redmi
-
రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్ఫోన్స్
-
మార్కెట్లోకి షావొమీ రెడ్మీ-14సీ 5జీ.. బడ్జెట్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ షావొమీ (Xiaomi) సరికొత్త 5జీ ఫోన్ను విడుదల చేయనుంది. రెడ్మీ -14సీ 5జీ (Redmi 14C 5G) పేరుతో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ స్మార్ట్ఫోన్ భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ తయారు చేశామని కంపెనీ ప్రతినిధి సందీప్ శర్మ తెలిపారుహైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లను వివరించారు. భారత్లో 5జీ స్మార్ట్ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కేవలం 16 శాతం మంది వినియోగదారులు మాత్రమే 5జీ ఫోన్లు కలిగి ఉన్నారని.. మరింత మంది అత్యధిక వేగంతో పని చేసే 5జీ ఫోన్లను అందుబాటులోకి తెచ్చే క్రమంలో భాగా షావొమీ రెడ్మీ-14సీని అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారు. స్టార్లైట్ బ్లూ, స్టార్డస్ట్ పర్పుల్, స్టార్గేజ్ బ్లాక్ పేరుతో ప్రత్యేకంగా డిజైన్తో కూడిన మూడు రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ లభిస్తుందని తెలిపారు.నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ డిజైన్..రెడ్మీ - 14సీ 5జీలో స్మార్ట్ఫోన్లో అత్యాధునిక స్నాప్డ్రాగన్ 4జెన్-2 ప్రాసెసర్ను ఉపయోగించారు. నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ (Processor) అర్కిటెక్చర్ కారణంగా సెకనుకు 2.5 జీబీబీఎస్ల వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత. 5జీ వేగాలను అందుకునేందుకు వీలుగా ఎక్స్-61 మోడెమ్ను ఏర్పాటు చేశారు. స్క్రీన్ సైజ్ 6.88 అంగుళాల హెచ్డీ (HD) డిస్ప్లే కాగా.. రెఫ్రెష్ రేటు 120 హెర్ట్ట్జ్. అలాగే డాట్ డ్రాప్ డిస్ప్లే కలిగి ఉండి.. గరిష్టంగా 600 నిట్స్ ప్రకాశాన్ని ఇస్తుంది.ఇక స్టోరేజీ విషయానికి వస్తే 12 జీబీల ర్యామ్ (RAM) (6జీబీ + అవసరమైతే మరో 6 జీబీ) కలిగి ఉంటుంది. 128 జీబీల రామ్ సొంతం. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఒక టెరాబైట్ వరకూ స్టోరేజీని పెంచుకోవచ్చు. 50 ఎంపీల ఏఐ-డ్యుయల్ కెమెరా వ్యవస్థతోపాటు 8 ఎంపీల సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావొమీ హైపర్ ఓఎస్పై పని చేస్తుంది.ధర.. అందుబాటులోకి ఎప్పుడు?రెడ్మీ 14సీ 5జీ ఈ నెల 10వ తేదీ నుంచి షావోమీ స్టోర్లతోపాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్లలోనూ అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ కలిగగిన ప్రాథమిక మోడల్ ధర రూ.9999లు కాగా.. స్టోరేజీ 128 జీబీ, మెమరీ నాలుగు జీబీలుండే ఫోన్ ధర రూ.10,999లు.. 6 జీబీ మెమరీ, 128 జీబీ స్టోరేజీ ఉన్న ఫోన్ ధర రూ.11,999లు అని సందీప్ శర్మ తెలిపారు. -
2024లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే (ఫొటోలు)
-
అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ త్వరలో మరో స్మార్ట్ఫోన్ సిరీస్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్మీ 12 4జీ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే తరహాలో రెడ్మీ 13 4జీ ఫోన్ను మార్కెట్కి పరిచయం చేయనుందంటూ పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.రెడ్మీ 13 4జీ ధర, కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే?6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్తో రెడ్మీ 13 4జీ ధర రూ.16,500 ఉండనుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.19,000గా ఉండనుందని తెలుస్తోంది.బ్లాక్,బ్లూ కలర్స్తో యూజర్లను అలరించనుంది.వాటికి అదనంగా పింక్, ఎల్లో కలర్స్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం.రెడ్మీ 13 4జీ డిజైన్స్ రెడ్మీ 13 4జీ డిజైన్స్ విషయానికొస్తే ఫోన్ టాప్ లెప్ట్ కార్నర్లో రెండు సర్కిల్ కెమెరా యూనిట్స్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లు ఉన్నాయి.ఫోన్ బాడీ గ్లోసీ ఫినీష్తో రానుంది.ఫోన్ ఛార్జర్ యూఎస్బీ టైప్-సీకి సపోర్ట్ చేస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్లాట్ డిస్ప్లే, థిక్ బెజెల్స్,ఫోన్ పై భాగంగా సెంటర్డ్ హోల్ పంచ్ కటౌట్, సెల్ఫీ కెమెరా సెన్సార్లు ఉన్నాయి.రెడ్మీ 13 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్లురెడ్మీ 13 4జీ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ సన్ స్క్రీన్, మీడియా టెక్ హీలియా జీ91 అల్ట్ రా, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, స్టోరేజ్ 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్, ఆండ్రాయిడ్ ఐపర్ ఓఎస్,108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,2 సెకండరీ సెన్సార్,ఫోన్ ముందు భాగంలో 13 మెగా పిక్సెల్ సెన్సార్తో విడుదల కానుందని పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
అదిరిపోయే ఫీచర్లతో.. భారత్లో రెడ్మీ ఏ3 విడుదల.. ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన స్మార్ట్ఫోన్ బ్రాండ్ రెడ్మీ సిరీస్లో రెడ్మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్మీ ఏ3ని తీసుకొచ్చింది. మూడు కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఫోన్ ధర రూ.7,299గా ఉంది. రెడ్ మీ ప్రీమియం ఫోన్లలో కనిపించే హాలో డిజైన్ ఈ బడ్జెట్ ఫోన్లలో కనిపిస్తుంది. రెడ్మీ ఏ3 ధర ఫిబ్రవరి 23 నుండి రిటైల్ అవుట్లెట్లలో లభ్యమయ్యే రెడ్మీ ఏ3 ధర 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299 ఉండగా.. 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,299, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,299 అందుబాటులో ఉంటుంది. రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ రెడ్మీ ఏ3 1650*720 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్ వాటర్డ్రాప్ స్టైల్ నాచ్ను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియా జీ36 చిప్సెట్తో 6జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్తో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం బడ్జెట్ స్మార్ట్ఫోన్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, కనెక్టివిటీ పరంగా రెడ్మీ ఏ3 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, డ్యూయల్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3లు ఉన్నాయి. 8ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08 ఎంపీ సెకండరీ సెన్సార్తో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాలను తీర్చడానికి 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఉంది. -
మొబైల్ ప్రారంభోత్సవంలో బిగ్బాస్ ఫేమ్ హిమజా’ సందడి (ఫొటోలు)
-
రెడ్మీ నోట్ 13 సిరీస్ వచ్చేది అప్పుడే.. ధర ఎంతంటే?
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెడ్ మీ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఇప్పటి వరకు విడుదలైన అన్నీ ఫోన్లు టెక్ ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. ఈ తుణంలో షావోమీ రెడ్మీ నోట్ 13 5జీ సిరీస్ను భారత్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. షావోమీ రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఫోన్లను సెప్టెంబర్లోనే చైనాలో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ మోడళ్లు 6.67 అంగుళాలు 1.5కే ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్లో మీడియా టెక్ డైమన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్ఓసీ, రెడ్మీ నోట్ 13 ప్రో స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 2 ఎస్ఓఎస్తో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్లను భారత్లో జనవరి 4, 2024న విడుదల చేయనున్నట్లు షావోమీ ఇండియా అధికారికంగా ట్వీట్ చేసింది. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ ధరలు ఎంతంటే? రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్ ప్రారంభ ధర (చైనా కరెన్సీ యువాన్లో ) రూ.13,900, రెడ్మీ నోట్ 13 ప్రో ప్రారంభ ధర రూ.17,400, రెడ్మీ నోట్ 13ప్రో ప్లస్ ప్రారంభ ధర రూ.22,800 ఉండగా భారత్లో సైతం ఇవే ధరల్లో అందుబాటులో ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక యూరప్లో రెడ్మీ నోట్ 13 ప్రో మోడల్ ధర రూ.40,700, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ రూ.45,000గా ఉంది. రెడ్మీ నోట్ 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ రెడ్మీ నోట్ 13 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో ఈ ఫోన్ రాబోతోంది. 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో 6.67-అంగుళాల 1.5కే హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేలను కలిగి ఉంది. ప్రో మోడల్ స్నాప్డ్రాగన్ 7 ఎస్ జెన్3 ఎస్ఓఎసీపై నడుస్తుంది. అయితే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మీడియాటెక్ డైమన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్ఓసీతో పనిచేస్తుంది. వెనిలా రెడ్మి నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీని కలిగి ఉంది. -
రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - సూపర్ ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్కు పరిచయం చేసింది. షావోమీ 12 సిరీస్ సూపర్ హిట్ కావడంతో.. లేటెస్ట్ సిరీస్ షోవోమీ 13పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సిరీస్లో రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడళ్లను సెప్టెంబర్ 22న చైనాలో లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈ సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. రెడ్మీ నోట్ 13 స్పెసిఫికేషన్లు 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉన్న రెడ్మీ నోట్ 13లో 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను అందిస్తుంది. దీంతో పాటు ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్ సౌకర్యం ఉండగా..ఫోన్ 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్లు ప్రో మోడల్లో 6.67-అంగుళాల 1.5కే హెచ్డీ ప్లస్ అమోలెడ్ ప్యానల్,120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్సెట్తో పాటు 16జీబీ ర్యామ్ 512జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్తో వస్తుంది. ఫోటోగ్రఫీ విభాగంలో నోట్ 13 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 200-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL హెచ్పీ3 ప్రైమరీ రియర్ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 16 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుండగా 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,100ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. రెడ్మీ నోట్ 13ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు ఈ రెడ్మీ నోట్ 13 ప్రో+ రేర్లో లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ షూటర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్, 16జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, 5జీ, వైఫై-6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ సైతం ఉన్నాయి. రెడ్మీ నోట్ 13, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ధరలు రెడ్మీ నోట్ 13, 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ఫోన్ ధర దాదాపు రూ. 13,900, 8జీబీ ప్లస్ 128 జీబీ, 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ల ఫోన్ ధరలు రూ. 15,100, రూ. 17,400గా ఉంది. 12జీబీ ప్లస్ 256 జీబీ ఫోన్ ధర రూ. 19,700గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెడ్మీ నోట్ 13 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ వేరియంట్ ఫోన్ల ధరలు రూ. 17,400, రూ. 19,700 వద్ద అందుబాటులో ఉన్నాయి. నోట్ 13 ప్రో 12జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ రూ. 22,000, 12జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 23,100కే కొనుగోలు చేయొచ్చు.హై-ఎండ్ ప్రో మోడల్ 16జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. రూ. 24,300గా ఉంది. -
కొత్త స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది. వివో వీ29 సిరీస్ (Vivo V29 Series) వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రియల్మీ జీటీ 5 (Realme GT 5) 2023 ఆగష్టు నెలలో రియల్మీ తన జీటీ 5 స్మార్ట్ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్కే వందల కోట్లు.. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఇన్ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ రెడ్మీ 12 5జీ (Redmi 12 5G) రెడ్మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి. -
రెడ్మీ నోట్ 12 5జీపై భారీ డిస్కౌంట్, రూ.12,999కే కొనుగోలు చేయొచ్చు!
ఈ ఏడాది జనవరిలో విడుదలైన 5జీ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 12 5జీ ఫోన్పై ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ షావోమీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటితో పాటు రెడ్మీ నోట్ 12ప్రో 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ రేట్లను సవరించింది. అమెజాన్, ఎంఐ.కామ్ డిస్కౌంట్లలో ఫోన్ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. విడుదల సమయంలో రెడ్మీ నోట్ 5జీ స్మార్ట్ఫోన్ 4జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.17,999 ఉండగా.. తాజాగా ఆఫోన్ ధరను వెయ్యిరూపాయలు తగ్గించింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.2,000 వరకు డిస్కౌంట్ను సొంతం చేసుకోవచ్చు. ఆ ఫోన్ ధర రూ.14,999కే తగ్గుతున్నట్లు షావోమీ కంపెనీ పేర్కొంది. కొనుగోలు దారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి ఈఎంఐ ఆప్షన్ను ఎంపిక, ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫోన్ను కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, మరో రెండు వేలు ఎక్ఛేంజ్ బోనస్ను పొందవచ్చు. ఇలా రూ.17,999 ఉన్న ఫోన్ ధర రూ.12,999కి తగ్గుతుంది. అలాగే, 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ రెడ్మీ నోట్ 12 5జీ ధర రూ.18,999 ఉండగా 8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఇప్పుడు ఆ రెండు వేరియంట్ ఫోన్ ధరల్ని షావోమీ తగ్గించడంతో బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి రూ.16,999, 18,999కే లభిస్తుంది. రెడ్మీ నోట్ 12 5జీ స్పెసిఫికేషన్లు రెడ్మీ నోట్ 12 5జీ (1,080*2,400) పిక్సెల్స్తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 5000 ఏఎంహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4జెనరేషన్ 1 ఎస్ఓఎస్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 128 జీబీ స్టోరేజ్, 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’.. అశ్నీర్ గ్రోవర్ దంపతులకు మరో ఎదురు దెబ్బ! -
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్!
తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు కొనాలని చూస్తున్న వారి కోసం మే నెలలో మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రియల్మీ (Realme), రెడ్మీ (Redmi) తమ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్లను మే నెలలో లాంచ్ చేశాయి. రియల్మీ నార్జో ఎన్53 (Realme Narzo N53)j, Redmi A2 సిరీస్ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. భారతదేశంలో Realme Narzo N53 ధర రూ. 8,999 వద్ద ప్రారంభమవుతుంది. Redmi A2 Plus ధర రూ. 8,499. వీటితోపాటు పోకో సీ51 (Poco C51), మోటో జీ13 (Moto G13), శాంసంగ్ గెలాక్సీ ఎం13(Samsung Galaxy M13) వంటి ఫోన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ నార్జో ఎన్53 Narzo N53 6.74 అంగుళాల పెద్ద డిస్ప్లే, 50MP మెయిన్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ధర రూ. 8,999. ఇందులో విశేషం ఏంటంటే ఐఫోన్ 14ప్రో (iPhone 14 Pro) లాంటి డిజైన్ ఉండటం. యాపిల్ డైనమిక్ ఐలాండ్ నాచ్ సిస్టమ్ ఇందులో ఉంది. రియల్ ఏ2 ప్లస్ Redmi A2 Plus అద్భుతమైన ఫీచర్లలో ముఖ్యమైనవి దాని డిజైన్, Android 13 Go ఎడిషన్ సాఫ్ట్వేర్. అలాగే ఇందులో అతిపెద్ద 5,000mAh బ్యాటరీని ఇస్తుంది. తక్కువ ర్యామ్, స్టోరేజ్ (2GB/32GB) చాలు, ఫింగర్ప్రింట్ రీడర్ అవసరం లేదు అనుకునే వారికి ఈ ఫోన్ సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ. 5,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. Redmi A2 స్టాండర్డ్ మోడల్. ఇందులో 2GB/64GB వేరియంట్ రూ.6,499, 4GB/64GB వర్షన్ రూ.7,499కి లభిస్తుంది. మోటరోలా జీ13 Motorola G13 ఫోన్ వేగవంతమైన 90Hz డిస్ప్లే, స్టీరియో స్పీకర్లతో వస్తుంది.డాల్బీ అట్మాస్ సౌండ్ను ఇది విడుదల చేస్తుంది. కంటెంట్ కోసం వినియోగించేవారికి ఈ ఫోన్ అనువుగా ఉంటుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 4GB/128GB వేరియంట్ ధర రూ.9,999. పోకో సీ51 Poco C51 భారత్లో ఏప్రిల్లోనే లాంచ్ అయింది. 4GB/64GB వేరియంట్ ధర ప్రారంభంలో రూ. 8,499 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 7,249లకే లభిస్తోంది. ఇది చూడాటానికి Redmi A2 ప్లస్ లాగే ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం13 Samsung Galaxy M13 ఒక సంవత్సరం పాతదే అయినా నేటికీ దీనికి మంచి ఆదరణ ఉంది. ఈ ఫోన్ 4GB/64GB వేరియంట్ ధర ఇటీవల రూ. 11,999 నుంచి రూ. 9,699కి తగ్గింది. దీంతో దీన్ని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. డెడికేటెడ్ అల్ట్రావైడ్ శక్తివంతమైన కెమెరా సెటప్, 6,000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇదీ చదవండి: Flipkart Big Bachat Dhamaal Sale: స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు.. ఫ్లిప్కార్ట్లో అదిరిపోయే డీల్స్! -
రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ
అతి తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది షావోమీ (Xiaomi). రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2 ప్లస్ (Redmi A2 Plus) ఫోన్లు భారత్లో అధికారికంగా విడుదలయ్యాయి. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! రెడ్మీ ఏ2 సిరీస్ గత సంవత్సరం వచ్చిన రెడ్మీ ఏ1 సిరీస్కు కొనసాగింపు. పైకి చూడటానికి ఒకేలా ఉన్నా ఏ2 సిరీస్లో మరికొన్ని హంగులు చేర్చారు. మరింత శక్తివంతమైన చిప్ను జోడించారు. తాజా ఆండ్రాయిడ్ ( Android 13 Go) ఎడిషన్ సాఫ్ట్వేర్ను జత చేశారు. ఇక రెడ్మీ ఏ2, ఏ2 ప్లస్ డిజైన్ పరంగా రెండూ ఒకే రకంగా ఏ2 ప్లస్ ఫోన్లో అదనంగా ఫింగర్ప్రింట్ రీడర్ ఫీచర్ ఉంటుంది. రెడ్మీ ఏ2 సిరీస్ ధర రూ. 5,999 నుంచి ప్రారంభమవుతుంది. మే 23 తర్వాత ఈ ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి. రేట్లు ఎంత.. ఎక్కడ కొనాలి.. ఆఫర్ల సంగతేంటి? రెడ్మీ ఏ2 2జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ.5,999. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.6,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్లో కూడా కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,499. ఇక రెడ్మీ ఏ2 ప్లస్ ధర రూ. 8,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్లో మాత్రమే వస్తుంది. సీ గ్రీన్, కామింగ్ ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్స్లో ఈ ఫోన్స్ లభిస్తాయి. ఈ ఫోన్లను ఆన్లైన్లో అయితే అమెజాన్, షావోమీ ఆన్లైన్ స్టోర్లో, అదే ఆఫ్లైన్లో అయితే ఎంఐ హోమ్ స్టోర్లతో పాటు కంపెనీ ఇతర రిటైల్ పార్టనర్ స్టోర్లలో మే 23 (మధ్యాహ్నం 12 తర్వాత) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే షావోమీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు ఈ ఫోన్ల కొనుగోలుపై రూ. 500 వరకు అదనపు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మోడళ్లపై 2 సంవత్సరాల వారంటీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకైతే ఈ ఫోన్లను హోం సర్వీస్లో అందించనున్నట్లు తెలిపింది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటర్డ్రాప్-స్టైల్ నాచ్తో 6.52 అంగుళాల 720p డిస్ప్లే MediaTek Helio G36 చిప్సెట్ 4GB ర్యామ్ 64GB ఎక్స్పాండబుల్ స్టోరేజ్ Android 13 Go సాఫ్ట్వేర్. వెనుకవైపు 8MP ప్రధాన సెన్సార్తో డ్యూయల్ కెమెరా సెటప్, ముందువైపు మరో 5MP కెమెరా 10W మైక్రో USB ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీ. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. -
బీ న్యూ మొబైల్స్ స్టోర్లో రెడ్మీ 12సి సిరీస్ ఫోన్లు
హైదరాబాద్: ప్రముఖ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్ స్టోర్ రెడ్మీ 12సీ, 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. సినీ నటి దక్ష నాగర్కర్ గురువారం రెడ్మీ 12సీ స్మార్ట్ఫోన్ను గ్రాండ్గా లాంచ్ చేశారు. ‘‘బీ న్యూ స్టోర్స్ అద్భుతమైన ఆఫర్లతో రెడ్ మీ 12సీ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకే అందిస్తుంది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని నాగర్కర్ కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్తో పాటు రెడ్మీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్కు షావోమి రెడ్ మి 12 సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. గత వారం యూరప్లో విడుదల చేసిన రెడ్మినోట్12 4జీతోపాటు, రెడ్మి12 సీనిక ఊడా ఇపుడు భారతదేశంలో తీసుకొచ్చింది. రెడ్మినోట్12 4జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అనే రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది రెడ్మినోట్12 4జీ ధర , లభ్యత 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16,999 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.14,999గా ఉంది. లూనార్ బ్లాక్, ఫ్రాస్టెడ్ ఐస్ బ్లూ సన్రైజ్ గోల్డ్ కలర్స్లో లభ్యం. అలాగే లిమిటెడ్ ఆఫర్ కింద కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై రూ. 1,000 తగ్గింపుకు అర్హులు. ఏప్రిల్ 6 నుండి ఎం స్టేర్లతోపాటు, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయంజ రెడ్మినోట్12 4జీ స్పెసిఫికేషన్స్ 6.67అంగుళాల పంచ్-హోల్ AMOLED FHD+ డిస్ప్లే | 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 685 చిప్సెట్ Android 13 ఆధారంగా MIUI 14 50+ 8+ 2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్కు 5,000mAh బ్యాటరీ రెడ్మి 12 సీ స్పెసిఫికేషన్స్ 6.71-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G85 SoC ఆండ్రాయిడ్ 12 OS 50 + 2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరాలు 5ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000W బ్యాటరీ రెడ్మి 12 సీ లభ్యత,ధరలు 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ధర : రూ. 8,999 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 10,999 ఏప్రిల్ 16నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ కార్డ్తో 500 తక్షణ తగ్గింపు -
Redmi : వావ్.. 32 అంగుళాల టీవీ కేవలం రూ.12 వేలు మాత్రమే!
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ కొత్త టీవీని విడుదల చేసింది. రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 (Redmi Smart Fire TV 32) పేరుతో భారత్లో లాంచ్ చేసింది. కేవలం రూ.11,999కే 32 అంగుళాల వేరియంట్ టీవీలో అమెజాన్ ఫైర్ ఓఎస్ని అందిస్తుంది. గతంలో రెడ్మీ పలు టీవీలను విడుదల చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్తో వచ్చేవి. భారత్లో రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రూ.13,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్, కార్డు ఆఫర్లు పోగా..రూ.11,999కే లభిస్తుంది. ఈ కొత్త స్మార్ట్ టీవీని మార్చి 21నుంచి రెడ్మీ అమ్మకాలు ప్రారంభించనుంది. ఇక ఈ టీవీ అమెజాన్, ఎంఐ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు పైన పేర్కొన్నట్లుగా రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ప్రస్తుతానికి 32 అంగుళాలు,హెచ్డీ (1366x768-పిక్సెల్) రిజల్యూషన్తో టెలివిజన్ ఫైర్ ఓఎస్ 7 ఆధారితమైనది. ఇందులో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి అమెజాన్ సొంత యాప్ల సపోర్ట్తో పాటు నెట్ఫ్లిక్స్, డిస్నీ+ హాట్స్టార్, యాపిల్ టీవీ, స్మార్ట్ టీవీ యాప్లు, స్ట్రీమింగ్ సేవలకు ఫైర్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం డాల్బీ ఆడియోకు సపోర్ట్గా 20డబ్ల్యూ స్పీకర్ సిస్టమ్ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, Redmi Smart Fire TV 32లో బ్లూటూత్ 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎయిర్ ప్లే, మిరా క్యాస్ట్(Miracast)లకు సపోర్ట్ ఇస్తుంది. రెండు హెచ్డీఎంఐ పోర్ట్లు, రెండు యూఎస్బీ పోర్ట్లు, ఏవీ ఇన్పుట్ సాకెట్లు, వైర్డు హెడ్ఫోన్ లేదా స్పీకర్ కనెక్టివిటీ కోసం 3.5ఎంఎం సాకెట్, వైర్డు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈథర్నెట్ పోర్ట్, యాంటెన్నా సాకెట్ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇది కాకుండా రెడ్మీఫైర్ టీవీలో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ని వినియోగించేందుకు వీలుగా టీవీ రిమోట్లో అలెక్సా బటన్ ఉంది. తద్వారా అమెజాన్ అకౌంట్తో కనెక్ట్ చేసిన ఐఓటీ, స్మార్ట్ హోమ్ పరికరాలను ఆపరేట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. రిమోట్లో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, నెట్ఫ్లిక్స్ కోసం హాట్కీలు కాకుండా ప్లేబ్యాక్కోసం ప్రత్యేక బటన్లు, మ్యూట్ బటన్లు ఉన్నాయి. -
Redmi Fire TV: కొత్త ఓఎస్తో, కొత్త కొత్తగా వచ్చేస్తోంది!
సాక్షి,ముంబై:బడ్జెట్ ధరల స్మార్టఫోన్లు, స్మార్ట్ టీవీలతో ఆకట్టుకున్న చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమికి చెందిన రెడ్మీ స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. ఇండియన్ మార్కెట్లో తొలిసారిగా ఫైర్ ఓఎస్తో సరికొత్త టీవీని పరిచయం చేసింది. ఈమేరకు షావోమీ ట్విటర్లో షేర్ చేసింది. రెడ్మీ ఫైర్ స్మార్ట్ టీవీ ఈ నెల (మార్చి) 14వ తేదీన లాంచ్ కానుంది. అమెజాన్కు చెందిన ఫైర్ ఓఎస్ 7 (Fire OS7)పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. రెడ్మీ ఫైర్ టీవీని లాంచ్ కోసం మైక్రోపేజీని క్రియేట్ చేసింది. అమెజాన్ భాగస్వామ్యంతో ఈ టీవీని షావోమీ రూపొందించింది. అమెజాన్ ద్వారా ఈ టీవీ అందుబాటులోకి రానుంది. రెడ్మీ ఫైర్ టీవీ ఫీచర్లు, అంచనాలు రెడ్మీ ఫైర్ టీవీ బెజిల్లెస్ డిజైన్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, మెటాలిక్ బాడీ డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ ఫోన్, ల్యాప్టాప్, టాబ్లెట్ టీవీ స్క్రీన్ కాస్టింగ్ కోసం మిరాకాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లే , అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగాఫైర్ ఓఎస్తో గ్లోబల్గా ఇటీవల షావోమీ ఎఫ్2 సిరీస్లో కొన్ని టీవీలను లాంచ్ చేసింది. 4K అల్ట్రా స్క్రీన్ రిజల్యూషన్, 43, 50, 55 అంగుళాల సైజుల్లో మెటల్ యూనీబాడీ డిజైన్తో వీటిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక ధర, ఇతర స్పెషికేషన్లపై లాంచింగ్ తరువాత మాత్రమే క్లారిటీ రానుంది. Experience the excitement of curtain raiser performances from the comfort of your home. Stay Tuned!#FireUp pic.twitter.com/mcQv20qN09 — Xiaomi TV India (@XiaomiTVIndia) March 2, 2023 -
10వేలకే స్మార్ట్టీవీ, రెడ్మీ స్మార్ట్టీవీ 32 ఉచితంగా పొందే లక్ మీదే!
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ షావోమీ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. 74వ గణతంత్ర సంవత్సరం సందర్భంగా, అధికారిక వెబ్సైట్ ప్రత్యేకమైన డీల్స్, ప్రమోషన్లను అందిస్తోంది. రోజువారీ 12 గంటలకు పరేడ్, 3 గంటలకు ఫ్లాష్ సేల్, ఎక్స్చేంజ్ అవర్ లాంటివి ప్రకటించింది. అంతేకాకుండా, వినియోగదారులు ప్లే అండ్ విన్ ఆఫర్ ద్వారా రెడ్మీ స్మార్ట్ టీవీ 32, రెడ్మి నోట్ ప్రోలాంటి అద్భుతమైన ఉచిత ఉత్పత్తులను గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. జనవరి 20 వరకు, 23న ఈ సేల్ అందబాటులో ఉంటుంది.ఈ సేల్లో షావోమీ స్మార్ట్ఫోన్లు స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, ఇతర ప్రొడక్టులు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇండస్ఇండ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పాటు యూపీఐ పేమెంట్లపై కూడా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్లో కొన్ని షావోమీ, రెడ్మీ, ఎంఐ టీవీలు మంచి తగ్గింపుతో స్మార్ట్టీవీలనుకొనుగోలు చేయవచ్చు. రెడ్మీ స్మార్ట్ టీవీ 32 హెచ్డీ రెడీ రెడ్మీ 32 ఇంచుల ఈ స్మార్ట్ టీవీ రూ.10,999గా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు. అంటే రూ.9,999కే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో సింగిల్ పేమెంట్లో కొంటే రూ.1,500 తగ్గింపు ఉంటుంది. పేటీఎం వ్యాలెట్, ఏదైనా యూపీఐ ద్వారా పేమెంట్లపై రూ.1,000 డిస్కౌంట్ లభ్యం. షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ రూ.12,499 ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ పేమెంట్లపై రూ.1,000, పేటీఎం వ్యాలెట్తో చెల్లింపులు చేస్తే మరో రూ.1,000, ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డు ఆఫర్లు వినియోగించుకుంటే ఈ 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. -
బీ న్యూలో రెడ్మీ నోట్ 12 5జీ సిరీస్ ఆవిష్కరణ
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్లలో రెడ్మీ నోట్ 12 5జీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఇక్కడ బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నటి ఈషా రెబ్బ ఈ ఫోన్ను ఆవిష్కరించారు. సంస్థ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్, రెడ్మీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబైల్ కొనుగోళ్లకు సంబంధించి ఈఎంఐ, జీరో ఫైనాన్స్ సౌలభ్యం అందుబాటులో ఉన్నట్లు సంస్థ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి! -
అమెజాన్ ఆఫర్: ఇలా చేస్తే రెడ్మీ ఏ1 స్మార్ట్ఫోన్ రూ.1000లోపు సొంతం చేసుకోవచ్చు!
కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా ? అయితే ఈ శుభవార్త మీ కోసమే. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్లో తన కస్టమర్లకు ఈ అద్భుత ఆఫర్ను తీసుకువచ్చింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న రెడ్మి స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపుని అందిస్తోంది. అమెజాన్ ప్రకటించిన ఆఫర్లన్నీ ఉపయోగిస్తే ఈ మొబైల్ వెయ్యి రూపాయలు లోపు చెల్లించి మన ఇంటికి తెచ్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం! రెడ్మి ఏ1 స్మార్ట్ఫోన్ .. ఇది మరో రకంగా బడ్జెట్ ఫోన్ అని చెప్పవచ్చు. అమెజాన్ వెబ్సైట్లో దీని ధర రూ. 8,999గా ఉంది. ఈ ధరపై 28 శాతం తగ్గింపు కూడా ఉంది. దీంతో తగ్గింపు పోను రూ. 6,499కే కస్టమర్లు కొనేయచ్చు. అంతేనా ఇది కాకుండా మరో అదిరిపోయే డీల్స్ కూడా ఉన్నాయి, వాటిపై ఓ లుక్కేద్దాం. ఈ ఫోన్పై బ్యాంక్ ఆఫర్ కింద రూ. 620 వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇలా మీకు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ఈఎంఐ రూ. 311 నుంచి ప్రారంభం అవుతోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ స్మార్ట్ఫోన్పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ. 6,100 వరకు ఈ తగ్గింపు ఉంటుంది. ఫైనల్గా రూ.1000 లోపే ఈ ఫోన్ మన సొంతం చేసుకోవచ్చు. తమ పాత ఫోన్ ఇచ్చి ఈ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పాలి. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీ ఫోన్ మోడల్, అది ఉన్న కండీషన్ ప్రాతిపదికన మీకు వచ్చే ఎక్స్చేంజ్ బోనస్ మారుతుంది. -
న్యూ ఇయర్ ధమాకా: జనవరిలో లాంచ్ కానున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే!
భారత్లో స్మార్ట్ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాకుండా 2022లో 5జీ సేవలు దేశంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో 5జీ టెక్నాలజీకి అనుగుణంగా వివిధ కంపెనీలు తన స్మార్ట్ఫోన్లను లేటెస్ట్ ఫీచర్లుతో తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇక ప్రస్తుతం కొత్త సంవత్సరం కావడంతో పలు బ్రాండెడ్ కంపెనీలు తమ ఫోన్లను గ్రాండ్గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వివిధ సెగ్మెంట్లలో అద్భుతమైన ఫీచర్స్తో స్మార్ట్ఫోన్లను తీసుకురానున్నాయి. ఈ జనవరిలో లాంచ్ కానున్న బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు వాటి ప్రత్యేకతలని తెలుసుకుందాం! Tecno Phantom X2 ►టెక్నో ఫాంటమ్ ఎక్స్2 (Tecno phantom X2) జనవరి 2న భారత్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇటీవలే ఫాంటమ్ X2 ప్రోతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ► ఫాంటమ్ X2 6.8 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే ►ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ► ఇందులో 64MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ► 5,160mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Poco C50 ►పోకో సీ 50 (Poco C50) ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్లో నడుస్తుంది కాబట్టి Poco ఇండియా ఇంటి నుండి సరసమైన స్మార్ట్ఫోన్గా కనిపిస్తోంది. ►ఈ స్మార్ట్ఫోన్ 6.52-అంగుళాల HD+ డిస్ప్లే ► 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ► వెనుకవైపు 8MP డ్యూయల్ కెమెరాలు, 5MP సెల్ఫీ కెమెరా ► ఇది ఫింగర్ప్రింట్ రీడర్, 5,000mAh బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంది. Samsung Galaxy F04 ►సాంసంగ్ నుంచి మరో సరసమైన ఫోన్, గెలాక్సీ ఎఫ్ 04 (Galaxy F04 )జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ► 6.5-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్ప్లే ► 8GB RAM వరకు MediaTek Helio P35 చిప్సెట్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ► 5,000mAh బ్యాటరీ సపోర్ట్ Redmi Note 12 series ►రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) సిరీస్ భారతదేశంలో జనవరి 5 న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సిరీస్లో రెడ్మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5G), రెడ్మీ నోట్ 12 ప్రో (Redmi Note 12 Pro), రెడ్మీ నోట్ 12 ప్రో+ ( Redmi Note 12 Pro+) ఫోన్లు ఉన్నాయి. ►రెడ్మీ నోట్ 12 ఈ సంవత్సరం బేస్ Redmi నోట్ ఫోన్కు 5G కనెక్టివిటీని తీసుకువస్తుంది. అయితే రెడ్మీ నోట్ 12 ప్రో + అత్యధికంగా 200MP ప్రధాన కెమెరా సిస్టమ్, 120W ఫాస్ట్ ఛార్జింగ్తో రానుంది. iQOO 11 ►ఐక్యూ 11 సిరీస్లో రెండు ప్రీమియం మోడల్స్ జనవరి 10న భారత్లో గ్రాండ్గా లాంచ్ కానున్నాయి. ఇందులో ఒకటి ఐక్యూ 11 కాగా , మరొకటి ఐక్యూ 11 ప్రో. ►144 Hz రిఫ్రెష్ రిఫ్రెష్ రేట్, ►2K రెజల్యూషన్తో 6.78 ఇంచెస్ E6 అమోలెడ్ డిస్ప్లే ►పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ► ట్రిపుల్ కెమెరా సెటప్తో రానుంది. ► 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్తో వస్తోంది. -
న్యూ ఇయర్ క్రేజీ ఆఫర్.. అదిరే ఫీచర్లున్న ఈ రెడ్మీ 5జీ స్మార్ట్ఫోన్ ధర తగ్గింపు!
ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ ఇండియా ఇటీవలే రెడ్మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G) స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల సంగతి తెలిసిందే. తాజాగా తన కస్టమర్లకు న్యూ ఇయర్ ఆఫర్గా ఈ స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెండు వేరియంట్లపై రూ.1,000 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం Mi.com, అమెజాన్ (Amazon)లో వెయ్యి రుపాయలు తగ్గింపు ధరతో... 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,999 ధరగా ఉంది. అంతకుముందు ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. Redmi Prime 5Gలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది డిస్ప్లేలో వాటర్డ్రాప్-స్టైల్ డిస్ప్లే నాచ్ను కలిగి ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5వాట్ ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. పవర్ఫుల్ నైట్ విజన్, పోర్ట్రైట్ మోడ్, మూవీ ఫ్రేమ్, షార్ట్ వీడియో, టైమ్ ల్యాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మెడో గ్రీన్, థండర్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ కలర్స్లో లభిస్తుంది. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్లు ద్వారా ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి ఈ హ్యాండ్సెట్ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,000 తగ్గింపు ఇస్తుండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ల ద్వారా చేసిన కొనుగోళ్లకు 750 తక్షణ తగ్గింపు అందిస్తోంది. అమెజాన్ నుంచి ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.2,000 నుంచి ప్రారంభం అవుతుంది. -
5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్లో అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘స్మార్ట్ఫోన్ అప్గ్రేడ్ డేస్’ పేరుతో డిస్కౌంట్ సేల్కు తెర తీసింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు స్మార్ట్ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. ముఖ్యంగా కొన్ని 5జీ మోడల్స్తోపాటు, వన్ప్లస్ 10 ప్రొ, ఐఫోన్ 14, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 సహా అనేక స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినవారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ లభ్యం. కనిష్టంగా రూ. 5,000 కొనుగోలు చేసిన వినియోగదారులు రూ. 1,000 వరకు (పది శాతం) తగ్గింపు పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ దారులు కనీసం రూ. 1,250 వరకు పది శాతం తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ రూ. 9,699కి లభ్యం. ఐక్యూ జీ6 లైట్ 13,999 కి లభిస్తుంది. రెడ్మీ ఏ1 డిస్కౌంట్ అనంతరం రూ. 6,119 కి లభిస్తుంది.రెడ్మీ 11ప్రైమ్ 5జీ రూ. 11,999, రెడ్ మీ నోట్ 11 రూ. 10,999లకు కొనుగోలు చేయ వచ్చు. ఒప్పో ఎఫ్ 21ఎస్ ప్రొ 5జీ: ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొ 5జీ రూ. 24,499కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ఆఫర్గా అదనంగా రూ. 3,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఇంకా ఒప్పో ఏ సిరీస్లో, ఒప్పో ఏ76, ఏ77 వరుసగా రూ. 15,490. రూ. 16,999కి అందుబాటులో ఉన్నాయి. లావా: ఇక స్వదేశీ బ్రాండ్, లవా బ్లేజ్ NXTని రూ.8,369కి సొంతం చేసుకోవచ్చు. అలాగే లావా జెడ్3 రూ.6,299కే లభ్యం. టెక్నో టెక్నో పాప్ 6 ప్రో రూ.5,579కి, టెక్నో స్పార్క్ 9 రూ.7,649కి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇటీవల తీసుకొచ్చిన పోవా 5జీ , టెక్నోకేమాన్ 19 మాండ్రియన్ వరుసగా రూ. 14,299 ,రూ. 16,999కి అందుబాటులో ఉంటాయి. -
‘రాత్రి మా ఆంటీ చనిపోయింది’, ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారా?
రాత్రి పూట స్మార్ట్ ఫోన్ వాడే అలవాటు ఉందా? నిద్రపోయే ముందు మొబైల్ను పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇటీవల కాలంలో చైనా స్మార్ట్ ఫోన్లు పేలుతున్న వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఓ స్మార్ట్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం మొబైల్ పేలిన ఘటన నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ రెడ్మీ 6ఏ ఫోన్ను వినియోగిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆర్మీలో విధులు నిర్వహించే ఆమె కుమారుడితో మాట్లాడి..ఆ ఫోన్ను పక్కనే పెట్టుకొని పడుకుంది. ఆ మరుసటి రోజు ఆమె అల్లుడు వచ్చి చూసే సరికి బాధితురాలు రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా కనిపించింది. దీంతో తన అత్త మరణంపై ఆమె అల్లుడు మంజీత్ స్పందించాడు. Hi @RedmiIndia @manukumarjain@s_anuj Yesterday in Night my Aunty found dead 😭, she was using Redmi 6A, she was sleeping & she kept the phone near her face on pillow side & after sometime her phone blast. It's a bad time for us. It's a responsibility of a brand to support🙏 pic.twitter.com/9EAvw3hJdO — MD Talk YT (Manjeet) (@Mdtalk16) September 9, 2022 ‘నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె రెడ్మీ 6ఏ వాడుతోంది. రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కనే దాన్ని పెట్టుకొని పడుకుంది. మధ్య రాత్రిలో అది పేలి మా అత్త చనిపోయింది. ఇది మాకు చాలా విషాదమైన సమయం. మాకు సాయం చేయాల్సిన బాధ్యత సదరు స్మార్ట్ ఫోన్ సంస్థపై ఉంటుంది’ అని అతను ట్వీట్ చేశాడు. అంతేకాదు పేలిన ఫోటోలు, రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయిన తన అత్త ఫోటోల్ని షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని రెడ్మీ కంపెనీ వెల్లడించింది. -
బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, ధర మాత్రం ఏడువేల లోపే!
సాక్షి,ముంబై: రెడ్మీ అందుబాటులో ధరలో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. క్లీన్ ఆండ్రాయిడ్ 12,హీలియో ఏ22 చిప్, వాటర్డ్రాప్-స్టైల్ నాచ్తో రెడ్మి ఏ1 పేరుతో దీన్ని లాంచ్ చేసింది.ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్ ధర రూ. 6,499గా ఉంచింది. సెప్టెంబర్ 9 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో రెడ్మి ఏ1 ధర, విక్రయ తేదీ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499. సెప్టెంబర్ 9నుంచి షావోమివెబ్సైట్, మై హోమ్, అమెజాన్ రిటైల్ అవుట్లెట్లలో లభ్యం. లేత ఆకుపచ్చ, లేత నీలం, నలుపు మూడు రంగుల్లో లాంచ్ అయింది. రెడ్మి ఏ1 స్పెక్స్, ఫీచర్లు 6.52 అంగుళాల 720p డిస్ప్లే 8 ఎంపీ రియర్కెమెరా 5 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 10W మైక్రో-యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ -
ఐఫోన్ ఇన్స్పిరేషన్తో..బోలెడన్ని ఫీచర్లతో బడ్జెట్ ఫోన్! ధర ఎంతంటే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఇన్స్పిరేషన్తో 'రెడ్మీ నోట్ 11ఎస్ఈ' ఫోన్ను డిజైన్ చేసింది. అంతేకాదు ఐఫోన్లో ఉన్న ఫీచర్లు ఈ కొత్త చైనా ఫోన్లో ఉన్నాయి. ధర విషయంలో ఐఫోన్ అంత కాస్ట్లీ కాకుండా బడ్జెట్ ధరనే నిర్ణయించింది. మైక్రో ఎస్డీ స్లాట్ వరకు అప్గ్రేడ్ చేసుకునేలా 64జీబీ స్టోరేజ్,మీడియా టెక్ హీలియా జీ95 చిప్ సెట్తో వస్తుంది. రెడ్మీ నోట్ 11ఎస్ఈ స్పెసిఫికేషన్లు 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.43అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, హోల్ పంచ్ కటౌట్తో 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2400*1080పిక్సెల్ రెజెల్యూషన్తో డిస్ప్లే,ఎంఐయూఐ తరహాలో కంటిపై ఒత్తిడి తగ్గించేందుకు రీడింగ్ మోడ్ 3.0, సన్లైట్ మోడ్ 2.0, 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ర్యామ్ అండ్ 64జీబీ యూఎఫ్ఎస్2.2 స్టోరేజ్తో మీడియాటెక్ హీలియా చిప్సెట్, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది దీంతో పాటు ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా, కెమెరా యాప్లో నైట్ మోడ్,ఏఐ బ్యూటీఫై, ఏఐ పోట్రేట్ వంటి మోడ్లు ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్,ఏఐ ఫేస్ అన్లాక్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ బ్యాండ్ వైఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెడ్మీ నోట్ 11ఎస్ఈ ధర 64జీబీ ర్యామ్ అండ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్మీ నోట్ 11ఎస్ ఫోన్ ధర రూ.13,499గా ఉంది. బ్లాక్,వైట్,బ్లూ కలర్స్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇక ఈ ఫోన్ ఆగస్ట్ 31 నుంచి షావోమీ వెబ్సైట్, ఫ్లిప్ కార్ట్లో లభ్యం అవుతుంది. ఈ ఫోన్తో పాటు రెడ్ మీ నోట్ 11 రెగ్యూలర్ (రూ.13,499),రెడ్మీ నోట్ 11 టీ 5జీ (రూ.15,999),రెడ్మీ నోట్ 11 ప్రో (18,999)ఫోన్లు సైతం అందుబాటులో ఉంటాయని రెడ్ మీ ప్రతినిధులు తెలిపారు. -
రెడ్మీ, షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్!
మీరు రెడ్మీ, షావీమీ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారా? కానీ, ఆ ఫోన్ బ్యాటరీలు డెడ్ అయ్యాయ్యా? ఛార్జింగ్ సరిగ్గా ఎక్కడం లేదా? లేదంటే ఛార్జింగ్ ఎక్కినా నిలవడం లేదా? అయితే మీకో శుభవార్త. షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త. యూజర్లు వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సమస్యల్ని పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు మందగించిన ఫోన్ల బ్యాటరీను మార్చి వాటి స్థానంలో కొత్త బ్యాటరీలను అమర్చుతున్నట్లు ప్రకటించింది. షావోమీ తన యూజర్లకు రూ.499కే పాత ఫోన్ల బ్యాటరీల స్థానంలో కొత్త బ్యాటరీలను అందిస్తున్నట్లు ట్విట్ చేసింది. మీ షావోమీ, రెడ్ మీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయినట్లు అనిపించినా, లేదంటే ఛార్జింగ్ ఎక్కకపోయినా మీ సర్వీస్ సెంటర్ని ఆశ్రయిస్తే తక్కువ ధరకే కంపెనీ బ్యాటరీలను అందిస్తామని ట్వీట్లో పేర్కొంది. బ్యాటరీ ఎప్పుడు రిప్లెస్ చేయాలి షావోమీ, రెడ్మీ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ ఛార్జింగ్ లైఫ్ టైమ్ ఉదాహరణకు 10 గంటల ఉంటుంది. కానీ ప్రతిరోజు పలు మార్లు ఛార్జింగ్ తగ్గిపోతుంటే బ్యాటరీ మార్చుకోవాలి. లేదంటే ఫోన్ ఛార్జింగ్ 100శాతం ఉండి నిమిషాల వ్యవధిలో 80-90కి పడిపోతే అప్పుడు మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చదవండి👉 జూన్లో విడుదల కానున్న 9 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
తక్కువ ధరకే, అదిరిపోయే రెడ్ మీ 5జీ స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ సబ్ బ్రాండ రెడ్మీ తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనుంది. రెడ్మీ 11 5జీతో రానున్న ఈ ఫోన్ భారత్ మార్కెట్లో జూన్ నెలలో విడుదల కానుండగా..ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉండగా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను రెడ్మీ డిజైన్ చేసింది భారత్ మార్కెట్లో జూన్ నెలలో విడుదల కానున్న ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ స్టోరేజ్ ఉండే వేరియంట్ ధర రూ.13,999 ధరగా ఉండనుంది. అయితే షావోమీ త్వరలోనే ఈ మొబైల్ గురించి మరిన్ని విషయాల్ని వెలడించనుంది. టీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
సూపర్ ఫీచర్స్తో షావోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్..! లాంచ్ ఎప్పుడంటే..?
భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ సిద్దమైంది. రెడ్మీ 10 సిరీస్లో భాగంగా రెడ్మీ 10 ఏ స్మార్ట్ఫోన్ను షావోమీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ భారత్లో ఏప్రిల్ 20న లాంచ్ కానుంది. రెడ్మీ10ఏ స్మార్ట్ఫోన్కు సంబంధించిన పలు వివరాలను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో టీజ్ చేసింది. Redmi 10A స్మార్ట్ఫోన్ను ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉండగా..ఇదే మోడల్ భారత్లో కూడా లాంచ్ కానుంది. ఇది Redmi 10 స్మార్ట్ఫోన్ స్ట్రిప్డ్ వెర్షన్ మాత్రమేనని తెలుస్తోంది. రాబోయే Redmi 10A స్మార్ట్ఫోన్ Redmi 10 కంటే చౌకగా ఉండే అవకాశం ఉంది. Redmi 10 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.10,999. 6GB RAM + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.12,999 గా ఉన్నాయి. అయితే భారత మార్కెట్లలో Redmi 10A ధరను ఇంకా వెల్లడి చేయనప్పటికీ, ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉండవచ్చునని తెలుస్తోంది. Redmi 10A 4GB RAM + 64GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక 3GB RAM + 32GB స్టోరేజ్ Redmi 10A బేస్ మోడల్ ధర సుమారు రూ. 8,999గా అంచనా వేయబడింది. Redmi 10A స్పెసిఫికేషన్లు(అంచనా) 6.53-అంగుళాల HD+ LCD డిస్ప్లే విత్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వాటర్డ్రాప్ నాచ్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ మీడియాటెక్ హెలియో జీ25 ప్రాసెసర్ పవర్వీ8320 జీపీయూ గ్రాఫిక్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4GB ర్యామ్+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 10W ఛార్జింగ్ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చదవండి: మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్..! -
బడ్జెట్ ధరలో రెడ్ మీ స్మార్ట్ఫోన్, అదిరిపోయే ఫీచర్లతో!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 50 ఎంపీ మెయిన్ కెమెరాను అందుబాటులోకి తెచ్చింది. రెడ్ మీ 10 ఫీచర్లు రెడ్ మీ10 స్మార్ట్ ఫోన్ 6.71 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 20.6:9 యాస్పెట్ రేషియోతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఓటీటీ ఫ్లాట్ఫామ్లో వీడియోస్ను హైయ్యస్ట్ రెజెల్యూషన్తో వీడియోలు చూసేందుకు వైడ్వైన్ ఎల్1 సర్టిఫికెషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో డిస్ ప్లే డిజైన్ చేసింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్, 6జీబీ ర్యామ్ 128జీబీ యూఎఫ్ఎస్ 2.2స్టోరేజ్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, ఫోన్ వెనుక భాగంగాలో 2ఎంపీ డెప్త్ సెన్సార్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. దీంతో పాటు మీరు ఎవరికైనా అర్జెంట్ కాల్ చేయాల్సి వస్తే ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీసి ఫోన్ను చూసి అన్లాక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేకమైన రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్తో మీరు ఫోన్ చూడకుండా జస్ట్ మీ చేతి వేళ్లను ఫోన్కు టచ్ చేస్తే చాలు. ఫోన్ అన్లాక్ అవుతుంది. ఐపీ సర్టిఫికేషన్ ను అందిస్తుంది. రెడ్ మీ 10 ధర రెడ్ మీ 10 స్మార్ట్ఫోన్ 4జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.10,999 ఉండగా.. 6జీబీ/128జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.12,999 గా ఉంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్పై ఈఎంఐ ఆప్షన్తో పాటు రూ.1000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ మార్చి 17న మార్కెట్లోకి విడుదల చేయగా... మార్చి 24 మధ్యాహ్నం 12గంటల నుంచి ఎంఐ.కామ్,ఫ్లిప్ కార్ట్, ఎంఐ స్టోర్తో ఆన్లైన్లో కొనుగోలు చేయోచ్చు. కాగా, ఈ ఫోన్ కరేబియన్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. చదవండి: ప్రీ బుకింగ్స్ బీభత్సం!! 12గంటల్లో 70వేల ఫోన్ల బుకింగ్స్! -
బడ్జెట్ ధరలో.. అదిరే ఫీచర్లతో రెడ్మీ కొత్త ఫోన్!
కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని మహమ్మారిని ఏం చేయలేకపోయింది. దీంతో గతేడాది దేశీయ మార్కెట్లో సుమారు 2లక్షల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 24శాతం వాటాతో భారత్లో టాప్ బ్రాండ్గా ఉన్న షావోమీ వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. తాజాగా షావోమీ రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. హోలీ సందర్భంగా మర్చి 17న దేశీయ మార్కెట్లో రూ.15వేల బడ్జెట్ ఫోన్ను విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్లిప్కార్ట్లో ఈ కొత్త ఫోన్ అమ్మకాలు ప్రారంభిస్తామని షావోమీ ప్రతినిధులు ప్రకటించారు. రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ►18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ►స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓఎస్ ప్రాసెసర్ ►18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ►ఫోన్ ముందు పై భాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ►50ఎంపీ మెయిన్ కెమరా సెన్సార్లు ►మ్యాక్రో ఫోటో గ్రఫీ కోసం 2ఎంపీ సెన్సార్లు చదవండి: ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్, అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్ ఫోన్!! -
ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..!
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెకండ్ హ్యాండ్ లేదా Refurbished స్మార్ట్ఫోన్లను ప్రత్యేక సేల్లో భాగంగా అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ సేల్లో మీకు నచ్చిన యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ Refurbished స్మార్ట్ఫోన్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ప్రీమియం యాపిల్ ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్ఫోన్ ధర రూ.49,999 అయితే, ఈ సేల్లో మీకు రూ.9,999లకు లభిస్తుంది. ఈ Refurbished స్మార్ట్ఫోన్లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేసినట్లు ఫ్లిప్కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు కొత్త మొబైల్స్ దీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ Refurbished గోల్డ్ కలర్ ఐఫోన్ 6ఎఎస్ 64జీబీ వేరియెంట్ కేవలం ₹10,899కు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్లో ఏ9 ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్ఫోన్ ధర రూ.49,999 అయితే, ఈ సేల్లో మీకు రూ.9,999లకు లభిస్తుంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 8 Refurbished యాపిల్ ఐఫోన్ 8 గోల్డ్ 64 జీబీ వేరియంట్ ₹17,999కు లభిస్తుంది. ఐఫోన్ 8లో 4.7 అంగుళాల డిస్ ప్లే, 12 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది ఏ11 బయోనిక్ ప్రాసెసర్ సహాయంతో పనిచేస్తుంది. Refurbished యాపిల్ ఐఫోన్ 7 ₹14,529కు అందుబాటులో ఉంది. ఇందులో ఏ10 ఫ్యూజన్ ప్రాసెసర్ ఉంది. గూగుల్ పీక్సెల్ 3 ఎక్స్ఎల్ 64జిబి ర్యామ్ గల సెకండ్ హ్యాండ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ ₹13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డి+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పీక్సెల్ 3ఏ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ ₹10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది. (చదవండి: లబోదిబో! హైదరాబాద్లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే!) -
అదిరిపోయే ఫీచర్లతో,రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్లు..ధర ఎంతంటే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్ మీ సిరీస్లో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. భారత్ వేదికగా జరిగిన లాంచ్ ఈవెంట్లో టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తూ రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్లో 5జీ రెడ్మీ నోట్ 11 ప్రో+, 4జీ రెడ్ మీ నోట్ ప్రో స్మార్ట్ ఫోన్లను మార్కెట్కు పరిచయం చేసింది. 4జీ రెడ్ మీ నోట్ 11 ప్రో , 5జీ నోట్ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు రెడ్ మీ నోట్ 11 ప్రో 4జీ, నోటీ 11 ప్రో ప్లస్ 5జీ ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే,120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపీ సెల్ఫీ కెమెరాకు పంచ్ హోల్ కటౌవుట్, 180 ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ స్నాపర్స్, 2ఎంపీ మైక్రో హెల్పర్, 2ఎంపీ డెప్త్ మాడ్యుల్స్ ఉన్నాయి. 5జీ షావోమీ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5జీ రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్తో రిలీజైతే.. 4జీ రెడ్మీ నోట్ 11 ప్రో మాత్రం ఇటీవల పాపులర్ అయిన మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్తో రిలీజైంది. 5జీ షావోమీ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, మిరాజ్ బ్లూ కలర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే టాప్ ఎండ్ 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.24,999 వరకు ఉంటుంది. ఇక ఈ ఫోన్ షావోమీ ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లాట్ఫారమ్లతో పాటు అమెజాన్ ఇండియా ద్వారా మార్చి 15నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 4జీ రెడ్ మీ నోట్ 11 4జీ రెడ్ మీ నోట్ 11 ప్రో స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, స్టార్ బ్లూ కలర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 17,999 నుంచి ప్రారంభం కానుండగా.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్ అమ్మకాలు మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. చదవండి: ఫ్లిప్ కార్ట్లో దిమ్మతిరిగే ఆఫర్లు, వాటిపై ఏకంగా 80శాతం డిస్కౌంట్లు!! -
వచ్చేశాయి..రెడ్మీ నోట్ 11 స్మార్ట్ఫోన్స్..! బడ్జెట్ ధరలో అద్బుతమైన ఫీచర్స్తో
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి కొత్త రెడ్మీ నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. గతేడాది రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్స్కు భారీ ఆదరణ వచ్చింది. రెడ్మీ నోట్ 11 సిరీస్లో ఇప్పటికే రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ఫోన్ రిలీజ్ కాగా, రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11ఎస్ మోడల్స్ను లాంచ్ చేసింది. ఈ రెండ స్మార్ట్ఫోన్స్ బడ్జెట్ ధరలో ఉండేలా రెడ్మీ రూపొందించింది. ఈ స్మార్ట్ఫోన్స్ రెడ్మీ నోట్ 11 మోటో జీ51, రియల్మీ 8 లాంటి మోడల్స్కు గట్టిపోటీ ఇవ్వనుంది. ధర ఎంతంటే..! రెడ్మీ నోట్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్స్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో రానున్నాయి. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499 ఉండగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది. హొరైజన్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్టార్బర్స్ట్ వైట్ కలర్స్లో కొనొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్స్ సేల్ ఫిబ్రవరి 11న సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్తో పాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్, ఎంఐ స్టూడియో, రీటైల్ ఔట్లెట్స్లో కొనుగోలు చేయవచ్చును. రెడ్మీ నోట్ 11 స్పెసిఫికేషన్స్ 6.43 అంగుళాల పుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 50 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ+ 2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా(రెడ్ మీ 11 ఎస్ స్మార్ట్ఫోన్లో 108 ఎంపీ రియర్ కెమెరా) 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 4జీ ఎల్టీఈ సపోర్ట్ బ్లూటూత్ 5.0 యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ చదవండి: గూగుల్ క్రోమ్ యూజర్లకు పెను ప్రమాదం..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..! -
పవర్ఫుల్ ర్యామ్తో రెడ్మీ నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్..! ధర ఎంతంటే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి రెడ్మీ నోట్ 10 సిరీస్లో భాగంగా మరింత పవర్ఫుల్ స్టోరేజ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 10ఎస్ స్మార్ట్ఫోన్లో పవర్ఫుల్ ర్యామ్ను అమర్చారు. 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. రెడ్మీ నోట్ 10ఎస్ 6జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ను ఎప్పుడో లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్ రెడ్మీ నోట్ 10ఎస్ వేరియంట్ కొనుగోలుదారులకు డిసెంబర్ 3 నుంచి అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 17,499గా ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ అధికారిక వెబ్సైట్ ఎంఐ. కామ్, అమెజాన్, ఎంఐ హోమ్స్ స్టోర్స్ కొనుగోలు చేయవచ్చును. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు తక్షణ డిస్కౌంట్ లాంచింగ్ ఆఫర్ను అందిస్తోంది. చదవండి: శాంసంగ్ నుంచి చౌవకైన 5జీ స్మార్ట్ఫోన్..! రెడ్మీ నోట్10ఎస్ ఫీచర్స్ 6.43-అంగుళాల పూర్తి-హెచ్డీప్లస్ అమ్లోడ్ డిస్ప్లే మీడియాటెక్ హెలియో జీ95 ప్రాసెసర్స్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 64 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 13ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ చదవండి: ఇది స్మార్ట్ఫోనా..ల్యాప్ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్..! -
షావోమీ స్మార్ట్ఫోన్ యూజర్లకు గుడ్న్యూస్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ పలు స్మార్ట్ఫోన్ యూజర్లకు త్వరలోనే గుడ్న్యూస్ను అందించనుంది. షావోమీ త్వరలోనే షావోమీ, రెడ్మీ స్మార్ట్ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ను తీసుకురానుంది. త్వరలోనే కొత్త MIUI 13 అప్డేట్ను షావోమీ విడుదలచేయనుంది. ఒక నివేదిక ప్రకారం..MIUI 13 అప్డేట్ పలు స్మార్ట్ఫోన్లతో సహా వచ్చే నెలలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా...ఈ నెలలోనే (డిసెంబర్ 13) న లాంచ్ ఈవెంట్ను షావోమీ హోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. లాంచ్ ఈవెంట్లో షావోమీ 12, షావోమీ 12ఎక్స్ మోడళ్లతో సహా నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు నిపుణుల భావిస్తున్నారు. ఈ స్మార్ట్ఫోన్స్ ఆండ్రాయిడ్ 12 కి బదులుగా ఆండ్రాయిడ్ 11తో రన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ వీటిలో MIUI 13తో రన్ అవుతాయని సమాచారం. కొద్దిరోజల తరువాత షావోమీ 12 స్మార్ట్ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 వచ్చే అవకాశం ఉంది. MIUI 13తో రన్ అయ్యే స్మార్ట్ఫోన్స్ ఏవంటే..! ఎంఐ మిక్స్4 ఎంఐ 11 అల్ట్రా ఎంఐ 11 రెడ్మీ కే40 ప్రో రెడ్మీ కే40 ఎంఐ 10ఎస్ ఎంఐ 11లైట్ 5జీ వీటిలో అప్డేట్ అయ్యే అవకాశం.! ఎంఐ 10 సిరీస్ స్మార్ట్ఫోన్స్ షావోమీ 11టీ రేంజ్ స్మార్ట్ఫోన్స్ షావోమీ సివీ షావోమీ మిక్స్4 షావోమీ మిక్స్ ఫోల్డ్ షావోమీ పాడ్5 ఎంఐ నోట్10 రెడ్మీ 9టీ, రెడ్మీ 9 పవర్ రెడ్మీ 10ఎక్స్ 5జీ, రెడ్మీ 10ఎక్స్ ప్రో,రెడ్మీ 10, రెడ్మీ 10 ప్రో భారత్లో ఇప్పటికే చాలా షావోమీ, రెడ్మీ స్మార్ట్ఫోన్లలో MIUI 12.5 అప్డేట్ను ప్రారంభించింది. దీంతో MIUI 13 అప్డేట్ రావాలంటే కొత్త సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఓఎస్కు, MIUI తేడా ఇదే..! సాధారణంగా అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది. షావోమీ లాంటి కంపెనీలు MIUI పేరుతో కస్టమైజ్డ్ వ్యూ, ఫ్రేమ్వర్స్క్, సెట్టింగ్స్ ఉంటాయి. MIUI అనేది యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు! -
కేవలం రూ.10 వేలకే..అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే
అసలే మంత్ ఎండింగ్. చేతిలో సరపడా డబ్బులు లేవు. కానీ బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలని ట్రై చేస్తున్నారు. అయితే మీ కోసం మార్కెట్లో రూ.10ల లోపు అదిరిపోయే ఫీచర్లతో బ్రాండెంట్ కంపెనీల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రియల్ మీ నార్జో 30ఏ రియల్ మీ నార్జో 30ఏ స్మార్ట్ఫోన్ ధర రూ.8,999. రియల్ మీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. 6.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంట్రన్నల్ స్టోరేజ్తో ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ను కలిగి ఉంది. 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్తో యూఎస్బీ సీ పోర్ట్ను వినియోగించుకోవచ్చు. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. మైక్రోమ్యాక్స్ నోట్ 1 'మేడ్ ఇన్ ఇండియా' మైక్రోమ్యాక్స్ నోట్ 1 బడ్జెట్ ధరలతో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోర్ ఫోన్ ధర రూ. 9,999గా ఉంది. మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్ 10,మీడియా టెక్ హాలియా జీ80 ప్రాసెసర్ను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో మరో రెండు సెన్సార్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 2ఎస్ ఉత్తర కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కు చెందిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 2ఎస్ ఫోన్ అందుబాటులో ఉంది. స్మార్ట్ఫోన్లో 6.5 అంగుళాల హెచ్డీప్లస్ ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ఎస్ఓఎస్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరాలు ఉన్నాయి. వెనుక సెటప్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీని ధర రూ. 9,499 ఉంది. మోటరోలా మోటో జీ10 పవర్ మోటో జీ 10..6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ (720×1,600 పిక్సెల్లు) మాక్స్ విజన్ డిస్ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ25 ఎస్ఓఎస్,13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది.5,000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. నోకియా సీ 20 ప్లస్ నోకియా సీ 20ప్లస్ 4,950ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, ఆక్టా కోర్ యూనిసోక్ ఎస్ఈ 9863ఏ ఎస్ఓఎస్తో పాటు 3జీబీ ర్యామ్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, కెమెరా వెనుక డ్యూయల్ సెటప్ ఉంది. రెడ్మీ 9 ప్రైమ్ రెడ్మీ 9 ప్రైమ్ ధర రూ. 9,999కే అందుబాటులో ఉంది. స్మార్ట్ఫోన్ 6.53 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్తో పనిచేస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో కూడిన క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది. -
అదిరే ఫీచర్లతో 5జీ ఫోన్, చేతులు కలిపిన జియో - షావోమీ
Xiaomi partnership with Jio for 5G phone: ఇండియన్ మార్కెట్లో సత్తా చాటుతున్న చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్ కోసం రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల విడుదలైన క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో షావోమీ సంస్థ 22 శాతం షిప్మెంట్తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఆ స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. మార్కెట్ షేర్ను పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వరుసగా 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. నవంబర్ 30న షావోమీ రెడ్ మీ నోట్ 11 సిరీస్ను రీబ్రాండ్ చేస్తూ..భారత్లో రెడ్ మీ నోట్ 11 టీ 5జీ ఫోన్ను విడుదల చేయనుంది. ఫోన్ విడుదల నేపథ్యంలో..ఆ ఫోన్ పనితీరును గుర్తించేందుకు షావోమీ..,జియోతో చేతులు కలిపింది. రెడ్ మీ నోట్ 11టీ 5తో పాటు భవిష్యత్లో విడుదల కానున్న రెడ్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ల పనితీరు, యూజర్ ఫ్రెండ్లీగా ఉందా' అనే విషయాల్ని గుర్తించేందుకు రిలయన్స్ జియో ఆధ్వర్యంలో 5జీ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. వివిధ సెన్సార్ల ద్వారా ట్రయల్స్ నిర్వహించి 5జీ యూజర్ల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే అంశాన్ని గుర్తిస్తారు. రెడ్మీ నోట్ 11టీ ఫీచర్లు రెడ్ మీ నోట్ 11తరహాలో రెడ్ మీ నోట్ 11టీ మీడియా టెక్ డైమెన్సిటీ 810తో అందుబాటులో ఉంది. రియల్ మీ 8ఎస్ కాన్ఫిగరేషన్ల లాగే 6జీబీ ర్యామ్ 128జీబీ, 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఎంట్రీ లెవల్ కాన్ఫిగరేషన్ లలో వస్తున్న ఫోన్ ధర రూ. 17,999 ఉండగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్లపై షావోమీ సంస్థ స్పందిస్తూ.. రెడ్మీ నోట్ 11 రీ బాండ్రే ఈ రెడ్మీ నోట్ 11టీ స్మార్ట్ ఫోన్ అని తెలిపింది. కానీ ఇది స్విఫ్ట్డిస్ప్లే, స్పీడ్ ఛార్జింగ్, ర్యామ్ బూస్టర్ వంటి ఫీచర్లు ఉన్న నెక్ట్స్ జెనరేషన్ రేసర్ ఫోన్ అని తెలిపింది. చదవండి: షావోమీ మరో సంచలనం, మాట్లాడేందుకు కళ్ల జోడు తెస్తోంది -
షావోమీ 'నెక్ట్స్ జనరేషన్ రేసర్' మామూలుగా ఉండదు, ఫీచర్లు అదిరిపోతాయ్..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ మరి కొద్ది రోజుల్లో 5జీ రెడ్మీ నోట్ 11టీ' ను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా రెడ్ మీ 11టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నెక్ట్స్ జనరేషన్ రేసర్' అంటూ అభివర్ణించింది. దీంతో రెడ్ మీ నోట్ 11టీ ధర, ఫీచర్లు, స్పెసికేషన్లు గురించి తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. రెడ్ మీ నోట్ 11టీ ఫీచర్లు, ధరలు రెడ్ మీ నోట్ 11తరహాలో రెడ్ మీ నోట్ 11టీ మీడియా టెక్ డైమెన్సిటీ 810తో అందుబాటులో ఉంది. రియల్ మీ 8ఎస్ కాన్ఫిగరేషన్ల లాగే 6జీబీ ర్యామ్ 128జీబీ, 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఎంట్రీ లెవల్ కాన్ఫిగరేషన్ లలో వస్తున్న ఫోన్ ధర రూ. 17,999 ఉండగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. రెడ్ మీ నోట్ 11టీ అంత స్పెషల్ ఎందుకో? నవంబర్ 30న విడుదల కానున్న5జీ రెడ్మీ నోట్ 11టీ' పై నెట్టింట్లో వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షావోమీ సంస్థ స్పందిస్తూ.. రెడ్మీ నోట్ 11 రీ బాండ్రే ఈ రెడ్మీ నోట్ 11టీ స్మార్ట్ ఫోన్ అని తెలిపింది. కానీ ఇది స్విఫ్ట్డిస్ప్లే, స్పీడ్ ఛార్జింగ్, ర్యామ్ బూస్టర్ వంటి ఫీచర్లు ఉన్న 'నెక్ట్స్ జెనరేషన్ రేసర్' ఫోన్ అని తెలిపింది. రెడ్ మీ 11 ప్రో సిరీస్తో పాటే విడుదల షావోమీ సంస్థ నవంబర్ 30న రెడ్ మీ నోట్ 11 సిరీస్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెడ్ మీ నోట్ 11ప్రో, రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్ తో పాటే రెడ్ మీ నోట్ 11టీ'ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రెడ్ మీ నోట్ 11ధరలు చైనాలో రెడ్ మీ నోట్ 11టీ 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.14,000 ఉండగా... 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.15,200, 8జీబీ ర్యామ్ స్టోరేజ్ ఫోన్ ధర 17,500, 8జీబీ ర్యామ్ 256స్టోరేజ్ ఫోన్ ధర రూ.19,900గా ఉంది. -
స్మార్ట్ ఫోన్పై అమెజాన్ బంపర్ ఆఫర్, ఈఎంఐ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే..!
దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైనా స్మార్ట్ సంస్థకు చెందిన బడ్జెట్ ఫోన్ రెడ్మీ 9 పవర్ పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రెడ్మీ 9 పవర్ ఫీచర్లు రెడ్మీ 9 పవర్ ఫీచర్ల విషయానికొస్తే 6.53 అంగుళాల హెచ్డీ ప్లస్ మల్టీ టచ్ కెపాసిటేటివ్ టచ్స్క్రీన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 4జీబీ ర్యామ్, 128 GB ఇంటర్నల్ మెమరీ 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక రెడ్ మీ 9లో ఉన్న కెమెరా ఫీచర్లు చూసుకుంటే 48ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా, అల్ట్రా వైడ్, మ్యాక్రోమోడ్ , పోట్రేట్ ,ఏఐ సీన్ రికగ్నైజేషన్, నైట్ మోడ్, హెచ్డీఆర్,ప్రో మోడ్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా,2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, డ్యూయల్ సిమ్ ప్లస్ డెడికేటెడ్ ఎస్ డీ కార్డ్ స్లాట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రాసెసర్తో ఆండ్రాయిడ్ వీ10 ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు హ్యాండ్స్ ఫ్రీ సంగీతం ఎంజాయ్ చేయడమే కాకుండా అలెక్సా నుంచే నేరుగా డయల్ చేయొచ్చు. రెడ్మీ 9 పవర్ ధర రెడ్మీ 9 పవర్ వాస్తవ ధర రూ.13,999. రూ.2500 డిస్కౌంట్తో రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.10,900కే పొందవచ్చు.రూ.541తో ఈఎంఐ ప్రారంభం కాగా..నోకాస్ట్ ఈఎంఐ సౌలభ్యం ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై యూపీఐ ఆఫర్లతో పాటు డిస్కౌంట్లు లభించనున్నాయి. చదవండి: షావోమీ మరో స్మార్ట్ ఫోన్ సిరీస్, ఫీచర్లు లీక్.. అదిరిపోయేలా -
షావోమీ మరో స్మార్ట్ ఫోన్ సిరీస్, ఫీచర్లు లీక్.. అదిరిపోయేలా
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం 'షావోమీ' మరో సిరీస్ 'షావోమీ 12' స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయనుంది. త్వరలోనే విడుదల కానున్న ఈఫోన్ ఫీచర్లు ప్రస్తుతం చైనాలో లీకయ్యాయి. లీకైన వివరాల ఆధారంగా ఈ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 870 ఫ్లాట్ ఫాం ఆధారంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఫోన్ సిరీస్లు ఏమై ఉంటాయనే విషయంపై షావోమీ అధికారికంగా ప్రకటించకపోయినా.. మార్కెట్ పండితులు అభిప్రాయం ప్రకారం..లీకైన స్నాప్ డ్రాగన్ 870 ప్లాట్ఫారమ్ ఆధారంగా రెండు ఫోన్లలో ఒకటి రెడ్ మీ, మరొకటి షావోమీ అని తెలుస్తోంది. షావోమీ, రెడ్మీ ఫీచర్లు షావోమీ విడుదల చేసే కొన్ని వెర్షన్ లు హై ఎండ్ ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. దీన్ని బట్టి లీకైన ఫోన్లలో స్నాప్డ్రాగన్ 870, 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నిక్లలో 67డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 33డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్నాయి. కెమెరాల విషయానికొస్తే 108 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెన్సార్, హార్మోన్ కార్డాన్ స్పీకర్లు, ఎక్స్ -యాక్సిస్ వైబ్రేషన్ మోటార్ ఉంటుందని భావిస్తున్నారు.మరోవైపు, రెడ్మి వెర్షన్లో స్నాప్డ్రాగన్ 870 చిప్, 6.6 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. -
మారుపేర్లతో అదరగొడుతున్న స్మార్ట్ ఫోన్, మరి ఇండియాలో..
చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ భారత్లో తన దూకుడును కొనసాగిస్తుంది. ఇప్పటికే స్మార్ట్ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న షావోమీ.. తాజాగా రెడ్మీ నోట్11 5జీ ఫోన్ను 'రెడ్మీ నోట్ 11టీ' పేరుతో ఇండియాలో విడుదల చేయనుంది. షావోమీ సంస్థ గతవారం చైనాలో రెడ్మీ నోట్ 11 సిరీస్ను లాంఛ్ చేసింది. వరల్డ్ వైడ్గా స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ రెడ్మీ నోట్ 11ను ఆయా దేశాల్లో మారు పేర్లతో విడుదల చేస్తోంది. చైనాలో రెడ్ మీ నోట్11గా విడుదల చేయగా..యురేపియన్ మార్కెట్లో పోకో ఎం4 ప్రో5జీగా విడుదల చేసేందుకు స్ధిమైంది. 'రెడ్మీ నోట్ 11టీ' ఫీచర్లు రెడ్మీ నోట్ 11 సిరీస్లో రెడ్మీ నోట్ 11 5జీ,రెడ్మీ నోట్11 ప్రో, రెడ్మీ నోట్11 ప్రో ప్లస్ మూడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా రెడ్మీ నోట్ 11 ప్రో, ప్రో ప్లస్లలో ఫాస్ట్ ఛార్జింగ్ తప్ప మిగిలిన అన్నీ ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. రెడ్మీ నోట్ 11 ప్రోలో 67వాల్ట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 5,160ఎంఏహెచ్ తో వస్తుంది. రెడ్మీ నోట్ 11ప్రో ప్లస్లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాల్ట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మూడు స్మార్ట్ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, పంచ్ హోల్ డిజైన్తో విడుదల కానుంది. చైనాలో రెడ్మీ నోట్ 11 సిరీస్ రూ.14,000 ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన ఫోన్ రెడ్మీ నోట్11 పేరుతో షావోమీ చైనాలో నిన్నటి నుంచి సేల్స్ ప్రారంభించింది.ఈ సేల్స్ ప్రారంభమైన గంటలోపు 500,000లక్షల ఫోన్లు అమ్ముడైన విషయం తెలిసిందే. భారత్లో సైతం షావోమీ విడుదల చేసిన రెడ్మీ సిరీస్ ఫోన్లు సేల్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవల భారత్లో విడుదలైన క్యూ3 (త్రైమాసిక) ఫలితాల్లో షావోమీ 22శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్ఫోన్లు రెడ్మీ9, రెడ్మీ9 పవర్, రెడ్మీ నోట్ 10, రెడ్మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్గా అగ్రస్థానంలో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. చదవండి: మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు -
సేల్స్ బీభత్సం..! గంటలో 5లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి..!
జాతీయ,అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా ఫోన్లు సత్తా చాటుతున్నాయి. మనదేశంలో స్మార్ట్ఫోన్ 3వ త్రైమాసిక(జులై,ఆగస్ట్,సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో షావోమీ సంస్థకు చెందిన రెడ్మీ 9 సిరీస్ ఫోన్లు ఈ ఏదాది అత్యదికంగా అమ్ముడైన ఫోన్లుగా సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేశాయి. తాజాగా అదే సంస్థకు చెందిన మరో ఫోన్ సేల్స్ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. సేల్ ప్రారంభమైన గంటలోపు 500,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు షావోమీ తెలిపింది. గంటలో 5లక్షల ఫోన్ సేల్స్ షావోమీ గత వారం రెడ్మీ నోట్ సిరీస్లో రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్11 ప్రో, రెడ్మీ నోట్ప్రో ప్లస్లను లాంఛ్ చేసింది. ఆఫోన్ సేల్స్ నేటి నుంచి చైనాలో ప్రారంభమయ్యాయి. అయితే సేల్స్ ప్రారంభమైన గంటలోపు 500,000లక్షల ఫోన్లు అమ్ముడైనట్లు షావోమీ తెలిపింది. ఫోన్ల అమ్మకాలు ప్రారంభమైన మొదటి 52 నిమిషాల 11 సెకన్లలో సుమారు 4 బిలియన్ యువాన్ల బిజినెస్ జరిగిందని, వీటిలో 1 నిమిషం 45 సెకన్లలో 2 బిలియన్ యువాన్లు బిజినెస్ జరిగినట్లు వెల్లడించింది. భారత్లో 20లక్షల ఫోన్ సేల్స్ ఇగ 'గిజ్మోచైనా' నివేదిక ప్రకారం..భారత్లో సైతం షావోమీ ఫోన్లు సేల్స్ భారీగా జరుగుతున్నాయి. ఈఏడాదిలో షావోమీకి చెందిన రెడ్ మీ నోట్ 10 విడుదలైన 3నెలల్లో ఒక్క భారత్లోనే 20లక్షల ఫోన్లు అమ్ముడైనట్లు గిజ్మోచైనా తన నివేదికలో పేర్కొంది. ఫోన్ ధరలు చైనాలో అమ్మకాలు జరుపుతున్న 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ రెడ్ మీ నోట్ 11 ధర రూ.14,000 ఉండగా.. 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఉన్న రెడ్ మీ నోట్ 11 ప్రో సుమారు రూ.18,700 గా ఉంది. రెడ్ మీ నోట్ 11ప్రో ప్లస్ ఫోన్ ధర రూ.22,200గా ఉంది. 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ ఉన్న రెడ్ మీ నోట్ 11 వైపో ఎడిషన్ ఫోన్ ధర రూ.31,500గా నిర్ణయించింది. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..! -
జియో నెక్ట్స్ ఫోన్ కొంటున్నారా.. అయితే ఇవి కూడా చూడండి!
దీపావళి పండుగా సందర్భంగా రిలయన్స్ జియో సంస్థ ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్ఫోన్గా పేర్కొన్న జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేయనున్నట్లు కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ఎప్పుడో లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ, చిప్ కొరత కారణంగా స్మార్ట్ఫోన్ వెంటనే అమ్మకానికి రాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29న జియో సంస్థ ఫోన్ ఫీచర్లు, ధరల్ని అధికారికంగా ప్రకటించింది. జియో ప్రకటించిన ఫోన్ ధర రూ.6,499 చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అలాగే, ఈఎమ్ఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడే చాలా మంది జియో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ ఈఎమ్ఐ ఆప్షన్ కింద ఎంచుకోవాలంటే ముందుగా రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని వారు ఇచ్చిన ఈఎమ్ఐ ఆప్షన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకుంటే రెడ్మీ 9ఏ, రియల్మీ సీ11 కంటే ఎక్కువ అవుతున్నట్లు పేర్కొంటున్నారు. (చదవండి: గ్రిడ్ 2.0 ఈవీ స్టేషన్స్ లాంచ్ చేసిన అథర్ ఎనర్జీ) ట్విటర్ వేదికగా జియో సంస్థను ప్రశ్నిస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ కంటే ఈ రెండింటిలో ఉత్తమ స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు తెలుపుతున్నారు. ప్రస్తుతం రెడ్మీ 9ఏ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,999గా ఉంది. అదే రియల్మీ సీ11 ధర రూ.6799గా ఉంది. మీరు గనుక జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇవి దాని కంటే ఉత్తమ స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. రెడ్మీ 9ఏ, రియల్మీ సీ11, జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్: 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 3,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్ ప్రగతి ఓఎస్ ధర - రూ.6,499 రెడ్మీ 9ఏ ఫీచర్స్: 6.53 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 5 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ధర - రూ.6,999 రియల్మీ సీ11: 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 5 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ధర - రూ.6,799 -
మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. పలు బ్రాండెడ్ ఫోన్లను ఎక్ఛేంజ్ ఆఫర్తో సగానికి పైగా తక్కువ ధరకే లభించేలా ఆఫర్లు అమలు చేస్తోంది. సుమారు రూ.40వేల ఖరీదైన ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్పై అన్ని రకాల రాయితీలు వర్తిస్తే కేవలం రూ. 12, 849కే సొంతం చేసుకోవచ్చు. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే 4,520ఎంఏహెచ్ బ్యాటరీ,క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్లు ఉండగా ..కెమెరా వెనుక భాగంలో ఉన్న 3కెమెరాలకు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్ను సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్తో అమెజాన్లో అందుబాటులో ఉన్న ఫోన్పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లు ఇలా ఉన్నాయి దేశంలో ఫెస్టివల్ సీజన్లో ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' పేరుతో భారీ ఆఫర్లను అందిస్తుంది. ఇందులో భాగంగా షావోమీ ఇండియా 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఫోన్ ధరల విషయానికొస్తే 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 ఉంది, ఈ మోడల్పై ఎక్సేంజీ ఆఫర్లో గరిష్టంగా రూ.25,250లను షావోమీ ఆఫర్ చేస్తోంది. మీ పాత మొబైల్ ఫోన్కి ఎక్సేంజీలో మ్యాగ్జిమమ్ అమౌంట్ వస్తే ఫోన్ ధర రూ.14,249కి వస్తుంది. అయితే ఇక్కడో మరో ఆఫర్ని కూడా పొందే వీలుంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా గరిష్టంగా మరోసారి రూ. 1,400ల వరకు డిస్కౌంట్ని పొందవచ్చు. దీంతో మొబైల్ చివరకు రూ.12,849లకే సొంతం చేసుకోవచ్చు. ఇదే మోడల్లో మరో వేరియంట్ 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్తో రూ.41,999గా ధరతో ఉంది. ఈ మొబైల్ ఫోన్పై గరిష్ట ఎక్సేంజీ రూ.16,250గా ఉంది. దీంతో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా గరిష్టంగా మరోసారి రూ.1,400ల వరకు డిస్కౌంట్ని పొందవచ్చు. అయితే 256 జీబీ వేరియంట్తో పోల్చితే 128 వేరియంట్ని ఎంపిక చేసుకోవడం ద్వారా తక్కువ మొత్తానికే ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. చదవండి: Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్ -
పవర్ ఫుల్ ఫాస్ట్ చార్జర్తో రానున్న రెడ్మి నోట్11 సిరీస్
ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రెడ్మీ ఈ నెల 28న ఒక ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రెడ్మి నోట్11 సిరీస్ స్మార్ట్ఫోన్ని ఆవిష్కరించనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్లో రెడ్మి వాచ్ 2 కూడా విడుదల కానుంది. రెడ్మి నోట్11 సిరీస్ పోస్టర్ నుంచి రాబోయే సిరీస్ డిజైన్ వెల్లడైంది. రెడ్మి నోట్11 సిరీస్లో చాలా ఫోన్లను ప్రారంభించవచ్చని సమాచారం. చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వీబోలో.. రెడ్మి నోట్11 సిరీస్ 120డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు కంపెనీ దృవీకరించింది. అలాగే, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో రానున్నట్లు పోస్ట్ చేసింది. రెడ్మి నోట్ 11 మొబైల్ మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్, రెడ్మి నోట్ 11 ప్రో మీడియాటెక్ డిమెన్సిటీ 920 ప్రాసెసర్, రెడ్మి నోట్ 11 ప్రో+ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్ ద్వారా పనిచేయనుంది. రెడ్మి నోట్11 సిరీస్ ఫోన్లు 120హెర్ట్జ్ డిస్ ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో వస్తాయని సమాచారం. వీటిలో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఫీచర్లు ఉన్నట్లు టెక్ బ్లాగ్ సినావిబో పేర్కొంది. (చదవండి: మరో మహత్తర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..!) -
రెడ్ మీ నోట్11 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్, లుక్ అదిరిపోయింది..!
Redmi Note 11 series: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ నోట్11 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది.న్యూ ఇయర్ సందర్భంగా రెడ్ మీ నోట్ 11 సిరీస్ ఫోన్లను తొలిసారి చైనాలో రిలీజ్ చేసి ఆ తర్వాత ఇండియాలో మార్చి నాటికి (అంచనా) విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో రెడ్ మీ నోట్ 11 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. ఆ లీకైన ఫోన్ ఫీచర్లు, వాటి ధరలు ఇలా ఉన్నాయి. రెడ్ మీ నోట్ 11ప్రో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్స్ చైనాకు చెందిన ప్రముఖ టెక్ బ్లాగ్ సినా వీబో (sina weibo) వివరాల ప్రకారం..5జీ రెడ్ మీ నోట్ 11ప్రోలో హైస్పీడ్, మెరుగైన ఫీచర్లు, సూపర్ పవర్ ఎఫిషెన్సీ (సామర్ధ్యం) కోసం మీడియా టెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓఎస్, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 8జీబీ ర్యామ్ 256జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్, 120 హెచ్డి ఆమ్లోడ్ డిస్ప్లేను అందిస్తుంది. ఈ ప్రోరియెంట్ లో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఫీచర్లు ఉన్నట్లు టెక్ బ్లాగ్ సినావిబో పేర్కొంది. రెడ్ మీ నోట్ 11ప్రో 5జీ ఫోన్ ధరలు రెడ్ మీ నోట్ 11ప్రో 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్తో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర చైనాలో ఇండియన్ కరెన్సీ ప్రకారం.రూ.18,600గా ఉంది. అదే 8జీబీ ర్యామ్ ఆప్షన్ తో 128జీబీ అండ్ 256జీబీ స్టోరేజ్ ఫోన్ ధరలు రూ.21,000, నుంచి రూ.23,300 మధ్యలో లభించనుంది. రెడ్ మీ నోట్ 11 5జీ స్పెసిఫికేషన్స్ రెడ్ మీ నోట్ 11 5జీ ఫోన్ 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనుంది. ఇక 120 హెచ్జెడ్ డిస్ప్లే,ఆమ్లోడ్ డిస్ప్లే, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా,13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియా టెక్ డైమన్సిటీ 810 ఎస్ఓసీ ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ మీ నోట్ 11 5జీ ఫోన్ ధరలు ప్రస్తుతం లీకైన ఫీచర్స్ ప్రకారం 6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్ ఉన్న ఫోన్ ధర రూ.14,000ఉండగా 8జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్ ఉన్న ఫోన్ ధర రూ.18,600గా ఉందని చైనా టెక్ బ్లాగ్ సినా వీబో తన కథనంలో పేర్కొంది. చదవండి: Xiaomi: షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్..ధర ఏంతంటే...! -
తక్కువ ధరల్లో స్మార్ట్టీవీ లాంచ్ చేసిన రెడ్మీ...!
భారత మార్కెట్లలోకి రెడ్మీ సరికొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్టీవీలు 32 అంగుళాల, 43 అంగుళాల సైజుల్లో ఉన్నాయి. రెడ్మీ లాంచ్ చేసిన స్మార్ట్టీవీలు ఆండ్రాయిడ్11 ఆపరేటింగ్ సిస్టమ్ కల్గి ఉంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 20 వాటా స్పీకర్స్, డాల్బీ ఆడియోను ఈ స్మార్ట్టీవీలు కలిగి ఉన్నాయి. 32-అంగుళాల వేరియంట్ ధర రూ .15,999 కాగా, 43-అంగుళాల వేరియంట్ ధర రూ .25,999గా రెడ్మీ నిర్ణయించింది. స్మార్ట్టీవీల అమ్మకాల తేదీని రెడ్మీ ఇంకా ప్రకటించలేదు. దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్టీవీలను రెడ్మీ విక్రయించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్మార్ట్టీవీలు ఎమ్ఐ. కామ్, అమెజాన్ సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. సేల్లో భాగంగా రెడ్మీ స్మార్ట్టీవీలపై అదనపు తగ్గింపుతో ప్రత్యేక ధరలకు అందించనుంది. రెడ్మీ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు 43ఇంచ్ స్మార్ట్టీవీ, 32 ఇంచ్ స్మార్ట్టీవీ హెచ్డీ డిస్ప్లే హెచ్డీఎమ్ఐ సపోర్ట్ యూఎస్బీ ఈథర్నెట్ సపోర్ట్ డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఆటో లో లేటెన్సీ మోడ్ -
పాపులర్ స్మార్ట్ ఫోన్, ధర ఐదోసారి పెరిగింది
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి మరోసారి రెడ్మీ నోట్ 10ను ధరను పెంచింది. రెడ్మీ నోట్ సిరీస్ అంటే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సిరీస్ విడుదలైన ప్రతీసారి ఆ ఫోన్ కొనుగోలు కోసం యూజర్లు ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి 16న రెడ్మీ నోట్ 10ను విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ ఫోన ధరను షావోమి పెంచింది. మొత్తంగా ఐదు నెలల కాలంలో ఈ ఫోన్ ధర రెండు వేల రూపాయలు పెరిగింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్ల తయారీ తగ్గిపోయింది. దీంతో స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిపై చిప్ల కొరత ప్రభావం పడుతోంది. ఫలితంగా ఫోన్ల ధరలు పెంచేందుకు స్మార్ట్ తయారీ కంపెనీలు వెనుకాడటం లేదు. చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్, ఫీచర్లు లీకయ్యాయి అప్పుడు రూ. 11,999లకే రెడ్మీ నోట్ 10 మార్కెట్లోకి వచ్చినప్పుడు 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఇప్పుడు ధర పెరిగిన అనంతరం ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గానూ ఉంది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.500 మేర పెరిగింది. రెడ్మీ నోట్ 10 ఫీచర్స్ నెట్వర్క్ టెక్నాలజీ : జీఎస్ఎం / హెచ్ఎస్పీఏ లాంచ్ డేట్ : మార్చి 4 డైమన్షన్ : 160.5 x 74.5 x 8.3 మిల్లీమీటర్ (6.32 x 2.93 x 0.33 అంగుళాలు) వెయిట్ : 178.8 గ్రాములు బిల్డ్ : ఫ్రంట్ గ్లాస్ (గొరిల్లా గ్లాస్ 3), ప్లాస్టిక్ బ్యాక్, ప్లాస్టిక్ ఫ్రేమ్ సిమ్ : సిమ్ డ్యూయల్ సిమ్ (నానో-సిమ్, డ్యూయల్ స్టాండ్-బై) డిస్ ప్లే : సూపర్ ఆమ్లోడ్, 450 నిట్స్ (టైప్), 1100 నిట్స్ (పీక్) సైజ్ : 6.43 అంగుళాలు, 99.8 cm2 (83.5% స్క్రీన్-టు-బాడీ రేషియో ) రిజల్యూషన్ :1080 x 2400 పిక్సల్స్, 20: 9 రేషియో ప్రొటెక్షన్ : కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఓఎస్ : ఆండ్రాయిడ్ 11, MIUI 12.5 చిప్సెట్ : క్వాల్కామ్ SDM678 స్నాప్డ్రాగన్ 678 (11 nm) సీపీయూ : ఆక్టా కోర్ (2x2.2 GHz క్రియో 460 గోల్డ్ అండ్ 6x1.7 GHz క్రియో 460 సిల్వర్) జీపీయూ : అడ్రినో 612 మెమరీ కార్డ్ స్లాట్ : మైక్రో ఎస్డీఎక్స్సీ ఇంటర్నల్ : 64జీబీ 4జీబీ RAM, 128జీబీ 4జీబీ ర్యామ్, 128జీబీ 6జీబీ ర్యామ్ క్వాడ్ : కెమెరా 48 ఎంపీ,ఎఫ్ /1.8, 26ఎంఎం సెల్ఫీ : కెమెరా సింగిల్ 13 ఎంపీ, ఎఫ్/2.5 -
రివర్స్ బ్యాటరీ ఛార్జింగ్ను సపోర్ట్ చేయనున్న రెడ్మీ కొత్త ఫోన్..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్మీ సిరీస్లో భాగంగా మరో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. రెడ్మీ 9 కు తదనంతర ఫోన్గా రెడ్మీ 10 ను షావోమీ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. కాగా విడుదలకు ముందే రెడ్మీ 10 సిరీస్ స్మార్ట్ఫోన్ స్పెసిఫీకేషన్లు ఎమ్ఐ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. కాగా ఈఫోన్ రివర్స్ బ్యాటరీ ఛార్జింగ్ను సపోర్ట్ చేయనుంది. ఈ నెల చివర్లో షావోమీ రెడ్మీ 10 భారత మార్కెట్లలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్మీ 10 మూడు స్టోరేజ్ వేరియంట్లతో రానుంది. 4జీబీ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లతో రానుంది. రెడ్మీ 10 కార్బన్ గ్రే, పెబ్బల్ వైట్, సీ బ్లూ కలర్స్లో ఉండనుంది. రెడ్మీ 10 ఫోన్ ధరలను షావోమీ ప్రకటించలేదు. స్మార్ట్ఫోన్ నిపుణుల ప్రకారం..రెడ్మీ 10 ప్రారంభ ధర రూ.8,999 నుంచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెడ్మీ 10 ఫీచర్లు డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 MIUI 12.5 6.5-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) డాట్ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ88 ఎస్ఓసీ 50 ఎమ్పీ రియర్ కెమెరా 8 ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18w ఫాస్ట్ ఛార్జింగ్ -
ఇండిపెండెన్స్డే ఆఫర్లు... తగ్గిన రెడ్మీ ఫోన్ల ధరలు
స్వాతంత్ర దినోత్సవ కానుకగా షావోమీ తన మొబైల్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. రీసెంట్గా మార్కెట్లో రిలీజైన మోడల్స్తో పాటు రన్నింగ్లో ఉన్న మొబైల్స్పై ఈ తగ్గింపును వర్తింప చేస్తోంది. ఈ మేరకు షావోమి తన ట్విట్టర్ పేజీ ద్వారా అధికారిక ప్రకటన జారీ చేసింది. ఎంఐ ఎక్స్ 11 5 జీ Xiaomi's Mi 11X 5G మొబైల్ ప్రస్తుతం మార్కెట్ ధర రూ.27,999లు ఉండగా ప్రత్యేక ఆఫర్ కింద రెండు వేలు తగ్గించారు. ఎంఐ 10టీ ప్రో 5జీ Xiaomi Mi 10T Pro ధర రూ. 39,999 ఉండగా ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద రూ. 36,999కి లభిస్తోంది. ఎంఐ 10ఐ Mi 10i మిడ్రేంజ్ సెగ్మెంట్లో ఎంఐ 10ఐ మొబైల్ని లాంచ్ చేసినప్పుడు ధర రూ.21,999 ఉండగా ఇప్పుడు రూ. 20,999కి తగ్గించింది. రెడ్మీ 9 Redmi 9 మొబైల్ ఫోన్ ధర రూ. 8,999 ఉండగా రూ. 1500 తగ్గింపు ప్రకటించింది. స్టార్ట్ టీవీపై కూడా స్వాతంత్ర దినోత్సవ తగ్గింపు ఆఫర్లను ఆగస్టు 5 నుంచి 9 వరకు షావోమీ అమలు చేస్తోంది. మొబైల్ ఫోన్లతో పాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి షావోమీ స్మార్ట్టీవీ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 7,500ల వరకు క్యాష్బ్యాక్ అమలు చేస్తోంది. దీంతో పాటు 20,000 ఎంఏహెచ్ పవర్బ్యాంక్పై రూ.500 తగ్గింపు అందిస్తోంది. Avail exciting offers on #MiSmartphones during the #BigSavingDays 📲 Up to ₹6,000 off on Exchange🤑 📲 Up to ₹2,500 Instant Discount and more Last day today! Shop now on @flipkart and save BIG! 😇 pic.twitter.com/ppREeLdcAD — Mi India (@XiaomiIndia) August 9, 2021 -
రెడ్ మీ నుండి ఫస్ట్ ల్యాపీ.. ఎలా ఉందో తెలుసా?
Xiaomi First Laptop: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ నేడు తొలిసారి రెడ్మీ ల్యాప్ట్యాప్ లను మార్కెట్లో విడుదల చేయనుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్ ట్యాప్ల వినియోగం పెరిగి పోతుండడంతో ఆయా టెక్ సంస్థలు వినియోగదారులకు అనుగుణంగా గాడ్జెట్స్ను అందుబాటులోకి తెస్తున్నాయి. యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా, షియోమీ సంస్థ 'రెడ్ మీ బుక్' పేరుతో రెండు మోడళ్లను ల్యాప్ ట్యాప్లను విడుదల చేస్తున్నట్లు అధికారంగా ప్రకటించింది. గతేడాది రెడ్ మీ బ్రాండ్ పేరుతో భారీ ఎత్తున పవర్ బ్యాంక్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ బ్రాండ్ను విడుదల చేసింది. ఈ ఏడాది స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. ఇప్పుడు అదే బ్రాండ్ పేరుతో ల్యాప్ ట్యాప్లను విడుదల చేయడం టెక్ మార్కెట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రెడ్ మీ బుక్ ల్యాప్ ట్యాప్ ఫీచర్స్ ప్రస్తుతం ఉన్న విండోస్ - 10 తో పాటు త్వరలో అప్ డేట్ కానున్న విండోస్ -11ను అప్ గ్రేడ్ చేసుకునే విధంగా రెడ్ మీ బుక్ ల్యాప్ట్యాప్ ను డిజైన్ చేశారు. దీంతో పాటు 15 అంగుళాల స్క్రీన్ సైజ్, 1920*1080 పిక్సెల్స్ రెజెల్యూషన్తో ఫుల్ హెచ్డీ డిస్ప్లే, వెబ్ క్యామ్ కోసం లైట్ బెజెల్స్ను ఏర్పాటు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, వీ 5.0 బ్లూటూత్, సీ టైప్ 3.1యూఎస్బీ, యూఎస్బీ టైప్ -ఏ,యూఎస్ బీ 2.0, ఆడియో జాక్, రెండు స్టెరో స్పీకర్స్ ఉన్నాయి. ఈ ల్యాప్ ట్యాప్లో మరో ఇంట్రస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇంటెల్ లెవెన్త్ జనరేషన్ లో ఐ3,ఐ5 ప్రాసెసర్ తో పనిచేయనుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్ (ఎస్ఎస్డీ), 65 వాట్ల ఛార్జర్, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10 గంటల పాటు వినియోగించుకోవచ్చేని రెడ్ మీ పేర్కొంది. కాస్ట్ ఎంత ఉండొచ్చు ప్రస్తుతం ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్లు అందుబాటులోకి వచ్చినా ధరపై షియోమీ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. టెక్ నిపుణులు మాత్రం రెడ్ మీ బుక్ ల్యాప్ ట్యాప్లు రూ.50వేల లోపు ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
త్వరలోనే రెడ్మీబుక్-15 లాంచ్..! ధర ఎంతంటే...!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రాకతో పాఠశాలలు, ఆఫీసులు పూర్తిగా క్లోజ్ అవ్వడంతో పిల్లలకు ఆన్లైన్ క్లాస్లు, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితమయ్యారు. దీంతో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ కొనుగోళ్లలో భారీగా వృద్ధి చెందింది. ల్యాప్టాప్స్ కొనుగోలు గణనీయంగా పెరగడంతో పలు దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలు ల్యాప్టాప్లపై దృష్టి సారించాయి. ప్రముఖ స్మార్ట్ఫోన్లల తయారీదారు షావోమీ కూడా ల్యాప్టాప్ ఉత్పత్తి రేసులో ముందు నిలుస్తోంది. తాజాగా షావోమీ రెడ్మీబుక్ 15 పేరిట మరో ల్యాప్టాప్ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ ల్యాప్టాప్ను ఆగస్టు 3 న భారత మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. రెడ్మీబుక్ 11th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది. రెడ్మీబుక్ 15 ప్రముఖ ల్యాప్ట్యాప్లు ఏసర్ స్విఫ్ట్ 3, ఆసుస్ వివోబుక్ తో పోటీ పడనున్నట్లుగా తెలుస్తోంది. రెడ్మీబుక్ ధర రూ. 50 వేల దిగువ ఉండొచ్చునని టెక్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. రెడ్మీబుక్ 15 ఫీచర్లు 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 11th జనరేషన్ ఇంటెల్ కోర్ i3 అండ్ i5 ప్రొసెసర్ 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నట్ స్టోరేజ్, 516 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ విత్ విండోస్ 10. డ్యూయల్ బ్యాడ్ వైఫై, బ్లూటూత్ వర్షన్ 5.0 యూఎస్బీ 3.1 టైప్ సీ, యూఎస్బీ టైప్-ఏ, యూఎస్బీ 2.0, హెచ్డీఏమ్ఐ, ఆడియోజాక్ పోర్ట్. 65w ఛార్జర్. -
ల్యాప్ ట్యాప్ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ బ్రాండ్ బాగుంటుందంట
వర్క్ఫ్రమ్ హోమ్, ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ కోసం మంచి ల్యాప్ట్యాప్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?! మనకి డెల్,హెచ్పీ,లెనెవో, ఆసుస్ ల్యాప్ ట్యాప్ల గురించి మాత్రమే తెలుసు. అయితే మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ల్యాప్ట్యాప్..పై వాటికంటే బాగుంటుందని టెక్ నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ రెడ్ మీ లేటెస్ట్ గా 5జీస్మార్ట్ ఫోన్లు రెడ్ మీ నోట్ 10 ఫ్యామిటీ, షియోమీ రెడ్ నోట్మీ 10టీ విడుదల చేసి వినియోగదారుల్ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే త్వరలో షియోమీ సంస్థ రూ.13,999వేరియంట్ తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ స్మార్ట్ ఫోన్ తో పాటు పవర్ బ్యాంక్స్, రెడ్ మీ ఆడియో, స్మార్ట్ టీవీ, ఫిట్నెస్ బ్రాండ్ 'రెడ్మీబూ' పేరుతో ల్యాప్ట్యాప్ను విడుదల చేయనున్నట్లు షియోమీ రియల్ మీ ఇండియా సీఈఓ మురళికృష్ణన్ తెలిపారు. అయితే దీని స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయనే విషయంపై చర్చించలేదు. త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది. షియోమి ల్యాప్ ట్యాప్లు షియోమి ల్యాప్ ట్యాప్లను విడుదల చేయడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో రెడ్మి నోట్బుక్14 హారిజోన్,రెడ్మి నోట్బుక్14 (ఐసి), రెడ్మి నోట్బుక్14, రెడ్మి నోట్ బుక్ 14 ఇ-లెర్నింగ్ ల్యాప్ట్యాప్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు, రెడ్మీ నోట్బుక్ ప్రో14, రెడ్మి నోట్బుక్ అల్ట్రా15 అనే రెండు కొత్త ల్యాప్టాప్లను విడుదల చేయడం ద్వారా కంపెనీ తన ల్యాప్టాప్ల అమ్మకాలు మరింత విస్తృతంగా జరిపేందుకు యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.రాబోయే ల్యాప్టాప్లు రెడ్మిబుక్ ప్రో 14 రీబ్రాండెడ్ వెర్షన్లుగా భావిస్తున్నారు. మరి త్వరలో విడుదల కానున్న రెడ్మీబూ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. చదవండి: ఇన్ స్టాగ్రామ్,ఈ సూపర్ ఫీచర్ గురించి మీకు తెలుసా?! -
అతి తక్కువ ధరకే షావోమీ నుంచి 5జీ ఫోన్...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ మొబైళ్ల తయారీ సంస్థ షావోమీ భారత మార్కెట్లోకి రెడ్మీ నోట్ 10టీ 5జీను మంగళవారం రోజున లాంచ్ చేసింది. షావోమి నుంచి రెడ్మీ బ్రాండ్తో భారత్లో రిలీజైన తొలి 5జీ స్మార్ట్ఫోన్. రెడ్మీ నోట్ 10 సిరీస్ నుంచి వచ్చిన ఐదో ఫోన్ రెడ్మీ నోట్ 10టీ 5జీ. రెండు రకాల స్టోరేజ్ వేరియంట్తో ఫోన్లను లాంచ్ చేశారు. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ వేరియంట్లతో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ నోట్ 10టీ 5జీ (4 జీబీ + 64 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ.13,999 ఉండగా, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ను జూలై 26 నుంచి అమెజాన్ , ఎమ్ఐ.కామ్, ఎమ్ఐ హోమ్ స్టోర్స్ నుంచి పొందవచ్చును. మొబైల్ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వర్తిస్తుంది. రెడ్ మీ 10టీ 5జీ ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి ప్లస్ హోల్-పంచ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12 మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 18వాట్స్ ఫాస్ట్ చార్జర్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
త్వరలో ఇండియా మార్కెట్లోకి రెడ్మీ నోట్ 10టీ!
రెడ్మీ నోట్ 10టీ త్వరలో భారతదేశంలో లాంఛ్ సిద్దంగా ఉన్నట్లు అమెజాన్లో టీజ్ చేసింది. ఇటీవలే రెడ్మీ నోట్ 10 5జీని పోకో ఎం3 ప్రో 5జీగా భారత మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు, నోట్ 10టీ మోడల్ కూడా భారతదేశానికి వస్తున్నట్లు కనిపిస్తోంది. పోకో ఎమ్3 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 10టీ, రెడ్మీ నోట్ 10 5జీ ఒకే విధమైన స్పెసిఫికేషన్లు కలిగి ఉన్నాయి. రెడ్మీ నోట్ 10టీని గత నెలలో రష్యాలో మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ స్పెసిఫికేషన్లతో వచ్చింది. ఈ ఫోన్ ఎలా ఉంటుందో టీజర్ లో స్పష్టంగా వెల్లడించనప్పటికీ, రెడ్మీ తీసుకొని రాబోయే మొబైల్ 'వేగంగా, ఫ్యూచరిస్టిక్ గా' ఉంటుందని టీజర్ లో పేర్కొంది. భారతీయ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారో అనే దానిపై ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ 4జీబీ + 128జీబీ స్టోరేజ్ మోడల్ సుమారు రూ.20,500కు తీసుకొని రావచ్చు. దీనిని బ్లూ, గ్రీన్, గ్రే, సిల్వర్ రంగులలో తీసుకొని రావచ్చు. రెడ్మీ నోట్ 10టీ ఫీచర్స్ 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి ప్లస్ హోల్-పంచ్ డిస్ ప్లేను ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12 మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 18డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
రెడ్మీ యూజర్లకు షాక్... ధరలు పెరిగే మోడల్స్ ఇవే
ఇండియాలో మెస్ట్ పాపులర్ మొబైల్ బ్రాండ్ షావోమీ తన యూజర్లకు వరుసగా షాక్లు ఇస్తోంది. రన్నింగ్లో ఉన్న మొబైల్ ఫోన్ల ధరలు ఒకదాని తర్వాత ఒకటిగా పెంచుకుంటూ పోతుంది. జూన్లో ధరల పెంపుకు తెర తీసిన షావోమీ.. అదే ట్రెండ్ని జులైలోనూ కంటిన్యూ చేస్తోంది. విడిభాగాల వల్లే షావోమీ సంస్థ గత మార్చ్లో రెడ్మీ నోట్ 10 సిరీస్ని రిలీజ్ చేసింది. ఆ వెంటనే నోట్ 10 ప్రో, నోట్ 10 ప్రో మ్యాక్స్ వేరియంట్లు రిలీజ్ చేసింది. ఈ మోడల్స్ సక్సెస్ఫుల్గా అమ్మకాలు సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా జూన్లో నోట్ 10, నోట్ 10 ప్రో ధరలను పెంచింది. ర్యామ్, స్టోరేజీ కెపాసిటీ ఆధారంగా రూ. 500ల నుంచి రూ. 1000 వరకు ధరలు పెంచేసింది. ఫోన్ తయారీలో ఉపయోగించే చిప్సెట్, డిస్ప్లే, డిస్ప్లే డ్రైవర్, బ్యాక్ప్యానెల్, బ్యాటరీ తదితర విడిభాగాల ధరలు పెరిగినందువల్లే తమ మొబైల్ ఫోన్ల ధరలు పెంచుతున్నట్టు షావోమీ ప్రకటించింది. పెంపు ఎంతంటే నోట్ 10 సిరీస్లో హై ఎండ్ వేరియంట్ అయిన నోట్ 10 ప్రో మ్యాక్స్ ధర పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం నోట్ 10 ప్రో మ్యాక్స్ 64 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్ ధర రూ. 18,990 ఉండగా, 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 20 వేల దగ్గర ఉంది. హై కెపాసిటీ కలిగిన 8 జీబీ 128 స్టోరేజీ మోడల్ ధర రూ. 23,944గా ఉంది. ఈ మూడు వేరియంట్లలో ముందుగా 6 జీబీ 128 స్టోరేజీ మోడల్ ధర పెంపుకు సిద్ధమైంది. వీటితో పాటు మిగిలిన రెండు వేరియంట్లకు కూడా ధరల పెంపు తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరల పెంపు కనీసం రూ. 500ల నుంచి రూ. 1,500ల వరకు ఉండొచ్చని సమాచారం. -
Redmi 10 Series: రెడ్ మీ 10 సీరీస్ వచ్చేస్తుంది!
రెడ్ మీ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. రెడ్ మీ 10 సీరీస్ త్వరలో మనదేశం లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. షియోమీ దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రెడ్ మీ 9, రెడ్ మీ 9 ప్రైమ్, రెడ్ మీ 9 పవర్, రెడ్ మీ 9ఎ, రెడ్ మీ 9ఐ లకు వారసుడిగా రెడ్ మీ 10 సీరీస్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. చైనా కంపెనీ నేరుగా రెడ్ మీ 10 సీరీస్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పనప్పటికి వచ్చే నెల ప్రారంభంలో సిరీస్ ను ఆవిష్కరించవచ్చని ట్వీట్ లో సూచించింది. రెడ్ మీ ఇండియా ట్విట్టర్ లో "రెడ్ మీ రివల్యూషన్" అనే చిన్న క్లిప్ ను "#10on10" అనే హ్యాష్ ట్యాగ్ తో పంచుకుంది. రెడ్ మీ 10 సీరీస్ ను జూలై ప్రారంభంలో లాంచ్ చేయవచ్చు అని ఇది సూచిస్తుంది. ఈ సిరీస్ పై ఈ ట్వీట్ తప్ప ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. రెడ్ మీ 9 సీరీస్ లో రెడ్ మీ 9 ప్రైమ్ మొబైల్ ను గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో భారతదేశంలో తొలిసారిగా లాంఛ్ చేసింది. ఇలా వరుసగా ఒక్కో మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Brace yourselves for the #RedmiRevolution! 💫 Hitting your screens soon! ☄️ Watch this space for more #10on10 action. 🎥 pic.twitter.com/uFY6ri5SU2 — Redmi India - #RedmiNote10 Series (@RedmiIndia) June 28, 2021 చదవండి: లీకైన వన్ ప్లస్ నార్డ్ 2 కెమెరా, డిస్ప్లే ఫీచర్లు -
Amazon: మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. ఖరీదైన ఫోన్
ముంబై: సాధారణంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో అప్పుడప్పుడు మనం ఆర్డర్ చేసినవి కాకుండా వేరే ప్రొడక్ట్స్ రావడం చాలా సహజం. అయితే తాము ఆర్డర్ చేసిన వస్తువు కన్నా ఎక్కువ ఖరీదైనది వస్తే.. రిటర్న్ చేసే వారు చాలా తక్కువ మంది. ఎక్కడో ఒకరో, ఇద్దరో మాత్రం వాటిని రిటర్న్ చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అమెజాన్లో మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. అతడికి ఏకంగా రెడ్మీ నోట్ 10 ఫోన్ డెలివరీ వచ్చింది. దాంతో సదరు వ్యక్తి.. ఆ మొబైల్ని తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ముంబైకి చెందిన లోకేష్ దగ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అమెజాన్లో మౌత్వాష్ ఆర్డర్ చేశాడు. అయితే అతడికి రెడ్మీ నోట్10 డెలవరీ చేశారు. మౌత్వాష్ ఆర్డర్ చేశాను కాబట్టి మొబైల్ని రిటర్న్ చేయడానికి కుదరడం లేదంటూ అతడు ట్వీట్ చేశాడు. ‘‘హలో అమెజాన్ నేను # 406-9391383-4717957 కోల్గెట్ మౌత్వాష్ ఆర్డర్ చేశాను. దాని బదులుగా నాకు రెడ్మీ నోట్ 10 వచ్చింది. మౌత్వాష్ నిత్యవసర వస్తువు కాబట్టి యాప్లో రిటర్న్ పెట్టడానికి కుదరడం లేదు. నాకు వచ్చిన ప్యాకేజ్ మీద నా పేరే ఉంది. కానీ ఇన్వాయిస్ వేరేవారిది. నా దగ్గర నుంచి ఈ మొబైల్ తీసుకెళ్లి.. దాన్ని ఆర్డర్ చేసిన వారికి డెలవరీ చేయాల్సిందిగా నేను మీకు ఈమెయిల్ కూడా చేశాను’’ అంటూ ట్వీట్ చేశాడు. Hello @amazonIN Ordered a colgate mouth wash via ORDER # 406-9391383-4717957 and instead of that got a @RedmiIndia note 10. Since mouth was in a consumable product returns are restricted and am unable to request for return via the app(1/2) pic.twitter.com/nPYGgBGNSR — Lokesh Daga (@lokeshdaga) May 13, 2021 మే 13న చేసిన ఈ ట్వీట్కి ఇప్పటికే అనేక రీట్వీట్లు వచ్చాయి. అతడి నిజాయతీపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: అమెజాన్లో హార్డ్ డిస్క్ ఆర్డర్.. పార్సిల్ విప్పగానే షాక్! -
గేమింగ్ ప్రియుల కోసం రెడ్మీ సూపర్ ఫోన్!
చైనా: గేమింగ్ కిల్లర్ రెడ్ మీ కే40 సిరీస్లో కొత్త ఫోన్ రెడ్ మీ కే40 గేమింగ్ ఎడిషన్ ను చైనాలో లాంచ్ చేసింది. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో కొన్ని గేమింగ్ ఫీచర్లను షియోమీ తీసుకొచ్చింది. షోల్డర్ బటన్లు, మూడు మైక్లు, డాల్బీ అట్మాస్, జేబీఎల్ ఆడియో సపోర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. ఈ మొబైల్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్పై పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 30వ తేదీన చైనాలో జరగనుంది. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారో అనే విషయం తెలియదు. రెడ్మీ కే40 గేమింగ్ ఎడిషన్ ఫీచర్స్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెట్ రేట్ హెచ్డీఆర్10+ సపోర్ట్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా + 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా + 2 ఎంపీ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరా 5065 ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 1,999 యువాన్లు (సుమారు రూ.23,000) 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,199 యువాన్లు (సుమారు రూ.25,300) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,600) 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,500) 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,699 యువాన్లు (సుమారు రూ.31,100) చదవండి: 65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు! -
రెడ్మీ రికార్డు: రెండు వారాల్లోనే రూ.500 కోట్లు
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ రెడ్మీ రికార్డు సృష్టించింది. రెడ్మీ నోట్ 10 సిరీస్ మొదటి రెండు వారాల్లోనే భారతదేశంలో రూ.500 కోట్ల అమ్మకాలు జరిగినట్లు షియోమీ ప్రకటించింది. ఈ సిరీస్లో రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్ మూడు ఫోన్లు తీసుకొచ్చింది. షియోమీ ఈ నెల ప్రారంభంలో ఈ సిరీస్ను భారతదేశంలో ఆవిష్కరించింది. ప్రతి ఫోన్ వరుసగా మార్చి 16, మార్చి 17, మార్చి 18న ఫస్ట్ సేల్ కు వెళ్లాయి. షియోమీ ఒక ప్రెస్నోట్ ద్వారా ఈ ఫోన్లకు సంబంధించిన అమ్మకాల వివరాలను షియోమీ ప్రకటిచింది. మార్చి 16 ఫస్ట్ సేల్ నుంచి ఇప్పటి వరకు మొత్తంగా రూ.500 కోట్ల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా రెడ్మీ నోట్ 10 మాత్రమే మార్చి 16వ తేదీన అమ్మకానికి వచ్చింది. రెడ్మి నోట్ 10 ప్రో మార్చి 17న, రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్ మార్చి 18న అమ్మకాలు జరిగాయి. షియోమీ మొత్తం ఎన్ని యూనిట్లు విక్రయించిందో తెలపలేదు. కాబట్టి, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడు ఫోన్లలో ఏది అనేది అస్పష్టంగా ఉంది. అంచనా ప్రకారం, షియోమీ రెండు వారాల్లో 2,27,000 నుంచి 4,16,000 యూనిట్ల రెడ్మి నోట్ 10 సిరీస్ ఫోన్ల విక్రయించవచ్చు. చదవండి: రెడ్మి నోట్ 10 స్మార్ట్ఫోన్లు వచ్చేసాయ్! -
రెడ్మి నోట్ 10 స్మార్ట్ఫోన్లు వచ్చేసాయ్!
సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్మి నోట్ 10 సిరీస్ను చైనా మొబైల్ దిగ్గజం షావోమి భారత్లో విడుదల చేసింది. ఈ సిరీస్లో భాగంగా రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్లు లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 10 సిరీస్ ఫోన్ల ధరలు రూ .11,999 , రెడ్మి నోట్ 10 ప్రో రూ .15,999 , ప్రో మాక్స్ రూ .18,999 వద్ద ప్రారంభమవుతుంది. అత్యంత ఖరీదైన 8 జీబీ ర్యామ్, 128 జీబీ వెర్షన్ వెర్షన్ రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్ వేరియంట్ ధర రూ .21,999 గా కంపెనీ నిర్ణయించింది. రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్లో శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం2 108 ఎంపీ, 5 ఎంపి సూపర్ మాక్రో కెమెరాలను వెనుక భాగంలో అమర్చడం ప్రధాన హైలైట్గా నిలిచింది. ధరలు, అమ్మకం రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్: అమ్మకం మార్చి 18 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ధర రూ .18,999 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ధర రూ .19,999 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ధర రూ .21,999 రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్ ఫీచర్లు 6.67అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 1080x2400 పిక్సెల్స్రిజల్యూషన్ 732 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా 108+ 8+ 5+2 ఎంపీ రియర్ కెమెరా 5020 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి నోట్ 10 ప్రో: అమ్మకం మార్చి 17 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ .15,999 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ధర రూ .16,999 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ధర రూ .18,999 రెడ్మి నోట్ 10 ప్రో ఫీచర్లు 6.67 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 732 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 64+ 8+ 5+ 2 ఎంపీ రియర్ కెమెరా 5050 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి నోట్ 10: అమ్మకం మార్చి 16 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ .11,999 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ .13,999 రెడ్మి నోట్ 10 ఫీచర్లు 6.43 అంగుళాల డిస్ప్లే 678 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 1080x2400 పిక్సెల్స్ రిజ్యలూషన్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 48+8+2+2 ఎంపీ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
లీకైన రెడ్మీ నోట్ 10 సిరీస్ ధర, చిత్రాలు
రెడ్మీ నోట్ 10 సిరీస్ మొబైల్ రేపు (మార్చి 4) మనదేశంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ లో మూడు ఫోన్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రీమియం రేంజిలో రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్, మిడ్-రేంజ్ లో రెడ్మీ నోట్ 10 ప్రో, బడ్జెట్ రేంజిలో వనిల్లా రెడ్మీ నోట్ 10 తీసుకోని రావొచ్చు. అయితే విడుదలకు ఒక రోజు ముందు రెడ్మీ నోట్ 10 సిరీస్ లాంచ్, రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో ధర లీకైంది. రెడ్మీ నోట్ 10 భారతదేశం ధర ఆన్లైన్లో లీక్ కాగా, రెడ్మీ నోట్ 10 ప్రో గ్లోబల్ లాంచ్ ధర కూడా బయటకు వచ్చేసింది. యూట్యూబర్ సిస్టెక్ బన్నా ఒక వీడియోలో రెడ్మీ నోట్ 10 ధరతో పాటు రిటైల్ బాక్స్ చిత్రాన్ని లీక్ చేశారు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. 6జీబీ + 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ.15,999గా ఉంది. అయితే, సాధారణంగా రిటైల్ బాక్స్ ధర కంటే ఫోన్ సేల్ ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ధర రూ.13,999 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఇంకా తక్కువ ధర కలిగిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఇందులో తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే టిప్స్టర్ అభిషేక్ యాదవ్.. 6జీబీ + 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ గ్లోబల్ రెడ్మీ లాంచ్ ధర 279 యూరోలుగా(సుమారు రూ.20,400) ఉండే అవకాశం ఉందని తెలిపారు. గతంలో వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు తీసుకోని రానున్నారు. వీటి ధర లీక్ చేయలేదు. రెడ్మి నోట్ 10 ప్రో మొబైల్ డార్క్ నైట్, గ్లేసియర్ బ్లూ, గ్రాడియంట్ బ్రాంజ్, వింటేజ్ బ్రాంజ్, ఓనిక్స్ గ్రే రంగుల్లో తీసుకోని రావచ్చు. అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉన్న ఫోన్ రెడ్ మీ ఈ ధరలోనే అందిస్తూ ఉండటం విశేషం. ఇందులో 120 హెర్ట్జ్ ఐపీఎస్ డిస్ ప్లే, బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్ ఉండనుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు సమాచారం. చదవండి: గ్రాహంబెల్ జయంతి: టెలిఫోన్లలో ఎన్ని రకాలొచ్చాయి? భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం -
రెడ్మీ నోట్ 10 సిరీస్ వచ్చేస్తుంది!
షియోమీ అభిమానులకు శుభవార్త తెలిపింది రెడ్మీ. వచ్చే నెల మార్చిలో రెడ్మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్ఫోన్లు తీసుకొస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కానీ, ఖచ్చితమైన విడుదల తేదీని వెల్లడించలేదు. ఈ ఫోన్లకు సంబందించిన టీజర్ ను కూడా విడుదల చేసింది. రెడ్మీ నోట్ 9 సిరీస్ కొనసాగింపుగా దీనిని తీసుకువస్తుంది. రెడ్మీ నోట్ 10 సిరీస్ ఎన్ని ఫోన్లు తీసుకొస్తుందో స్పష్టత లేదు. షియోమీ రెడ్మీ నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్లను రూ.20,000లోపే లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబదించిన కొన్ని ఫీచర్స్ బయట చక్కర్లు కొడుతున్నాయి. రెడ్మి నోట్ 10 సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్తో 120 హెర్ట్జ్ ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉండవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732జీ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. రెడ్మి నోట్ 10 6జీబీ + 64జీబీ, 8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్లలో రానున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. రెడ్మీ నోట్ 10 సిరీస్లో 4జీ, 5జీ మోడల్స్ ఉంటాయని సమాచారం. రెడ్మీ నోట్ 10ప్రో 5జీ మోడల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఉంటుందని అంచనా. రెడ్మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్ఫోన్లు బ్రాంజ్, బ్లూ, గ్రే కలర్స్లో లభించే అవకాశం ఉంది. #RedmiNote10 series - 2021's smartphone of the year is making it's way home in early March. ⚡️ India's most-loved smartphone series is getting an upgrade unlike anything anyone's ever seen before! 👀 Are you ready to be blown away by the #10on10 experience? Heads up! 🔥 pic.twitter.com/vs9KGJAhOG — Redmi India - #RedmiNote10 Series is coming! (@RedmiIndia) February 10, 2021 చదవండి: ఈ 20 పాస్వర్డ్స్ ఉపయోగిస్తే మీ ఖాతా ఖాళీ ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు -
సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ షియోమీ రోజు రోజుకి సంచలనాలను సృష్టిస్తుంది. తక్కువ ధరకే మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇయర్ఫోన్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పతులను తక్కువ ధరకే అందిస్తూ ప్రపంచంలోని చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తుంది. తక్కువ కాలంలోనే శాంసంగ్, యాపిల్ వంటి ఇతర కంపెనీలను దీటుగా ఎదుర్కొంటూ షియోమీ తన హవా కొనసాగిస్తోంది. షియోమీ కేవలం 6 సంవత్సరాల కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా రెడ్మి నోట్ సిరీస్ ఫోన్లను విక్రయించినట్లు షియోమీ ప్రకటించింది. రెడ్మీ ఇండియా ఈ గణాంకాలను తెలుపుతూ ట్విటర్లో ఈ విషయాన్ని షేర్ చేసింది. మొట్ట మొదటి రెడ్మి నోట్ సిరీస్ ఫోన్ను 2014లో లాంచ్ చేశారు. అప్పటి నుంచి కంపెనీ రెడ్మి నోట్ సిరీస్ ఫోన్లను వరుసగా విడుదల చేస్తుంది. షియోమీ ప్రపంచ మూడో అతిపెద్ద స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీగా ఆవిర్భవించింది. షియోమీ 2014లో తొలిసారి రెడ్మి నోట్ సిరీస్ను ఫోన్లను విడుదల చేసింది. 2015లో రెడ్మి నోట్2, రెడ్మి నోట్3, 2016లో రెడ్మి నోట్4 తర్వాత 2017లో రెడ్మి నోట్ 5ఎ వచ్చింది. ఆ తర్వాత 2018లో రెడ్మి నోట్5, రెడ్మి నోట్ 6 సిరీస్ తీసుకోని వచ్చింది. 2019లో రెడ్మి నోట్7, రెడ్మి నోట్8 సిరీస్ను వరుసగా విడుదల చేసింది. 2020లో రెడ్మీ నోట్ 9 సిరీస్ ఫోన్లను విడుదల చేయగా త్వరలోనే రెడ్మి నోట్ 10 సిరీస్ ఫోన్లను 2021 మొదటి త్రైమాసికంలో తీసుకురావాలని షియోమీ యోచిస్తుంది. #RedmiNote series smartphones has shipped more than 2⃣0⃣,0⃣0⃣,0⃣0⃣,0⃣0⃣0⃣ units globally! 🌏 Crazy feat achieved by our most feature packed smartphone series! This milestone is a testament to #Redmi Note being the most-loved series in the world! ❤️ pic.twitter.com/sUdhmC9neH — Redmi India - #Redmi9Power is Here! (@RedmiIndia) February 8, 2021 చదవండి: ఈ యాప్ ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి ఓటు వేసి రియల్మీ నార్జో30 గెలుచుకోండి -
రెడ్ మీ లవర్స్కు శుభవార్త..!
గత రెండేళ్ల నుంచి షియోమీ భారతదేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్ను రోజు రోజుకి ఆక్రమించుకుంటూ పోతుంది. ఇప్పటికే ఈ సంస్థ భారతదేశంలో అనేక స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. చివరగా 2020 డిసెంబర్ లో ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీని విడుదల చేసింది. ఇప్పుడు 2021లో రెడ్ మీ బ్రాండ్ పేరుతో మరొకొన్ని టెలివిజన్లను మార్కెట్లోకి తీసుకోని రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చైనాలో రెడ్ మీ పేరుతో షియోమీ స్మార్ట్ టీవీలను విక్రయిస్తోంది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఇదే విధంగా చేయాలని చూస్తోంది. ఈ సమాచారాన్ని టిప్స్టెర్ ముకుల్ శర్మ షేర్ చేశారు. రెడ్ మీ టీవీలు తక్కువ ధరతో మార్చిలో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే భారత్ లో విడుదల చేయబోయే మోడళ్లపై ఎటువంటి స్పష్టత లేదు. చైనాలో 2020లో విడుదల చేసిన 50-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల పరిమాణాల్లో గల రెడ్ మీ ఎక్స్50 సిరీస్ టీవీలను ఇండియాలో తీసుకొనిరావడానికి రెడ్ మీ చూస్తున్నట్లు సమాచారం. (ఇక వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి) రెడ్ మీ ఎక్స్50 సిరీస్ ఫీచర్స్: రెడ్ మీ స్మార్ట్ టీవీ స్క్రీన్ టు బాడీ రేషియో 97 శాతంగా ఉంది. ప్రస్తుతం ఎంఐ టీవీ 4మోడళ్లలో ఉన్న ప్లాస్టిక్ ఫ్రేమ్కు బదులుగా ఇవి మెటల్ ఫ్రేమ్ను కలిగి ఉంటాయి. 50, 55, 65 అంగుళాల టీవీలో 4కే అల్ట్రా హెచ్ డీ స్క్రీన్లను వీటిలో అందించారు. 60 హెర్ట్జ్ మోషన్ ఎస్టిమేషన్, ఎంఈఎంసీ వంటి ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం. వీటిలో 8 యూనిట్ సౌండ్ సిస్టం కూడా అందుబాటులో ఉంది. డాల్బీ ఆడియో, డీటీఎస్ హెచ్ డీ టెక్నాలజీలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఫీల్డ్ వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది. వీటిలో క్వాడ్ కోర్ ప్రాసెసర్ ను అందించారు. 32 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. వీటిలో డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఇన్ ఫ్రారెడ్, మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, ఒక ఏవీ కనెక్టర్, ఒక డీటీఎంబీ కనెక్టర్, రెండు యూఎస్ బీ పోర్టులు, ఒక ఎథర్ నెట్ పోర్టు, ఒక ఎస్/పీడీఐఎఫ్ కనెక్టర్ లను ఇందులో అందించారు.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్!) రెడ్ మీ ఎక్స్50 సిరీస్ ధర: చైనాలో ఎక్స్50 బేస్ మోడల్ టివి ధర సిఎన్వై1999(సుమారు రూ.21,000) ఉండగా ఎక్స్55 టివి ధర సిఎన్వై 2,299(సుమారు రూ.24,400)గా ఉంది. ఇక టాప్-ఆఫ్-ది-లైన్ రెడ్మి స్మార్ట్ టివి ఎక్స్65 ఖరీదు సిఎన్వై 3,299(సుమారు రూ.35,000)కు అందుబాటులో ఉంది. -
షియోమీ కొత్త స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్
షియోమీ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్లో లీకయ్యయి. ఇది రెడ్ మీ కే40 సిరీస్ లేదా ఎంఐ 11 సిరీస్కు సంబంధించిన ఫోన్ అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. ఇందులో వనిల్లా మోడల్ క్వాల్కామ్ నుంచి సబ్-ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ను షియోమీ తీసుకొస్తున్నట్లు సమాచారం.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3!) ఇందులో పంచ్ హోల్ కటౌట్ ఉన్న ఓఎల్ఈడీ డిస్ప్లేను షియోమీ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు ఒక ప్రముఖ టిప్స్టర్ తెలిపారు. అలాగే మిడ్ రేంజ్ మొబైల్ లో ఉపయోగించే ఎస్ఎం7350 ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇది 5ఎక్స్ జూమ్ కి సపోర్ట్ చేసే 64 ఎంపీ కెమెరా కలిగి ఉండవచ్చని టిప్స్టర్ పేపేర్కొన్నారు. ఇది రాబోయే రెడ్మి కె40 లేదా ఎంఐ 11 సిరీస్ వేరియంట్ కావచ్చు అని భావిస్తున్నారు. రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ సిద్ధంగా ఉంది. దీని ధర సిఎన్వై 2,999(సుమారు రూ.34,000) నుంచి ప్రారంభమవుతుంది. రెడ్ మీ కే40లో మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ను అందించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది లాంచ్ అయిన క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 765జీకి తర్వాత వెర్షన్గా స్నాప్ డ్రాగన్ 775జీ రానుంది. ఈ ప్రాసెసర్ ను ఇందులో తీసుకురానున్నట్లు అంచనా. -
బడ్జెట్ లో రెడ్మీ స్మార్ట్ బ్యాండ్
న్యూఢిల్లీ: రెడ్మీ బ్రాండ్ యొక్క మొట్టమొదటి స్మార్ట్ బ్యాండ్ ఫిట్నెస్ ట్రాకర్ సెప్టెంబర్లో 5న రూ.1,599($22) ధరతో భారతదేశంలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు, ఈ ఫిట్నెస్ ట్రాకర్ను రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా మీకు రూ.999($ 13.69)కి లభిస్తుంది. భారతదేశపు అతిపెద్ద ఈ కామర్స్ ప్లాట్ఫాం అమెజాన్ ఇండియా రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్ను నిర్వహిస్తుంది. షియోమీ దాదాపు అన్ని దేశాలలో ఎంఐ, రెడ్మీ బ్రాండెడ్ ఉత్పత్తుల మీద డిస్కౌంట్ అందిస్తోంది. రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ లో 1.08-అంగుళాల టిఎఫ్టి ఎల్సిడి కలర్ ప్యానెల్, టచ్ ఇన్పుట్, 24 గంటల హార్ట్ బీట్ మానిటరింగ్, 5 స్పోర్ట్స్ మోడ్లు, బ్లూటూత్ 5.0 ఎల్ఇ, యాప్ నోటిఫికేషన్లు, 5 ఎటిఎం వాటర్ రెసిస్టెంట్, 14 రోజుల బ్యాటరీ లైఫ్ , యుఎస్బి ఛార్జింగ్ వంటి మరిన్ని ఆప్షన్స్ కలిగి ఉంది.(చదవండి: ఫేస్బుక్కు పోటీగా దూసుకెళ్తున్న 'మీవే' యాప్) -
అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రిపబ్లిక్ డే సందర్బంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(జనవరి 20) నుంచి జనవరి 23 వరకు కొనసాగనుంది. ఈ నాలుగు రోజుల సేల్ లో ప్రముఖ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, అమెజాన్ పరికరాలు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ పై మంచి ఆఫర్స్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రస్తుతం లైవ్ లో ఉంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు నిన్నటి నుంచే అందుబాటులో ఉంది. ఎస్బిఐ బ్యాంక్ కార్డుదారులు 10 శాతం(కార్డుపై రూ.1,500 వరకు) తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ ఒప్పందాలు, ఆఫర్లు మీకోసం.(చదవండి: మొదలైన ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ సేల్) ఆపిల్ ఐఫోన్ 12 మినీ: ఆపిల్ ఐఫోన్ 12 మినీపై అమెజాన్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వడం లేదు, కాని ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈ ఫోన్పై రూ.4,500(అసలు రూ.64,490) డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.12,400(గరిష్టంగా) అదనపు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. వన్ప్లస్ 8: వన్ప్లస్ 8 అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే అమ్మకంలో రూ.39,999(ఎంఆర్పి రూ.41,999)కి లభిస్తుంది. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.12,400(గరిష్టంగా) అదనపు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. వన్ప్లస్ 8లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.55-అంగుళాల ఫ్లూయిడ్ డిస్ప్లే ఉంది. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇది 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 4,300ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎం51: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే అమ్మకంలో శామ్సంగ్ గెలాక్సీ ఎం51పై కూపన్ లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఆ ప్రోడక్ట్ కింద రూ.2,000 చెక్ బాక్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు గెలాక్సీ ఎం51ను రూ.20,999 (ఎంఆర్పి రూ.28,999)కి పొందవచ్చు. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా కొనుగోలుపై రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. గెలాక్సీ ఎం51 6.7-అంగుళాల ఎస్ఆమోఎల్ఈడి ప్లస్ డిస్ప్లే, 7,000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. రెడ్మి నోట్ 9ప్రో మాక్స్: షియోమీకీ చెందిన రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో రూ.14,999(ఎంఆర్పి రూ.18,999). అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.12,400(గరిష్టంగా) అదనపు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. రెడ్మి నోట్ 9ప్రో మాక్స్ 6.67-అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. -
రెడ్మీ మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్
షియోమీ గత ఏడాది రెడ్మీ 9 ప్రైమ్ను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా షియోమీ తన యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. 9 ప్రైమ్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 11తో పనిచేస్తుంది. ఇప్పుడు 9 ప్రైమ్ యూజర్లకు ఎంఐయుఐ12 అప్డేట్ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. వినియోగదారులు కూడా ఈ విషయాన్ని ట్వీటర్లో తెలిపారు. దీనికి సంబందించిన స్క్రీన్ షాట్లను తమ ట్విటర్ లో యూజర్లు షేర్ చేస్తున్నారు. ఈ అప్డేట్ లో ల్యాండ్ స్కేప్ మోడ్కు సంబంధించిన సమస్యను పరిష్కరించారు. ఎంఐయుఐ 12.0.1.0.QJCINXM వెర్షన్ నంబర్తో ఈ అప్డేట్ రానుంది. ఈ అప్డేట్ సైజు కూడా 600ఎంబీ వరకు ఉంది. ఈ అప్డేట్ మొదట్లో చైనాలోని రెడ్మీ 9 వంటి ఫోన్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు భారతదేశంలోని రెడ్మి 9 ప్రైమ్కు తీసుకురానునట్లు ప్రకటించింది. ఇది దశల వారీగా యూజర్ ఫోన్లకు రానుంది. రెడ్మి 9 ప్రైమ్ భారతదేశంలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఎంట్రీ వేరియంట్ 4జీబీ + 64జీబీ స్టోరేజ్ కాగా, మరొకటి 6జీబీ ర్యామ్ +1 28 జీబీ స్టోరేజ్ వేరియంట్. డిసెంబర్ 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్తో ఈ అప్డేట్ రానుంది. ఈ కొత్త ఎంఐయూఐ 12 అప్ డేట్ ద్వారా కంట్రోల్ సెంటర్కు మెరుగులు దిద్దారు.(చదవండి: రెడ్మీ కే40లో పవర్ ఫుల్ ప్రాసెసర్) -
రెడ్మీ కే40లో పవర్ ఫుల్ ప్రాసెసర్
రెడ్మీ కే40 మొబైల్ ను వచ్చే నెలలో చైనాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మొబైల్ సరికొత్త క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రానున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. రెడ్మీ కే40 ధరను కూడా రెడ్మీ జనరల్ మేనేజర్ "లు వీబింగ్" వెల్లడించారు. రెడ్మీ కే40 సిరీస్ గతేడాది ప్రారంభించిన రెడ్మీ కే30 సిరీస్ కొనసాగింపుగా రానుంది. ప్రస్తుతానికి రెడ్మీ కే40 స్పెసిఫికేషన్స్ గురుంచి ఇప్పటివరకు తెలియదు. రెడ్మీ కే40 సిరీస్ బేస్ వేరియంట్ ధర సిఎన్వై 2,999(సుమారు రూ. 34,000) నుంచి ప్రారంభం కానునట్లు "లు వీబింగ్" ధృవీకరించారు. రెడ్మీ కే40 సిరీస్లో మెరుగైన ర్యామ్,స్టోరేజ్తో పాటు ఎక్కువ ప్రీమియం ఆప్షన్స్ తీసుకురానున్నట్లు భావిస్తున్నారు. కంపెనీ పేర్కొన్నట్లుగా దీనిలో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకురానున్నారు. రెడ్మీ కే40 అమోలెడ్ డిస్ప్లే తీసుకురానున్నట్లు సమాచారం. దీనిలో 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్తో పాటు యుఎస్బి టైప్-సి పోర్ట్ను తీసుకువచ్చే అవకాశం ఉంది.(చదవండి: వాట్సాప్, సిగ్నల్ కు ప్రధాన తేడా ఏంటి?) -
ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఇవే!
న్యూఢిల్లీ: మీరు బడ్జెట్ లో మంచి మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. మొబైల్ లవర్స్ కోసం క్రిస్మస్ పండుగ సందర్బంగా అమెజాన్ సరికొత్త ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా శామ్సంగ్, ఒప్పో, నోకియా, ఎల్జీ, వివో వంటి బ్రాండ్ల మొబైల్స్ మీద ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీనికి తోడు మీరు ఐసీఐసీఐ, ఎస్బిఐ, హెచ్డీఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఇఎంఐని కూడా పొందగలరు. హెచ్డీఎఫ్సి క్రెడిట్ కార్డులను ఉపయోగించి మొబైల్స్ కొంటె 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ (రూ.1,500) పొందే అవకాశం ఉంది. ఈ సేల్ లో భాగంగా తీసుకొచ్చిన కొన్ని బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ మేము మీకోసం అందిస్తున్నాం.(చదవండి: 5వందల కోసం 5వేలు పెట్టుబడి పెడుతున్నారా జాగ్రత్త!) ఒప్పో ఏ11కే ఒప్పో ఏ11కే ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10990. ఇది 6.2-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,230 ఎంఏహెచ్. ఒప్పో ఏ11కే మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. నోకియా 5.3 నోకియా 5.3 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.11,999కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.16,599. ఇది 6.55-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,000 ఎంఏహెచ్. నోకియా 5.3 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్, మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.10,000కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999. ఇది 6.4-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది SDM450-F01 ఆక్టో కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 5,000 ఎంఏహెచ్. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.(చదవండి: రూ.14వేలకే శామ్సంగ్ 5జీ మొబైల్) ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.12,990కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.14,999. ఇది 6.21-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,050 ఎంఏహెచ్. ఎల్జీ డబ్ల్యూ30 ప్రో మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. వివో వై91ఐ వివో వై91ఐ ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11,990. ఇది 6.22-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,030 ఎంఏహెచ్. వివో వై91ఐ మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. రెడ్మీ 9 పవర్ రెడ్మీ 9 పవర్ మొబైల్ నేడే ఫస్ట్ సేల్ కి వచ్చింది. దీని ధర వచ్చేసి రూ.10,999. ఇది 6.53-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. రెడ్మీ 9 పవర్ మొబైల్ లో 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. -
నేడే రెడ్మీ 9 పవర్ ఫస్ట్ సేల్
న్యూఢిల్లీ: షియోమీ కంపెనీ రెడ్మీ 9 పవర్ మొబైల్ నీ గత వారం భారత్ లో ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. రెడ్మీ 9 పవర్ ఫస్ట్ సేల్ నేడు ప్రారంభం అయింది. ఈ మొబైల్ అమెజాన్, షియోమీ ఆన్లైన్ స్టోర్ లలో అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 4+64 జీబీ వేరియంట్ దీని ధర రూ.10,999, రెండవది 4+128 జీబీ వేరియంట్ దీని ధర రూ.11,999. దీనిలో ప్రత్యేకంగా మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. షియోమీ రెడ్మీ 9 పవర్ మైటీ బ్లాక్, బ్లేజింగ్ బ్లూ, ఫైరీ రెడ్, ఎలక్ట్రిక్ గ్రీన్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. (చదవండి: రూ.14వేలకే శామ్సంగ్ 5జీ మొబైల్) కొత్త రెడ్మీ 9 పవర్ మొబైల్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. ఇది అడ్రినో 610 జీపీయు, 4 జీబీ ర్యామ్తో జత చేయబడింది. ఇది 6.53-అంగుళాల ఫుల్హెచ్డి ప్లస్ డిస్ప్లే కలిగి ఉంది. మెయిన్ కెమెరా సెటప్లో నాలుగు కెమెరా లెన్సులు ఉన్నాయి. ఇందులో 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో 4జీ వోల్టే, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. -
షియోమీ లవర్స్ కి గుడ్ న్యూస్
షియోమీ తన సొంత ప్లాట్ఫామ్లో నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్ను నిర్వహిస్తోంది. నేటి(డిసెంబర్ 18) నుండి డిసెంబర్ 22 వరకు ఈ సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్లో భాగంగా ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్ వాచ్, బ్యాక్ప్యాక్, స్మార్ట్ఫోన్లు ఇంకా మరిన్ని ఉత్పత్తులపై కంపెనీ 4,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్లో షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో రూ.13,999కు లభిస్తుంది. షియోమి నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్ సందర్భంగా ఎంఐ నోట్బుక్ 14 హారిజన్ ఎడిషన్ను రూ.9 వేల తగ్గింపుతో రూ.50,999కు పొందవచ్చు. కంపెనీ తన ఎంఐ వాచ్ రివాల్వ్ను 9,999 రూపాయలకు అందిస్తోంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.15,999కు లభించింది. ఫిట్నెస్ వాచ్లో 10 స్పోర్ట్స్ మోడ్లు, బాడీ ఎనర్జీ మానిటరింగ్, జిపిఎస్ సపోర్ట్, 1.39-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి. షియోమీ తన 10,000ఎంఏహెచ్ ఎంఐ వైర్లెస్ పవర్ బ్యాంక్పై రూ.700 తగ్గింపుతో 1,999 రూపాయలకు లభిస్తుంది. ఈ పవర్ బ్యాంకు 10వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఉత్పత్తిపై ఈ సేల్లో తగ్గింపును ప్రకటించింది.(చదవండి: అమెజాన్ లో మరో కొత్త సేల్) -
పదకొండు వేలకే రెడ్మీ 9 పవర్
న్యూఢిల్లీ: షియోమీ సరికొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్గా రెడ్మీ 9 పవర్ను భారత్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, వాటర్డ్రాప్ డిస్ప్లే నాచ్తో వస్తుంది. రెడ్మి 9 పవర్లో తాజా ఎంఐయుఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, స్టీరియో స్పీకర్లు, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. చైనాలో విడుదల చేసిన రెడ్మి నోట్ 9 4జీ రీబ్రాండ్ గా రెడ్మీ 9 పవర్ మొబైల్ తీసుకొచ్చారు. శామ్సంగ్ గెలాక్సీ ఎం11, వివో వై 20, ఒప్పో ఎ53లకు పోటీగా దీనిని తీసుకొచ్చింది.(చదవండి: ఒప్పో నుంచి మరో బడ్జెట్ మొబైల్) రెడ్మీ 9 పవర్ ఫీచర్స్ డ్యూయల్ సిమ్ (నానో) రెడ్మీ 9 పవర్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12పై నడుస్తుంది. ఇందులో 6.53-అంగుళాల పూర్తి-హెచ్డి ప్లస్ (1,080x2,340) పిక్సెల్ వాటర్డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే ఉంది. ఇది 19.5 : 9 రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో లభిస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ కలిగి ఉంది, ఇది అడ్రినో 610 జీపీయు, 4జీబీ ఎల్ పీఢీడీఆర్4ఎక్స్ ర్యామ్ తో జత చేయబడింది. రెడ్మి 9 పవర్ లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ సెకండరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం రెడ్మి 9 పవర్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.ఈ కెమెరా సెన్సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫేస్ అన్లాక్కు కూడా సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ 9 పవర్ లో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే 4జీ ఓఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, యుఎస్బి టైప్-సి మరియు 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ హై-రెస్ ఆడియో సర్టిఫికేట్ పొందిన స్టీరియో స్పీకర్లతో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్ఫ్లిక్స్ సహా ప్లాట్ఫారమ్ల ద్వారా హెచ్ డీ వెబ్ స్ట్రీమింగ్కు సపోర్ట్ కోసం వైడ్విన్ ఎల్ 1 ధృవీకరణ కూడా పొందింది. షియోమీ రెడ్మి 9 పవర్పై సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను అందించింది. ఫోన్లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ కూడా ఉన్నాయి. ఫోన్ లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని బరువు 198 గ్రాముల. రెడ్మీ 9 పవర్ ధర భారతదేశంలో రెడ్మీ 9 పవర్ ధర రూ.4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్కు 10,999 ఉండగా, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.11,999గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ నాలుగు రంగులలో లభిస్తుంది. అవి బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫైరీ రెడ్, మైటీ బ్లాక్. అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మొదటి సేల్ డిసెంబర్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. త్వరలో ఆఫ్ లైన్లో కూడా దీని సేల్ జరగనుంది. -
499కే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరు నిత్యం ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాక్అప్. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడియా వాడటం బాగా పెరిగినప్పటి నుండి ఫోన్ యొక్క బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా పని మీద వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, విహార యాత్రలకు వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మధ్య పవర్ బ్యాంక్ వాడకం కూడా బాగా పెరిగింది. మీరు కూడా కొత్త పవర్ బ్యాంక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది ఒక మంచి సమయం. అమెజాన్ లో తాజాగా పవర్ బ్యాంక్ డేస్ సేల్ ఈ రోజు (డిసెంబర్ 13) నుండి నిర్వహిస్తుంది. ఈ సేల్ మూడు రోజుల పాటు(డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 15) కొనసాగుతుంది. ఈ సేల్ లో మీకు తక్కువ ధరకే మంచి నాణ్యత గల పవర్ బ్యాంక్ లు లభిస్తాయి. ఈ సేల్ లో తీసుకొచ్చిన కొన్ని పవర్ బ్యాంకు వివరాలు మీకు అందిస్తున్నాం.(చదవండి: నోకియా 5.4లో సూపర్ ఫీచర్స్) రెడ్మీ పవర్బ్యాంక్: రెడ్మి యొక్క ఈ పవర్ బ్యాంక్ 10000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది, దీని ధర 699 రూపాయలు మాత్రమే. పవర్బ్యాంక్ బరువు 246.5 గ్రాములు. ఛార్జ్ చేయడానికి 7.5 గంటలు పడుతుంది. దీనికి రెండు అవుట్పుట్ పోర్టులు మరియు రెండు ఇన్పుట్ పోర్టులు ఉన్నాయి.| అంబ్రేన్ పవర్బ్యాంక్: అంబ్రేన్కు చెందిన ఈ పవర్బ్యాంక్ ధర 649 రూపాయలు. పవర్బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 నుండి 7 గంటలు పడుతుంది. సిస్కా పవర్బ్యాంక్: సిస్కోకు చెందిన 10000 ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన ఈ పవర్బ్యాంక్ ధర రూ.599. దీనికి ఎల్ఈడీ ఫ్లాష్లైట్ కూడా లభిస్తుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ పవర్బ్యాంక్లో ఓవర్ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ రక్షణ కూడా ఇవ్వబడింది. యూఆర్బీఎన్(URBN) పవర్బ్యాంక్: యూఆర్బీఎన్ పవర్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఈ సేల్ లో అతి తక్కువ ధరకు రూ.499 లభించేది ఇదే. ఈ అల్ట్రా స్లిమ్ పవర్బ్యాంక్ 10000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. ఇది 12వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. పవర్బ్యాంక్ బరువు కేవలం 354 గ్రాములు. -
రెడ్మీ 9 పవర్ వచ్చేస్తోంది
షియోమీ రెడ్మీ 9 పవర్ మొబైల్ ని డిసెంబర్ 17 తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల చైనాలో విడుదల చేసిన రెడ్మి నోట్ 9 4జీకి రీబ్రాండెడ్ వెర్షన్గా దీనిని తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ కి సంబంధించి కొన్ని లీకైన ఫీచర్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. రెడ్మీ 9 పవర్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ పేజీలో మోడల్ నంబర్ M2010J19SIతో వచ్చింది. రెడ్మి 9 పవర్ మొబైల్ లో క్వాడ్ రియర్ కెమెరాను తీసుకొస్తున్నట్లు సమాచారం. రెడ్మి 9 పవర్లో రాబోయే నాల్గవ కెమెరా మెగాపిక్సెల్ గురుంచి ఇంకా సమాచారం లేదు. రెడ్మి నోట్ 9 4జీలో మాదిరిగానే రెడ్మీ 9 పవర్ ఫోన్లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇప్పటికే ఉన్న మోడల్ ను స్వల్ప మార్పుల చేసి రీబ్రాండెడ్ ఫోన్లను తీసుకురావడం షియోమికి ఇది కొత్త కాదు. ఇటీవల ఇండియాలో విడుదలైన రెడ్మీ 9కి రీబ్రాండెడ్ గా రెడ్మీ 9సినీ తీసుకొచ్చింది. దీంట్లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 చిప్సెట్తో పనిచేస్తుంది. 6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేతో ఈ స్మార్ట్ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.(చదవండి: అమెజాన్ లో మరో సేల్) -
2020లో ఎక్కువ వెతికిన మొబైల్స్ ఇవే!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పలు స్మార్ట్ఫోన్ల విడుదల ఆలస్యమైంది. అయినప్పటికీ భారత్లో లాక్డౌన్ తర్వాత పండుగ సీజన్ సందర్బంగా రికార్డు స్థాయిలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు జరిగాయి. ఆపిల్, వన్ప్లస్, షియోమీ, రియల్మీ తదితర ప్రముఖ కంపెనీలు భారత మార్కెట్లో నూతన ఫోన్లను విడుదల చేశాయి. 2020లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్ఫోన్ల జాబితాను గూగుల్ విడుదల చేసింది. 1) వన్ప్లస్ నార్డ్ వన్ప్లస్ నార్డ్ బేసిక్ ప్రైస్ వచ్చేసి రూ.24,999గా ఉంది. వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ 6.44 అంగుళాల డిస్ప్లే 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్ 20: 9 యాస్పెక్ట్ రేషియోలో లభిస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 5జీ ప్రాసెసర్, 4115 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్సెట్ 48ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ యొక్క క్వాడ్-కెమెరా సెటప్ కలిగి ఉంది. 2) ఐఫోన్ 12 రూ.79,900 ప్రారంభ ధరతో వచ్చిన ఐఫోన్ 12 మొబైల్ 64జీబీ, 128జీబీ, 256జీబీ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది 5.4 అంగుళాల ఓఎల్ ఈఢీ డిస్ప్లేని కలిగి ఉంది. ఐఫోన్ 12 ఏ14 బయోనిక్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. దీనిని బ్లూ, వైట్, గ్రీన్, బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. 3) రియల్ మీ 7 ప్రో రియల్మీ 7 ప్రో స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 65వాట్ సూపర్డార్ట్ ఛార్జ్ సపోర్ట్తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 48 ఎంపి ప్రధాన సెన్సార్తో క్వాడ్-కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది, ఇది ప్రారంభ ధర రూ.19,999. 4) రెడ్మీ నోట్ 8 ప్రొ షియోమీ రెడ్మీ నోట్ 8 ప్రో స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ.15,999. ఈ మొబైల్ హాలో వైట్, గామా గ్రీన్, షాడో బ్లాక్, డార్క్ బ్లూ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ హెలియో జీ90టీ ప్రాసెసర్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 5) రెడ్మీ నోట్ 8 షియోమీ రెడ్మీ నోట్ 8 ప్రో స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ.11,499 రూపాయలు. రెడ్మి నోట్ 8 స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో బ్యాకప్ చేయబడిన 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది 6) ఒప్పో ఎఫ్ 17 ప్రో షియోమీ రెడ్మీ నోట్ 8 ప్రో స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ.21,490 రూపాయలు. ఒప్పో ఎఫ్ 17 ప్రో స్మార్ట్ఫోన్ 6.4-అంగుళాల ఎఫ్హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ ఎఫ్హెచ్డి + డిస్ప్లే (2400x1080p రిజల్యూషన్) కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో పీ 95 ప్రాసెసర్ ద్వారా వస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తున్న ఒప్పో ఎఫ్ 17ప్రో వెనుక భాగంలో 48 ఎంపీ క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 7) రెడ్మి నోట్ 9 ప్రో షియోమీ రెడ్మీ నోట్ 8 ప్రో స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ.12,999 రూపాయలు. రెడ్మి నోట్ 9 ప్రో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్తో 5020 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 6.67-అంగుళాల ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ ప్లే, 48ఎంపీ ప్రధాన సెన్సార్తో క్వాడ్-కెమెరా సెటప్ను కలిగి ఉంది. 8) వివో వీ20 సన్సెట్ మెలోడీ, మిడ్నైట్ జాజ్, మూన్లైట్ సోనాట వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభించే వివో వీ20 హ్యాండ్సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. 6.44-అంగుళాల ఎఫ్హెచ్డి + డిస్ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ లో 44 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.దీని ప్రారంభ ధర రూ.23990. 9) రియల్ మీ 6ప్రో ప్రస్తుతం రూ.17,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్న రియల్మీ 6ప్రో స్మార్ట్ఫోన్లో 6.6 అంగుళాల ఎఫ్హెచ్డి + డిస్ప్లే 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జీతో నడిచే ఈ హ్యాండ్సెట్ 4300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ హ్యాండ్సెట్ 64ఎంపీ + 8ఎంపీ + 12ఎంపీ + 2ఎంపీ క్వాడ్-కెమెరా సెటప్ను కలిగి ఉంది. 10) రియల్ మీ 7 దీని ప్రారంభ ధర రూ.14,999. రియల్మీ 7 6.5 అంగుళాల ఎఫ్హెచ్డి + డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ మొబైల్ వెనుక 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ క్వాడ్-కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. -
రెడ్మి కే 40 ప్రోలో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్
రెడ్మీ 2021లో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత నడిచే ఒక మొబైల్ ఫోన్ అయిన తీసుకురావాలని భావిస్తుంది. అందుకోసమే రెడ్మీ కే 30ప్రోకి సక్సెర్ గా రాబోయే కే40 ప్రోలో దీనిని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు వచ్చిన కొన్ని లీక్స్ ప్రకారం కే40ప్రో స్మార్ట్ ఫోన్ నాచ్-తక్కువ ఉన్న ప్యానల్తో లేదా పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇటీవల ఒక టిప్ స్టార్ తెలిపిన ప్రకారం రెడ్మి కే 40 ప్రోలో 3.7 మిమీ పరిమాణంలో ఉండే స్లిమ్ పంచ్-హోల్తో ఓఎల్ఈడీ ప్యానెల్ తో రానున్నట్లు పేర్కొన్నారు. రెడ్మి కే 40ప్రో 90హెర్ట్జ్, 120హెర్ట్జ్ లేదా 144హెర్ట్జ్ అధిక రిఫ్రెష్ రేట్లతో రానుంది. రెడ్మి కే 40ప్రో మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే ఇందులో 45000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. రెడ్మి కే 40ప్రోలో వచ్చే ప్రధాన కెమెరా రిజల్యూషన్ గురించి నివేదికలు ఏమీ పేర్కొనలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా చివరలో దీనిని తీసుకురానున్నట్లు సమాచారం. దీనిని చైనాలో మొట్ట మొదటగా సారిగా లాంచ్ చేయనున్నారు.(చదవండి: లెనోవా కొత్త స్మార్ట్ఫోన్లు) -
2021లో రాబోయే షియోమీ ఫోన్లు ఇవే
షియోమీ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ లను తీసుకొస్తుంది. ఒక్కోసారి నెలకు 1, 2 ఫోన్లను ఈ కంపెనీ లాంచ్ చేస్తుంది. అలాగే 2021లో కూడా మరిన్నీ ఫోన్లను తీసుకురావడానికి షియోమీ సిద్ధంగా ఉంది. వచ్చే సంవత్సరం షియోమీ మనదేశంలో రెడ్మి బ్రాండ్ క్రింద రెడ్మి 10 సిరీస్, రెడ్మి నోట్ 10 సిరీస్ తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే పోకో విషయానికి వస్తే పోకో ఎం 3 ప్రో, పోకో ఎమ్ 3 ప్రో మరియు పోకో ఎక్స్ 4, పోకో ఎక్స్ 5 ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. 2021లో రాబోయే పూర్తీ షియోమీ ఫోన్ల జాబితా ఈ క్రింద ఉంది. (చదవండి: వోడాఫోన్ ఐడియా రికార్డు) షియోమీ ఎంఐ 11, ఎంఐ 11 ప్రో షియోమీ ఎంఐ 11 సిరీస్ లో రాబోయే మొబైల్ జనవరిలో వస్తుందని సమాచారం. దీనిలో ఇటీవల లీకైన సమాచారం ప్రకారం 108 ఎంపీ ప్రధాన కెమెరా, కర్వేడ్ డిస్ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ వంటి ఫీచర్లను తీసుకురానున్నారు. ఎంఐ 11 ప్రోలో ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్ నుండి 192 మెగాపిక్సెల్స్ వరకు ఉండనుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా ఇందులో అందించనున్నట్లు సమాచారం. పోకో ఎఫ్ 2 పోకో ఎఫ్ 2 త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. పోకో ఎఫ్ 1 తర్వాతి వెర్షన్గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. పోకో ఈ మధ్యే ఎన్నో ఫోన్లను లాంచ్ చేయడం ప్రారంభించింది. పోకో ఎఫ్ 2 ఫీచర్ల గురుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. రెడ్మి నోట్ 10, రెడ్మి నోట్ 10 ప్రో, రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్ రెడ్ మీ నోట్ సిరీస్లో రానున్న తర్వాతి వెర్షన్ స్మార్ట్ ఫోన్లు ఇవే. రెడ్మి నోట్ 10, రెడ్మి నోట్ 10 ప్రో 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తాయని సమాచారం. రెడ్మి నోట్ 10 తక్కువలో 108 ఎంపి కెమెరా ఫోన్గా మారవచ్చు. దీనిలో స్నాప్డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన 4800 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ కే 40/ పోకో ఎక్స్ 4 రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ కూడా ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. కాబట్టి ఈ ఫోన్ కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో స్నాప్డ్రాగన్ 775 5జీ ప్రాసెసర్ తో రావచ్చు. కొన్ని మార్కెట్లలో రెడ్ మీ బ్రాండింగ్, కొన్ని మార్కెట్లలో పోకో ఎక్స్4గా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెడ్మి కే 40 ప్రో/ పోకో ఎఫ్ 3ప్రో రెడ్మి కే 30 ప్రో లేదా పోకో ఎక్స్ 2 ప్రో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తో భారతదేశానికి రావచ్చు. రెడ్మి కె 40 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, మల్టీ కెమెరా సెటప్, 12 జిబి ర్యామ్, 5జీ కనెక్టివిటీ తీసుకొస్తున్నట్లు సమాచారం. రెడ్మి 10, రెడ్మి 10 ప్రైమ్, రెడ్మి 10 పవర్, రెడ్మి 10 ఐ ఇవి రెడ్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో లాంచ్ కానున్నాయి. రెడ్ మీ 9 సిరీస్ తర్వాతి వెర్షన్లుగా రెడ్ మీ 10 సిరీస్ రానుంది. వీటి ధర వచ్చేసి 7,000 నుండి రూ.12,000 ఉండనున్నట్లు సమాచారం. 2021 మొదటి త్రైమాసికంలో మొదలయ్యి ఏడాది పొడవునా రెడ్మి 10 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తూనే ఉంటుంది. పోకో ఎం3, పోకో ఎం 3 ప్రో పోకో ఎం3 ఇప్పటికే లాంచ్ అయింది. కొన్ని దేశాల్లో ఈ ఫోన్ పోకో ఎం3 ప్రోతో పాటు లాంచ్ కానుంది. పోకో ఎం 3 రియల్మే నార్జో 20 ఎ, రియల్మే సి 15 మరియు ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో వంటి వాటికీ పోటీగా తీసుకొచ్చింది. పోకో ఎం3 స్నాప్డ్రాగన్ 662 చిప్ సెట్ 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. పోకో ఎం3 ఇండియా ధర బడ్జెట్ కేటగిరీ రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. పోకో ఎం 3 ప్రో 15,000 కేటగిరీలో మిడ్-బడ్జెట్ రేంజ్ లో తీసుకురానుంది. ఎంఐ నోట్ 10 లైట్/ఎంఐ 10ఐ ఎంఐ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో 2021 ప్రారంభంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఎంఐ నోట్ 10 లైట్ సెప్టెంబర్లో ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. చైనాలో రెడ్ మీ నోట్ 9 ప్రో 5జీగా లాంచ్ అయిన ఫోన్ మనదేశంలో ఎంఐ 10ఐగా లాంచ్ కానుందని తెలుస్తోంది. -
ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి?
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ లో ఎప్పుడు చాలా గట్టి పోటీ ఉంటుంది. అందుకే చాలా మొబైల్ సంస్థలు ఈ పోటీని తట్టుకోవడానికి ప్రతి నెల ఎదో ఒక ఫోన్ ని విడుదల చేస్తూ ఉంటాయి. వీటితో మంచి ఆఫర్లను కూడా మొబైల్స్ పై అందిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం చైనా కంపెనీల మద్యే ఎక్కువ పోటీ ఉంది. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో లాంచ్ చేయబోయే మొబైల్స్ ని మీకోసం తీసుకొస్తున్నాం. మొబైల్స్ యొక్క ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఉన్నాయి. అందుకే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. (చదవండి: వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడండి) వివో వీ20 ప్రో 5జీ శాంసంగ్ ఏ32 5జీ ఒప్పో రెనో ప్రో 5జీ శాంసంగ్ ఏ12 ఒప్పో రెనో ప్రో ప్లస్ 5జీ రెడ్ మీ నోట్ 10 5జీ ఒప్పో రెనో 5ప్రో రెడ్ మీ నోట్ 10 5జీ ప్రో రియల్ మీ ఎక్స్ 7 ప్రో పోకో ఎం3 రియల్ మీ ఎక్స్ 7 ఒప్పో ఏ53 5జీ రియల్ మీ వి5 మోటో జీ9 పవర్