నడిరోడ్డుపై వ్యక్తి సజీవ దహనం..! | Man Burnt To Death Alive In Sanath Nagar | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై వ్యక్తి సజీవ దహనం..!

Published Fri, Mar 8 2019 9:21 AM | Last Updated on Fri, Mar 8 2019 9:40 AM

Man Burnt To Death Alive In Sanath Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సనత్‌నగర్‌లోని స్నేహపురి కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇంట్లో నుంచి బయటికొచ్చిన వెంకటేష్‌ గుప్తా అనే వ్యక్తి ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. వ్యాపారంలో నష్టాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. వెంకటేష్‌ సజీవ దహనమవుతున్న దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement