున్నారు. గ్లోబల్ వేరియంట్గా భావిస్తోన్న ఎంఏ 2ను ప్రపంచ మార్కెట్లలోకి తీసుకురాబోతున్నట్లు సమయంలోనేదీన్ని కూడా లాంచ్ చేయవచ్చని అంచనా. ఎంఐ 6ఎక్స్ హట్సన్ మికు ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 660 ఎస్వోసీ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఎంఐయుఐ 2160×1080 రిజల్యూషన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 20+20 ఎంపీ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 3010 ఎంఏహెచ్ బ్యాటరీ -
వన్ప్లస్ 6 రికార్డులను బద్దలుకొట్టిన ఎంఐ 8
వన్ప్లస్ కంపెనీ తాజాగా లాంచ్ చేసిన వన్ప్లస్ 6 స్మార్ట్ఫోన్ను, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన షావోమి ఎంఐ 8 బద్దలు కొట్టింది. లాంచ్ అయిన కొన్ని రోజుల్లో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఎంఐ 8, పది లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ మైలురాయిని చేధించడానికి ఎంఐ 8 స్మార్ట్ఫోన్కు కేవలం 18 రోజుల్లో పట్టిందని కంపెనీ తెలిపింది. జూన్ 5న తొలిసారి షావోమి ఎంఐ 8 స్మార్ట్ఫోన్ను విక్రయానికి తీసుకొచ్చింది. ఎంఐ 8 స్మార్ట్ఫోన్ 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసిందన్న విషయాన్ని కంపెనీ గ్లోబల్ అధికార ప్రతినిధి డోనోవాన్ సంగ్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు. ‘జూన్ 5న ఎంఐ 8 సిరీస్ స్మార్ట్ఫోన్ తొలిసారి విక్రయానికి వచ్చింది. కేవలం 18 రోజుల్లోనే మేము 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేశాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి వన్ప్లస్ 6 స్మార్ట్ఫోన్కు 22 రోజుల సమయం పట్టింది. అంటే వన్ప్లస్ 6 రికార్డులను ఎంఐ 8 బద్దలు కొట్టేసిందన్న మాట. ఇక ఎంఐ 8 ఫీచర్ల విషయానికి వస్తే.. 6.21 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ నాచ్డ్ డిస్ప్లేను ఇది కలిగి ఉంది 2.5 కర్వ్డ్ గ్లాస్తో గ్లాస్, మెటల్ డిజైన్తో రూపొందింది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభ్యం 12 ఎంపీ + 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్ఫోన్ త్వరలోనే భారత్కు కూడా రాబోతుంది. -
రెడ్మీ 6ప్రొ అన్బాక్సింగ్.. అదిరిపోయే లుక్
మరికొద్ది గంటల్లో విడుదల కానున్న షావోమి రెడ్మి6 ప్రొ అన్బాక్సింగ్ ఫొటోలు లీకయ్యాయి. ఇటీవల అన్ని స్మార్ట్ఫోన్లలో హైలెట్గా నిలిచిన టాప్-నాచ్ డిస్ప్లేతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్ఫోన్ ఐఫోన్ ఎక్స్ పోలివుంది. వెనుక భాగంలో సూపర్ క్వాలిటీ కెమెరాలు రెండింటిని పొందుపరచింది. అంతేకాకుండా సర్క్యూలర్ ఫింగర్ప్రింట్ సెన్సార్ ఉంది. లేటెస్ట్ ఎంఐయూఐ 10 ఆధారిత ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్పై నడుస్తుంది. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఫోన్ కంపెనీ : షావోమి మోడల్ : రెడ్మి 6 ప్రొ ఇంటర్నల్ మెమోరీ : 16 /32 /64 జీబీ ర్యామ్ : 2 /3 /4 జీబీ డిస్ప్లే : 5.84 అంగుళాలు (19: 9 ఆస్పెట్ రేషియో) కెమెరా : 13 ఎంపీ ప్రైమరీ, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ పోట్రెయిట్ మోడ్ ప్రాసెసర్ : 625 స్నాప్ డ్రాగన్ చిప్సెట్ బ్యాటరీ : 4000 ఎంఏహెచ్ ఆపరేటింగ్ సిస్టమ్ : ఎంఐయూఐ 10 ఆధారిత ఆండ్రాయిడ్ 8.1 -
నెట్లో చక్కర్లు కొడుతున్న రెడ్మి 6 ప్రొ
షావోమి మరికొన్ని మూడు రోజుల్లో లాంచ్ చేయబోతున్న షావోమి రెడ్మి 6 ప్రొ ఇంటర్నెట్లో లీకైంది. ఈ స్మార్ట్ఫోన్ను సంబంధించిన ఇమేజ్లు ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎంఐ ప్యాడ్ 4 టాబ్లెట్తో పాటు ఈ స్మార్ట్ఫోన్ను జూన్ 25న కంపెనీ మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. తాజాగా లీకైన ఇమేజెస్లో స్మార్ట్ఫోన్ డిజైన్ వివరాలు హైలెట్ అయ్యాయి. చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వైబో ఈ ఇమేజ్లను లీక్చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఐఫోన్ ఎక్స్ మాదిరి టాప్-నాచ్ డిస్ప్లేను కలిగి ఉందని తెలుస్తోంది. టీనా లిస్టింగ్ కూడా ఈ ఫీచర్ను అంతకముందే రివీల్ చేసింది. అంతేకాక నిలువుగా అమర్చిన రెండు కెమెరాలను కూడా ఈ ఫోన్ కలిగి ఉందని లీక్ అయిన ఇమేజ్లు చూపిస్తున్నాయి. వెనుకవైపు సర్క్యూలర్ ఫింగర్ప్రింట్ సెన్సార్ను ఇది కలిగి ఉందట. ఎంఐయూఐ 9.6 ఆధారిత ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్తోనూ రెడ్మి 6 ప్రొ మార్కెట్లోకి వస్తుందని టాక్. టీనా లిస్టింగ్ అంతకముందు రివీల్ చేసిన దాని ప్రకారం ఈ స్మార్ట్ఫోన్కు 5.84 అంగుళాల ఫుల్ హెచ్డీప్లస్ డిస్ప్లే, ఆక్టాకోర్ సీపీయూ, 2 గిగాహెడ్జ్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుందని తెలిసింది. రెడ్మి 6 ప్రొతో మార్కెట్లోకి వస్తున్న ఎంఐ ప్యాడ్ 4, 8 అంగుళాల స్క్రీన్తో మార్కెట్లోకి వస్తుందని కంపెనీ ఇప్పటికేధృవీకరించేసింది. అంతకముందు రిపోర్టుల ప్రకారం ఎంఐ ప్యాడ్కు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 660 ఎస్ఓసీ, 13 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటున్నాయని తెలిసింది. -
షావొమీ సర్వీస్ సెంటర్స్ @ 1,000
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ హైదరాబాద్లో మరో సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించింది. దీంతో కంపెనీ మొబైల్స్ కోసం నెలకొల్పిన సర్వీస్ సెంటర్ల సంఖ్య 1,000కి చేరుకుంది. 600 నగరాలు, పట్టణాల్లో ఇవి విస్తరించాయి. ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఈ కేంద్రాల సంఖ్య రెండింతలైందని షావొమీ వైస్ ప్రెసిడెంట్ మను జైన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. టీవీల కోసం 300 ప్రాంతాల్లో 500 సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ‘నెలకు 30 లక్షలపైగా ఫోన్లను విక్రయిస్తున్నాం. ఏడాదిలో అమ్మకాల పరంగా మూడింతల వృద్ధి సాధించాం. 2 సెకన్లకు ఒక ఫోన్ను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. మూడింట రెండొంతుల విక్రయాలు ఆన్లైన్లోనే. వచ్చే ఏడాది ఆన్లైన్, ఆఫ్లైన్ సేల్స్ సమానస్థాయికి చేరుతాయి’ అని ఆయన చెప్పారు. -
శాంసంగ్పై ప్రేమ.. షావోమిపై నమ్మకం
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ఫోన్ ఓ నిత్యావసర వస్తువులా మారిపోయింది. స్మార్ట్ఫోన్కు రోజురోజుకు అంతలా పెరుగుతుంది ఆదరణ. ఈ డిమాండ్, ఆదరణతో రోజుకో కొత్త బ్రాండ్.. రోజుకో కొత్త మోడల్తో మార్కెట్లోకి వస్తోంది. ఎన్ని బ్రాండ్లు వస్తున్నప్పటికీ.. మన దేశంలో షావోమి, శాంసంగ్లకు ఉన్న క్రేజే వేరు. ఈ రెండు బ్రాండెండ్ ఫోన్లకు మార్కెట్లో తెగ డిమాండ్ ఉంటుంది. ఇటీవల విడుదలైన స్ట్రాటజీ అనలిటిక్స్ అధ్యయన రిపోర్టులో కూడా ఇదే వెల్లడైంది. ‘ఇండియా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ పర్సెప్షన్స్ అండ్ క్యారెక్టర్స్టిక్స్’ పేరుతో స్ట్రాటజీ అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్టులో భారతీయులు ఎక్కువగా కొనుక్కోవాలనుకుంటున్న ఫోన్లలో షావోమి, శాంసంగ్లే టాప్ బ్రాండ్లుగా నిలిచాయి. కొత్త స్మార్ట్ఫోన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు చాలా మంది వినియోగదారులు ఈ బ్రాండ్లకే మొగ్గుచూపుతున్నారని ఈ రిపోర్టు పేర్కొంది. ఇక వీటి తర్వాత వన్ప్లస్ ఫోన్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపింది. షావోమి నమ్మకమైన బ్రాండ్గా, తేలికగా ఉపయోగించుకునే బ్రాండ్గా యూజర్లుగా పేర్కొనగా... శాంసంగ్ తాము ప్రేమించే బ్రాండ్గా, తమ అవసరాలను అర్థం చేసుకునే బ్రాండ్గా పేర్కొన్నట్టు రిపోర్టు వెల్లడించింది. ఇక చైనా బ్రాండ్ ఫోన్లకు కూడా భారత్లో బాగా గిరాకీ పెరుగుతున్నట్టు తెలిపింది. అదేవిధంగా 60 శాతం ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లు 12 నెలల్లోగా మార్చేయాలని అనుకుంటున్నట్టు పేర్కొంది. షావోమి, వన్ప్లస్ వంటి చైనీస్ బ్రాండ్లు భారత మార్కెట్లో మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని, ఇతర గ్లోబల్ కంపెనీలు ఎల్జీ, సోనీ, హువావేలు ఒత్తిడిలో కొనసాగుతున్నట్టు రిపోర్టు తెలిపింది. ఇటీవల స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది ఆ ఫోన్ బ్యాటరీ లైఫ్ అని, కెమెరా క్వాలిటీపై కాదని రిపోర్టు హైలెట్ చేసింది. -
బుల్లితెరపై ధరల పోటీ!!
న్యూఢిల్లీ: దేశ టీవీల మార్కెట్లో లీడర్గా ఉన్న శామ్సంగ్... చైనా కంపెనీలిస్తున్న పోటీకి తల వంచింది. తన ప్రారంభ సైజు టీవీల ధరలను ఏకంగా 20 శాతం వరకూ తగ్గించింది. శామ్సంగ్ ధరల్ని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే తొలిసారి. నిజానికి షావోమీ, టీసీఎల్ కంపెనీలు 55 అంగుళాల టీవీలను రూ.45,000 స్థాయిలోనే అందిస్తుండగా, శామ్సంగ్ మాత్రం ఇదే సైజు టీవీలను రెట్టింపునకు పైగా ధరలకు మార్కెట్ చేసుకుంటోంది. తాజాగా ధరల్ని తగ్గించిన తర్వాత వీటి మధ్య వ్యత్యాసం 60 శాతానికి తగ్గింది. మార్కెట్లో తన స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు, కొత్త కస్టమర్లను ఆకర్షించొచ్చన్నది కంపెనీ వ్యూహమని శామ్సంగ్ డీలర్లు చెబుతున్నారు. భారీ టెలివిజన్ మార్కెట్... దేశీయ టెలివిజన్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ.22,000 కోట్లు. అందుకే దేశ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో సగానికి పైగా వాటాతో ఆధిపత్యాన్ని సాధించిన చైనా కంపెనీల కన్ను ఇప్పుడు టెలివిజన్ల మార్కెట్పై పడింది. ఇందులో భాగమే షావోమీ కంపెనీ అత్యాధునిక ఫీచర్లున్న స్మార్ట్ టీవీలను తక్కువ ధరలకు లాంచ్ చేయడం. 43 అంగుళాల స్మార్ట్ టీవీని షావోమీ ఎంఐ పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ మార్కెట్లో రూ.22,999కే విడుదల చేసింది. ఇక 55 అంగుళాల 4కే టీవీ ధరను రూ.39,999కే తీసుకొచ్చింది. అయితే, తర్వాత కొన్ని రోజులకు 55 అంగుళాల టీవీ ధర రూ.5వేలు పెంచి రూ.44,999 చేసింది. వీటికి కస్టమర్ల నుంచి స్పందనే లభించింది. దీంతో దక్షిణ కొరియా కంపెనీ శామ్సంగ్ ధరల పరంగా దిగిరాక తప్పలేదు. 55 అంగుళాల టీవీని ఇంతకాలం రూ.లక్షకు విక్రయించిన ఈ కంపెనీ ఇపుడు రూ.70,000కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక 43 అంగుళాల టీవీని రూ.39,900 నుంచి రూ.33,500కు తగ్గించింది. విధానంలో మార్పు... ‘‘సాధారణంగా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినప్పుడు కంపెనీలు అప్పటికే మార్కెట్లో ఉన్న పాత మోడళ్ల ధరల్ని 5 శాతం వరకు తగ్గించడం జరుగుతుంది. కానీ, ఈ విడత శామ్సంగ్ ఏకంగా 10– 20 శాతం వరకు ధరల్ని తగ్గించింది. ధరల విధానం పూర్తిగా మారిందని ఇది తెలియజేస్తోంది’’ అని ప్రముఖ రిటైల్ కంపెనీ డైరెక్టర్ ఒకరు చెప్పారు. అందుబాటు ధరల టీవీలకు మళ్లుతున్న కస్టమర్లను ఆకర్షించేందుకు, మార్కెట్ వాటా పెంచుకునేందుకు శామ్సంగ్ చాలా పోటీతో కూడిన ధరల విధానాన్ని ఆచరణలో పెట్టిందని ముంబైకి చెందిన రిటైల్ చెయిన్ కోహినూర్ డైరెక్టర్ విశాల్మేవాని చెప్పారు. దేశ టీవీ మార్కెట్ను శామ్సంగ్, సోనీ, ఎల్జీలే ఇంతకాలం ఏలాయి. అయితే, షావోమీ, టీసీఎల్, థామ్సన్, షార్ప్, బీపీఎల్, స్కైవర్త్ బ్రాండ్ల రాకతో పరిస్థితి మారిపోయింది. ప్రముఖ బ్రాండ్లు తమ ధరలపై పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది. స్మార్ట్ఫోన్ల మాదిరే... భారత టెలివిజన్ల మార్కెట్లోకి షావోమీ ప్రవేశం గత నాలుగేళ్ల కాలంలో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో చోటుచేసుకున్న విధ్వంసకర పోటీ పరిస్థితులకే దారితీస్తుందని ఫారెస్టర్ అధ్యయనం తెలిపింది. టెలికం రంగంలో జియో ఎలాగైతే విప్లవం సృష్టించిందో, అదే మాదిరిగా భారత టెలివిజన్ మార్కెట్ను తాము మార్చేయాలనుకుంటున్నట్టు షావోమీ సహ వ్యవస్థాపకుడు లీజున్ చెప్పారు. ఆఫ్లైన్ స్టోర్లలో విక్రయాలు ఆరంభించడానికి ముందే ఈ ఏడాది చివరికి అతిపెద్ద ఆన్లైన్ బ్రాండ్గా అవతరించాలన్నది కంపెనీ లక్ష్యంగా చెప్పారు. అంత సులభం కాదు...! ‘‘వినియోగదారులు కేవలం ధరలను మాత్రమే చూసి టీవీలు కొనకపోవచ్చు. టీవీకి రిపేర్ వస్తే అది వెంటనే సరిచేయాలని కోరుకుంటారు. రిపేర్ సదుపాయాలను సమకూర్చడం అంత తేలికకాదు. స్మార్ట్ఫోన్లకు సమస్య వస్తే వారు వెంటనే హ్యాండ్సెట్ మార్చేయగలరు. అందుకే స్మార్ట్ఫోన్లతో పోలిస్తే టీవీ మార్కెట్ కొత్త బ్రాండ్లకు సవాలే’’ అని కొరియాకు చెందిన ఓ ప్రముఖ టెలివిజన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసిక గణాంకాలు చూస్తే... దేశీ టీవీ మార్కెట్లో శామ్సంగ్కు 30 శాతం వాటా ఉంది. తర్వాత ఎల్జీ, సోనీ ఉన్నాయి. అదే 55 అంగుళాలు ఆ పైన సైజున్న టీవీల్లో శామ్సంగ్ వాటా 37 శాతం. సోనీది 29 శాతం వాటా. ధరల పెంపు చిత్రంగా ప్రారంభసైజు టీవీల ధరల్ని తగ్గంచిన శామ్సంగ్ పెద్ద సైజు తెరల క్యూఎల్ఈడీ టీవీల రేట్లను పెంచేసింది. 65 అంగుళాల ఫ్లాట్ క్యూఎల్ఈడీ టీవీ ధరను రూ.30,000 వరకు పెంచగా, కర్వ్డ్ క్యూఎల్ఈడీ టీవీ ధరను ఏకంగా రూ.55,000 మేర పెంచేసింది. కాకపోతే బంపర్ ఆఫర్ కింద ఈ టీవీలను కొన్న వారికి శామ్సంగ్ గెలాక్సీ ఎస్9 స్మార్ట్ఫోన్ను ఉచితంగా ఇస్తోంది. శామ్సంగ్ తాజా ధరలు సైజు గత ధర ప్రస్తుత ధర (అంగుళాల్లో) (రూ.ల్లో) (రూ.ల్లో) 32 22,900 19,400 43 39,900 33,500 55 1,00,000 70–75,000 65 2,05,000 1,95,000 కొత్త ఫీచర్లతో శామ్సంగ్ టీవీలు చెన్నై: శామ్సంగ్ కంపెనీ యాంబియెంట్ మోడ్, మరింత శబ్ధ నాణ్యత తదితర ఫీచర్లతో కూడిన నూతన శ్రేణి టెలివిజన్లను గురువారం విడుదల చేసింది. క్యూఎల్ఈడీ, యూహెచ్డీ, కాన్సర్ట్ సిరీస్లో నూతన శ్రేణి టెలివిజన్లను తీసుకొచ్చింది. క్యూఎల్ఈడీ సిరీస్ టీవీల్లో యాంబియెంట్ మోడ్తో కస్టమర్లు తమ స్వభావాలకు అనుగుణమైన ఫీచర్లు, వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది. క్యూఎల్ఈడీ మోడళ్ల ధర రూ.2.45 లక్షలు, యూహెచ్డీ టీవీల ధర రూ.64,900, కాన్సర్ట్ సిరీస్ టీవీల ధరలు రూ.27,500 నుంచి ప్రారంభం అవుతాయి. -
రెడ్మి వై 2 లాంచ్..ధర, ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజ కంపెనీ షావోమి రెడ్ మీ వై సిరీస్లో మరో నూతన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఇప్పటికే వై1 డివైస్ అమ్మకాలతో ఉత్సాహంగా ఉన్న కంపెనీ తాజాగా ఫైండ్ యువర్ సెల్పీ అంటూ వై 2 స్మార్ట్ఫోన్ను ప్రారంభించింది. 3జీబీ/32జీబీ స్టోరేజ్, 4జీబీ/64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో, గోల్డ్, డార్క్ గ్రే , రోజ్ గోల్డ్ కలర్స్లో ఈ డివైస్లు లభ్యం. వీటి ధరలు వరుసగా 9,999, 12,999 రూపాయలుగా ఉండనున్నాయి. రెడ్మీ వై1 కంటే ఫేస్అన్లాక్ మోడ్, మియూఐ 9.5 అప్డేట్ ఫీచర్లతో 37 శాతం మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. సెల్ఫీ సిరీస్లో భాగంగా వై1 సెలబ్రిటీ స్పెషల్గా లాంచ్ చేసింది. తాజాగా వై2 కూడా బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. జూన్12 మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు మొదలు కానున్నాయి. దీంతో పాటు లాంచింగ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. రెడ్మి వై 2 ఫీచర్లు 5.99 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 720x1440 రిజల్యూషన్ స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్ 3జీబీ/32జీబీ స్టోరేజ్, 4జీబీ/64 జీబీ స్టోరేజ్ స్టోరేజ్ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 12+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్పీ ఏఐ కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ లాంచింగ్ ఆఫర్లు: ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై రూ.500ల తక్షణ డిస్కౌంట్ ఎయిర్టెల్ద్వారా 1800 క్యాష్బ్యాక్ ఆఫర్, 240 జీబీ దాకా డేటా ఫ్రీ -
అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన ఎంఐ 8
రూమర్లన్నింటిన్నీ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి నిజం చేసింది. తన 8వ వార్షికోత్సవతం సందర్భంగా ఎంఐ 8 ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను షావోమి చైనా వేదికగా లాంచ్ చేసింది. 3డీ ఫేస్ అన్లాక్, డ్యూయల్ జీపీఎస్ సిస్టమ్తో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. నోచ్ డిస్ప్లేతో వచ్చిన తొలి షావోమి స్మార్ట్ఫోన్ ఇదే. ఈ స్మార్ట్ఫోన్లో అమర్చిన 3డీ ఫేస్ అన్లాక్ ఫీచర్, చీకటి వాతావరణంలో కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేయనుంది. కంపెనీ సీఈవో లీ జున్ దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఎంఐ 8 అద్భుతమైన అన్టుటు స్కోర్ను సాధించిందని, స్నాప్డ్రాగన్ 845తో రూపొందిన అన్ని డివైజ్ల కంటే దీనికే ఎక్కువ స్కోర్ వచ్చిందని లాంచింగ్ సందర్భంగా కంపెనీ చెప్పింది. డిస్ప్లే పరంగా ఈ స్మార్ట్ఫోన్ 6.21 అంగుళాల ఫుల్-స్క్రీన్ డిస్ప్లను కలిగి ఉంది. దీనికి శాంసంగ్ అమోలెడ్ ప్యానల్ను వాడారు. 3.5 ఎంఎం ఆడియోజాక్ కూడా ఉంది. ఎంఐ 8 స్మార్ట్ఫోన్తో పాటు, ఎంఐ 8 ఎస్ఈ, 75 అంగుళాల ఎంఐ టీవీ 4, ఎంఐ వీఆర్ స్టాండలోన్, ఎంఐ బ్యాండ్ 3ను కూడా లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది. ఎంఐ 8 ఫీచర్లు... 6.21 అంగుళాల ఫుల్ స్క్రీన్ ఏఐ సామర్థ్యంతో 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫేస్ అన్లాక్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ వెనుకవైపు ఫింగర్ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ఎస్ఓసీ 6 జీబీ ర్యామ్ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్తో ఎక్స్ప్లోర్ ఎడిషన్ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు... 6జీబీ ర్యామ్, 64 జీబీ వెర్షన్ ధర 2,699 సీఎన్వై(సుమారు రూ.28,600) 6 జీబీ ర్యామ్, 128 జీబీ వెర్షన్ ధర 2,999 సీఎన్వై(సుమారు రూ.31,600) 6 జీబీ ర్యామ్, 256 జీబీ వెర్షన్ ధర 3,299 సీఎన్వై(సుమారు రూ.34,800) 8 జీబీ ర్యామ్తో వచ్చిన ఎక్స్ప్లోర్ ఎడిషన్ ధర 3,799 సీఎన్వై(సుమారు రూ.39,000) గా ఉంది బ్లూ, గోల్డ్, లైట్ బ్లూ, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటు -
టీవీ మార్కెట్లో సంచలనానికి షావోమి రె‘ఢీ’
కోల్కతా : టెలివిజన్ మార్కెట్ను ఓ కుదుపు కుదిపేయడానికి షావోమి సిద్ధమైంది. ఇప్పటికే స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన సత్తా చాటుతున్న షావోమి, భారత్లో టెలివిజన్ సెట్లు తయారుచేయడానికి రంగం సిద్ధం చేసింది. దీని కోసం తైవనీస్ కాంట్రాక్ట్ మానుఫ్రాక్ట్ర్చర్ ఫాక్స్కాన్తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. వచ్చే పండుగ సీజన్ కల్లా ఆన్లైన్ అమ్మకాల్లో తాను ఆధిపత్య స్థానంలో ఉండాలని షావోమి ప్లాన్ చేస్తోందని ముగ్గురు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్లు చెప్పారు. భారత్లోనే టీవీ సెట్లను రూపొందిస్తుండటంతో, కంపెనీ పన్ను ప్రయోజనాలను కూడా పొందనుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్లు చెప్పారు. అయితే టీవీల ధరలను మాత్రం షావోమి తగ్గించకపోవచ్చని, ఇప్పటికే ఎలాంటి మార్జిన్లు లేకుండా వీటిని తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తుందని తెలిపారు. భారత్లో అతిపెద్ద స్మార్ట్ఫోన్ విక్రయదారిగా ఇప్పటికే షావోమికి పేరుంది. ప్రస్తుతం భారత్లో టెలివిజన్లను తయారు చేయడానికి ఫాక్స్కాన్తో జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. జూన్-ఆగస్టు నుంచి వీటి అమ్మకాలు ప్రారంభమవుతాయని, పండుగ సీజన్-దివాళి విక్రయాల్లో ఎక్కువగా మేడిన్ ఇండియా మోడల్సే ఉండనున్నాయని పేర్కొన్నాయి. అయితే షావోమి తొలుత అతిపెద్ద ఆన్లైన్ టెలివిజన్ బ్రాండ్గా నిలువాలని టార్గెట్ పెట్టుకుంది. అనంతరం మల్టి బ్రాండ్ స్టోర్లలోకి విస్తరించాలని చూస్తోంది. స్థానికంగా టెలివిజన్ సెట్లు తయారు చేస్తుండటంతో, కంపెనీకి పన్ను ప్రయోజనాలు లభించడమే కాకుండా... మార్జిన్లు కూడా పెరగనున్నాయి. ఇది సప్లై చెయిన్ను నియంత్రించడానికి సహకరిస్తుంది. భారత్లో టెలివిజన్లను తయారుచేయడం షావోమి ప్రారంభిస్తుందని, ఈ ఏడాదిలో ఈ ప్రక్రియ ప్రారంభం కావొచ్చని షావోమి ఇండియా అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఫాక్స్కాన్ మాత్రం దీనిపై స్పందించలేదు. దిగుమతి పన్నుల్లో మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో షావోమి గత నెలలో తన 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను పెంచిన సంగతి తెలిసిందే. పన్నులు పెరుగుతుండటంతో ఆన్లైన్ ఎక్స్క్లూజివ్, ఫోకస్డ్ టెలివిజన్ బ్రాండ్లు స్థానిక ఉత్పత్తిని పెంచడంపై ఎక్కువగా దృష్టిసారించాయి. షావోమి స్మార్ట్ఫోన్లను భారత్లో తయారు చేయడంలో ఫాక్స్కాన్ అతిపెద్ద తయారీదారి. స్మార్ట్ఫోన్లను అసెంబుల్ చేయడానికి షావోమి ఇప్పటికీ ఆరు థర్డ్ పార్టీ ప్లాంట్లను కలిగి ఉంది. -
షావోమీ యూజర్లకు బిగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ ఫోన్లతో భారతీయ స్మార్ట్ఫోన్ వినియోగదారులను ఆకట్టుకున్న చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమి వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రెడ్ మి వినియోగదారులకు తక్షణమే లోన్ అందించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్ను అందిస్తున్నట్లు గురువారం వెల్లడించింది. ఇందుకు క్రెడిట్ బి (KreditBee )అనే సంస్థతో కలిసి షావోమీ 'ఎంఐ క్రెడిట్ సర్వీస్' అనే ప్రాజెక్ట్ను ఇండియాలో ప్రారంభించినట్టు తెలిపింది. ఎంఐ క్రెడిట్ సర్వీస్ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను కూడా రూపొందించింది. ముఖ్యంగా "యువ నిపుణులు కోసం తక్షణ వ్యక్తిగత రుణ వేదిక" ద్వారా ఆర్థిక రుణాన్ని అందివ్వనుట్టు షావోమీ తెలిపింది. సాధారణ కేవైసీ ధృవీకరణతో కేవలం 10 నిమిషాల్లోఈ పక్రియ పూర్తవుతుందని వివరించింది. యంగ్ ప్రొఫెనల్స్ కోసం క్రెడిట్బీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు షావోమీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ చెప్పారు. ‘ఎం ఐ క్రెడిట్’ మరో కీలక ముందడుగు అని ఆయన అభివర్ణించారు. హార్డ్వేర్, ఇంటర్నెట్ సేవల మధ్య స్థిరమైన అనుసంధానంతో తమ స్మార్ట్ఫోన్లు యూజర్లకు మంచి అనుభవాన్ని అందించడానికి ఈ ప్లాట్ఫాం బాగా ఉపయోగపడుతుందన్నారు. తమ వినియోగదారులకు ఇది నిజంగా లాభదాయకంగా ఉంటుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఇందుకోసం యూజర్లు తమ వివరాలను యూజర్ (ఆధార్,పాన్)ఎంఐ క్రెడిట్ సర్వీస్లో నమోదు చేసుకోవాలి. ఈ వివరాల ఆధారంగా కేవైసీ వెరిఫికేషన్ అనంతరం లోన్కు అర్హత ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. కేవలం పది నిమిషాల్లోపే ఈ ప్రక్రియ ముగుస్తుంది. కావాల్సిన లోన్ మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. వెరిఫికేషన్ అనంతరం అర్హులైన వినియోగదారులకు యూజర్ బ్యాంక్ అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా పొందిన పర్సనల్ లోన్పై 3 శాతం వడ్డీని వసూలు చేస్తారు. 15 నుంచి 90 రోజుల్లో లోన్ క్లియర్ చేయవచ్చు. క్రెడిట్ బీ యాప్ ద్వారా ఈ లోన్ను తిరిగి చెల్లించవచ్చు. అయితే ఈ అవకాశం ఎంఐయుఐ యూజర్లకు మాత్రమేనని, షావోమీ ఎంఐ ఎ1 లాంటి ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ లోన్ సదుపాయం వర్తించదని షావోమి స్పష్టం చేసింది. -
8వ వార్షికోత్సవం : గ్రాండ్గా ఆ ఫోన్ రిలీజ్
షావోమి మరికొన్ని రోజుల తన 8వ వార్షికోత్సవాన్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతుంది. ఈ వార్షికోత్సవ సందర్భంగా వచ్చే వారం ఎంఐ సిరీస్లో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని షావోమి ధృవీకరించేసింది. మే 31న ఎంఐ 8 లాంచ్ ఈవెంట్ను షావోమి నిర్వహిస్తోంది. అప్కమింగ్ లాంచ్పై ధృవీకరణ చేసిన షావోమి, ఎంఐ 6 సక్సెసర్గా ఎంఐ 7ను లాంచ్ చేయనుందనే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దాని బదులు 8వ వార్షికోత్సవ సందర్భంగా ఎంఐ 8 స్మార్ట్ఫోన్నే తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఆపిల్ ఫేస్ ఐడీకి ధీటుగా 3డీ ఫేసియల్ సెన్సింగ్ టెక్నాలజీతో ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ లాంచ్ చేయబోతున్నట్టు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వైబోలో టీజర్ ఇమేజ్ను పోస్టు చేసిన కంపెనీ ఎంఐ 8 లాంచింగ్ను ధృవీకరించింది. అంతేకాక కంపెనీ గ్లోబల్ అధికార ప్రతినిధి దోనోవాన్ సంగ్ కూడా ప్రత్యేకంగా మరో ట్వీట్ చేసి కొత్త లాంచింగ్ను ప్రకటించారు. ‘మేము 8వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. షెన్జెన్లో మే 31న తమ వార్షిక ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ ఎంఐ 8ను లాంచ్ చేస్తున్నాం’ అని సంగ్ ట్వీట్ చేశారు. కంపెనీ ఇప్పటికే ఈ ఈవెంట్కు సంబంధించిన టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించింది. షావోమి ఎంఐ 8 రూమర్ స్పెషిఫికేషన్లు... క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ఎస్ఓసీ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ ఓరియో డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ BIG announcement Mi fans. The brand new #Mi8, a nod to our 8th anniversary, is coming on 31 May. Stay tuned! pic.twitter.com/UGwmwO7Xi0 — Mi (@xiaomi) May 22, 2018 -
షావోమి ఆ స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది
న్యూఢిల్లీ : షావోమి అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్గా ఎంఐ మిక్స్2 గతేడాది మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ఫోన్పై ప్రస్తుతం షావోమి ధర తగ్గించింది. 2017 అక్టోబర్లో లాంచింగ్ సందర్భంగా ఈ స్మార్ట్ఫోన్ 35,999 రూపాయలుగా ఉంటే, తాజాగా ధర తగ్గింపు అనంతరం ఎంఐ మిక్స్2 స్మార్ట్ఫోన్ను 29,999 రూపాయలకు విక్రయానికి తీసుకొచ్చింది. ఎంఐ మిక్స్2పై ధర తగ్గింపును శాశ్వతంగా చేపడుతున్నట్టు షావోమి ధృవీకరించింది. ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, అధికారిక పార్టనర్లలో తగ్గింపు ధరలు అమ్లోకి రానున్నాయని షావోమి పేర్కొంది. ఇప్పటికే ఎంఐ.కామ్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో తగ్గింపు ధర అందుబాటులోకి వచ్చింది. జనవరిలో కూడా ఈ స్మార్ట్ఫోన్ఫై 3వేల రూపాయల ధర తగ్గించి 32,999 రూపాయలకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరంగా షావోమి ప్రత్యర్థి వన్ప్లస్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ 6 ను భారత్లో లాంచ్ చేసిన ఒక్కరోజులోనే ఈ ధర తగ్గింపును చేపట్టింది. ఎంఐ మిక్స్2 స్పెషిఫికేషన్లు... 5.99 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 12 జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేసియల్ రికగ్నైజేషన్ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ జూన్ 7న మరో కొత్త స్మార్ట్ఫోన్ను షావోమి భారత మార్కెట్లోకి లాంచ్ చేయబోతుంది. ఆ స్మార్ట్ఫోన్ను సెల్ఫీ సెట్రిక్ స్మార్ట్ఫోన్గా షావోమి అభివర్ణించింది. -
రెడ్మి ఎస్2 భారత్లోకి వచ్చేస్తోంది
షావోమి ఇటీవల చైనాలో లాంచ్ చేసిన అఫార్డబుల్ సెల్ఫీ సెట్రిక్ స్మార్ట్ఫోన్ రెడ్మి ఎస్2. ఈ స్మార్ట్ఫోన్ను ఇప్పుడు భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చేస్తోందట. కానీ ఈ స్మార్ట్ఫోన్ రెడ్మి వై2 పేరుతో భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. తన తర్వాత స్మార్ట్ఫోన్ లాంచింగ్ను షావోమి తన ట్విటర్ అకౌంట్ ద్వారా ధృవీకరించింది. కొత్త రెడ్మి హ్యాండ్సెట్ లాంచింగ్ గురించి సోషల్ మీడియా ఛానల్స్లో టీజ్ చేసింది. బెస్ట్ సెల్ఫీ స్మార్ట్ఫోన్’ ను జూన్ 7న మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు షావోమి టీజర్ పోస్టు చేసింది. కానీ మిగతా వివరాలను వెల్లడించలేదు. కంపెనీ టీజర్లో జూన్7న న్యూఢిల్లీలో రెడ్మి స్మార్ట్ఫోన్ లాంచ్ ఈవెంట్ ఉందని పేర్కొంది. అంతేకాక #ఫైండ్యువర్సెల్ఫీ, #రియల్యూ అనే హ్యాష్ట్యాగ్లతో ఈ టీజర్ను పోస్టు చేసింది. ఈ హ్యాష్ట్యాగ్ల్లో ‘వై’ను హైలెట్ చేసింది. దీంతో షావోమి జూన్ 7న తీసుకొచ్చే డివైజ్ రెడ్మి వై2 అని తెలుస్తోంది. కానీ కంపెనీ ఇటీవల చైనాలో లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్ రెడ్మి ఎస్2. ఇదే కంపెనీకి బెస్ట్ సెల్ఫీ స్మార్ట్ఫోన్గా షావోమి అభివర్ణించింది. దీంతో రెడ్మి ఎస్2 స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి రెడ్మి వై2 పేరుతో లాంచ్ చేయనుందని సమాచారం. రెడ్మి వై1, రెడ్మి వై1 లైట్ స్మార్ట్ఫోన్లకు కొనసాగింపుగా రెడ్మి ఎస్ 2 వచ్చింది. రెడ్మి ఎస్2 అచ్చం ఎంఐ 6ఎక్స్ మాదిరిగానే ఉంది. అయితే ఎంఐ 6ఎక్స్ కంటే రెడ్మి ఎస్2నే తక్కువ. ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, హానర్ 9 లైట్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. రెడ్మి ఎస్2 ధర.. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ధర సీఎన్వై 999(సుమారు రూ.10,600). 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్వై 1299(సుమారు రూ.13,700). ఈ రెండు వేరియంట్లు గోల్డ్, ప్లాటినం సిల్వర్, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటు. అయితే భారత్లో వీటి ధరలు ఎంత ఉంటాయన్నది ఇంకా రివీల్ కాలేదు. రెడ్మి ఎస్2 స్పెషికేషన్లు ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 9 5.99 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 625 ఎస్ఓసీ 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా 256జీబీ వరకు విస్తరణ మెమరీ 3080 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి ఎస్2 నేడే లాంచింగ్
రెడ్మి సిరీస్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ను చైనీస్ మొబైల్స్ దిగ్గజం షావోమి నేడు లాంచ్ చేస్తోంది. మరికొన్ని గంటల్లో కొత్త స్మార్ట్ఫోన్ రెడ్మి ఎస్2ను షావోమి రివీల్ చేయబోతోంది. రెడ్మి సిరీస్లో బెస్ట్ సెల్ఫీ కెమెరా స్మార్ట్ఫోన్గా ఇది వినియోగదారుల ముందుకు వస్తోంది. చైనా, భారత మార్కెట్లను టార్గెట్గా చేసుకుని షావోమి ఈ స్మార్ట్ఫోన్ను తన స్వదేశంలో ప్రవేశపెడుతోంది. లాంచ్ ఈవెంట్ చైనాలో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనుంది. గత కొన్ని వారాలుగా ఈ స్మార్ట్ఫోన్ ధర, స్పెషిషికేషన్లు, డిజైన్, ఫీచర్లపై పలు లీకేజీలు మార్కెట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఒకవేళ ఆ లీకేజీలే కనుక నిజమైతే.. రెడ్మి ఎస్2 మూడు వేరియంట్లలో రాబోతున్నట్టు తెలుస్తోంది.ఒకటి 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ దీని ధర సీఎన్వై 1000(సుమారు రూ.10,500) కంటే తక్కువగా ఉండబోతోంది. మరొకటి 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, దీని ధర 165.99 డాలర్లు అంటే సుమారు రూ.11,100గా ఉండనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా చివరిది 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్. అయితే ఈ టాప్ వేరియంట్ ధర ఎంత ఉండొచ్చనది ఇంకా క్లారిటీ లేదు. రెడ్మి ఎస్2 స్పెషిఫికేషన్లు... 5.99 అంగుళాల డిస్ప్లే విత్ హెచ్డీ ప్లస్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఎంఐయూఐ 9 ఆపరేటింగ్ సిస్టమ్ స్నాప్డ్రాగన్ 625 ఎస్ఓసీ బ్లాక్, రోజ్ గోల్డ్, వైట్, బ్లూ, రెడ్, పింక్, గ్రే, సిల్వర్ రంగుల్లో లభ్యం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వెనుక వైపు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్తో డ్యూయల్ కెమెరా 256జీబీ వరకు విస్తరణ మెమరీకి అవకాశం 3080 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమి మరో బడ్జెట్ ఫోన్...ఫీచర్స్ అదుర్స్
సాక్షి, ముంబై: చైనీస్ ఫోన్ తయారీదారు షావోమి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ మేరకు చైనా వెబ్సైట్ వైబోలో ఒక టీజర్ను రిలీజ్ చేసింది. రెడ్మి ఎస్2 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ఫోన్ను మే 10 న గా చైనాలో సన్నింగ్.కామ్(Suning.com) ద్వారా ప్రత్యేకంగా విడుదల చేయనుంది. అదేరోజున ఇండియాలో లాంచ్ చేస్తుందని అంచనా. అంతేకాదు రెడ్మి నోట్ ప్రో 5, ఎం6 ఎక్స్ తరహాలోనే ఉండబోతోందని టీజర్ సూచిస్తోంది. ప్రీమియం స్మార్ట్ఫోన్ ధరను సుమారు 11,700 రూపాయలుగా నిర్ణయించవచ్చని సమాచారం. దీంతో పాటు 10వేల రూపాయల లోపు ధరలో బేస్ మోడల్ను కూడా లాంచ్ చేయనుందట. రెడ్మి ఎస్2 ఫీచర్లపై అంచనాలు 5.99 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే (18: 9 రేషియో) 720x1440 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625 ఎస్వోసీ 3 జీబి ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 12 ఎంపీ ప్రాధమిక సెన్సార్ , 5ఎంపీ సెకండరీ సెన్సార్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
షావోమి మరో రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్మేకర్, షావోమి మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోను దాఖలు చేసిన రికార్డును సొంతం చేసుకుంది. చైనాకు చెందిన ఈ స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజ కంపెనీ హాంగ్ కాంగ్ మార్కెట్లో గురువారం ఈ అతిపెద్ద ఐపీవోను సమర్పించింది. బ్లూమ్బర్గ్ అందించిన సమాచారం ప్రకారం 2014 తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఐపీవోగా భావిస్తున్నారు. ఈ లిస్టింగ్తో కంపెనీవిలువ100 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ తర్వాత చైనాలో అతిపెద్ద టెక్ ఐపీవోగా నిలవనుంది. 2014 లో అలీబాబా గ్రూప్ 21.8 బిలియన్ డాలర్లను సేకరించింది. షిప్మెంట్ వారీగా ప్రపంచంలోని నాల్గవ-అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ, హాంగ్ కాంగ్ ఎక్స్చేంజెస్ అండ్ క్లియరింగ్ లిమిటెడ్కు ఐపీవో దరఖాస్తును సమర్పించింది. 2017 నాటికి దాని ఆదాయం 114.62 బిలియన్ యువాన్లతో (18 బిలియన్ డాలర్లు) గా ఉంది. 2016 లో 67.5 శాతం పెరిగింది. 2017 లో ఆపరేటింగ్ లాభం 12.22 బిలియన్ యువాన్లుగా నమోదు చేసింది. కాగా 2016లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సేల్స్ నమూనాలను పునరుద్ధరించడం, ఇండియాలోభారీ విస్తరణ ద్వారా తిరిగి బౌన్స్ అయింది. దీంతో ఇండియాలో అతిపెద్ద విక్రయదారుడిగా ఉన్న శాంసంగ్కు ప్రధాన ప్ర్యతర్థిగా నిలిచింది. -
రెడ్మి నోట్ 5 ప్రొ, ఎంఐ టీవీ 4 ధరలు పెరిగాయ్!
షావోమి తన పాపులర్ స్మార్ట్ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ, 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ధరలను పెంచేసింది. ఈ రెండింటిపై 5000 రూపాయల వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. రెడ్మి నోట్ 5 ప్రొ ధరను వెయ్యి రూపాయలు, 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ను రూ.5000 ధరలు పెంచినట్టు షావోమి తెలిపింది. పెంచిన ధరలు వెనువెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. రెడ్మి నోట్ 5 ప్రొకు, ఎంఐ టీవీ 4కు దేశీయ మార్కెట్లో భారీ ఎత్తున్న డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటికి వస్తున్న డిమాండ్ను షావోమి చేరుకోలేకపోతోంది. దీంతో కంపెనీ ఇక్కడే వీటిని రూపొందించాలని కూడా నిర్ణయించింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా, రెడ్మి నోట్ 5 ప్రొ విషయంలో పీసీబీఏలను భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఈ దిగుమతి చేసుకుంటున్న పీసీబీఏలపై పన్ను మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటికి తమ ఖర్చులను పెంచుతున్నాయని కంపెనీ తెలిపింది. దీంతో ఎంఐ ఎల్ఈడీ టీవీ ధరను రూ.5000 మేర పెంచి, రూ.44,999గా నిర్ణయించింది. 2018 మే 1 నుంచి అన్ని ఎంఐ హోమ్ స్టోర్లు, ఎంఐ.కామ్లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రూ.13,999గా ఉన్న రెడ్మి నోట్ 5 ప్రొ ధర కూడా రూ. 14,999కు పెరిగింది. కంపెనీ ఇటీవల చేపట్టిన రెడ్మి నోట్ 5 ప్రొ ఫోన్కు చేపట్టిన ప్రీ-ఆర్డర్లకు భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇటీవలే భారత్లో మూడు స్మార్ట్ఫోన్ తయారీ యూనిట్లను ప్రారంభించినట్టు పేర్కొంది. -
24 గంటల పాటు రెడ్మి నోట్ 5 సేల్
షావోమీ కంపెనీ రెడ్మి నోట్ 5 స్మార్ట్ఫోన్ ఫ్లాష్ సేల్ను రోజంతా నిర్వహించబోతోంది. నేటి అర్ధరాత్రి 11:59 నుంచి రెడ్ మి నోట్ 5 విక్రయాలను తన వెబ్సైట్ ఎంఐ.కామ్లో ఎక్స్క్లూజివ్గా ప్రారంభించబోతున్నట్టు షావోమి ప్రకటించింది. సాధారణంగా ఈ ఫోన్ను షావోమి ప్రతి వారం ఫ్లాష్ సేల్ ద్వారా విక్రయిస్తోంది. అది కూడా మధ్యాహ్నం 12 గంటలకు మొదలై నిమిషాల్లోనే ముగిసిపోతోంది. దీంతో ఈ ఫోన్ కోరుకునే వారి కోసం షావోమి, ఎంఐ.కామ్ ద్వారా ఒక రోజు పాటు ఫ్లాష్ సేల్ను చేపట్టబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ మి నోట్ 5ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెడ్మి నోట్ 5కు సక్సెసర్గా దీన్ని తీసుకొచ్చింది. సెమీ-బడ్జెట్ ఫోన్ అయిన రెడ్మి నోట్ 5 రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ఒకటి 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.9,999. రెండోది 4జీబీ ర్యామ్, 64జీబీ ర్యామ్ ధర రూ.11,999. ఈ ఫోన్కు 5.99 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లే డిస్ప్లే కలిగి ఉంది. స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని పెంచుకునే కెపాసిటీ, షావోమి ఎంఐయూఐ 9.5 ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ నోగట్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. -
షావోమి ఎంఐ 6ఎక్స్ లాంచ్, ఫీచర్లివే!
గత ఎన్నో రోజుల నుంచి మార్కెట్లో చక్కర్లు కొడుతున్న షావోమి నయా స్మార్ట్ఫోన్ ఎంఐ 6ఎక్స్ మార్కెట్లోకి వచ్చేసింది. యుహాన్ యూనివర్సిటీలో జరిగిన ఈవెంట్లో సీఈవో లీ జున్ ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేశారు. త్వరలోనే ఈ స్మార్ట్ఫోన్ దేశీయ మార్కెట్లోకి కూడా రానుంది. ఇదే డిజైన్, కెమెరాలో ఏఐ ఇంటిగ్రేషన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియా ఆధారిత కస్టమ్ స్కిన్లతో ఎంఐ ఏ2గా ఈ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకురావాలని షావోమి చూస్తోంది. ఎంఐ ఏ2 లాంచ్ చేయనున్న సందర్భంగా ఇప్పటికే భారత్లో ఎంఐ ఏ1 స్మార్ట్ఫోన్ అవుటాఫ్ స్టాక్ అయింది. ఎంఐ 6 ఎక్స్(ఎంఐ ఏ2) ధర మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్ లాంచ్ అయిఅంది. ఒకటి 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ఆప్షన్, ధర 1,599 సీఎన్వై(సుమారు రూ.16,900). రెండోది 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, ధర 1,799 సీఎన్వై(సుమారు రూ.19,000). టాప్ ఎండ్ ఎంఐ 6ఎక్స్ వేరియంట్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంది, ధర 1,999 సీఎన్వై(సుమారు రూ.21వేలు). ఏప్రిల్ 27 శుక్రవారం అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి చైనాలో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వస్తుంది. ఎంఐ 6ఎక్స్(ఎంఐ ఏ2) స్పెషిఫికేషన్లు... 5.99 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.1 ఆధారిత ఎంఐయూఐ 9.5 సాఫ్ట్వేర్ ఆక్టా-కోర్ స్నాప్డ్రాగన్ 660 ఎస్ఓసీ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్స్తో వెనుకవైపు డ్యూయల్ కెమెరాలు ఫింగర్ప్రింట్ సెన్సార్తో పాటు ఫేస్ అన్లాక్ ఫంక్షన్ 3010 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం రెడ్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ, బ్లాక్ రంగుల్లో అందుబాటు -
షావోమి అభిమానులకు బ్యాడ్న్యూస్
చైనీస్ ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ షావోమి అభిమానులకు బ్యాడ్న్యూస్. కంపెనీకి చెందిన తొలి ఆండ్రాయిడ్ వన్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్ ఎంఐ ఏ1 ఇక నుంచి భారత్లో లభ్యం కాదట. ఈ స్మార్ట్ఫోన్ ఇక నుంచి ఫ్లిప్కార్ట్లో కానీ కంపెనీ అధికారిక సెల్లింగ్ పార్టనర్ వద్ద కానీ అమ్మకానికి లభ్యం కాదని కంపెనీ తన భారత వెబ్సైట్లో పేర్కొంది. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్కు ఈ ఏడాది ప్రారంభంలోనే ఓరియో అప్డేట్ తీసుకొచ్చింది. ఎంఐ ఏ1 స్మార్ట్ఫోన్ను గతేడాది సెప్టెంబర్లోనే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు లాంచ్చేసిన ఏ స్మార్ట్ఫోన్ను ఏడు నెలల్లోనే నిలిపివేయలేదు. వచ్చే కొన్ని రోజుల్లో ఎంఐ ఏ1కు సక్సెసర్గా ఎంఐ ఏ2 లాంచ్ చేయనున్న నేపథ్యంలో షావోమి ఈ ఫోన్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు టెక్ విశ్లేషకులంటున్నారు. ఎంఐ 6ఎక్స్ అక్కా ఎంఐ ఏ2 చైనాలో ఈ నెల 25న లాంచ్ కాబోతోంది. అయితే కంపెనీ అధికారిక ఆహ్వానంలో మాత్రం ఎంఐ 6ఎక్స్ గురించి ధృవీకరించలేదు. కొంత మంది టెక్ విశ్లేషకులు ఏప్రిల్ 25న ఎంఐ 5ఎక్స్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తుందని అంటున్నారు. లీకైన సమాచారం ప్రకారం ఏప్రిల్ 25న లాంచ్ కాబోతోన్న స్మార్ట్ఫోన్కు ఫీచర్లు ఈ కింది విధంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. 5.99 అంగుళాల ఎఫ్హెచ్డీప్లస్ డిస్ప్లే 4జీబీ ర్యామ్, 32జీబీ వెర్షన్ 6జీబీ ర్యామ్, 64జీబీ వెర్షన్ 6జీబీ ర్యామ్, 128జీబీ మోడల్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ 12మెగాపిక్సెల్, 20మెగాపిక్సెల్తో బ్యాక్ కెమెరాలు 20మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమ్మకాలు నిలిపివేస్తున్న ఎంఐ ఏ1 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 5.5 అంగుళాల ఎఫ్హెచ్డీ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్తో డ్యూయల్ రియర్ కెమెరాలు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ ధర 14,999 రూపాయలు. -
షావోమి తొలి గేమింగ్ స్మార్ట్ఫోన్ లాంచ్
చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి, తన తొలి గేమింగ్ స్మార్ట్ఫోన్ను నేడు లాంచ్ చేసింది. ‘షావోమి బ్లాక్ షార్క్’ పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తున్నట్టు షావోమి పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ను, స్పెషల్ బటన్ను, డిటాచ్బుల్ గేమ్ప్యాడ్ను, ఎక్కువ బ్యాటరీను కలిగి ఉంది. దీని ధర 2,999 సీఎన్వై(సుమారు రూ.31,100)గా కంపెనీ పేర్కొంది. ఏప్రిల్ 20 నుంచి ఈ స్మార్ట్ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ చైనాలో మాత్రమే అందబాటులో ఉండనుంది. అంతర్జాతీయంగా ఎప్పుడు ఈ డివైజ్ను విక్రయానికి తీసుకొస్తోందో కంపెనీ తెలుపలేదు. జేడీ.కామ్లో ఈ ఫోన్ ఇప్పటికే ప్రీ-ఆర్డర్కు వచ్చేసింది. పోలార్ నైట్ బ్లాక్ లేదా స్కై గ్రే రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. షావోమి బ్లాక్ షార్క్ స్పెషిఫికేషన్లు... 5.99 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ విత్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1080x2160పీ రెజుల్యూషన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ 20 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్ ముందు వైపు 20 మెగాపిక్సెల్ సెన్సార్ ఆండ్రాయిడ్ ఓరియో 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ‘ఎక్స్ టైప్ స్మార్ట్ యాంటీనా’ గేమింగ్ మోడ్లోకి వెళ్లడానికి ఎడమవైపు ‘షార్క్’ బటన్ -
ప్రీ-ఆర్డర్కు వచ్చిన రెడ్మి నోట్ 5 ప్రొ
షావోమి రెడ్మి నోట్ 5 సిరీస్లో హై-ఎండ్ వేరియంట్ రెడ్మి నోట్ 5 ప్రొ నేడు ప్రీ-ఆర్డర్స్కు వచ్చేసింది. షావోమి ఈ-కామర్స్ వెబ్సైట్ ఎంఐ.కామ్లో ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ ప్రీ-ఆర్డర్లకు ఉంచింది. దీంతో ఇక నుంచి రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్ ఫ్లాష్సేల్ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్కు వచ్చిన ప్రతీసారి‘సోల్డ్ అవుట్’ అని దర్శనమిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర నిరాశకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ రెడ్మి నోట్ 5 ప్రొ ప్రీ-ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎంఐ వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్ను ఆర్డర్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ ఫోన్ను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్లో ప్రీ-ఆర్డర్కు అందుబాటులో ఉంచింది. ఆర్డర్ చేసిన తర్వాత రెండు లేదా నాలుగు వారాల్లో ఈ ఫోన్ను వినియోగదారుడికి డెలివరీ అవుతుంది. ఒక వ్యక్తి ఒకటి, లేదా రెండు మాత్రమే ఫోన్లను ఆర్డర్ చేసే సౌకర్యం కల్పించింది. ఒకవేళ ముందస్తు ఆర్డర్ను రద్దు చేసుకోవాలనుకుంటే ఫోన్ షిప్పింగ్ కన్నా ముందే రద్దు చేసుకోవాలి. ఫ్లిప్కార్ట్లో కూడా రెడ్మి నోట్ 5 ప్రొ అందుబాటులో ఉంటుంది. కానీ వీక్లీ ఫ్లాష్ సేల్స్ ద్వారానే ఫ్లిప్కార్ట్ ఈ ఫోన్ను విక్రయించనుంది. 4జీబీ ర్యామ్ 64జీబీ మెమరీ సామర్థ్యం ఉన్న రెడ్మి నోట్ 5 ప్రొ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.16,999. షావోమి ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఫోన్లన్నంటిలో ఇదే ఖరీదైనది. ఇది నలుపు, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ఆర్డర్ చేసుకున్న వారికి జియో ప్రత్యేక ఆఫర్ను అందిస్తోంది. రూ.2,200 విలువ కలిగిన 44 వోచర్లను ‘మై జియో’ యాప్లో యాడ్ చేస్తుంది. అంతేకాకుండా రూ.198, రూ.299 రీఛార్జ్తో 4.5టీబీ వరకూ డేటాను పొందవచ్చు. రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్స్ 5.99 అంగుళాల ఎఫ్హెచ్డీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఫీచర్ వెనుక 12 మెగా పిక్సెల్, 5మెగాపిక్సెల్స్తో డ్యుయల్ కెమెరా ముందు వైపు 20 మెగాపిక్సెల్ కెమెరా 4000 ఎంఎహెచ్ బ్యాటరీ -
త్వరలో అమరావతిలో విద్యుత్ బైకులు
సాక్షి, అమరావతి: దేశంలోనే మొదటిసారిగా రాజధాని అమరావతిలో పర్యావరణహితమైన విద్యుత్ బైకులు ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నగరాన్ని కాలుష్య రహితంగా ఉంచేందుకు బ్యాటరీ వాహనాలను త్వరలో తీసుకువస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తున్న హ్యాపీ సిటీస్ సమ్మిట్లో రెండో రోజైన బుధవారం అక్కడి ఎగ్జిబిషన్ హాళ్లు, ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అనంతరం సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. షియోమీ ప్రతినిధులతో సీఎం భేటీ సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం తిరుపతిలోని మారస సరోవర్ హోటల్లో షియోమీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. షియోమీ ఫోన్ల తయారీ కంపెనీతో పాటు ఆ కంపెనీకి కాంపోనెంట్స్ సరఫరా చేసే 38 కంపెనీల (సప్లయర్స్)తో మాట్లాడ్డం జరిగిందని, 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. సెల్ఫోన్ విడిభాగాల తయారీకి షియోమీ కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు. -
షావోమి సప్లయిర్స్తో ఏపీ సీఎం భేటీ
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. షావోమి సప్లయిర్స్కు సంబంధించి 36 కంపెనీలతో ఆయన సమావేశమయ్యారు. చైనా నుంచి వచ్చిన మొత్తం 198 మంది ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు. తిరుపతిలోని మానస సరోవరం హోటల్లో ఈ సమావేశం ఏర్పాటుచేశారు. షావోమి సప్లయిర్స్ ఏర్పాటుకు అన్ని రకాల ప్రోత్సహకాలను తాము అందజేస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో రాయలసీమకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. షావోమి సప్లయిర్స్, జియో కంపెనీలు ఏర్పాటైతే, రూ.3వేల బిలియన్లు పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఎలక్ట్రానిక్ హబ్స్తో పాటు, ఆటో మొబైల్ హబ్గా కూడా రూపొందుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పెద్ద ఎత్తున్న ఉద్యోగాల కల్పన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవలే షావోమి తన కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను శ్రీసిటీలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
భారత్లో మూడు షియోమి స్మార్ట్ఫోన్ ప్లాంట్స్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమి భారత్లో మూడు స్మార్ట్ ఫోన్ తయారీ కేంద్రాలను నెలకొల్పనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఏపీలోని శ్రీసిటీతో పాటు తమిళనాడులోని పెరంబదూర్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశంలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ యూనిట్ల తయారీ కోసం చెన్నైలో కంపెనీ తొలిసారిగా సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ) ప్లాంట్ను నెలకొల్పనుంది. సప్లయర్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సందర్భంగా షియోమీ గ్లోబల్ ఎండీ వైస్ ప్రెసిడెంట్ మనూ జైన్ ఈ వివరాలు వెల్లడించారు. భారత స్మార్ట్ఫోన్ పరిశ్రమలో షియోమి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని చెప్పారు. భారత్ను అంతర్జాతీయ తయారీ హబ్గా మలిచే క్రమంలో షియోమి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఫాక్స్కాన్ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఫాక్స్కాన్ ప్లాంట్ల్లో 95 శాతం మంది మహిళలే ఉద్యోగులు కావడం గమనార్హం. ఈ మూడు స్మార్ట్ ఫోన్ ప్లాంట్లు, చెన్నైలోని ఎస్ఎంటీ ప్లాంట్తో స్ధానికులకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు సమకూరుతాయని షియోమి పేర్కొంది. -
ఓపెన్ సేల్లో రెడ్మి 5
షావోమి అత్యంత పలుచనైన అద్భుత స్మార్ట్ఫోన్ రెడ్మి 5 ఓపెన్ సేల్కు వచ్చింది. అమెజాన్.ఇన్, అమెజాన్ ఇండియా యాప్, ఎంఐ.కామ్లలో ఈ స్మార్ట్ఫోన్ ఇక శాశ్వతంగా ఓపెన్ సేల్లో అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. అంటే ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇక నుంచి ఫ్లాష్సేల్ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఎల్లప్పుడూ ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 2జీబీ/ 16జీబీ, 3జీబీ/ 32జీబీ, 4జీబీ/ 64జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్ ఓపెన్ సేల్లో ఉంటుంది. గోల్డ్, బ్లాక్, రోజ్ గోల్డ్, బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదనంగా ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే వారికి అమెజాన్ కిండ్లీ ఈబుక్స్పై 90 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్స్కు 5 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్, రిలయన్స్ జియో నుంచి డేటా, రూ.2200 క్యాష్బ్యాక్ లభించనుంది. రెడ్మి 5 స్పెషిఫికేషన్లు 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఫుల్స్క్రీన్ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ఎస్ఓసీ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ సెల్ఫీ లైట్ -
ఎంఐ ఫాన్స్ ఫెస్టివల్: బిగ్ డిస్కౌంట్స్
సాక్షి, న్యూఢిల్లీ: షావోమి మరోసారి ఫాన్స్ ఫెస్టివల్ను ప్రారంభించింది. 2018ఎంఐ ఫాన్స్ ఫెస్టివల్ పేరుతో స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఏప్రిల్ 5నుంచి 6 వరకు ఈ స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఎంఐ టీవీలు, ఎంఐ మిక్స్ 2, రెడ్మి నోట్ 5 ప్రో, రెడ్మి 5 లాంటి ఇతర ప్రొడక్ట్స్పై డిస్కౌంట్లను అందిస్తోంది. అంతేకాదు ఎంఐ ఫాన్స్ కు రూ. 40 లక్షలు అంతకన్నా ఎక్కువ విలువైన ఎంఐ కూపన్లను అందిస్తోంది. ఫాన్ ఫెస్టివల్పై సోషల్మీడియాలో ప్రచారం నిర్వహించనున్నట్లు షావోమి ప్రకటించింది. దీని ద్వారా కూడా యూజర్లకు డిస్కౌంట్లను అందిస్తోంది. సోషల్ మీడియా యూజర్లు వారి స్నేహితులను ఆహ్వానిం చడంతో పాటు, నిర్దిష్ట లైక్స్ను పొందితే రెడ్మి నోట్ 5, వై1, బ్యాండ్ 2 లాంటి బహుమతులను ఉచితంగా గెలుచుకునే అవకాశం. ఇందులో గ్రూప్గా కూడా కూపన్లు గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ కూపన్లు ఏప్రిల్ 4 న ప్రారంభమవుతాయి. మరోవైపు అమ్మకాల సమయంలో ఆఫర్లపై పూర్తి స్పష్టత లేనప్పటికీ..ఎంఐ మిక్స్2, ఎంఐ మాక్స్ 2, రెడ్మి 4, రెడ్మి వై1, రెడ్మి వై1లైట్ , రెడ్మి 5ఏ వంటి స్మార్ట్ఫోన్లపై రూ.3వేల వరకు తగ్గింపు ఇవ్వనుందని తెలుస్తోంది. ఇవే కాకుండా ఎంఐ యాప్లో "క్రేజీ కాంబోస్" ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా షావోమి స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఎల్ఈడీ టీవీలపై ఈ కాంబో ఆఫర్ ఉంది. దీంతోపాటు ఏప్రిల్ 2 నుంచి 6 వరకు షావోమి 'కలర్ అవర్ ప్లానెట్' ప్రచారాన్ని చేపట్టింది. ఇందులో విజేతలు రెడ్మి 5ఏ గెలుచుకునే అవకాశం. మరిన్ని వివరాలు ఎంఐ స్టోర్ యాప్లో లభ్యం. -
షావోమి న్యూ ప్లాన్: గిఫ్ట్ కార్డ్
సాక్షి, న్యూఢిల్లీ: షావోమి భారత కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో ప్రణాళికను సిద్ధం చేసింది. ఎంఐ గిఫ్ట్కార్డ్ ప్రోగ్రామ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమెయిల్ ద్వారా గిఫ్ట్లను అందించేలా ఎంఐ గిఫ్ట్కార్డ్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పుట్టినరోజు, వార్షికోత్సవం, అభినందనలు తెలిపేందుకు లాంటి సందర్భాల్లో ఈ బహుమతులను అభిమానులకు, సన్నిహితులకు పంపుకోవచ్చు. రూ.100నుంచి గరిష్టంగా రూ.10వేల దాకా షావోమి ఉత్పత్తులను గిఫ్ట్గా ఇవ్వవచ్చు. ఒక లావాదేవీలో గరిష్ట 10గిఫ్ట్ కార్డులను ఉపయోగించవచ్చు ఎంఐ.కాం, లేదా ఎంఊస్టోర్ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్ల నుంచి టెలివిజన్ దాకా స్మార్ట్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీటిని ప్రవేశపెట్టింది. ఎస్ఏఏఎస్ ఆధారిత ప్రీపెయిడ్ కార్డు సొల్యూషన్స్ ప్రొవైడర్ క్విక్కిల్వర్తో జత కట్టింది. అంతేకాదు ఎంఐ.కామ్ లేదా మి స్టోర్ స్టోర్లలో ఈ గిఫ్ట్ కార్డులను..కార్డుల గ్యాలరీ నుంచి ఎంచుకోవచ్చు లేదంటే.. మనకిష్టమైన ఫోటోను, ఇమేజ్ లేదా డిజైన్ను అప్లోడ్ చేసి ఆకర్షణీయమైన పెర్సనలైజ్డ్ కార్డ్ను కూడా పొందవచ్చు. డిజిటల్ గిఫ్టింగ్ భారతదేశంలో లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో క్విక్కిల్వర్ భాగస్వామ్యంతో డిజిటల్ గిఫ్టింగ్ పథకాన్ని లాంచ్ చేశామని షావోమి ఇండియా ఆన్లైన్ సేల్స్ హెడ్ రఘురెడ్డి వెల్లడించారు. గిఫ్ట్కార్డ్ పొందాలంటే: గిఫ్ట్ కార్డును రీడీమ్ చేయడానికి, ఎంఐస్టోర్ యాప్లోకి వెళ్లి.. మై అకౌంట్ క్లిక్ చేసి ..యాడ్ గిఫ్ట్కార్డ్ను ఎంచుకోవాలి. 16 డిజిట్ నెంబర్ను, ఈమెయిల్ ద్వారా మనకు అందిన 6డిజిట్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. యాడ్ గిఫ్ట్కార్డ్ను క్లిక్ చేసి మన ఖాతాను చెక్ చేసుకోవచ్చు. దీనిద్వారా కస్టమర్లకిష్టమైన ఉత్పత్తిని ఎంచుకుని గిఫ్ట్గా మన కిష్టమైనవారికి పంపుకోవచ్చు. కొనుగోలు ఎలా చేయాలంటే:ఎంఐ గిఫ్ట్ కార్డుద్వారా కొనుగోలు చేయడానికి షావోమి వెబ్సైట్ స్పెషల్ పేజ్ను విజిట్ చేయాలి. ఎంఐ గిఫ్ట్ కార్డ్ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత గిప్ట్ పంపేవారి, గిప్ట్ అందుకునే వారి,చిరునామా,ఇతర సమాచారాన్ని నింపాలి. తరువాత మెసేజ్ , బహుమతి కార్డుతోపాటు డెలివరీ తేదీ వంటి వివరాలను పూరించాలి. ఈ ప్రక్రియ ఒకసారి పూర్తయితే, క్రెడిట్ /డెబిట్ కార్డు/ ఈఎంఐ/ యూపీఐ ద్వారా చెల్లింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, స్వీకర్తకు ఒక ఇమెయిల్ అందుతుంది. దీంతోపాటు లావాదేవీ వివరాలు , గిఫ్ట్కార్డులో ఇంకా మిగిలి ఉన్న బ్యాలెన్స్ వంటి సమాచారం కూడా వినియోగదారుడికి అందుతుంది. ముఖ్యంగా, ఈ కార్డ్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఒకవేళ ప్రొడక్ట్ను రిటర్న్ చేస్తే .. దాని విలువ తిరిగి గిఫ్ట్కార్డ్ ఖాతాలో జమ అవుతుంది. -
షావోమి నుంచి మరో స్మార్ట్ టీవీ
స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న షావోమి, ప్రస్తుతం టీవీ మార్కెట్లోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే తేలికైన, సన్నని టీవీని లాంచ్ చేసిన షావోమి, మరో స్మార్ట్టీవీని తీసుకొచ్చింది. ఎంఐ టీవీ 4ఎస్ పేరుతో ఈ స్మార్ట్టీవీని తన సొంత మార్కెట్ చైనాలో లాంచ్ చేసింది. హెచ్డీఆర్ డిస్ప్లే, ప్యాచ్వాల్, డాల్బీ ఆడియో, ఇతర ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. ఎంఐ టీవీ 4ఎస్ స్పెషిఫికేషన్లు... 55 అంగుళాల 4కే డిస్ప్లే 64 బిట్ క్వాడ్ కోర్ అమ్లోజికల్ కార్టెక్స్-ఏ53 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 8జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ రెండు 8డబ్ల్యూ స్పీకర్లు విత్ డాల్బీ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఆండ్రాయిడ్ ఆధారిత ప్యాచ్వాల్ యూఐ ధర 2,999 సీఎన్వై (సుమారు రూ.31,100) అయితే ఈ టీవీని షావోమి భారత్ వంటి ఇతర మార్కెట్లలో లాంచ్ చేస్తుందో లేదో క్లారిటీ లేదు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎంఐ టీవీ 4, ఎంఐ టీవీ 4ఏలు విక్రయానికి ఉన్నాయి. -
షావోమీ ఎంఐ మిక్స్ 2ఎస్ లాంచ్
బీజింగ్: చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి కొత్త హైఎండ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎంఐ మిక్స్ 2ఎస్ పేరుతో స్మార్ట్ఫోన్ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. బెజెల్ లెస్ స్క్రీన్తో తన జాగా ఫ్లాగ్షిప్ డివైస్ను మంగళవారం లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్/ 256 స్టోరేజ్, 6 జీబీ/128 స్టోరేజ్, 6 జీబీ/64 స్టోరేజ్ వెర్షన్లను అందుబాటులో ఉంచింది. చైనాలో 8జీబీ ర్యామ్/ 256 స్టోరేజ్ ధర సుమారు రూ.41,438గా ఉండగా 6 జీబీ/128 స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 37,000, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.34,185గా ఉంది. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ, వైర్లెస్ చార్జర్, ఫింగర్ ప్రింట్ రీడర్ దీని ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. దీంతోపాటు ఎంఐ గేమింగ్ ల్యాప్టాప్, ఎంఐ స్పీకర్ మినీని లాంచ్ చేసింది. ఎంఐ మిక్స్ 2 ఎస్ ఫీచర్లు 5.9 బెజెల్ లెస్ స్క్రీన్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ 2160×1080 ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 12+12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి 5 సేల్: ఈరోజే త్వరపడండి
న్యూఢిల్లీ: చైనా కంపెనీ షావోమి నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. రెడ్మి 5 పేరుతో తయారుచేసిన స్మార్ట్ఫోన్ అమ్మకాలను భారత్లో ఈరోజు నుంచి ప్రారంభించనున్నట్టు షావోమి ప్రకటించింది. ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఎమ్ఐ.కాట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. 4 లక్షలకుపైగా ఫోన్లను విక్రయించనున్నట్టు వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో చైనా మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ ఫోన్, నేడు ఎక్స్క్లూజివ్గా అమెజాన్ ఇండియా ద్వారా అమ్మకాలు జరపనుంది. 7.7 మిల్లీమీటర్ల మందంతో రెడ్మి సిరీస్లో అత్యంత పలుచనైన స్మార్ట్ఫోన్గా చెప్పబడుతున్న రెడ్మి 5 మూడు వేరియంట్లలో లభించనుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999 కాగా.. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999గా షావోమి ప్రకటించింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలుగా నిర్ణయించింది. బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్లు లభించనున్నాయి. జియో ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ రెడ్మి 5 స్మార్ట్ఫోన్తో 100జీబీ అదనపు డేటాతో రిలయన్స్ జియో నుంచి రూ. 2,200 ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ పొందొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ 5 శాతం డిస్కౌంట్ ప్రకటించాయి. తొలిసారి కిండ్లీ ఈ-బుక్స్ కొనేవారికి 90 శాతం తగ్గింపు లభించనుంది. రెడ్మి 5 ఫీచర్లు 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ఎస్ఓసీ 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లు 16జీబీ, 32జీబీ, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లు మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణకు అవకాశం 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ సెల్ఫీ లైట్ ఫేస్ రికగ్నైజేషన్, స్మార్ట్ బ్యూటీ 3.0 యాప్ -
షావోమి పాపులర్ స్మార్ట్ఫోన్ ధర తగ్గింపు
సాక్షి, ముంబై: షావోమి తనపాపులర్ స్మార్ట్ఫోన్ ధరలను స్వల్పంగా తగ్గించింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో కస్టమర్లు అందుబాటులోకి తెచ్చి రెడ్ మి4 ధరను తగ్గించింది. ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ స్మార్ట్ఫోన్ 3జీబీ/32 జీబీ స్టోరేజ్, 4జీబీ/64జీబీస్టోరేజ్, వేరియంట్ స్మార్ట్ఫోన్లను రూ.500 తగ్గింపుతో ఆఫర్ చేస్తోంది. ఈ తగ్గింపుతో రెడ్మి 4 3జీబీ/32 జీబీ స్టోరేజ్ ధర. రూ.8499గా ఉంటుంది. 4జీబీ/64జీబీస్టోరేజ్ వేరియంట్ రూ. 10499లో అందుబాటులో ఉంటుంది. ఎంఐ.కామ్, అమెజాన్, ఎంఐ హోమ్ స్టోర్లో ఈస్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. రెడ్ మి 4 ఫీచర్లు 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1.4 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 3జీబీ/32 జీబీ స్టోరేజ్, 4జీబీ/64జీబీస్టోరేజ్ 128జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం 13 మెగా పిక్సెల్స్ రేయర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ -
3 వేరియంట్లలో రెడ్మి 5 వచ్చేసింది
రెడ్మి 5 స్మార్ట్ఫోన్ను షావోమి లాంచ్ చేసింది. గతేడాది డిసెంబర్లో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్, నేడు భారత్ మార్కెట్లో కూడా ప్రవేశపెట్టింది. ఎక్స్క్లూజివ్గా అమెజాన్ ఇండియా ద్వారా ఈ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్చేసింది. ఒకటి 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్. దీని ధర 7,999 రూపాయలుగా షావోమి ప్రకటించింది. రెండో వేరియంట్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్. దీని ధర 8,999 రూపాయలుగా పేర్కొంది. మరొకటి 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్. దీని ధర 10,999 రూపాయలుగా షావోమి తెలిపింది. ఎక్స్క్లూజివ్గా అమెజాన్ ఇండియాలో, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో మార్చి 20 నుంచి ఈ ఫోన్ లభ్యమవుతుంది. లాంచ్ ఆఫర్లు.. 100జీబీ అదనపు డేటాతో రిలయన్స్ జియో నుంచి 2,200 రూపాయల ఇన్స్టాంట్ క్యాష్బ్యాక్ను ఈ ఫోన్పై పొందొచ్చు. అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్లలో 5 శాతం డిస్కౌంట్ను ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు అందించనుంది. తొలిసారి కిండ్లీ ఈబుక్స్ కొనే వారికి 90 శాతం తగ్గింపు లభించనుంది. రెడ్మి 5 స్పెషిఫికేషన్లు.. 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ఎస్ఓసీ 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లు 16జీబీ, 32జీబీ, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లు మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణకు అవకాశం 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ సెల్ఫీ లైట్ ఫేస్ రికగ్నైజేషన్, స్మార్ట్ బ్యూటీ 3.0 యాప్ బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటు -
షావోమికి షాక్: కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్టీవీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ బ్రాండ్లకు షాకిచ్చేలా వీయూ టెక్నాలజీస్ టీవీ మార్కెట్లోకి దూసుకువచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో ఆండ్రాయిడ్ స్మార్ట్టీవీలను లాంచ్ చేసినట్టు మంగళవారం ప్రకటించింది. ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ ఆధారంగా తమ 4కేటీవీలు పని చేస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 43, 49, 55 ఇంచెస్ వేరియంట్లలో ఈ 4కే స్మార్ట్ టీవీలను అందిస్తున్నామని వీయూ టెక్నాలజీసీ సీఈవో , ఫౌండర్ దేవితా సరాఫ్ తెలిపారు. గత ఏడాదిగా అనేక విజయవంతమైన పరీక్షల తర్వాత ఈ హైఎండ్ టెక్నాలజీతో కూడిన, హై క్వాలిటీ పిక్చర్, సౌండ్ కలగలసిన విప్లవాత్మక ప్రొడక్ట్ను లాంచ్ చేశామని సంస్థ సీఈవో వెల్లడించారు. 43 అంగుళాల టీవీ ధర రూ.. 36,999గాను, 49 అంగుళాల వేరియంట్ టీవీ ధర రూ. 46,999, 55 అంగుళాల వేరియంట్ టీవీ ధర రూ. 55,999గా నిర్ణయించినట్టు చెప్పారు.ఈ స్మార్ట్టీవీలు ఫ్లిప్కార్ట్, వియూ స్టోర్లలో మార్చి 16వ తేదీనుంచి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. క్వాడ్-కోర్ ప్రాసెసర్ , 2.5 జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, డాల్బీ డిజిటల్ ఆడియో సపోర్ట్ ఈ టీవీల ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. దీంతో ఇటీవల టీవీ మార్కెట్లోకి దూసుకువచ్చిన చైనా మొబైల్ మేకర్ షావోమికి గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా. అలాగే ఇప్పటికే టీవీ సెగ్మెంట్లో ప్రత్యర్థులకు ప్రధాన పోటీ ఇస్తున్న కొరియన్ సంస్థ శాంసంగ్కు వీయూ మరో ప్రత్యర్థి అవుతుందని అంచనా. -
ఉసూరుమనిపించిన షావోమి ఫస్ట్సేల్
సాక్షి, ముంబై: తమ అభిమాన బ్రాండ్ షావోమి స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవాలనుకున్న కస్టమర్లను అవుట్ ఆఫ్ స్టాక్ నోటిపికేషన్ వెక్కిరించింది. విక్రయాలు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఎంఐ ఎల్ఈడీ టీవీలు చేజారిపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు ఎంఐ 32, 43, 55 అంగుళాల స్మార్ట్ టీవీల సేల్స్ గ్రాండ్ ఓపెనింగ్.. బిగ్ సేల్స్ అంటూ కంపెనీ వెల్లడించింది. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర కేవలం రూ.13, 999గా, 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.22 999గాను, 55 అంగుళాల టీవీని రూ .39,999గాను నిర్ణయించింది. అయితే సేల్ ప్రారంభించిన నిమిషాల్లోనే వినియోగదారులను ఉసూరుమనిపించింది. ఒక విధంగా కళ్లు మూసి తెరిచేలోపు అవుట్ ఆఫ్ స్టాక్...నోటి ఫై మి అని దర్శనమివ్వడంపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తదుపరి విక్రయాలు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని షావోమి ప్రకటించింది. కాగా స్మార్ట్ఫోన్ సంచలనం షావోమి టీవీ సెగ్మెంట్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అత్యాధునిక ఫీచర్లు, సరసమైన ధర అంటూ వినియోగదారులకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో గతనెలలో ప్రారంభించిన కొత్త టీవీ సిరీస్ ఎంఐ స్మార్ట్టీవీ 4ఏ ల తొలి విక్రయంలో ఫ్లిప్కార్ట్, తన అధికారిక వెబ్సైట్లో భారత వినియోగదారులకు నేడు (మంగళవారం) అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు ఇటీవల లాంచ్ చేసిన రెడ్మి నోట్ 5, నోట్ 5 ప్రో సేల్స్ను కూడా ఈ రోజు మరోసారి ప్రారంభించింది. ఈ స్మార్ట్ఫోన్ విక్రయాల్లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుతుండటం గమనార్హం. దీనిపై షావోమి అభిమానుల ఆగ్రహం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. -
ఈ ఏడాది కొత్తగా షావోమి 6 స్మార్ట్ఫోన్లు
దేశీయ మార్కెట్లో చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షావోమి దూసుకుపోతోంది. కొత్త కొత్త ప్రొడక్ట్లతో తన సత్తా చాటుకుంటోంది. ఇక షావోమి స్మార్ట్ఫోన్లకు భారత్లో వస్తున్న స్పందన అంతా ఇంతా కానిది. తాజాగా ఈ ఏడాది షావోమి 6 స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని షావోమి గ్లోబల్ వైస్-ప్రెసిడెంట్, ఇండియా హెడ్ మను కుమార్ జైన్ లైవ్మింట్లో తెలిపారు. కేవలం ఆరు స్మార్ట్ఫోన్ల లాంచింగ్ మాత్రమే కాక, 100 ఎక్స్క్లూజివ్ స్టోర్లను కూడా షావోమి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్త ప్రొడక్ట్ కేటగిరీల విడుదలతో పాటు, సాఫ్ట్వేర్పై, ఇంటర్నెట్ స్టార్టప్లపై కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు చెప్పారు. భారత్లో షావోమి పెట్టుబడులు పెంచడం అంత ఆశ్చర్యకరమైన విషయం కాదని, చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్గా షావోమినే ఉందని తెలిసింది. భారత్లో అతిపెద్ద స్మార్ట్ఫోన్ బ్రాండుగా కూడా షావోమి నిలుస్తోంది. శాంసంగ్ను వెనక్కి నెట్టేసి మరీ షావోమి భారత్ మార్కెట్లోకి టాప్ బ్రాండుగా దూసుకొచ్చేసింది. ఆరేళ్లలో షావోమి టాప్ బ్రాండుగా నిలువడం ఇదే తొలిసారి. రెండు స్వచ్ఛంద రీసెర్చ్ సంస్థలు విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం రెడ్మి 5 స్మార్ట్ఫోన్ను భారత్లో మార్చి 14న లాంచ్ చేయబోతుంది. రెడ్మి 4కు సక్సెసర్గా ఇది మార్కెట్లోకి వస్తోంది. మోస్ట్ అఫర్డబుల్ బెజెల్-లెస్ ఫోన్గా ఇది అలరించబోతుంది. కేవలం స్మార్ట్ఫోన్ మార్కెట్లోనే కాక, ఇటు స్మార్ట్టీవీ మార్కెట్లోనూ తన పాగా వేయాలని చూస్తోంది. 55 అంగుళాల ఎంఐ టీవీ4 లాంచింగ్ అనంతరం, మరో రెండు అఫర్డబుల్ స్మార్ట్టీవీలను షావోమి లాంచ్ చేసింది. 32 అంగుళాలు, 43 అంగుళాలలో ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్టీవీను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 43 అంగుళాల టీవీ ధర రూ.22,999 కాగ, 32 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ధర 13,999 రూపాయలు. -
రెడ్మి 5ఏ ధర పెంచేసింది
చైనా మొబైల్ మేకర్ షావోమి లాంచ్ చేసిన దేశ్కా స్మార్ట్ఫోన్ రెడ్మి 5ఏ ధర పెరిగింది. ఎంట్రీ లెవల్ వేరియంట్ను అసలు ధర 5,999 రూపాయలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు షావోమి ప్రకటించింది. ఈ కొత్త ధర ఎంఐ.కామ్, ఫ్లిప్కార్ట్, ఎంఐ హోమ్ రిటైల్ స్టోర్లలో అప్లయ్ అవుతుందని చెప్పింది. లాంచింగ్ సమయంలో రెడ్మి 5ఏ ప్రారంభ ధర 4,999 రూపాయలు మాత్రమే. 50 లక్షల యూనిట్లను విక్రయించిన అనంతరం దీన్ని అసలు ధర 5,999 రూపాయలకు తీసుకొస్తామని కంపెనీ లాంచింగ్ సమయంలోనే ప్రకటించింది. ప్రస్తుతం షావోమి అనుకున్న లక్ష్యాన్ని చేధించేసింది. దీంతో దీని ధరను వెయ్యి రూపాయలు పెంచేసి 5,999 రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు వేరియంట్లలో రెడ్మి 5ఏను షావోమి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ధర 5,999 రూపాయలు కాగ, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ మోడల్ ధర 6,999 రూపాయలు. 8 రోజుల బ్యాటరీ లైఫ్ను ఇది కలిగి ఉంది. మెమరీని పెంచడం కోసం ఈ ఫోన్లో మైక్రోఎస్టీ కార్డు స్లాటును కూడా అందుబాటులో ఉంచింది. డార్క్ గ్రే, రోజ్ గోల్డ్, గోల్డ్ రంగుల్లో ఇది లభ్యమవుతోంది. రెడ్మి 5ఏ స్పెషిఫికేషన్లు.. డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్, ఆండ్రాయిడ్ నోగట్, 5 అంగుళాల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 425 ఎస్ఓసీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని స్పెషిఫికేషన్లు. -
షావోమి మరో బడ్జెట్ ఫోన్ త్వరలో
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి త్వరలోనే మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే బడ్జెట్ఫోన్లతో మొబైల్ మార్కెట్లో సంచలనం రేపుతున్న షావోమి మరోసారి బడ్జెట్ధర, ప్రీమియం ఫీచర్లతో భారత వినియోగదారులకు ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు షావోమి ఇండియా ఎండీ మను కుమార్ జైన్ ట్విటర్ లో ఒక టీజర్ను పోస్ట్ చేశారు. తమ స్లిమ్, స్లీక్, కాంపాక్ట్ పవర్ హౌస్ స్మార్ట్ఫోన్ను ఈ నెల 14న లాంచ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్మి 5 ఇకపై భారతీయు కస్టమర్లకు అందుబాటులోకి తేనుందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. రూ.7వేలుగా దీని ధరను నిర్ణయించనుందని సమాచారం. రెడ్మి 5 ఫీచర్లు 5.7 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ నోగట్ ఆధారితంగా ఎంఐయూఐ 9 క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ఎస్ఓసీ 2జీబీ/ 3జీబీ / 4జీబీ ర్యామ్ 16జీబీ/ 32జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ 12 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫింగర్ప్రింట్ సెన్సార్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ #CompactPowerhouse is launching on 14th March! Slim, sleek and compact! Yet a true super power house! Guess what this is? 🤔 RT if you are excited 😎 pic.twitter.com/kusimWUC2B — Manu Kumar Jain (@manukumarjain) March 8, 2018 -
షావోమి మరో కొత్త టీవీ : రేపే లాంచింగ్
సాక్షి, ముంబై : ఇటీవలే టెలివిజన్ మార్కెట్లో ప్రవేశించి సంచలనం సృష్టించిన షావోమి, ఈ మార్కెట్లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రూ. 40 వేలకు 55 అంగుళాల స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన ఈ కంపెనీ, మిండ్ రేంజ్ టీవీని రేపు(మార్చి 7) లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఓ టీజర్ను కూడా ట్విట్టర్లో పోస్టు చేసింది. స్విచ్ఛ్టూస్మార్ట్, స్విచ్ఛ్టూస్టయిల్, స్విచ్ఛ్టూఎంటర్టైన్మెంట్ అనే పంచ్ లైన్లతో ఈ కొత్త సిరీస్ టీవీని లాంచ్ చేస్తోంది. 'ఎంఐ ఫ్యాన్స్! స్మార్టర్, స్లిమ్మర్, స్లీకర్గా మారడానికి ఇదే సరియైన సమయం. స్మార్ట్టీవీలోకి మారడానికి సమయం వచ్చేసింది. కొత్త సిరీస్ త్వరలో వచ్చేస్తోంది'' అని ఎంఐ ఇండియా ట్వీట్ చేసింది. షావోమి తన దేశీయ మార్కెట్లో రెండు టీవీలను లాంచ్ చేసింది. ఒకటి ఎంఐ టీవీ 4సీ, రెండు ఎంఐ టీవీ 4ఏ. ముందస్తు రిపోర్టులను బట్టి షావోమి ఎంఐ 4ఏ సిరీస్లో 40 అంగుళాల టీవీను 17,500 రూపాయలకు లాంచ్ చేస్తుందని తెలిసింది. కానీ కంపెనీ వెబ్సైట్ తాజా లీకేజీల ప్రకారం ఎంఐ టీవీ 4సీ సిరీస్ను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. రెండు సిరీస్లో ఈ స్మార్ట్టీవీ లాంచ్ అవుతుందని, 43 అంగుళాల ఫుల్హెచ్డీ రెజుల్యూషన్, 4కే రెజుల్యూషన్తో 55 అంగుళాల స్క్రీన్ను ఇది కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఎంఐ టీవీ4 లాగానే.. హెచ్డీఆర్ 10 సపోర్టు, హెచ్ఎల్జీ, వైఫై 802, డోల్బీ, డీటీఎస్ ఆడియో, బ్లూటూత్ 4.2 స్పెషిఫికేషన్లను కలిగి ఉంటుందని టాక్. రేపు ఈ లాంచ్ ఈవెంట్ను షావోమి నిర్వహించబోతుంది. కంపెనీ వెబ్సైట్లో మూడు గంటలకు దీన్ని లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. అదేవిధంగా తాజాగా లాంచ్ అయిన రెడ్మి నోట్ 5 ప్రొ, రెడ్మి నోట్ 5 స్మార్ట్ఫోన్లను కూడా షావోమి రేపు మధ్యాహ్నం విక్రయిస్తోంది. -
షావోమి సంచలనం.. రూ.13 వేలకే స్మార్ట్ టీవీ
సాక్షి, ముంబై : చవక ఫోన్లతో భారత్లో పాగావేసిన షావోమి మరో అడుగు ముందుకేసింది. ఇటీవలే టెలివిజన్ మార్కెట్లో ప్రవేశించి సంచలనం సృష్టించిన షావోమి, టీవీ మార్కెట్లోను తన మార్క్ కోసం తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రూ. 40 వేలకు 55 అంగుళాల స్మార్ట్ టీవీని లాంచ్ చేసి ప్రముఖ కంపెనీల గుండెల్లో దడ పుట్టించింది. ఇదే క్రమంలో భారత్లోని టీవీ మార్కెట్పై కన్నేసిన షావోమి మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని మిడ్ రేంజ్ టీవీలను లాంచ్ చేయనుంది. ఇందులో భాగంగానే 15వేల కంటే తక్కువ ధరలో 32 అంగుళాల టీవీని మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. హైడెఫినేషన్ క్వాలీటీతో రూ.12,999లకే 32 అంగుళాల స్మార్ట్ టీవీని షావోమీ తీసుకు రానున్నట్లు ప్రముఖ టెక్నాలజీ వార్తా సంస్థ ఐగ్యాన్ ప్రచురించింది. ఇందులో 1జీబీ ర్యామ్తో పాటు 4జీబీ ఇంటర్నల్ మెమెరీని నిక్షిప్తం చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా రూ.21,999లకే 43 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీని అందిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమోరీ అందుబాటులో ఉంటాయని ఐగ్యాన్ తెలిపింది. అంతేకాకుండా బ్లూటూత్ 4.2 వెర్షన్, వైఫై సౌకర్యం కూడా ఇందులో ఉన్నట్లు పేర్కొంది. ఎంఐ 4ఏ సిరీస్లో వీటిని లాంచ్ చేసే అవకాశం ఉంది. మార్చి 7న వీటిని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు షావోమి తన అధికారిక యాప్లో ప్రకటించింది. 32 అంగుళాల టీవీ ఫీచర్లు స్క్రీన్: 32 అంగుళాలు ర్యామ్: 1జీబీ ఇంటర్నల్ మెమెరీ : 4జీబీ ఆపరేటింగ్ సిస్టమ్ : ప్యాచ్ (ఆండ్రాయిడ్) వీడియో టైప్ : ఫుల్ హెచ్డీ ధర : రూ.12, 999 (అంచనా) 43 అంగుళాల టీవీ ఫీచర్లు స్క్రీన్: 43 అంగుళాలు ర్యామ్: 2జీబీ ఇంటర్నల్ మెమెరీ : 8జీబీ ఆపరేటింగ్ సిస్టమ్ : ప్యాచ్ (ఆండ్రాయిడ్) వీడియో టైప్ : ఫుల్ హెచ్డీ, 4కే ధర : రూ.21, 999 (అంచనా) -
రెడ్మి నోట్ 5 ఆఫ్లైన్గా...
ఫ్లాష్ సేల్కు వచ్చిన నిమిషాల్లో అవుటాఫ్ స్టాక్ అవుతున్న రెడ్మి నోట్ 5 స్మార్ట్ఫోన్ను ఇక నుంచి ఆఫ్లైన్గా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్ ప్రీ-బుకింగ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు షావోమి ప్రకటించింది. గత నెలలోనే రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్లను షావోమి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచ్ చేసిన అనంతరం వీటిని ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో అందుబాటులో ఉంచింది. ఫ్లాష్ సేల్కు వచ్చిన ప్రతీసారి ఈ స్మార్ట్ఫోన్లు నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అవుతున్నాయి. త్వరలోనే ఆఫ్లైన్ రిటైల్ పార్టనర్ల వద్ద అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రెడ్మి నోట్ 5 ప్రీ-బుకింగ్స్ను ఆఫ్లైన్ స్టోర్ల వద్ద షావోమి ప్రారంభించింది. వీటి డెలివరీని మార్చి 8 నుంచి మొదలుపెడుతుంది. రెండు వేల రూపాయలు కట్టి ఈ ఫోన్ను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని రిటైల్ వర్గాలు తెలిపాయి. అంతేకాక త్వరలో ఆఫ్లైన్ రిటైల్ పార్టనర్ల వద్ద విక్రయానికి రాబోతున్న ఈ స్మార్ట్ఫోన్ ధర ఆన్లైన్ కంటే రూ.500 ఎక్కువగా ఉండనుంది. థర్డ్ పార్టీ ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా రెడ్మి నోట్ 5ను కొనుగోలు చేస్తే, 3జీబీ ర్యామ్, 32జీబీ మోడల్ ధర 10,499 రూపాయలు. అసలు ఆన్లైన్గా ఈ మోడల్ ధర 9,999 రూపాయలు. అదేవిధంగా 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ను ఆఫ్లైన్గా 12,499 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఆన్లైన్గా ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.11,999గా ఉంది. అదేవిధంగా రెడ్మి నోట్ 5 ప్రొ ధర కూడా ఆన్లైన్గా కంటే ఆఫ్లైన్గా 500 రూపాయలు ఎక్కువగా ఉండనుంది. షావోమి రెడ్మి నోట్ 5 ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 12 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. షావోమి రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భలే గిరాకీ : నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ షావోమికి చెందిన కొత్త స్మార్ట్ఫోన్లు రెడ్మి నోట్5, రెడ్మి నోట్ 5 ప్రొలకు భలే గిరాకీ వచ్చింది. ఎంఐ.కామ్, ఫ్లిప్కార్ట్లో తొలి ఫ్లాష్ సేల్కు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఈ రెండు స్మార్ట్ఫోన్లు అవుటాఫ్ స్టాక్ అయ్యాయి. 3 నిమిషాల్లోనే 3 లక్షల యూనిట్ల స్మార్ట్ఫోన్లు, అంటే నిమిషానికి లక్ష ఫోన్లు అమ్ముడుపోయినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ తెలిపారు. ఇండియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సేల్గా అభివర్ణించారు. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అయిన రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ తర్వాతి సేల్ ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉండబోతున్నట్టు పేర్కొన్నారు. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అవడంపై, కస్టమర్లు తీవ్ర నిరాశ వ్యక్తంచేస్తున్నారు. ఈ రెండు స్మార్ట్ఫోన్లతో పాటు షావోమి ఎంఐ టీవీ 4ను కూడా కంపెనీ నేడు విక్రయానికి తీసుకొచ్చింది. షావోమి రెడ్మి నోట్ 5 ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 12 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. షావోమి రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ #RedmiNote5 & #RedmiNote5Pro: we sold 3L+ units in -
రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ వచ్చేశాయ్
షావోమి న్యూఢిల్లీ వేదికగా రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. రెడ్మి నోట్ 4కు సక్ససర్గా రెడ్మి నోట్ 5ను విడుదల చేస్తున్నట్టు కంపెనీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ తెలిపారు. రెడ్మి నోట్ 4తో పోలిస్తే ఈ స్మార్ట్ఫోన్ బెజెల్-లెస్ డిజైన్, అతిపెద్దగా 5.99 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. రెడ్మి నోట్ 4 బ్యాటరీ కెపాసిటీ కూడా 4000 ఎంఏహెచ్. గతేడాది మోడల్ కంటే సగం మిల్లీమీటర్ పలుచగా ఉందని తెలిపారు. ముందస్తు నోట్ స్మార్ట్ఫోన్ల కంటే మెరుగ్గా లో-లైట్ ఫోటోగ్రఫీతో ఈ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. 12 మెగాపిక్సెల్ సెన్సార్ను ఈ ఫోన్ కలిగి ఉంది. స్నాప్డ్రాగన్625 ప్రాసెసర్ కింద 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.9,999గా, రూ. 11,999గా ఉన్నాయి. నాలుగు రంగుల్లో రెడ్మి నోట్ 5 అందుబాటులో ఉంచనున్నట్టు మను కుమార్ జైన్ తెలిపారు. షావోమి లాంచ్ చేసిన మరో స్మార్ట్ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్తో వచ్చిన తొలి నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.13,999గా, రూ.16,999గా ఉన్నాయి. ఫేస్ అన్లాక్ ఫీచర్ను కూడా ఈ స్మార్ట్ఫోన్తో షావోమి తన యూజర్లకు ప్రవేశపెట్టింది. 20 మెగాపిక్సెల్తో సెల్ఫీ షూటర్ కలిగి ఉండగా.. వెనుకవైపు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లను వచ్చే వారం నుంచి ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్లలో ఫ్లాష్ సేల్కు రానున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆఫ్లైన్గా కూడా వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. వీటితో పాటు తొలిసారి భారత్లో ఎంఐ టీవీ4ను కూడా కంపెనీ విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 కంటే పలుచగా ఈ ఎంఐ టీవీ ఉంది. ప్రపంచంలోనే అత్యంత పలుచైన ఎల్ఈడీ టీవీ ఇదేనని షావోమి తెలిపింది. దీని ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. హాట్స్టార్, వూట్, సోనీ లివ్, హంగామా ప్లే, జీ5, సన్ నెక్ట్స్, వియూ, టీవీఎఫ్, ఫ్లిక్స్ట్రీ వంటి వాటితో షావోమి భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. వీటి భాగస్వామ్యంతో 5 లక్షల గంటల కంటెంట్ను అందించనున్నట్టు పేర్కొంది. దీనిలో 80 శాతం కంటెంంట్ను పూర్తిగా ఉచితమని తెలిపింది. ఎంఐ టీవీ 4 తోపాటు ఎంఐ టీవీ రిమోట్ను కూడా షావోమి తీసుకొచ్చింది. దీనిలో కేవలం 11 బటన్లు మాత్రమే ఉన్నాయి. -
5జీ స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయ్...
2జి శకం ముగిసింది. 3జీ కూడా ముగిసిపోయి కాలం 4జీ వైపు పరుగులు పెడుతోంది. అయితే త్వరలో 4జీ శకం కూడా ముగిసిపోయి 5జీ వైపు అడుగులు వేగంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో 5జీ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు తెలుస్తోంది. క్వాల్కామ్, ఇంటెల్ రెండూ కూడా కొన్ని నెలల నుంచి దీనిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని, 2018 చివరి వరకు లేదా 2019 ప్రారంభంలో 5జీ కేపబుల్ తొలి స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి రానున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. 2019లో స్నాప్డ్రాగన్ ఎక్స్50 5జీ మోడమ్స్తో స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు 18 ఫోన్ తయారీదారి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్టు క్వాల్కామ్ ప్రకటించింది. ఈ కంపెనీల్లో నోకియా/హెచ్ఎండీ, సోని, షావోమి, ఒప్పో, వివో, హెచ్టీసీ, ఎల్జీ, ఆసుస్, జడ్టీసీ వంటి కంపెనీలున్నట్టు పేర్కొంది. ఈ అన్ని కంపెనీలు కమర్షియల్ వాడకం కోసం 2019లో 5జీ డివైజ్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. అంతేకాక స్నాప్డ్రాగన్ ఎక్స్50 మోడమ్స్ను విడుదల చేసినట్టు కూడా ధృవీకరించింది. తర్వాత తరం 5జీ మొబైల్ అనుభవాన్ని తన వినియోగదారులకు అందించడానికి క్వాల్కామ్ టెక్నాలజీస్ ఎంతో అంకితభావంతో పనిచేస్తుందని క్వాల్కామ్ టెక్నాలజీస్ ఇంక్ మొబైల్, జనరల్ మేనేజర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ కటౌజియాన్ తెలిపారు. అయితే 5జీ స్మార్ట్ఫోన్లను అందించే కంపెనీ జాబితాలో ఆపిల్, శాంసంగ్, హువావే లేకపోవడం గమనార్హం. ఆపిల్కు గత ఏడాదిగా క్వాల్కామ్తో న్యాయ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్వాల్కామ్తో కలిసి ఆపిల్ పనిచేయడం లేదని తెలుస్తోంది. ఆపిల్ తన మోడమ్ ఆర్డర్స్ను ఇంటెల్ నుంచి స్వీకరిస్తుంది. శాంసంగ్ తన సొంత ఎక్సీనోస్ చిప్సెట్నే 5జీ కోసం వాడనుంది. క్వాల్కామ్ చిప్స్ను ఇది వాడటం లేదు. శాంసంగ్ తొలి 5జీ చిప్ను ఎక్సీనోస్ 5జీగా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ చిప్ను ఈ ఏడాది చివరిలో లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
8జీబీ ర్యామ్తో షావోమి కొత్త ఫోన్..
చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి వచ్చే నెలల్లో మరో రెండు హై-ఎండ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎంఐ మిక్స్ 2ఎస్, ఎంఐ 7 పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తుందని రిపోర్టులు వెలువడుతున్నాయి. ఎంఐ 7 స్మార్ట్ఫోన్ ఫీచర్లు ఇప్పటి నుంచే ఆన్లైన్ చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. ఈ ఫోన్కు సంబంధించి స్క్రీన్షాట్లు కూడా బయటికి వచ్చాయి. ఒకవేళ తాజాగా విడుదలైన స్క్రీన్షాట్లు కనుక నిజమైతే, ఎంఐ 7 స్మార్ట్ఫోన్ 5.65 అంగుళాల ఫుల్-హెచ్డీ ప్లస్ డిస్ప్లేను కలిగి ఉండబోతుందని తెలుస్తోంది. అంతకముందు ఈ ఫోన్కు 6 అంగుళాల డిస్ప్లే ఉంటుందని కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ స్క్రీన్షాట్లోనే స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్తో ఈ ఫోన్ రూపొందిందని, అత్యధిక మొత్తంలో 8జీబీ ర్యామ్ను ఇది ఆఫర్ చేస్తుందని తెలిసింది. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను ఇది ఆఫర్ చేస్తుందట. ఇటీవల విడుదలైన లీకేజీల్లో వివో కొత్తగా తీసుకొచ్చే ఎక్స్ప్లే7 స్మార్ట్ఫోన్ 10జీబీ ర్యామ్ను కలిగి ఉండనున్నట్టు టాక్. కెమెరా పరంగా తీసుకుంటే షావోమి ఎంఐ 7 స్మార్ట్ఫోన్ 16 మెగాపిక్సెల్ లెన్సెస్తో డ్యూయల్ రియర్ కెమెరాను, ముందు వైపు 16 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఎంఐ 6 స్మార్ట్ఫోన్కు 3350 ఎంఏహెచ్ సామర్థ్యం కల బ్యాటరీ ఉంటే, ఎంఐ 7కు 4480 ఎంఏహెచ్ సామర్థ్యంతో అతిపెద్ద బ్యాటరీ ఉన్నట్టు ఆ స్క్రీన్షాట్ తెలుపుతోంది. ఏప్రిల్లో ఈ ఫోన్ లాంచ్ అవొచ్చని... ప్రస్తుతం ఈ నెల చివరిలో జరుగబోయే ఎండబ్ల్యూఐసీ 2018లో ఎంఐ మిక్స్ 2ఎస్ను లాంచ్ చేస్తారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. -
రెడ్మి 5 కమింగ్, లాంచింగ్ ఆ రోజే
చైనీస్ ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ షావోమి, తన 2018 తొలి ప్రొడక్ట్ను భారత్లో లాంచ్ చేయబోతుంది. దీని కోసం కంపెనీ బిగ్ ''5'' లోగోతో ఆహ్వానాలు కూడా పంపుతోంది. ఈ ఆహ్వాన పత్రికల మేరకు షావోమి తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్ రెడ్మి 5నే భారత్లో లాంచ్ చేస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 14న ఈ లాంచింగ్ ఈవెంట్ జరుగబోతుంది. ఈ ఈవెంట్లోనే రెడ్మి 5 ప్లస్ కూడా వస్తుందో లేదో ఇంకా స్పష్టతలేదు. 2జీబీ ర్యామ్ / 16జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్ / 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ / 32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచింగ్కు సిద్ధమైందని తెలుస్తోంది. చైనాలో ఈ స్మార్ట్ఫోన్ను గత డిసెంబర్లోనే లాంచ్ చేశారు. బ్లాక్, గోల్డ్, లైట్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల వేరియంట్లలో అక్కడ మార్కెట్లోకి వచ్చింది. రెడ్మి 5తో పాటు రెడ్మి 5 ప్లస్ను కూడా చైనాలో లాంచ్ చేశారు. రెడ్మి 5 ధర అక్కడ 799 సీఎన్వై నుంచి అంటే రూ.8100గా ప్రారంభం కాగ, రెడ్మి 5 ప్లస్ స్మార్ట్ఫోన్ సీఎన్వై 999(రూ.10,200) నుంచి ప్రారంభమైంది. కానీ భారత్లో ఈ ఫోన్ ధర ఏ మేర ఉంటుందో ఇంకా తెలియలేదు. రెడ్మి 5, 5 ప్లస్ స్మార్ట్ఫోన్ల స్పెషిఫికేషన్లు... డ్యూయల్-సిమ్ ఆండ్రాయిడ్ నోగట్ ఆధారితంగా ఎంఐయూఐ 9తో రన్ రెడ్మి 5కి 5.7 అంగుళాల డిస్ప్లే రెడ్మి 5 ప్లస్కి 5.99 అంగుళాల డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ఎస్ఓసీ రెడ్మి 5 స్మార్ట్ఫోన్కి 2జీబీ/ 3జీబీ / 4జీబీ ర్యామ్ 16జీబీ/ 32జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ రెడ్మి 5 ప్లస్ స్మార్ట్ఫోన్కి 3జీబీ/ 4జీబీ ర్యామ్ 32జీబీ/ 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫింగర్ప్రింట్ సెన్సార్ రెడ్మి 5- 3300 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి 5 ప్లస్కు 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
టీవీ మార్కెట్పై కన్ను
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో, చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి జట్టు కట్టనున్నాయి. స్మార్ట్ఫోన్ మార్కెట్ లో లీడర్గా ఉన్న షావోమి టీవీ మార్కెట్లో కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే ఇండియాలోకి తీసుకురానున్న షావోమి టీవీలను జియో రీటైల్ దుకాణాల్లో లాంచ్ చేసేందుకు యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య భాగస్వామ్య చర్చలు నడుస్తున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది ఇప్పటికే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఆన్లైన్ స్టోర్ల ద్వారా తన ఉత్పత్తులను విక్రయిస్తున్న షావోమి ఆఫ్లైన్ విక్రయాలపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో భాగస్వాముల కోసం చూస్తోంది. అలాగే వినియోగదారుల ఉత్పత్తులు మాత్రమే కాకుండా, బీ టూ బీ ఉత్పత్తులను కూడా ఇండియాకు తీసుకురావాలని ఆశ పడుతోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో, షావోమి సీనియర్ ఎగ్జిక్యూటివ్ల మధ్య ఈ మేరకు పలుమార్లు చర్చలు జరిపాయి. చర్చలు ఒక కొలిక్కి వచ్చి..ఈ ఒప్పందం అమల్లోకి వస్తే.. ఈ ఏడాది నుంచే రిలయన్స్ జియో డిజిటల్ స్టోర్స్ ద్వారా ఎంఐ, రెడ్ మీ బ్రాండ్లను విక్రయించనుంది. అలాగే షావోమీ టీవీలను కూడా విక్రయించనుంది. స్మార్ట్ఫోన్ మార్కెట్ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస్థల ధరలతో పోలిస్తే సరసమైన ధరలకు ఫీచర్, రిచ్, హై ఎండ్ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. కాగా పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ ప్రకారం భారతదేశంలో నంబర్ వన్ స్మార్ట్ఫోన్ కంపెనీగా అవతరించిన షావోమి 2018 లో తన ఆన్లైన్ వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. -
షావోమి రిపబ్లిక్ డే సేల్, ఆఫర్లో మొబైల్స్
షావోమి రేపటి నుంచి రిపబ్లిక్ డే సేల్కు తెరలేపింది. ఎంఐ.కామ్లో ఈ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్లో భాగంగా మొబైల్ ఫోన్లు, ఆడియో యాక్ససరీస్, పవర్ బ్యాంక్స్, హోమ్ గాడ్జెట్స్, ఇతర ఉత్పత్తులపై షావోమి ప్రకటించింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, రిపబ్లిక్ డే వరకు కొనసాగనుంది. ఈ సేల్ పిరియడ్లో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు డిస్కౌంట్ కూపన్లను కంపెనీ అందిస్తోంది. రూ.50, రూ.100, రూ.200, రూ.500 డినామినేషన్లలో ఈ డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా మొబిక్విక్ ద్వారా జరిపిన పేమెంట్లకు ఫ్లాట్ 30 శాతం సూపర్ క్యాష్ను ఆఫర్ చేస్తోంది. మూడు నెలల హంగామా ప్లే సబ్స్క్రిప్షన్ను, 12 నెలలు హంగామా మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఈ సేల్లో కొనుగోలుదారులకు లభిస్తోంది. వీటితో పాటు 14,999 రూపాయలుగా ఉన్న ఎంఐ ఏ1 స్మార్ట్ఫోన్ 13,999 రూపాయలకే లభ్యమవుతోంది. ఎంఐ మిక్స్2 ధర 35,999 రూపాయల నుంచి 32,999 రూపాయలకు తగ్గించింది. ఎంఐ మ్యాక్స్2 ధరను కూడా వెయ్యి రూపాయల మేర తగ్గించింది. అదేవిధంగా ఈ సేల్లో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్ రెడ్మి 5ఏ కూడా 4999 రూపాయల నుంచి విక్రయానికి వచ్చింది. రెడ్మి వై1 ప్రారంభ ధర 8,999 రూపాయలు కాగ, రెడ్మి వై1 లైట్ 6,999 రూపాయల నుంచి అందుబాటులో ఉంది. 20000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంకు 2ఐ రూ.1499కు, 10000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంకు 2ఐ రూ.799కు, ఎంఐ బ్యాండ్-హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్ రూ.1299కు షావోమి అందుబాటులో ఉంచింది. పలు స్మార్ట్ఫోన్ కేసులు, కవర్లపై 200 రూపాయల వరకు డిస్కౌంట్ను అందిస్తున్నట్టు ప్రకటించింది. -
దూసుకుపోతున్న షావోమి: న్యూ రికార్డ్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ మేకర్ షావోమి దూసుకుపోతోంది. కొత్త సంవత్సరంలో కొత్త రికార్డులతో ఇండియాలో తన సత్తా చాటుతోంది. అమెజాన్లో టాప్ సెల్లింగ్ బ్రాండ్స్ స్మార్ట్ఫోన్ విక్రయాల్లో టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా షావోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ ట్విటర్లో ప్రకటించారు. అమెజాన్లో సేల్ అవుతున్న 6 టాప్ స్మార్ట్ఫోన్లలో 5 తమవే(షావోమి) అని ట్వీట్ చేశారు. మరోవైపు రెడ్ మి 5 ఎ విక్రయాల్లో దుమ్ము రేపుతోంది. షావోమి పాపులర్ మోడల్ దేశ్ కా స్మార్ట్ఫోన్ పేరిట రెడ్మీ 5ఎ భారీ సేల్స్ను నమోదు చేసింది. లాంచ్ అయిన నెలరోజులలోపే తమ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ భారత్లో మిలియన్కు పైగా విక్రయాలను సాధించిందని జైన్ వెల్లడించారు. లాంచ్ అయిన నెల రోజుల వ్యవధిలోనే అన్ని మాధ్యమాల్లోనూ కలిపి ఏకంగా 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడైనట్టు జైన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్లైన్తోపాటు, ఆఫ్లైన్ స్టోర్స్లోనూ లభ్యం. గతేడాది డిసెంబర్ 7వ తేదీన 5ఎ స్మార్ట్ఫోన్ను 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల చేసింది. మరోవైపు 2జీబీ ర్యామ్ వేరియెంట్పై మొదటి 50 లక్షల యూనిట్లకు రూ.1000 డిస్కౌంట్ను అందిస్తున్న నేపథ్యంలో రెడ్మీ 5ఎ స్మార్ట్ఫోన్ రూ.4,999 లకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. రెడ్మీ 5ఎ పీచర్లు 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 1.4 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ 2/3 జీబీ ర్యామ్ 16/32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ New year, newer records! Once again, 5 out of the top 6 selling smartphones on @AmazonIN are all @XiaomiIndia phones! Which one of these do you use? 😉#1SmartphoneBrandXiaomi pic.twitter.com/QsxDMjiczu — Manu Kumar Jain (@manukumarjain) January 11, 2018 -
రెడ్ మి నోట్ 5 వస్తుందా? ఎప్పుడు?
చైనా మొబైల్ మేకర్ షావోమి నోట్ సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. రెడ్ మి నోట్ 5ను త్వరలోనే లాంచ్ చేయనుందని , ఈ మేరకు ఇప్పటికే టెస్టింగ్ ప్రారంభించిందంటూ పలు నివేదికలు వెలుడ్డాయి. మరోవైపు దీనికి భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అవుట్ గోయింగ్ మోడల్ రెడ్మి నోట్ 5 లాంచింగ్ బాగా లేట్ కానుందని మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకతగా చెబుతున్న క్వాల్కం చిప్సెట్ ఇంకా లాంచ్ కాకపోవడం దీనికి కారణమని ఓ చైనా వెబ్సైట్ వాదిస్తోంది. ఈ ఏడాది రెండవ క్వార్టర్కంటే ముందు అందుబాటులోకి రాదని తెలిపింది. అలాగే భారతీయ కొనుగోలుదారులు దీనికోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుందని నివేదించింది. రెడ్ మి నెట్ 5 బేస్ వేరియంట్ ధర రూ.12 వేలుగా నిర్ణయించే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్తో రానుందని అంచనా. మిగతా ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి. రెడ్ మి నోట్ 5 5.99 అంగుళాల ఫుల్హెచ్డీ స్క్రీన్18:9 యాస్పెక్ట్ రేషియో క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 632 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2. 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమి ఎంఐ మిక్స్ 2 ధర తగ్గిందోచ్...
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి మరోసారి తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తన ఫ్లాగ్ షిప్ బెజెల్లెస్ స్మార్ట్ఫోన్ ఎంఐ మిక్స్2 ను డిస్కౌంట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తగ్గింపు తరువాత ఇపుడు ఇది రూ.32,999 ధరకు లభించనుంది. అసలు ధరతో పోలిస్తే రూ.3వేల డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్ కింద జనవరి 5వ తేదీ వరకే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ స్టోర్స్లోనూ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. కాగా గత అక్టోబర్ నెలలో లాంచ్ అయిన ఎంఐ మిక్స్ 2 స్మార్ట్ఫోన్ ధరను రూ.35,999గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎంఐ మిక్స్ 2 ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 12ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆఫ్లైన్గా రెడ్మి 5ఏ, కానీ ధరనే..
షావోమి తన రెడ్మి 5ఏ స్మార్ట్ఫోన్ను ఇక త్వరలోనే ఆఫ్లైన్గా అందుబాటులోకి తీసుకురాబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టోర్ల ద్వారా ఈ స్మార్ట్ఫోన్ను విక్రయించబోతున్నట్టు షావోమి తెలిపింది. రెండు వేరియంట్లలో లాంచ్ అయిన రెడ్మి 5ఏ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్, ఎం.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో అందుబాటులో ఉంది. అయితే 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ఆఫ్లైన్ పార్టనర్ల వద్ద అమ్మకానికి వస్తుందని కంపెనీ తెలిపింది. అదేవిధంగా 2జీబీ ర్యామ్ వేరియంట్ ఎంఐ పార్టనర్ స్టోర్ల వద్ద మాత్రమే అమ్మకానికి వస్తున్నట్టు పేర్కొంది. 2జీబీ ర్యామ్ వేరియంట్ను రూ.4,999కు విక్రయిస్తోంది. 3జీబీ ర్యామ్ వెర్షన్ను కూడా ఆన్లైన్, ఎంఐ హోమ్ స్టోర్ల వద్ద రూ.6,999కు అమ్ముతోంది. కానీ ఆఫ్లైన్కు వచ్చేసరికి ఈ వేరియంట్ ధరను షావోమి పెంచేసింది. దీని రూ.7,499 వరకు విక్రయిస్తామని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అంటే లాంచింగ్ ధర కంటే రూ.500కు పైగా ఎక్కువ. రెడ్మి 5ఏ స్పెషిఫికేషన్లు.. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ ఎంఐయూఐ 9 ఆధారిత ఆండ్రాయిడ్ నోగట్ 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1.4గిగాహెడ్జ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ 2జీబీ/ 3జీబీ ర్యామ్ 16జీబీ/ 32జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమి స్మార్ట్ఫోన్లకు ఇక అది ఉండదు
షావోమి స్మార్ట్ఫోన్లకు 'నోట్' ట్యాగ్ చాలా ఫేమస్. రెడ్మి నోట్, రెడ్మి నోట్ 2, రెడ్మి నోట్ 3, రెడ్మి నోట్ 4 ఇలా పలు స్మార్ట్ఫోన్లను షావోమి మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే తాజాగా స్మార్ట్ఫోన్లకు ఉపయోగిస్తున్న ఈ 'నోట్' ట్యాగ్ను షావోమి తీసివేయాలని చూస్తుందట. షావోమి 'నోట్' పేరుకు స్వస్తి చెప్పబోతుందంటూ ఇప్పటికే పలు రిపోర్టులు కూడా విడుదలయ్యాయి. అంతేకాక రెడ్మి నోట్4కు సక్ససర్గా షావోమి రెడ్మి 5 ప్లస్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయడం ఈ రిపోర్టులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎంఐ ఫోరమ్ 'సూపర్ మోడరేటర్' మిచ్002 ఈ విషయాన్ని తొలిసారి రివీల్ చేసింది. కానీ ఇప్పటి వరకు షావోమి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రెడ్మి 5 ప్లస్తో పాటు రెడ్మి 5 స్మార్ట్ఫోన్ను కూడా షావోమి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు హ్యాండ్సెట్లు ఫుల్ వ్యూ డిస్ప్లే, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రెండు స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లోకి కూడా రాబోతున్నాయి. రెడ్మి 5 ప్లస్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీప్లస్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి 5 ఫీచర్లు 2జీబీ ర్యామ్, 16జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ 3జీబీ ర్యామ్, 32జీబీ వెర్షన్ 5.7 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ స్క్రీన్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ -
ఎంఐ ఎ1పై పర్మినెంట్ రేట్ కట్
సాక్షి,ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి ఎంఐ ఫాన్స్కు గ్రేట్ న్యూస్ అందించింది. ఇటీవల లాంచ్ చేసిన ఎంఐ ఎ1పై శాశ్వతంగా తగ్గింపు రేటును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల తాత్కాలికంగా రూ.2 వేల తగ్గింపును అందించిన కంపెనీ తాజాగా ఎప్పటికీ వెయ్యి రూపాయల తగ్గింపుతో కస్టమర్లకు అందించనుంది. భారత్లో ఈ ఏడాది సెప్టెంబర్లో రూ.14,999 ధరలో విడుదల చేసిన ఈ డివైస్ను ఇకమీదట రూ.13,999లకే అందిస్తున్నట్టు ట్విట్టర్లో తెలిపింది. వెయ్యి రూపాయల మేర పర్మినెంట్ డిస్కౌంట్ను అందిస్తున్నట్టు షావోమి వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఎం, ఫ్లిప్కార్ట్ద్వారా కొనుగోలు చేయవచ్చని సూచించారు. ఎంఐ ఎ1 ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ 12ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 3080 ఎంఏహెచ్ బ్యాటరీ Great news Mi Fans: announcing a permanent price drop of ₹ 1000 on Mi A1! 🙌#MiA1: picture perfect flagship dual camera phone. Now available for a perfect price of ₹13,999! Buy it from https://t.co/lzFXOcGyGQ and @Flipkart. pic.twitter.com/PWplnIMC71 — Manu Kumar Jain (@manukumarjain) December 10, 2017 -
భారీ ప్రణాళికలతో దూసుకొస్తున్న షావోమి
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన చైనా కంపెనీ షావోమి మరింత శరవేగంగా దూసుకొస్తోంది. భారత్లో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయం, పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించడానికి యోచిస్తోందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కార్లు విక్రయాలతో పాటు రుణాలు ఇవ్వడం లాంటి ఇతర ఫైనాన్సింగ్ సేవలను అందించనుందనీ ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్లో తెలిపిందని పేర్కొంది. ఆర్ఓసీలో షావోమి దాఖలు చేసిన వివరాల ప్రకారం, అన్ని రకాల వాహానాలు (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) రవాణ పరికరాలు, ఇతర రవాణా సామగ్రి, విడిభాగాలను సరఫరా చేయనున్నామని ప్రకటించింది. అంతేకాదు నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, పేమెంట్ బ్యాంకు, లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్, ఇతర ఆర్థిక సేవలు, పేమెంట్ గేట్ వే, సెటిల్మెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, మొబైల్ వర్చ్యువల్ నెట్వర్క్ ఆపరేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్టు సంస్థ తెలిపింది. -
రెడ్మి 5, 5 ప్లస్ లాంచ్
షావోమి సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 18:9 యాస్పెప్ట్ రేషియో డిస్ప్లేలతో రెడ్మి 5, రెడ్మి 5 ప్లస్ పేరుతో రెండు స్మార్ట్ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. రెడ్ మి 5 ను 2 జీబీ, 3జీబీ వేరియంట్స్, 5 ప్లస్ 3జీబీ, 4 జీబీ రెండు వేరియంట్లలో లభ్యంకానుంది. అలాగే బ్లాక్,గోల్డ్, లైట్ బ్లూ, రోజ్ గోల్డ్ కలర్లలో ఈ డివైస్లు అందుబాటులో ఉంటాయి. మిగతా మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి వచ్చేది షావోమి ఇంకా ధృవీకరించలేదు. రెడ్మి 5ఫీచర్లు 5.7 అంగుళాల హెచ్డీప్లస్ డిస్ప్లే యాస్పెక్ట్ రేషియో 18:9, 720x1440 పిక్సెల్ రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నోగట్ 7.0 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ స్టోరేజ్ను విస్తరించుకునే సదుపాయం 12ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ధర సుమారు రూ.12,700లు. 2 జీబీ వేరియంట్ ధర రూ.7,800గా ఉంటుంది. రెడ్మి 5 ప్లస్ ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1080x2160 పిక్సెల్ రిజల్యూషన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ స్టోరేజ్ను విస్తరించుకునే సదుపాయం 12ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇక దీని ధర విషయానికి వస్తే భారత మార్కెట్లో సుమారు రూ. 9,700గా ఉంటుందని అంచనా. -
ఆ ఫోన్ సేల్ నేటి నుంచే..
బెజెల్-లెస్ డిస్ప్లేతో విడుదలైన షావోమి ఎంఐ మిక్స్ 2 తొలిసారి భారత్లో విక్రయానికి వచ్చింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్లలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. రూ.35,999కు గత వారంలోనే ఈ స్మార్ట్ఫోన్ భారత్లో విడుదలైంది. వన్ప్లస్ 5, నోకియా 8, ఎల్జీ జీ6 స్మార్ట్ఫోన్లకు పోటీగా ఎంఐ మిక్స్2ను షావోమి మార్కెట్లోకి తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ కార్డుతో కొనుగోలుచేస్తే 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ను, ఒకవేళ ఫోన్ పే ద్వారా కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్బ్యాక్ను, యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్నారు. ఎంఐ. కామ్లో అయితే కంపెనీ 12 నెలల పాటు ఉచితంగా హంగామా మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. ఎంఐ మిక్స్2 ఫీచర్లు... 5.99 అంగుళాల డిస్ప్లే 2.4 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ/8జీబీ ర్యామ్ 64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ, వాయిస్ఓవర్ ఎల్టీఈ -
షావొమి మేక్ ఇన్ ఇండియా ఫోన్ ఆవిష్కరణ నేడు
వైజాగ్లో కార్యక్రమం; పాల్గొంటున్న చంద్రబాబు హైదరాబాద్: చైనాకు చెందిన షావొమీ కంపెనీ భారత్లో తయారు చేసిన తొలి ఫోన్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వైజాగ్లో ఆవిష్కరించనున్నారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఏపీ కార్యక్రమం కింద ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరగనున్నదని హైదరాబాద్లో విడుదలైన ఒక పత్రికా ప్రకటన పేర్కొంది. ఈ కార్యక్రమంలోనే షావొమీ కంపెనీ తన భారత విస్తరణ ప్రణాళికలను వెల్లడించనున్నదని సమాచారం. ఈ కార్యక్రమంలో షావొమీ ఇండియా సీఈఓ మను జైన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. షావొమీ వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ కూడా పాల్గొంటారు. వైజాగ్లో షావొమీ హోర్డింగ్ కాగా మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న షావొమీ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో తన ప్లాంట్ను ఏర్పాటు చేసే అవకాశం వుందంటూ పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. విశాఖ పట్టణం విమానాశ్రయం వద్ద మేక్ ఇన్ ఇండియా లోగోతో షావోమి కంపెనీ ఒక హోర్డింగ్ను ఏర్పాటు చేయడం, ఫేస్బుక్లో కూడా ఒక పోస్ట్ వెలువడడం దీనిని బలపరుస్తున్నాయని పీటీఐ పేర్కొంది. విశాఖ పట్టణం విమానాశ్రయం అరైవల్స్ దగ్గర ‘గుడ్ మార్నింగ్ వైజాగ్ ! భారత్లో ఒక అడుగు ముందుకు వేస్తున్నాం అంటూ షావోమి వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బరా ఫొటోతో ఉన్న హోర్డింగ్ వెలిసింది. ఇదే హోర్డింగ్ ఫోటోను ఆదివారం ట్విటర్లో పోస్ట్ చేసిన హ్యూగో, ‘గుడ్ మార్నింగ్ వైజాగ్, వుయ్ ఆర్ టేకింగ్ ఏ బిగ్ లీప్ ఇన్ ఇండియా’ అంటూ ట్వీట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలు చైనా కంపెనీలు ఆసుస్, మోటొరొలా, జియోనిలు భారత్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఇదే బాటలో షావోమి కూడా ప్రయత్నాలు చేస్తోంది. -
భారత్ కోసం షియోమి ఎంఐ 4ఐ స్మార్ట్ఫోన్
ధర రూ.12,999 - ఈ నెల 30 నుంచి అందుబాటులోకి న్యూఢిల్లీ: షియోమి కంపెనీ భారత మార్కెట్ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మి 4ఐ స్మార్ట్ఫోన్ను గురువారం ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ.12,999గా నిర్ణయించామని షియోమి వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా తెలిపారు. ఈ నెల 30 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. దీనికోసం గురువారం నుంచే ఫ్లిప్కార్ట్లో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. వచ్చే నెల నుంచి హాంగ్కాంగ్, తైవాన్, సింగపూర్, మలేసియా, ఇండోనేషియాల్లో ఈ ఫోన్ను అందుబాటులోకి తెస్తారు. భారత వినియోగదారుల అవసరాలు, అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ను రూపొందించామని బర్రా తెలియజేశారు. ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఎంఐయూఐ సాఫ్ట్వేర్పై పనిచేసే ఈ డ్యూయల్ సిమ్ ఫోన్లో 5 అంగుళాల హెచ్డీ ఓజీఎస్ ఐపీఎస్ డిస్ప్లే, 2 జీబీ ర్యా మ్, 16 జీబీ మెమరీ, 13 మెగా పిక్సెల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4 జీ సపోర్ట్, 3,120 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం ఈ ఏడాది చివరికల్లా కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ భారత్లో డేటా సెంటర్ను ఏర్పా టు చేస్తామని హ్యుగో బర్రా చెప్పారు. దీనికి ఎంత మొత్తం వెచ్చిస్తున్నామన్నది వెల్లడించకపోయినా దీనికోసం షియోమి భారీ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయనున్నదని సమాచారం. -
'మెరుపు' కథలు!
⇒ మొబైల్ ఫోన్ అమ్మకాల్లో ‘ఫ్లాష్’ వ్యూహం ⇒ సెకన్ల వ్యవధిలోనే వేలకు వేల విక్రయాలు అంతా ప్రచార వ్యూహమే: పోటీ కంపెనీలు ⇒ వాస్తవ అమ్మకాలు తక్కువే ఉంటాయని వ్యాఖ్యలు ⇒ కస్టమర్లకు కొంత లాభం... కొంత నష్టం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లాష్ సేల్... అంటే మెరుపు సేల్ అన్న మాట. కంపెనీలు చెబుతున్న లెక్కలు చూస్తుంటే నిజంగానే ఈ ఫోన్లన్నీ మెరుపు వేగంతో అమ్ముడయిపోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మెరుపు లెక్కలన్నీ నిజమా! కాదా? అనే విషయమై ఎన్నెన్నో సందే హాలున్నాయి. ఎందుకంటే కంపెనీలు చెబుతున్న లెక్కలకు మరే ఇతర ఆధారాలూ లేవు కనక. నిజానికి ఈ ఫ్లాష్ సేల్ను తొలుత పరిచయం చేసింది షియోమీ కంపెనీయే. ఆ తరవాత లెనోవో, ఒన్ప్లస్ ఒన్, మైక్రోమ్యాక్స్, మోటోరోలా... ఇలా ఫ్లాష్ మార్గాన్ని ఎంచుకుంటున్న కంపెనీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రకమైన మార్కెటింగ్ వ్యూహంతో వాటికి పలురకాలుగా లాభం కలుగుతోంది తప్ప ఎలాంటి నష్టమూ లేదు. కాస్తోకూస్తో నష్టపోయేదెవరైనా ఉంటే ఆ ఫోన్ కోసం... ఆ ఫ్లాష్ సేల్ కోసం ఎదురు చూసీ చూసీ విసిగిపోయే వినియోగదారుడే!! అదెలాగో చూద్దాం. పక్కా మార్కెటింగ్ వ్యూహం... ఆన్లైన్ రిటైల్లో ఫ్లాష్ సేల్ అనేది కొత్త మార్కెటింగ్ వ్యూహం. ఒక ఉత్పాదనను ప్రకటించిన తేదీలో ఎక్స్క్లూజివ్గా ఏదైనా వెబ్సైట్లో... అదీ ముందుగా పేర్లు నమోదు చేసుకున్న కస్టమర్లకు మాత్రమే విక్రయించటమనేది ఈ విధానం. మొబైల్ ఫోన్ల విషయంలో ఈ సేల్ చాలా పాపులర్ అయింది. కొన్ని రోజుల ముందు నుంచీ ఫ్లాష్ సేల్ తేదీ వరకు ఇదుగో అదుగో అంటూ ఆ మొబైల్ను ప్రచారం చేస్తారు. ప్రధానంగా ఆన్లైన్, సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఉత్పత్తికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఫలానా సంఖ్యలో యూనిట్లు అందుబాటులో ఉంటాయని చెబుతూ... అప్పటికే ఆ సంఖ్యను మించిన రిజిస్ట్రేషన్లు వచ్చాయని కస్టమర్లను ఊరిస్తుంటారు. దీంతో సహజంగానే ఆ ఉత్పత్తి పట్ల ఉత్సుకత పెరుగుతుంది. ప్రచారం తారస్థాయిని చేరుకుంటుంది. నిజానికి ఫ్లాష్ సేల్ సందర్భంగా నిజంగా ఎన్ని యూనిట్లను విక్రయిస్తున్నారనేదానికి ఒక లెక్కాపక్కా లేదు. ఉదాహరణకు 10వేల మంది రిజిస్టర్ చేసుకున్నపుడు 100 ఫోన్లు మాత్రమే విక్రయిస్తే సహజంగానే మిగతా 9,900 మందికీ ఆ ఫోన్ దొరకదు. అది దొరకలేదన్న ప్రచారంతో ఆ ఫోన్కు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. దానికోసం ఎదురుచూసేవారి సంఖ్యా అదే స్థాయిలో పెరుగుతుంది. ఇలా మూడునాలుగు సార్లు ఉత్సుకత సృష్టించి... చివరకు ఒకేసారి భారీ ఎత్తున ఫోన్లు విక్రయిస్తున్నారు. అప్పుడు అందరికీ దొరుకుతున్నాయి. ఇక దానిపై పెద్దగా ఆసక్తి లేదనుకున్నపుడు దాన్ని నేరుగా విక్రయానికి పెడుతున్నారు. ఇలా చేయటం వల్ల మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారులకు లాభమేంటంటే... - ఉచితంగా... లేదా తక్కువ ఖర్చుకే కంపెనీలకు విస్తృతమైన ప్రచారం లభిస్తోంది. ఆ మోడళ్లపై విపరీతమైన ఉత్సుకత ఏర్పడుతోంది. - కృత్రిమమైన డిమాండ్ను సృష్టించటం ద్వారా సదరు వినియోగదారుడు అదే ధరలో అంతకన్నా మంచి ఫీచర్లున్న ఇతర ఫోన్లు దొరుకుతున్నా... వాటివైపు వెళ్లకుండా తమ ఫోన్ కోసమే ఎదురు చూసేలా చేయగలుగుతున్నారు. - కంపెనీలకు మరో లాభమేంటంటే స్టాక్ ఉండకపోవటం. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు ఎన్ని వచ్చాయన్నది ముందే తెలుస్తుంది కనక... వాటికన్నా తక్కువ ఫోన్లనే తెచ్చి అందుబాటులో ఉంచుతున్నారు. సహజంగానే సరుకు మిగలదు. ‘‘ఉత్పత్తి అయి బయటకు వచ్చిన ఫోన్లలో ఏ ఒక్కటి అమ్ముడుపోకుండా మిగిలిపోయినా అది కంపెనీకి నష్టమే. ఫ్లాష్ సేల్ వల్ల అలాంటి నష్టాలు ఉండటం లేదు. ముందే డిమాండ్ తెలుస్తుంది కనక దానికన్నా తక్కువ యూనిట్లే అందుబాటులోకి తెస్తున్నాం’’ అని ఒన్ ప్లస్ ఒన్ కంపెనీ ప్రతినిధి ఇటీవల ‘బ్లూమ్బర్గ్’ వార్తాసంస్థతో వ్యాఖ్యానించటం ఈ సందర్భంగా గమనార్హం. - రిజిస్ట్రేషన్ల ద్వారా వినియోగదారుల డేటా కంపెనీలకు అందుతోంది. వారి మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు తమ దగ్గరుంటాయి కనక తాము తెచ్చే ఏ కొత్త ఉత్పత్తి తాలూకు సమాచారాన్నయినా సదరు వినియోగదారులకు పంపటానికి, తమ ఉత్పత్తులను పుష్ చేయడానికి ఇది ఉపకరిస్తోంది. వినియోగదారులు నష్టపోతున్నదిలా.. - వినియోగదారుడికి జరుగుతున్న నష్టమేంటంటే ఒక ఫోన్ ముందే మార్కెట్లోకి వస్తే దాని పనితీరు ఎలా ఉందన్నది సమీక్షలు చూసో, తెలిసినవారు చెబితేనో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే దాన్ని కొంటారు కూడా. కానీ తొలి ఫ్లాష్ సేల్ సమయంలో ఎవ్వరికీ వేరొకరి సమీక్షలు చూసే అవకాశం ఉండదు. కేవలం కంపెనీ ఇస్తున్న సమాచారంపై ఆధారపడి కొనాల్సిందే. అంతా ఒకేసారి కొంటారు కనక ఉత్పత్తి బాగాలేకుంటే కొన్నవారంతా నష్టపోతారు. - ఒక ఉత్పత్తి కోసం వారాల తరబడి ఎదురుచూడటమనేది... ఒకరకంగా ఎప్పటికప్పుడు ఎంచుకుని కొనుక్కునే హక్కును కోల్పోవటం కిందే లెక్క. అదే ధరలో దాంతో సమానమైన ఫీచర్లో, అంతకన్నా ఎక్కువ ఫీచర్లో ఉన్న ఫోన్ను వెతుక్కుని కొనుక్కునే అవకాశం ఉన్నా... ఫ్లాష్ ప్రచారం కారణంగా అదే మోడల్ కోసం ఎదురు చూడటం... అప్పటికి దొరక్కుంటే మళ్లీ తరువాతి తేదీ కోసం వేచి చూడటం చేయాల్సి వస్తోంది. ఇవీ ఫ్లాష్ వాస్తవాలు... ఇక ఫ్లాష్ సేల్ వాస్తవాల్లోకి వస్తే మైక్రోమ్యాక్స్ ఫ్లాష్ సేల్లో భాగంగా జనవరి 13న ‘యురేకా’ మోడళ్లను తొలిసారి విక్రయించినప్పుడు చాలా మంది కస్టమర్లకు ఎర్రర్ పేజీ దర్శనమిచ్చింది. ఇతర కంపెనీల ఫ్లాష్ సేల్ సమయంలోనూ ఇలాంటివే చోటు చేసుకున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ గతేడాది ‘బిగ్ బిలియన్ డే’ సేల్ జరిపినపుడు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియంది కాదు. పేజీ తెరుచుకోకపోవటం, తెరుచుకున్నా పేమెంట్ వరకూ వెళ్లకపోవటం, వెళ్లినా ఆర్డర్ ఓకే కాకపోవటం వంటి పలు సమస్యలు తలెత్తాయి. దీనికి ఫ్లిప్కార్ట్ క్షమాపణలు చెప్పింది కూడా. ఒకే సమయంలో వేలమంది ప్రయత్నించిన సందర్భాల్లో చాలా వెబ్సైట్ల విషయంలో ఇలాగే జరుగుతుంది. అదేం అసహజం కాదుకూడా. ఇవి ప్రత్యేకమైనవేమీ కావు... ఇదంతా మార్కెటింగ్ వ్యూహం. ఇలా ఫ్లాష్ సేల్లో విక్రయిస్తున్న ప్రతి మోడలూ ప్రత్యేకమైనదేమీ కాదు. ఒక ఫోన్ కొనుక్కోవడానికి కస్టమర్ అన్ని రోజులపాటు వేచి చూడాల్సిన పని కూడా లేదు. ఫ్లాష్ సేల్లో విక్రయిస్తున్న మోడల్స్ను పోలిన ఫోన్లు మార్కెట్లో బోలెడన్ని దొరుకుతున్నాయి. కాబట్టే కొన్ని కంపెనీలు తమ ఫోన్లను ఎలాగైనా విక్రయించుకోవటానికి ఈ ఫ్లాష్ సేల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. - వై.గురు, సెల్కాన్ మొబైల్స్ సీఎండీ విలువ ఉంటేనే విక్రయం.. ఉత్పాదన కోసం కస్టమర్ను కొన్ని రోజులపాటు ఊరించటమంటే కృత్రిమ కొరత సృష్టించటమే. ఉపకరణాల అమ్మకానికి ఫ్లాష్ సేల్ చక్కని వేదిక. అయినప్పటికీ భారత్లో ఈ విధానం అన్ని సందర్భాల్లోనూ విజయవంతం కావడం కష్టమే. భారతీయులు విలువను చూస్తారు. తదుపరి ఫ్లాష్ సేల్లో విక్రయించే ఉత్పాదనలో మరిన్ని ఫీచర్లు జోడించారా లేదా అనేది కస్టమర్ బేరీజు వేసుకుంటాడు. కొత్తదనం కనిపిస్తేనే ఓకే చెబుతారు. - అరవింద్ వోరా, జియోనీ ఇండియా హెడ్ -
షియోమి నుంచి రెడ్ ఎంఐ 2 విడుదల
చైనా యాపిల్గా పేరొందిన షియోమి కంపెనీ కొత్తగా మరో రెండు డివైజ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెడ్ ఎంఐ2 అనే స్మార్ట్ ఫోన్తో పాటు.. ఎంఐ ప్యాడ్ టాబ్లెట్ పేరుతో మొట్టమొదటి టాబ్ను కూడా విడుదల చేసింది. వీటింలో రెడ్ ఎంఐ 2 ధరను రూ. 6999గా నిర్ణయించారు. దీని రిజిస్ట్రేషన్ గురువారం సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. ఫ్లిప్కార్ట్లో మార్చి 24వ తేదీన ఫ్లాష్ అమ్మకాలు ఉంటాయి. మొదటి విడతలో 30 వేల నుంచి 40 వేల ఫోన్లు అమ్మే అవకాశం ఉన్నట్లు షియోమి ఇండియా హెడ్ మను జైన్ చెప్పారు. ఇందులో 4.7 అంగుళాల డిస్ప్లే, క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్డ్రాగన్ 410 ప్రాసెసర్, 4జి డ్యూయల్ సిమ్ ఉంటాయి. వెనుక కెమెరా 8 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ కెమెరా 2 మెగాపిక్సెల్స్ ఉన్నాయి. ఇక ఎంఐ ప్యాడ్ ధరను రూ. 12,999గా నిర్ణయించారు. దీనికి 7.9 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా మార్చి 24నే అమ్మకానికి వస్తుంది. అయితే వీటిలో కేవలం వై-ఫై ఆధారంగానే నెట్ అందుబాటులోకి వస్తుంది. -
చైనా యాపిల్.. షియోమి వచ్చేసింది
న్యూఢిల్లీ: చైనా యాపిల్గా పేరు గాంచిన షియోమి కంపెనీ మంగళవారం భారత మార్కెట్లోకి అడుగిడింది. ఎంఐ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. చైనాలో బాగా ప్రాచుర్యం పొందిన ఎంఐ స్మార్ట్ఫోన్ను రూ.13,999కు అందిస్తోంది. వీటి విక్రయాలను ఈ నెల 22 నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ ఫోన్ల కొనుగోళ్లకు ముందస్తు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే మొదలయ్యాయని, ఈ నెల 21 వరకూ రిజిస్టర్ చేసుకున్న వారే ఎంఐ 3 కొనుగోళ్లకు అర్హులని వివరించింది. ఎంఐ స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలు ఆండ్రాయిడ్ కిట్క్యాట్ ఓఎస్ ఆధారంగా షియోమి కస్టమైజ్ చేసిన ఎంఐయూఐ ఓఎస్పై పనిచేసే ఈ ఫోన్లో 5 అంగుళాల ఫుల్ హెచ్డీ 1080పి ఐపీఎస్ డిస్ప్లే, 2.3 గిగా హెర్ట్జ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్, 800 ఏబీ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇం టర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3,050ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్లిప్కార్ట్తో ఒప్పందం ఉత్పత్తుల విక్రయాల కోసం షియోమి కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 35 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మరికొన్ని వారాల్లో రెడ్ఎంఐ 1ఎస్ స్మార్ట్ఫోన్ను, రెడ్ఎంఐ నోట్(ఫ్యాబ్లెట్)లను అందించనున్నామని తెలిపింది. 4.7 అంగుళాల రెడ్ఎంఐ 1ఎస్ ఫోన్ను రూ.6,999కు, 5.5 అంగుళాల డిస్ప్లే ఉన్న రెడ్ఎంఐ నోట్ను రూ.9,999కు విక్రయిస్తామని పేర్కొంది. షియోమి రెడ్ ఎంఐ 1 ఎస్ ఫోన్లో 4.7 అంగుళాల డిస్ప్లే, 1.6 గిగా హెట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1. 6 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇక రెడ్ఎంఐ నోట్ ఫ్యాబ్లెట్లో 5.5 అంగుళాల డిస్ప్లే, 1.7 గిగా హెర్ట్జ్మీడియా టెక్ ఆక్టకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. రానున్న నెలల్లో 4 కే అల్ట్రా హెచ్డీ టీవీలను, సౌండ్ బార్లను, పవర్ బ్యాంక్లనూ ఈ కంపెనీ భారత మార్కెట్లోకి తేనుంది.