మళ్లీ పెరిగిన రెడ్‌ మీ నోట్​ 8 ధర | redmi note 8 received another price hike | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన రెడ్‌ మీ నోట్​ 8 ధర

Published Mon, Jul 13 2020 4:58 PM | Last Updated on Mon, Jul 13 2020 6:41 PM

redmi note 8 received another price hike - Sakshi

న్యూఢిల్లీ: రెడ్​ మీ నోట్​ 8 స్మార్ట్‌ఫోన్‌ ధర మళ్లీ పెరిగింది. 4 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్​తో వచ్చే ఫోన్​ రేటు రూ. 500 పెరిగి 12,499 రూపాయలకు చేరింది. జూన్​ నెలలో జీఎస్టీ పెరుగుదల, డాలర్​తో పోల్చితే రూపాయి విలువ పతనం కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. (రెడ్‌మీ 10 ఎక్స్ వచ్చేసింది..)

అయితే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్​తో వస్తున్న మరో వేరియంట్​ ధరలో ఎలాంటి మార్పురాలేదు. దీని ధర ప్రస్తుతం 14,499 రూపాయలుగా ఉంది. నోట్​ 8ను రెడ్​ మీ 2019లో 9,999 రూపాయలకు లాంచ్ చేసింది. అంటే మొత్తం మీద దీని రేటు 2,500 రూపాయలు పెరిగిందన్నమాట. సవరించిన ధరలను ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇక రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ను ఈనెల 20న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు షావోమి వెల్లడించింది. (లీకైన రెడ్‌మి 9 వివరాలు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement