Live burning
-
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదం
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్న ఓ బస్సు తన ముందున్న వ్యాన్ను ఢీకొట్టింది. ఈ వ్యాన్లో ఇంధన ట్యాంక్ ఉంది. దీంతో రెండు వాహనాలు వెంటనే నిప్పంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సులోని పలువురు మహిళలు, చిన్నారులు సహా 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. కొందరు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు లాహోర్కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతిచెందడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి మొహిసిన్ నక్వీ విచారం వ్యక్తం చేశారు. -
రాజుతో అంగరక్షకుడి సహగమనం
సాక్షి, హైదరాబాద్: సతీ సహగమనం గురించి అందరికీ తెలిసిందే. భర్త చితిపైనే భార్యను సజీవంగా దహనం చేసే దారుణ పద్ధతది. కానీ, రాజు చనిపోతే అంగరక్షకులను అతనితోపాటు సజీవ సమాధి చేసే మరో వికృత ఆచారం కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. స్వామి భక్తితో ఆత్మాహుతి చేసుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడి(లెంక) స్మృతిలో ఏర్పాటు చేసిన స్మారక ఆత్మాహుతి శిల ఇటీవల వెలుగుచూసింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ శివారు ఆల్వాన్పల్లిలో ఉన్న అతి పురాతన జైన దేవాలయం గొల్లత్తగుడి వెనక దీన్ని గుర్తించారు. అక్కడి శిథిల శైవమఠం గోళకీ ఆలయం పరిసరాల్లో ఆరు వీరగల్లు శిలలున్నాయి. వాటిల్లో ఒకటిగా ఉన్న ఈ శిలను కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, ముచ్చర్ల దినకర్లు పరిశీలించారు. దానిపై పరిశోధన చేసి, అది చనిపోయిన రాజుతోపాటు సజీవంగా సమాధి చేయించుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడిదిగా తేల్చారు. స్థానికంగా ఉన్న రాజు లేదా రాజు హోదాలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు అతని సేవకుడు కూడా ఆత్పార్పణ చేసుకోవటంతో తొలుత సేవకుడిని సమాధి చేసి, దాని మీద రాజు శవాన్ని సమాధి చేసినట్టు పేర్కొన్నారు. ఈ శిలమీద చనిపోయిన రాజు చిత్రం, దిగువ ఆ సేవకుడి చిత్రాన్ని చెక్కారు. వారు శివైక్యం చెందారనటానికి గుర్తులు చెక్కి ఉన్నాయి. యుద్ధంలో చనిపోతే... ‘శిల మీద లఘు శాసనం ఉంది. అది ఆ సేవకుడు, రాజుకు సంబంధించే ఉండి ఉంటుంది. అస్పష్టంగా ఉన్నందున చదవటం సాధ్యం కావటం లేదు’ అని హరగోపాల్ పేర్కొన్నారు. ఇక్కడికి చేరువలోని గంగాపూర్ ప్రాంతంలో గతంలో చాలా యుద్ధాలు జరిగాయని, ఓ యుద్ధంలో స్థానిక రాజు/ ఆ స్థాయి వ్యక్తి చనిపోవటంతో అతని సేవకుడు కూడా సజీవ సమాధి ద్వారా ఆత్మార్పణ చేసుకుని ఉంటాడని, దానికి గుర్తుగా స్థానిక దేవాలయం వద్ద ఈ ఆత్మాహుతి శిలను ఏర్పాటు చేసి ఉంటారని ఆయన చెప్పారు. ఏడెనిమిది శతాబ్దాల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని గుంటూరు జిల్లా ఈపూర్లో గతంలో కాకతీయ రాణి రుద్రమ మరణంతో ప్రమేయమున్న ఇలాంటి శిల్పం లభించిందని, అది చెన్నై మ్యూజియంలో ఉందని, మరోటి త్రిపురాంతకంలో ఉందని వెల్లడించారు. తెలంగాణలో తొలిసారి వెలుగు చూసిన ఈ శిల్పానికి చరిత్రలో ప్రాధాన్యముంటుందన్నారు. -
రాజస్తాన్లో ఘోరం.. మహిళపై రేప్.. ఆపై సజీవదహనం
జైపూర్: రాజస్తాన్లో ఘోరం జరిగింది. ఓ దుర్మార్గుడు దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెకు నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. బార్మెర్ జిల్లాకు చెందిన దళిత మహిళ(30) ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన షకూర్ఖాన్ అనే వ్యక్తి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన అనంతరం యాసిడ్ వంటి ద్రావకాన్ని ఒంటిపై పోసి, నిప్పంటించి పరారయ్యాడు. 50 శాతం గాయాలపాలైన బాధితురాలు జోథ్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వివాహేతర సంబంధమే హత్యకు కారణమా..?
-
కారుకు నిప్పు పెట్టడంతో ఓ వ్యక్తి సజీవ దహనం
-
మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం
నాసిక్: ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కు ట్రైలర్ను ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి బస్సులోని ఇద్దరు చిన్నారులు సహా 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాసిక్–ఔరంగాబాద్ హైవేపై నాదుర్నాకా సమీపంలో శనివారం ఉదయం 5.15 గంటల సమయంలో దుర్ఘటన సంభవించింది. యావత్మాల్ నుంచి ముంబై వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు ట్రక్కు ట్రైలర్ను, ఆపై కార్గో వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో బస్సులో వేగంగా వ్యాపించిన అగ్నికీలలు రెండేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు సహా 12 మందిని బలి తీసుకున్నాయి. మరో 43 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా తగులబడిపోయింది. క్షతగాత్రులను నాసిక్లోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం షిండే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సాయం అందజేస్తామని చెప్పారు. -
తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
సాక్షి, కోనసీమ(అల్లవరం): తల్లీకుమార్తెల సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. మాజీ ప్రియుడ్ని తన వైపు తిప్పుకునే క్రమంలో ఓ మహిళ పన్నాగానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ నెల 2వ తేది తెల్లవారుజామున సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి సజీవదహనమైన సంగతి తెలిసిందే. అమలాపురం రూరల్ సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమరగిరిపట్నానికి చెందిన సురేష్, జ్యోతి ప్రేమించుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకుని గోడితిప్పలో నివసిస్తున్నారు. అంతకుముందు సురేష్కు నాగలక్ష్మి అనే వివాహితతో వివాహేతర సంబంధముండేది. పెళ్లయిన తర్వాత ఆమెకు దూరమవడంతో నాగలక్ష్మి ఎలాగైనా జ్యోతి సురేష్లను విడదీయాలనుకుంది. ఇందులో భాగంగా సురేష్ ఇంటి వద్ద ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పడేసేది. ఇందుకు తన సవతి కుమార్తెలు సౌజన్య, దివ్య హరితలను వినియోగించుకునేది. ఆ ఉత్తరాలలో జ్యోతికి అక్రమ సంబంధం ఉన్నట్లు రాసేవారు. వాటిని చదివినా సురేష్ ఆమెతో ప్రేమగానే ఉండేవాడు. ఇలా కాదని జ్యోతిని హతమారిస్తే సురేష్ తనకు దగ్గరవుతాడని భావించింది. ఇదే సమయంలో జ్యోతి తన పుట్టింటికి వెళ్లింది. చదవండి: (తీరని శోకం: రెండు కుటుంబాలు.. నలుగురు బిడ్డలు..) ఈనెల 2వ తేదీ రాత్రి తన తల్లి సాధనాల మంగాదేవితో కలిసి పడుకుంది. ఇదే అదునుగా నాగలక్ష్మి తన సవతి కుమార్తెలిద్దరినీ ఉసి గొల్పింది. నిద్రిస్తున్న తల్లీ కూతుళ్లపై పెట్రోలు పోయాలని చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి తల్లీకూతుళ్లపై పెట్రోలు పోసి బయటకు వచ్చి నిప్పంటించారు. కాసేపటికే మంటలు ఎగసిపడుతుండటంతో జ్యోతి తండ్రి లింగన్న మేల్కొన్నాడు. మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికే మంగాదేవి, జ్యోతి సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి చురుగ్గా దర్యాప్తు చేశారు. ఈ హత్యతో సంబంధమున్న నాగలక్ష్మ, సౌజన్య, దివ్య హరితలను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితులనురాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దర్యాప్తులో ఎస్సై ప్రభాకరరావు, కానిస్టేబుళ్లు ధర్మరాజు, సుభాకర్, క్రైం పార్టీకి చెందిన కానిస్టేబుల్ బాలకృష్ణ, రామచంద్రరావు, జి.కృష్ణసాయి, డి.అర్జున్ కీలక భూమిక పోషించారు. చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు) -
కారులో పెట్రోల్ పోసుకుని ప్రేమికుల సజీవ దహనం
బనశంకరి: కారులో పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ప్రేమజంట సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో ఉడుపి జిల్లా బ్రహ్మవర పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. బెంగళూరు సుల్తాన్పాళ్యవాసి యశవంత్యాదవ్ (23), మనోరాయనపాళ్యవాసి జ్యోతి (23) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి బీకాం చదివింది. యశవంత్ కంప్యూటర్ కోర్సు చేశాడు. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు యశవంత్ కంప్యూటర్ క్లాస్కు వెళ్తానని ఇంట్లో చెప్పి బైక్పై బయటకు వెళ్లాడు. జ్యోతి కూడా పని ఉందని బయటకు వెళ్లింది. రెండురోజులైనా కనిపించకపోవడంతో ఇద్దరి తల్లిదండ్రులూ హెబ్బాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ జంట మంగళూరుకు వెళ్లి తమకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక అద్దె ఇంటిని తీసుకున్నారు. అక్కడే హుసేనఖ అనే వ్యక్తి నుంచి స్విఫ్ట్ కారును బాడుగకు తీసుకుని ఉడుపికి వెళ్లారు. ఉడుపిలో వివిధ దేవస్థానాలను సందర్శించి ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. యశవంత్ తన సోదరునికి మెసేజ్ పంపాడు. తరువాత ప్రేమికులు కారులోనే కూర్చుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలు చెలరేగి కారులో గ్యాస్ సిలండర్ పేలిపోవడంతో యశవంత్ శరీరం బయటకు ఎగిరిపడింది. జ్యోతి కారులోనే కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బ్రహ్మవర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. -
కారులో ముగ్గురు సజీవ దహనం
మార్కాపురం/భాకరాపేట: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ముగ్గురు యువకులు సజీవదహనం అయ్యారు. టైరు పేలి అదుపు తప్పిన కారు.. కంటైనర్ లారీని ఢీకొనడంతో స్నేహితులు సాకిరి బాలాజీ (21), పటాన్ ఇమ్రాన్ఖాన్ (21), రావూరి తేజ (29) నిలువునా కాలిపోయారు. తేజ పాస్పోర్ట్ పనిమీద ముగ్గురు విజయవాడ వెళ్లారని, తిరుగు ప్రయాణంలో ఈ ఘోరం జరిగిందని భావిస్తున్నారు. కంభం వైపు నుంచి మార్కాపురం వైపు వస్తున్న ఏపీ39 డీఈ 6450 నంబరు కారు తిప్పాయపాలెం–జంగంగుంట్ల మధ్య మిట్టమీదిపల్లి అడ్డరోడ్డు వద్దకు రాగానే టైరు పేలిపోయింది. దీంతో కుడివైపు మార్కాపురం నుంచి కంభం వైపు వెళుతున్న కేఏ14 సీ 2949 నంబరు కంటైనర్ లారీని ఢీకొంది. కారులో ఉన్న పెట్రోల్ ట్యాంక్కు మంటలు అంటుకోవడంతో అందులోని ముగ్గురు సజీవ దహనమయ్యారు. మంటలు ఎగిసిపడుతుండటంతో కారు వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. డీఎస్పీ డాక్టర్ కిశోర్కుమార్, సీఐ ఆంజనేయరెడ్డి సమాచారం ఇవ్వడంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారు నంబరు ఆధారంగా యజమాని చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెలపాలెం పోస్టు, ఆదినారాయణవారిపల్లికి చెందిన ఈటెలమర్రి నరేంద్రగా గుర్తించి పోలీసులు అతడికి సమాచారమిచ్చారు. తాను కారును బాడుగకు ఇచ్చానని నరేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో డ్రైవర్ రావూరు తేజ అయి ఉండవచ్చని అనుమానించిన పోలీసులు వివరాలు సేకరించారు. మూడు కుటుంబాల్లో విషాదం భాకరాపేటకు చెందిన సాకిరి బాలాజీ, పటాన్ ఇమ్రాన్ఖాన్, రావూరి తేజ స్నేహితులు. వీరు ముగ్గురు ఎక్కడికెళ్లారో తమకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్నేహితులు మాత్రం త్వరలో గల్ఫ్కు వెళ్లాలనుకుంటున్న రావూరి తేజ పాస్పోర్ట్ పనిమీద విజయవాడ వెళ్లారని చెబుతున్నారు. బాలాజీ తండ్రి సత్యనారాయణ, తల్లి ఇంద్ర టీటీడీలో పనిచేసి రిటైరయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. మృతుడు పెద్ద కుమారుడు. పటాన్ ఇమ్రాన్ఖాన్ తండ్రి మస్తాన్ పంక్చర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. రావూరి తేజ తండ్రి భాస్కర్ పెయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు తేజ తండ్రికి సాయంగా ఉండేందుకు గల్ఫ్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే జరిగిన ఈ ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. -
కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?
-
కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేట్ సమీపంలోని పొలాల్లో ఓ కారు పూర్తిగా దగ్ధమై కనిపించింది. కారులో ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మాలిలో ఉగ్ర దాడి.. 31మంది పౌరులు మృతి
బమాకో: ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది అమాయకపౌరులు బలయ్యారు. బండియగర పట్టణ సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. సుమారు 50 మంది పౌరులతో వెళ్తున్న ట్రక్కుపై అల్ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రక్కులో మంటలు చెలరేగి 31 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది సజీవ దహనమైనట్లు బండియగర మేయర్ హొస్సేనీ తెలిపారు. పలువురు గాయాలపాలయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. స్థానిక సాయుధ బృందాల హింసాత్మక చర్యల కారణంగా మాలిలో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!) -
వివాహేతర సంబంధం: చేతులు, కాళ్లు కట్టేసి..
తిరువొత్తియూరు (తమిళనాడు): చేతులు, కాళ్లు కట్టేసి మహిళను సజీవ దహనం చేసిన చెన్నై కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై నోలంబోర్ బైపాస్ రోడ్డులో మంగళవారం సాయంత్రం స్థానికులు ఇచ్చిన సమాచారంతో కాలుతున్న మహిళ మృతదేహాన్ని నోలంబూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మృతురాలు చెన్నై వానగరం శక్తిసాయి రాంనగర్ కు చెందిన మురుగన్ భార్య రేవతి (35)గా తేలింది. ఆమె చెన్నై కార్పొరేషన్ వలసరవాక్కం మండల కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న బ్యాటరీ వాహనం డ్రైవర్ తెలంగాణకు చెందిన తిమ్మప్ప (24)తో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో 16వ తేదీన రేవతి వద్ద ఐదు సవర్ల బంగారు నగ తీసుకున్నాడు. 22వ తేదీన ఇద్దరూ నిర్మానుష్య ప్రాంతంలో కలుసుకున్నారు. ఆ సమయంలో నగ గురించి రేవతి అతన్ని కోరింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహం చెందిన తిమ్మప్ప ఆమె చున్నీతో చేతులు, కాళ్లు కట్టేసి కత్తితో గొంతు కోశాడు. స్పృహతప్పి పడి న రేవతిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. తిమ్మప్పను గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: టిక్ టాక్ స్టార్కు జైలు శిక్ష.. కాపాడమంటూ వేడుకోలు రాత్రిళ్లు కల్లోకి వచ్చి నాపై అత్యాచారం చేస్తున్నాడు -
చిన్నపాటి ఘర్షణ.. ఆసుపత్రిలోనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు
భోపాల్: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ఒక వ్యక్తి తనతో గొడవపడిన మరో వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆసుపత్రి సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం బాధితుడు కాలిన గాయాలతో సాగర్ బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. దామోదర్ కోరి, మిలన్ మాచే రజాక్ మధ్య గురువారం(జూన్ 10న) ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ ఘర్షణలో దామోదర్ కోరికి గాయాలు కావడంతో చికిత్స చేయించుకునేందుకు బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వచ్చాడు. అయితే తనతో గొడవపడిన కోరిపై ఆగ్రహంతో ఉన్న మిలన్ మాచే కొన్ని గంటల తర్వాత కోరి ఉన్న ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని బయటకు వస్తున్న కోరీపై పెట్రోల్ పోసి తన వద్ద ఉన్న లైటర్తో నిప్పు అంటించి అక్కడినుంచి పరారయ్యాడు. దాదాపు 50 శాతం కాలిన గాయాలతో కిందపడిపోయిన కోరిని వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స నిర్వహించారు. కాగా మిలన్ మాచే కోరికి నిప్పు అంటించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. సీసీటీవీ, బాధితుడి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు మిలన్ మాచే రజాక్ ను పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. చదవండి: స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి ‘న్యూడ్ కాల్ చేస్తావా.. ఫొటోస్ అప్లోడ్ చేయలా?’ -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం
రాజేంద్రనగర్: ఔటర్ రింగ్ రోడ్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీ నుంచి రొయ్యల లోడ్తో మహారాష్ట్రకు వెళ్తున్న కంటైనర్ ముందు వెళ్తున్న గుర్తుతెలి యని వాహనాన్ని ఢీకొంది. ఈ తీవ్రతకు కంటైనర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. డోర్లు లాక్ కావడం, లోపల ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో క్షణాల్లో అగ్నికీలలు విస్తరించాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతా నిమిషాల్లోనే... ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఉమామహేశ్వరరావు రొయ్యల వ్యాపారి. పాలకొల్లు నుంచి ముంబైకి రొయ్యలు ఎగుమతి చేస్తుంటారు. ఈయన వద్ద థానేకు చెందిన ముత్యంజయ యాదవ్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన సూర్యకుమార్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. పాలకొల్లు నుంచి ఓ కంటైనర్ (ఏపీ 39 టీక్యూ 5734)లో ఇద్దరు డ్రైవర్లు బయలుదేరారు. వీరిలో ఒకరు వాహనం నడుపుతుండగా మరొకరు క్యాబిన్లో ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ వాహనం ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణిస్తూ హిమాయత్సాగర్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదం ధాటికి కంటైనర్ ముందు భాగం దెబ్బతినడంతో పాటు మంటలు అంటుకున్నాయి. క్యాబిన్ కూడా ధ్వంసం కావడంతో పాటు దాని డోర్స్ లాక్ అయ్యాయి. నిమిషాల వ్యవధిలోని మంటలు క్యాబిన్ మొత్తం ఆక్రమించాయి. వీటిలో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర వాహన చోదకులు ఆగి వారిని కాపాడే ప్రయత్నాలు చేశారు. క్యాబిన్ ముందు అద్దాలు పగులకొట్టినా.. మంటల ఉధృతి కి వెనక్కు తగ్గారు. గ్యాస్సిలిండర్ పేలిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కేబిన్లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు పూర్తిగా కాలిపోయారు. రాజేంద్రనగర్ పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారమివ్వడంతో ఫైరింజన్ మంటల్ని ఆర్పింది. మృతదేహాలకు పంచనామా నిర్వహించిన రాజేంద్రనగర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. ఈ ఉదం తంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కంటైనర్ ఢీకొట్టిన వాహనం వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. -
ప్రాణం తీసిన అగ్గిపుల్ల, చూస్తుండగానే ఘోరం
నిజాంసాగర్(జుక్కల్): బీడీ కాల్చేందుకు వెలిగించిన అగ్గిపుల్ల ప్రాణాలనే తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన తాటివార్ బాలరాజ్ (35) శనివారం మధ్యాహ్నం తన చెల్లెలు సోని కిరాణా దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో ముగ్గురు చిన్నపిల్లలు ఉండటంతో బాలరాజ్ పెట్రోల్ డబ్బాల పక్కన కింద కూర్చున్నాడు. అనంతరం అగ్గిపుల్ల వెలిగించి బీడీ అంటించుకున్నాడు. ఆ తర్వాత అగ్గిపుల్లను పారవేసే క్రమంలో అది పెట్రోల్ డబ్బాలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బాలరాజ్కు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న బాలరాజ్ హాహాకారాలు చేస్తూ కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు, అటు వైపు వచ్చిన వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అందరూ చూస్తుండగానే బాలరాజ్ సజీవదహనం అయ్యాడు. ప్రమాద సమయంలో కిరాణా దుకాణంలో ఉన్న పిల్లలు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్.ఐ దత్తాత్రిగౌడ్ తెలిపారు. చదవండి: యువతి కిడ్నాప్; ఆపై అత్యాచారం -
శామీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా శామీర్పేట రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నగరం నుండి తమిళనాడు సేలం కు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి సజీవ దహనం
భువనేశ్వర్: ఇంజినీరింగ్ విద్యార్థి సజీవ దహనమయ్యాడు. పలు అనుమానాలకు దారితీసిన ఈ దారుణం రణస్థలం మండలంలో సంచలమైంది. రణస్థలం పంచాయతీ పరిధి సీతంపేట గ్రామ సమీప తోటల్లో విద్యార్థి సజీవదహనమై కనిపించిన ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 5.30 గంటల సమయంలో పొలాలకు వెళ్లిన రైతులకు దుర్గారావు అనే వ్యక్తికి చెందిన పొలంలోని ధాన్యం బస్తాలు కాలిపోయి పొగలు రావడాన్ని గమనించారు. దీంతో వారంతా పక్కనే ఉన్న తోటపల్లి కాలువలోని నీటిని బకెట్లతో తీసుకొచ్చి కాలిపోతున్న ధాన్యం బస్తాలపై జల్లుతుండగా...పక్కనే కాలిపోయిన శవం కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో విషయాన్ని రణస్థలంలోని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. వారు జె.ఆర్.పురం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ వి.చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్లూస్టీంకు తెలియజేయడంతో వారు వచ్చి కాలిపోయిన మృతదేహాన్ని, సమీపంలో పడిఉన్న ఏటీఎం కార్డు, పర్సులోని కళాశాల ఫీజు రశీదును గుర్తించారు. వాటి ఆధారంగా సజీవ దహనమైన యువకుడు మువ్వల నగేష్(18)గా తెలుసుకున్నారు. ఇతను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శివాని కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని, స్వగ్రామం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవుగా తేలిందని పోలీసులు తెలిపారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా మృతుడు సోదరుడు మేఘనాథ్ (ఆర్ఎంపీ వైద్యుడు) సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సజీవదహనమైన తమ్ముడు నగేష్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. మృతుని సోదరుడు ఏం చెప్పాడంటే.. ఈ నెల 7వ తేదీన శివాని ఇంజినీరింగ్ కళాశాలలో జాయినయ్యాడని, తరువాత మధ్యలో రెండు సార్లు ఇంటికి వచ్చాడని నగేష్ సోదరుడు మేఘనాథ్ చెప్పారు. ఈ నెల 25న ఉదయం తొమ్మిది గంటలకు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వచ్చేశాడన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కాలేజీలో సెల్ఫోన్ విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు స్నేహితుల ద్వారా తెలిసిందన్నారు. బుధవారం ఉదయం పోలీసుల నుంచి ఫోన్ రావడంతో తమ్ముడు చనిపోయిన విషయం తెలిసిందని రోదిస్తూ చెప్పారు. నగేష్ తల్లిదండ్రులు సుందరి, గోపాల్ మత్స్య వేటే వృత్తిగా బతుకుతున్నారు. కాగా విద్యార్థి సజీవ దహనంపై పోలీసులు, క్లూస్ టీం అన్ని కోణాల్లో లోతుగా విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్రశేఖర్ చెప్పారు. -
భర్తను సజీవ దహనం చేసిన భార్య
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో బుధవారం వేర్వేరు చోట్ల వెలుగు చూసిన హత్యలు ఆయా ప్రాంతాల్లో కలకలం రేపాయి. చెన్నై తురై పాక్కం కన్నగి నగర్కు చెందిన ఆట్రోడ్రైవర్ రఘు, మైలాపూర్కు చెందిన కార్తీక్ స్నేహితులు. అయితే, భార్య వినోదిని(21)తో కార్తీక్తో సాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని పసిగట్టిన రఘు వేకువజామున తాను లేననుకుని ఇంటికి వచ్చిన కార్తిక్ను, రఘు హతమార్చాడు. చదవండి: ప్రియుడిని కలవడానికి నిరాకరించినందుకు .. తండ్రి కోసం.. తిరునల్వేలి జిల్లా తచ్చనల్లూరుకు చెందిన సుడలైమణి(55), షణ్ముగవేల్(52) అన్నదమ్ముళ్లు. ఆస్తి కోసం తండ్రికి సుడలైమణి చేతబడి చేసినట్టు షణ్ముగవేల్ కుమారుడు ముత్తుమారి కొంతకాలంగా గొడవ పడుతూ కక్ష గట్టాడు. ఉదయం గ్రామ శివార్లలో ఒంటరిగా కనిపించిన సుడలైమణిని మారిముత్తు నరికి చంపేశాడు. చదవండి: తరచూ ఫోన్ చేసి భార్యను వేధిస్తున్నాడని.. డ్రమ్ములో హిజ్రా శవం.. కోవై జిల్లా హిజ్రాల సంఘం నేతగా సంగీత(50) వ్యవహరిస్తున్నారు. హిజ్రాల్ని ఏకం చేసి ట్రాన్స్ కిచ్చన్ పేరిట బిర్యానీ సెంటర్ను నడుపుతూ వస్తున్న సంగీత ఆమె ఇంట్లో ఓ డ్రమ్ములో శవంగా తేలింది. కోయంబత్తూరు రత్నగిరికి చెందిన పెరియస్వామి(46) రాంగ్ కాల్లో తగిలిన ఓ మహిళతో పరిచయం పెంచుకునేందుకు తీవ్రంగా యత్నించాడు. కారమలైకు చెందిన వితంతువు ధనలక్ష్మిగా గుర్తించాడు. ప్రతిరోజూ రాత్రుల్లో సిమ్ కార్డుల్ని మారుస్తూ, ఫోన్చేసి అశ్లీల వ్యాఖ్యలు చేయడం, కోరిక తీర్చాలని వేధించడం మొదలెట్టాడు. దీంతో విషయాన్ని తన తల్లి మల్లిక, బంధువు లక్ష్మణన్ దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం అర్ధరాత్రి పథకం ప్రకారం పెరియస్వామి ఇంటికి రప్పించుకున్న ధనలక్ష్మి తన తల్లి, బంధువుతో కలిసి చెట్టుకు కట్టేసి చితక్కొట్టింది. దీంతో పెరియస్వామి విగత జీవి అయ్యాడు. పెట్రోల్ పోసి తగలబెట్టింది... ఈరోడ్ వలరసం పట్టికి చెందిన సుధాకర్(40)ను అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి గత ఏడాది రెండో పెళ్లి చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో ఉన్న పెట్రోల్ను సుధాకర్పై పోసి తగలబెట్టేసింది. అతడు సజీవ దహనం కావడం, ఇంట్లో నుంచి పొగరావడంతో ఇరుగు పొరుగు పరుగులు తీశారు. దీంతో లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసి, ఆస్పత్రి పాలైంది. తండ్రి ఆత్మహత్య టీ.నగర్: కుమారుడు మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగపట్నం జిల్లా, శీర్గాళి సమీపంలోగల సంజీవరాయన్ కోవిల్ గ్రామానికి చెందిన శేఖర్ (48) రైతు. భార్య తమిళరసి.. వీరి కుమారుడు సంతోష్ (27). ఈనెల తొమ్మిదో తేదీన చెన్నైకు వెళుతున్నట్లు తెలిపి బయలుదేరాడు. ఈ క్రమంలో 10న కడలూరు జిల్లా చిదంబరం సమీపం పి.ముట్లూరు ప్రాంతంలో సంతోష్ హత్యకు గురయ్యాడు. కుమారుడు మృతిని తట్టుకోలేక శేఖర్ మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి తమిళరసి అనే భార్య ఉంది. -
అగ్నికీలల్లో ఆర్తనాదాలు
సాక్షి, బళ్లారి: బస్సు బెంగళూరుకు పరుగులు తీస్తోంది. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంతలో బస్సులో అగ్నికీలలు. కొందరికి మెలకువ వచ్చి బస్సులో నుంచి దూకేశారు. డ్రైవర్ బస్సును నిలిపేసి పారిపోయాడు. డ్రైవర్ వెనుక సీట్లో ›కూర్చున్న బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన కవిత(28), ఆమె అక్క శీలా (33), వారి ముగ్గురు పిల్లలు స్పర్శ (8), సమృద్ధి(5), నిశ్చిత(3)లు మంటల్లో చిక్కి సజీవ దహనమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా కేఆర్హళ్లి వద్ద జాతీయ రహదారిలో బుధవారం తెల్లవారుజామున 3–4 సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విజయపుర(బీజాపూర్) నుంచి బెంగళూరుకు వెళ్తున్న కుక్కేశ్రీ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు మంటల్లో చిక్కుకుంది. పై ఐదుగురి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. ఈ ఘటనలో మరో 27 మంది తీవ్రంగా గాయపడటంతో చిత్రదుర్గ, హిరియూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన ఈ ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ కవిత, ఎస్పీ రాధికలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. డ్రైవర్ పరారు కావడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిద్రలోకి జారుకొన్న వారు ప్రమాదం నుంచి బయట పడేందుకు వీలుకాకపోగా ముగ్గురు చిన్నారులు కావడం వల్ల వారికి ఏం జరుగుతోందో తెలియక క్షణాల్లో కాలిబూడిదయ్యారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం తాండవించింది. -
ఆస్తి కోసం అత్తను కాల్చేసింది
శంకర్పల్లి: ఓ మహిళ ఆస్తి కోసం తన కుమారుడితో కలిసి అత్తను కాల్చి చంపేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎల్వర్తి అనుబంధ కొజ్జగూడలో మంగళవారం సాయంత్రం జరిగింది. సీఐ గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంసమ్మ(70)కు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. గతేడాది కొడుకు చనిపోయాడు. అతడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కంసమ్మ గ్రామంలో ఉన్న పొలం విక్రయించి మెదక్ జిల్లా కాదులబాద్లో 5 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. సదరు భూమిని తన ముగ్గురు కూతుళ్లతో పాటు తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అయితే, ఈ విషయం కోడలు విజయకు తెలియడంతో మంగళవారం సాయంత్రం అత్తను నిలదీసింది. తనకు భూమి ఎందుకు ఇవ్వవు అని గొడవపడింది. ఈక్రమంలో విజయ తన కుమారుడు శివతో కలిసి ఇంట్లో ఉన్న కంసమ్మపై పెట్రోల్ పోసి నిప్పటించారు. మంటలు అంటుకొని కాలిన గాయాలతో ఇంటి గడప వద్దే కంసమ్మ మృతి చెందింది. ఇల్లు పూర్తిగా కాలి పోయింది. ఇరుగుపొరుగు వారు గమనించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, కంసమ్మను హత్య చేసిన అనంతరం విజయ, ఆమె కుమారుడు పరారయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తమ్ముడు కిష్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక సజీవదహనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుకోట్టై జిల్లాలో ఇటీవలే ఏడేళ్ల చిన్నారిపై లైంగికదాడి, కిరాతకంగా హతమార్చిన ఉదంతం నుంచి ఇంకా కోలుకోక ముందే తిరుచ్చిరాపల్లి జిల్లాలో మరో ఘోరం జరిగిపోయింది. ఆడుతూ పాడుతూ అందరిముందు తిరుతుండిన మైనర్ బాలిక అంతలోనే శరీరం కాలిపోయిన స్థితిలో ముళ్లపొదల్లో శవంగా మారిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుచ్చిరాపల్లి జిల్లా సోమరసంపేట అదవత్తూరుపాళయంకు చెందిన పెరియస్వామి (45) రైతుకు భార్య మహేశ్వరి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె గంగాదేవి (14) ఎట్టరై ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో సహచరి విద్యార్థినులతో కలిసి ఆడుకుంది. ఆ తరువాత ఇంట్లోని చెత్తను పారవేసేందుకు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన గంగాదేవి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చేపట్టగా అడవిలోని ముళ్లపొదల్లో శరీరమంతా కాలిపోయిన స్థితిలో బాలిక శవంగా పడి ఉంది. సమీపంలో ఒక లీటరు క్యానులో కొద్దిగా కిరసనాయిలు, సంఘటన జరిగిన రోజున బాలిక ధరించిన దుస్తులు సమీపంలో చిరిగిపోయి పడి ఉన్నాయి. కుమార్తెను సజీవంగా తగలబెట్టారంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ ప్రారంభించారు. బాలిక శవాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు పోలీసులు సిద్ధపడగా గ్రామస్తులు అడ్డుకుని నిందితులను అరెస్ట్ చేసేవరకు పంచనామా చేయరాదని బైఠాయించారు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న అంబులెన్స్ అద్దాలను పగలగొట్టి రాస్తారోకోకు దిగారు. పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరిపి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలిక శవాన్ని తిరుచ్చిరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుచ్చి ఎస్పీ, ఏఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ బాలికపై లైంగికదాడి జరిగిందా లేదా అనేది చెప్పగలమని తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పుదుక్కోట్టై జిల్లా అరిమళంలో ఏడేళ్ల చిన్నారిపై కొన్ని రోజుల క్రితమే లైంగికదాడి, దారుణహత్య జరిగింది. ఇంతలోనే మరో బాలికను వికృతంగా హతమార్చిన సంఘటనతో ప్రజల్లో భీతినెలకొంది. తిరుచ్చిరాపల్లి మండల డీఐజీ విజయ మీడియాతో మాట్లాడుతూ బాలిక ఒంటి నిండా ఉన్న కాలినగాయాలపై పరిశోధన చేయాల్సిందిగా వైద్య నిపుణులను కోరామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఏడీఎస్పీ నేతృత్వంలో ఐదుగురు ఇన్స్పెక్టర్లతో కూడిన 11 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితులను వదిలే ప్రసక్తేలేదన్నారు. కఠిన శిక్షకు గురిచేస్తామన్నారు. ఇదిలా ఉండగా, బాలికపై లైంగికదాడి జరగలేదని మంగళవారం విడుదల చేసిన పోస్టుమార్టం రిపోర్టు ద్వారా తేటతెల్లమైంది. ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ ఘటనను సుమోటాగా స్వీకరించి విచారణ జరిపేందుకు ముందుకు వచ్చింది. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తరువాత తమిళనాడులో ఆరు సార్లు బాలికలపై ఆఘాయిత్యాలు, లైంగికదాడుల ఘటనలు చోటుచేకున్నాయి. కమిషన్ సైతం ఆరోసారి తమిళనాడులోని కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. -
నిప్పంటించుకుని యువతి ఆత్మహత్య
శ్రీకాకుళం, పాతపట్నం: మెళియాపుట్టి మండలం వెంకటాపురం పంచాయతీ బందపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం తన ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని సవర హేమలత (25) ఆత్మహత్య చేసుంది. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం... ఆమె తండ్రి సవర పాపయ్య, తల్లి జానకమ్మ పోడు వ్యవసాయం కోసం కొండపైకి వెళ్లారు. ఇంతలో ఈ దారుణానికి ఒడిగట్టింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటన స్థలానికి ఎస్ఐ సిద్ధార్థ కుమార్ చేరుకుని పరిశీలించి, మృతురాలి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. హేమలత ఇంటర్ వరకు చదువుకుంది. తమ్ముడు అనిల్ ఉన్నాడు. పోస్టుమార్టం కోసం పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
అత్తను మట్టుబెట్టిన కోడలు..
సాక్షి, చెన్నై: తన కాపురంలో వరకట్న చిచ్చు పెట్టడమే కాదు, భర్తను తనకు దూరం చేయడానికి ప్రయత్నించిన ఓ అత్తను కోడలు సజీవదహనం చేసింది. పాలల్లో నిద్రమాత్రలు వేసి నిద్ర పుచ్చినానంతరం కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. అత్త శరీరం మంటల్లో కాలుతున్నా, ఏమీ ఎరుగనట్టుగా మరో గదిలో నిద్ర నాటకం ఆడి అడ్డంగా ఈ కోడలు బుక్కైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు...(కాళ్ల పారాణి ఆరకముందే... ) పుదుకోట్టై జిల్లా వెల్లకోట సమీపంలోని మనియాందపురం గ్రామానికి చెందిన రమేష్కు రెండేళ్ల క్రితం ప్రతిభతో వివాహం అయింది. వీరికి తొమ్మిది నెలల ఆడ బిడ్డ ఉంది. రమేష్ పుదుకోట్టైలోని ఓ మందుల తయారీ సంస్థలో ఉద్యోగి. రమేష్తో పాటు తండ్రి అరుల్ పుళవన్, తల్లి రాజమ్మాల్ కూడా ఉన్నారు. ఈ కుటుంబానికి సొంతంగా ఇళ్లు, పంట పొలాలు ఉన్నాయి. అయితే, కోడల్ని కూతురుగా చూసుకోవాల్సిన అత్త రాజమ్మాల్ మొదటి నుంచి ఆరళ్లు పెడుతూ వచ్చింది. పెళ్లి సమయంలో కట్న కానుకల్ని బకాయి పెట్టారని, అది తీసుకు రావాలని, పదే పదే కోడల్ని వేధించేది. తన కుమారుడికి ఆడ బిడ్డ పుట్టినానంతరం కోడలిపై వేధింపుల్ని ఈ గయ్యాలి అత్త పెంచింది. అదనపు కట్నం తీసుకురావాలని లేని పక్షంలో తన కుమారుడికి మరో పెళ్లి చేస్తానంటూ బెదిరించడం మొదలెట్టింది. భర్త, అత్తమామలు తనను బాగానే చూసుకుంటున్నా, అత్తరూపంలో తనకు వేధింపులు పెరగడంతో బయటకు చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయేది. తన పుట్టింట్లో ఆదరణ కరువు కావడం, అత్త వేధింపులు పెరగడం వెరసి మానసికంగా కృంగిన ›ప్రతిభ చివరకు ఉన్మాదిగా మారింది. (అక్కాచెల్లెలు అదృశ్యం..) పథకం ప్రకారం.. వంద రోజుల ఉపాధి పథకం కూలీలకు హెడ్గా ఉన్న అత్త రాజమ్మాల్ ఇంటికి రాగానే, ప్రతిరోజూ పాలు తాగడం అలవాటు. దీనిని ఆసరగా చేసుకుని ఆమెను మట్టుబెట్టేందుకు ప్రతిభ పథకం వేసుకుంది. వారం రోజులుగా ఒక్కక్కటి చొప్పున నిద్ర మాత్రల్ని మెడికల్ షాపు ద్వారా సేకరించింది. బుధవారం సాయంత్రం మామ అరుల్ పుళవన్ బయటకు వెళ్లడం, భర్త ఇంటికి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశాల్ని పరిగణలోకి తీసుకుంది. ఇంటికి వచ్చిన అత్త పాలు తాగింది. అప్పటికే అందులో నిద్ర మాత్రల్ని ప్రతిభ వేసింది. ఆ మత్తులో ఆమె నిద్రకు ఉపశ్రమించింది. తన కాపురంలో చిచ్చు పెట్టే రీతిలో వేధింపులు ఇవ్వడమే కాదు, భర్తను తనకు కాకుండా చేస్తానన్న అత్తను హతమార్చేందుకు ఉన్మాదిగా మారింది. ముందుగా సిద్ధం చేసుకున్న కిరోసిన్ను ఆమెపై పోసి నిప్పు పెట్టింది. ఏమీ ఎరుగనట్టుగా మరో గదిలోకి వెళ్లి నిద్ర పోయినట్టు నాటకం రచించింది. అయితే, ఈ ఇంట్లో నుంచి హఠాత్తుగా పొగ, కాలిన వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పరుగులు తీశారు. తలుపులు తెరిచే ఉండడంతో లోనికి వెళ్లారు. అక్కడ మంటల్లో రాజమ్మాల్ కాలుతుండడంతో ఆర్పే యత్నం చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా, కోడలు గదికే పరిమితం కావడం, గాడ నిద్ర నుంచి లేచినట్టు బయటకు రావడం స్థానికుల్లో అనుమానం రేకెత్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఆస్పత్రిలో రాజమ్మాల్ మరణించడం, సంఘటన స్థలంలో సాగిన పోలీసులు విచారణతో కోడలి బండారం బయటపడింది. భర్తకు మరో పెళ్లి చేస్తే, తాను, తన బిడ్డ ఒంటరి అవుతామన్న భయంతోనే ఈ కిరాతకానికి ఒడి గట్టాల్సి వచ్చిందని ప్రతిభ కన్నీటి పర్యంతమైంది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అత్త కోడళ్ల మధ్య సాగిన వరకట్న వేధింపులు, ఉన్మాద చర్య కారణంగా ముక్కు పచ్చలారని 9 నెలల చంటి బిడ్డ పాల కోసం అలమటిస్తుండడం కొసమెరుపు. -
తల్లీకూతురు సజీవ దహనం
సాక్షి, బళ్లారి: తల్లీకూతుళ్ల కిరోసిన్ పోసుకుని నిప్పుటించుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం బళ్లారి తాలూకా సంజీవరాయనకోట ఎస్సీకాలనీలో నివాసం ఉంటున్న తల్లి పార్వతమ్మ(60), కూతురు హులిగమ్మ(35) కుటుంబ సమస్యలతో జీవితంపై విరక్తి చెంది కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇరుగుపొరుగు గమనించేలోగా ఇద్దరూ సజీవ దహనం అయ్యారు. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. మంటలను ఆర్పేందుకు యత్నించగా అప్పటికే తీవ్రగాయాలతో ఇద్దరు మృతి చెందారు. పిల్లలు పుట్టలేదని చింత పార్వతమ్మ కుమార్తెను అదే గ్రామానికి చెందిన వ్యక్తితో 20 ఏళ్ల కిందట పెళ్లి చేశారు. తన కుమార్తెకు సంతానం కలగలేదని తల్లి బాధపడేది. భర్త పని మీద వేరే ఊరికి వెళ్లాడు. ఈ సమయంలో తల్లీకూతుళ్లు ఇద్దరూ కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘోరంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామీణ పోలీసులు అక్కడకి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా, మొదట గ్యాస్ సిలిండర్ పేలి మరణించారని ప్రచారం జరిగింది. పోలీసులు వచ్చిన పరిశీలించగా వారే నిప్పంటించుకున్నట్లు తేలింది. -
పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య
సాక్షి, చెన్నై: ప్రేమ వివాహం చేసుకున్న భర్తను పెళ్లైన 20 రోజులకే ఓ భార్య సజీవదహనం చేసింది. నిద్రిస్తున్న భర్తతో పాటు ఇంటిని కూడా తగల బెట్టేసింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనంలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టీవీ నగర్కు చెందిన దక్షిణా మూర్తి, మారియమ్మాల్ దంపతుల దత్త పుత్రుడు సేతుపతి దిండివనంకు చెందిన మురుగవేణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహమై 20 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సేతుపతి ఇళ్లు తగల బడుతుండడాన్ని స్థానికులు గుర్తించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది శ్రమించి మంటల్ని అదుపు చేశారు. ఇంటి బయట గడియపెట్టి ఉండడం, లోపల సేతుపతి సజీవ దహనమైన పడిఉండడం, మురుగవేణి కనిపించకపోవడంతో అనుమానాలు నెలకొన్నాయి. దిండివనంలో తల్లి కుముదాతో ఉన్న మురుగవేణిని శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా భర్తను సజీవ దహనం చేసి అగ్ని ప్రమాదం నాటకాన్ని ఆమె ఆడడం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ముందు బుద్ధిమంతుడుగా ఉన్న సేతుపతి, పెళ్లైన రోజు నుంచి ప్రతిరోజూ మద్యం తాగి రావడం, రాత్రుల్లో నరకం చూపిస్తుండడం, అనుమాన పడడం, నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా తిడుతుండడంతో అడ్డుతొలగించుకునేందుకు నిర్ణయించినట్టు పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. గురువారం సాయంత్రం పూటుగా మద్యం తాగి మత్తులో ఉన్న సేతుపతిని ఇంటితో పాటు తగులబెట్టి అగ్నిప్రమాదం జరిగినట్టుగా నాటకం ఆడానని వివరించారు. అయితే, బయట తాళం వేసి ఇరుక్కుపోయానని ఆమె పేర్కొంది. -
పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమిస్తున్నానని అంటే నమ్మింది. సన్నిహితంగా మెలగడంతో గర్భందాల్చింది. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో ప్రియుని చేతిలో సజీవదహనమై పోయింది. పుదుచ్చేరిలో చోటుచేసుకున్న ఈ ఘోర ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరి ఆరోరాలోని జీడిమామిడి తోటలో కాలిపోయిన స్థితిలో సుమారు 20 ఏళ్ల వయసున్న యువతి శవాన్ని గతనెల 30న పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు. యువతి ముఖం పూర్తిగా కాలిపోయి ఉండడంతో ఆమె ఎవరో గుర్తించేందుకు తీవ్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈనెల 2న ఆరోరా పోలీసుస్టేషన్కు అప్పాదురై అనే యువకుడు వచ్చి తన అక్క మూడురోజులుగా కనపడడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అప్పాదురై, అతని తల్లి మనోరంజితం, ఇద్దరు సోదరిలను పుదుచ్చేరి బీమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి యువతి శవాన్ని చూపగా ఆమె లక్ష్మీనేనని గుర్తించి గుండెలవిసేలా రోదించారు. హతురాలు లక్ష్మి పుదుచ్చేరి నెహ్రూ వీధిలోని దుకాణంలో పనిచేస్తుండగా అదే దుకాణానికి చెందిన వాహన డ్రైవర్ అరుణకుమార్తో స్నేహం ఏర్పడిందని, గత నెల 29న దుకాణానికి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన లక్ష్మి తిరిగి రాలేదని తల్లి మనోరంజింతం పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు అరుణ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా తన స్నేహితునితో కలిసి లక్ష్మీని హత్యచేసినట్లు అంగీకరించాడు. -
ప్రియుడు చేతిలో వివాహిత బలి..
షాద్నగర్ రూరల్: వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలం కలిసితిరిగారు. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎలాగైనా ఆమెను కడతేర్చాలని ప్రియుడు పన్నాగం పన్నాడు. ఆ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మహల్ ఎలికట్ట గ్రామంలో చోటు చేసుకుంది. సొంత కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితుడు మరో దారుణానికి ఒడగట్టిన సంఘటన సంచలనం రేకెత్తించింది. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మహల్ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములుకు అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళ జంగం మంగమ్మతో కొంతకాలంగా సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కొంత కాలంగా బాగానే ఉన్న ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. కొంత కాలంగా ఇరువురి మధ్య మాటలు లేకపోవడంతో మంగమ్మపై కోపం పెంచుకున్న రాములు ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పన్నాగం పన్నాడు. మంగళవారం సాయంత్రం కూలీ పనులు చేసి ఇంటికి ఒంటిరిగా వెళ్తున్న మంగమ్మను రాములు వెంబడించాడు. పథకం ప్రకారం ముందుగానే తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ను ఆమె ఒంటిపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలకు తాళలేక మంగమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పి ఆమెను వెంటనే షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మంగమ్మను హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మంగమ్మ పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీధర్కుమార్ సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. అయితే ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాంగ్మూలం నమోదు చేసిన జడ్జి... ప్రియుడు రాములు చేతిలో హత్యాయత్నానికి గురైన మంగమ్మ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఆశారాణి షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మంగమ్మ నుంచి వాగ్మూలం తీసుకున్నారు. అయితే మంగమ్మను సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన రాములు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండి ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడు. సొంత కుటుంబ సభ్యులను హతమార్చిన రాములు తాజాగా మరో దారుణానికి పాల్పడ్డాడు. -
ఇథియోపియాలో నగరవాసి మృతి!
హైదరాబాద్: తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్తను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవదహనం చేశారు. ఈ ఘటనలో నగరవాసి మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు ముషీరాబాద్లోని అశోక్నగర్ వాసి టీవీ శశిధర్గా అక్కడి పోలీసులు తేల్చారు. సన్రైజ్ మైనింగ్ పీఎల్టీ పేరిట ఇథియోపియాలో మైనింగ్ వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు రెండేళ్లుగా శశిధర్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తరచూ అక్కడికి వెళ్లి వస్తున్నారు. ఈనెల 9న మళ్లీ అక్కడకు వెళ్లిన శశిధర్ ముగ్గురు ఇథియోపియా దేశస్తులతో పాటుగా జపాన్కు చెందిన మరో వ్యక్తితో కలసి మంగళవారం రెండు కార్లలో బయటకు బయల్దేరారు. శశిధర్ రెండో కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో కొందరు దుండగులు అడ్డగించి కారును దహనం చేసేశారు. అయితే ముందు బయల్దేరిన మొదటి కారులోని వ్యక్తులు శశిధర్ కారు ఇంకా రావటం లేదని గమనించి వెనుదిరిగి చూసేసరికి కారు తగలబడిపోతున్నట్లు కన్పించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో శశిధర్ మృతి చెంది ఉండ వచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శశిధర్ నివాసం వద్ద విషాద ఛాయలు శశిధర్ మృతితో అశోక్నగర్లోని స్ట్రీట్ నంబర్ 2లోని జీహెచ్ఎంసీ–56 ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. శశిధర్కు భార్య, కూతురు తేజస్విని, కొడుకు అభిషేక్ ఉన్నారు. శశిధర్ మరణ వార్తను తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఇథియోపియాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా, ఆయన మృతికి సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. తరచూ తమతో మాట్లాడే శశిధర్ నుంచి గత రెండ్రోజులుగా ఎటువంటి సమాచారం లేదని, ఆయన ఫోన్ కూడా కలవలేదని శశిధర్ వ్యాపార భాగస్వామి రామకృష్ణ, శశిధర్కు చెందిన ఎగ్జిమ్ కంపెనీ మేనేజర్ సంతోష్ తెలిపారు. ఈ ఘటనలో శశిధర్ తప్పించుకుని ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. -
నడిరోడ్డుపై వ్యక్తి సజీవ దహనం..!
-
నడిరోడ్డుపై వ్యక్తి సజీవ దహనం..!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సనత్నగర్లోని స్నేహపురి కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇంట్లో నుంచి బయటికొచ్చిన వెంకటేష్ గుప్తా అనే వ్యక్తి ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. వ్యాపారంలో నష్టాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. వెంకటేష్ సజీవ దహనమవుతున్న దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ డ్రైవర్ సజీవ దహనం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల (నల్లజర్ల): రాష్ట్రీయ రహదారిపై ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. నల్లజర్ల మండలం దూబచర్లలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుది. స్థానికుల కథనం ప్రకారం.. నిడదవోలు మండలం సమిశ్రగూడెంకు చెందిన డ్రైవర్ సవరపు హరీష్ (25) టిప్పర్ లారీలో చిప్స్ లోడు వేసుకుని గౌరీపట్నం నుంచి గుండుగొలను వైపునకు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే గుజరాత్ నుంచి టైల్స్ లోడుతో వస్తున్న లారీ హరీష్ లారీని ఢీకొట్టింది. దీంతో చిప్స్ లోడు లారీ డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు చెలరేగాయి. రెప్పపాటులో లారీ అగ్నికి ఆహుతైంది. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన హరీష్ సజీవదహనమయ్యాడు. టైల్స్ లారీ డ్రైవర్ మాత్రం వాహనంలోంచి బయటకు దూకి ప్రా ణాలను దక్కించుకున్నాడు. సంఘటనా స్థలాన్ని నల్లజర్ల పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సమిశ్రగూడెంలో విషాద ఛాయలు నిడదవోలు రూరల్: నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామ వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్ సవరపు హరీష్ (25) అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. హరీష్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి భార్య సౌందర్యతో పాటు రెండేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలంలో హరీష్ మృతదేహన్ని చూసి కుటుంబసభ్యులు, బం«ధుమిత్రులు గుండెలవిసేలా రోధించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతాపం హరీష్ మరణవార్త తెలుసుకుని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. యువకుడైన హరీష్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని మృతి పార్టీకి, కుటుంబసభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు అయినీడి పల్లారావు, నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ గాజుల రంగారావు, సొసైటీ అధ్యక్షుడు గజ్జరపు శ్రీరమేష్, ఎంపీపీ మన్యం సూర్యనారాయణ, రాష్ట్ర నాయకులు ముళ్లపూడి శ్రీనివాసకుమార్చౌదరి తదితరులు సంతాపం తెలిపారు. -
కారే చితిగా మారిందా?
సురక్షితంగా గమ్యం చేరుస్తుందనుకున్న కారే చితిగా మారిపోయింది. పనిమీద మంగళూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురై మంటలపాలైంది. అందులోని కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. తెల్లవారురుజాము కావడంతో బాధితులఆర్తనాదాలు వినేవారే లేకపోయారు. కర్ణాటక, బనశంకరి: వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న భవనం గోడను డీకొనడంతో కారులో మంటలు చెలరేగి అందులోని నలుగురు సజీవ దహనమయ్యారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ దుర్ఘటన హాసన్ జిల్లా చెన్నరాయపట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.... బెంగళూరులోని చిక్కబాణవారలో వివేకనాయక్ (45) కుటుంబంనివాసముంటోంది. ఇతను బెంగళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఒక కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి మంగళూరుకు కారులో వెళ్లారు. బుధవారం రాత్రి అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు. ఆ సమయంలో వివేక్ నాయక్ కారు నడుపుతున్నాడు. మరుగుదొడ్డి గోడను ఢీకొని.. తెల్లవారుజామున హాసన్ జిల్లా చెన్నరాయపట్టణ ఉదయపుర వద్ద హైవే– 75పై వేగంగా వస్తు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న మరుగుదొడ్డి గోడను డీకొంది. కారు ఇంధన ట్యాంక్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. కారుమంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో సాయం చేసేవారెవరూ లేకపోయారు. వివేక్నాయక్ (45), భార్య రేష్మానాయక్ (38), కుమార్తె వినంతి నాయక్ (10) ఎనిమిదేళ్ల కొడుకు సజీవదహనమైయ్యారు. అప్పటికి కొందరు స్థానికులు వచ్చి రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చెన్నరాయపట్టణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
భార్య,కొడుకును కడతేర్చిన భర్త
-
చిన్నారి సహా తల్లి సజీవ దహనం
ఘట్కేసర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సీఐ రఘవీర్రెడ్డి కథనం మేరకు.. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులను కాల్చివేసినట్లు స్థానికులు, వీఆర్ఏ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన మాచెల్ల రమేష్, గూడూరుకు చెందిన కందిగ శుశ్రుత 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరివీ వేర్వేరు సామాజిక వర్గాలు. ఈ దంపతులకు 4 నెలల బాబు ఉన్నాడు. భర్తతో గొడవపడిన శుశ్రుత కొద్ది రోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సమస్యను పరిష్కరించుకుందామని భార్యను ఉప్పల్కు రమేశ్ పిలిపించాడు. కుమారుడితో కలిసి శుశ్రుత ఓఆర్ఆర్ వద్దకు వచ్చింది. ఈ సందర్భంగా వారి మధ్య మళ్లీ వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెందిన శుశ్రుత.. తాను నిద్రమాత్రలను మింగడమేగాక మరో మాత్రను పాలలో కలిíపి కుమారుడికి తాగించింది. ఆపస్మారక స్థితికి చేరుకున్న వారిని రాత్రి 9 గంటల ప్రాంతంలో రమేష్.. ప్రభాకర్ ఎన్క్లేవ్ ప్రాంతానికి తరలించి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం నేరుగా పాలకుర్తికి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సందర్భంగా.. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడైందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
భార్యను సజీవదహనం చేసిన భర్త
బీర్కూర్(బాన్సువాడ) : కట్టుకున్న భార్యను కిరోసిన్ పోసి నిప్పటించి సజీవదహనం చేసిన ఘటన బీర్కూ ర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి సంభవించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీకి చెందిన మెరిగె అశోక్కు మెరిగె లక్ష్మి(35)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాలుగా వారిమధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. భర్త అశోక్ రోజూ తాగివచ్చి భార్యను హింసించేవాడని చుట్టుపక్కల వారు వివరించారు. కాగా రోజు మాదిరిగానే ఆదివారం తాగి వచ్చిన భర్తతో లక్ష్మి గొడవ పడింది. అనంతరం అశోక్ తన ఇద్దరు పిల్లలను పక్కింట్లో పడుకోబెట్టాడు. అదే సమయంలో తల్లిదండ్రుల ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుమారుడిని బయటకు పంపించి వేసి అశోక్ తన భార్య లక్ష్మిపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. దీంతో సజీవదహనమైన లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చే రుకుని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎస్సై పూర్ణేశ్వర్ వివరించారు. -
వృద్ధురాలి సజీవ దహనం
విజయనగరం, గరివిడి: పూరిపాక కాలి వృద్ధురాలు సజీవ దహనమైన సంఘటన మండలంలోని కోనూరులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వట్టికాయల చింతమ్మకు (65) కొద్ది రోజుల కిందట ప్రమాదం జరగడంతో కాలు విరిగింది. అప్పటి నుంచి ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెకు కుమారుడు తవుడు, కోడలు సునీత ఉన్నారు. అయితే ఆమె కాలకృత్యాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్కు ఆనుకుని ఉన్న వారి కళ్లాల్లో పూరిపాక వేసి అందులో ఉంచారు. ప్రతిరోజూ అక్కడికి వెళ్లి ఆమెకు సేవలు అందించేవారు. ఆదివారం ఉదయం కూడా కుమారుడు,కోడలు ఆమెకు సపర్యలు చేపట్టి పొలం పనులకు వెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చింతమ్మ మంచం మీద నుంచి లేవలేకపోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రేమ వివాహం.. సజీవ దహనం
వారం కిందట జరిగిన ప్రేమ వివాహం... ఇరు కుటుంబాలను ఒప్పించి ఇద్దరూ ఒక్కటయ్యారు ... బంధు, మిత్రులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు...ఇందుకు వారం రోజుల ముందునుంచీ సందడే సందడి. ఆ రోజు రానే వచ్చింది. ఆ జంటలో ఆనందం ... ఓ వైపు వచ్చీపోయే వారితో ఆ ప్రాంగణం సందడిగా మారింది. అంతలోనే విషాదం...ఇరు వర్గాల మధ్య చిన్నగా ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. కత్తిపోట్ల వరకూ వెళ్లింది. ఇది సహించని ప్రత్యర్థివర్గం కత్తితో దాడి చేసిన అన్నదమ్ములపై దాడికి దిగారు. వారు పారిపోతున్నా వెంట తరిమారు. వారిద్దరూ ఓ ఇంటి గదిలో దాక్కున్న విషయం గమనించి పెట్రోలు పోసి నిప్పంటించడంతో సజీవ దహనమయ్యారు. కాపాడండంటూ ఆర్తనాదాలు చేస్తున్నా ... అక్కడే అందరూ ఉన్నా ... ఏ ఒక్కరూ రక్షించే సాహసం చేయలేకపోయారు. తూర్పుగోదావరి, శంఖవరం: శంఖవరం ఎస్సీపేటలో ఇద్దరి వ్యక్తుల సజీవ దహనంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామంలో ఎస్సీపేటలో పులి సుధాకర్, మీరా రాజేంద్రప్రసాద్, హత్యకు గురైన బత్తిన నూకరాజు, ప్రసాద్ మధ్య తలెత్తిన వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం డీఎస్పీ సీహెచ్వీ రామారావు, ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో ఎస్సీపేటలో కర్కట నాగేశ్వరరావు కుమారుడు ప్రసాద్, పులి మోజేష్ కుమార్తె శిరీషల ప్రేమ వివాహం సందర్భంగా గురువారం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పెళ్లి కుమారుడు తరఫు బంధువులు మృతులు బత్తిన నూకరాజు, ప్రసాద్, పెండ్లి కుమార్తె తరఫున పులి సుధాకర్, మేరా రాజేంద్రప్రసాద్ తదితరులు ఒకరినొకరు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో మృతులు నూకరాజు, ప్రసాద్లు ప్రత్యర్థి వర్గీయులైన పులి సుధాకర్, రాజేంద్రప్రసాద్ల వర్గీయులతో కవ్వింపు చర్యలు దిగి దాడి చేశారు. ఈ దాడిలో సుధాకర్, రాజేంద్రప్రసాద్లను బత్తిన నూçకరాజు, ప్రసాద్లు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ సుధాకర్, రాజేంద్రప్రసాద్ వారి అనుచరులతో కలసి నూకరాజు, ప్రసాద్లను వెంటాడారు. సుధాకర్, రాజేంద్రప్రసాద్ వర్గీయుల నుంచి తప్పించుకోవడానికి ముందుగా బుద్ధాల లోవరాజుకు చెందిన ఇంట్లోకి వెళ్లారు. అక్కడ ఆ ఇంటిపై దాడి చేయడంతో ప్రాణభయంతో మరలా ఎదురుగా ఉన్న పెండ్లి కుమారుడు తండ్రి కర్కాట నాగేశ్వరరావు ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో సుధాకర్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఆ ఇంటిని చుట్టుముట్టి గది తలుపులకు తాళాలు వేసి గది పక్కనే ఉన్న కిటికీలోంచి పెట్రోల్ బాటిళ్లు విసిరి నిప్పుపెట్టారు. దీంతో లోపల ఉన్న పర్నీఛర్ అంటుకుని మంటలు చెలరేగి గదిలో దాగి ఉన్న నూకరాజు, ప్రసాద్లు సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలంలో వందలాదిమంది ప్రజలు ఉన్నా సుధాకర్, రాజేంద్రప్రసాద్, తదితరులు చేస్తున్న దాడులకు భయపడి వారందరూ పరుగులు తీశారు. గ్రామంలో 144సెక్షన్ విధింపు ఘటనా స్థలానికి పెద్దాపురం ఆర్డీఓ వసంతరాయుడు, తహసీల్దార్ ఎం.సుజాత, పెద్దాపురం డీఎస్పీ సీహెచ్వీ రామారావు చేరుకున్నారు. గ్రామంలో పర్యటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. పోలీసుల అదుపులో పలువురి నిందితులు ఈ ఘటనకు సంబంధించి పలువురి నిందితులను పులి సుధాకర్, మేరా రాజేంద్రప్రసాద్, మేరా సుశీల, పులి కృష్ణ, కాపారపు సింహాచలం, కాపారపు నానిబాబు, తదితరులును అదుపులోకి తీసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ సీహెచ్వీ రామారావు తెలిపారు. పూర్తి నేరపరిశోధన జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. భయాందోళనలో ఎస్సీపేట బత్తిన నూకరాజు, బత్తిన ప్రసాద్ల హత్యతో శంఖవరం ఎస్సీపేటవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ హత్యాఘటనతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు హడలెత్తిపోతున్నారు. గ్రామంలో ఈ ఘోర హత్యతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. -
పెళ్లికి నిరాకరించిందనే...
బోడుప్పల్: పెళ్లికి నిరాకరించిందని ఓ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కేసులో నిందితుడిని మేడిపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మేడిపల్లి పోలీస్స్టేషన్లో మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్రావు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గోరఖ్పూర్ జిల్లాకు చెందిన రాకేష్రాయ్ పెయింటర్గా పని చేసేవాడు. గత ఆరేళ్లుగా బోడుప్పల్ దేవేందర్నగర్లో కాలనీలో ఉంటూ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. సమీపంలోని సీతారాం కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ కుమార్తె సయ్యద్ షన్ను భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటోంది. రాకేష్రాయ్తో కలిసి పని చేస్తున్న షన్నుకు అతడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత కొంత కాలంగా తనను పెళ్లి చేసుకోవాలని రాకేష్ షన్నుపై ఒత్తిడి చేస్తుండగా తనకు పిల్లలు ఉన్నందున పెళ్లి చేసుకోవడం కుదరని చెప్పింది. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. గత నెల 28న పెళ్లి విషయంపై మరో సారి గొడవ జరగగా పెళ్లికి నిరాకరించదన్న కోపంలో రాకేష్రాయ్ షన్నుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. షన్ను కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య అనంతరం పరారైన రాకేష్ను మేడిపల్లి ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం గోరఖ్పూర్లో అదుపులోకి తీసుకుంది. విచారణలో షన్నుతో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించదనే కోపంతోనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు తెలిపాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, ఎస్సై రఘురాం పాల్గొన్నారు. -
ముగ్గురి సజీవ దహనం
ఆత్మకూరు(పరకాల): తన తండ్రితో ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ మహిళపై అతడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమెతోపాటు అడ్డుకోబోయిన అతడి తండ్రి సజీవ దహనమయ్యారు. అదే సమయంలో మంటలు ఎగిసిపడి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో యువకుడి నానమ్మ కూడా సజీవ దహనమైంది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కంఠాత్మకూరులో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కంఠాత్మకూరుకు చెందిన మామిడి కుమారస్వామి(50) భార్యాపిల్లలతో హన్మకొండలో ఉంటూ ప్లంబర్ పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కంఠాత్మకూరుకు సమీప గ్రామమైన పులుకుర్తికి చెందిన పోతరాజు సుమలతతో కుమారస్వామికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. సుమలతతో ఉంటూ కుమారస్వామి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతడి కుమారుడు కార్తీక్ కక్షపెంచుకున్నాడు. ఆదివారం రాత్రి తన తండ్రి సుమలతతో కంఠాత్మకూరులోనే ఉన్నాడని తెలుసుకొని నేరుగా ఇంటికి పెట్రోల్ డబ్బాతో వెళ్లి సుమలతపై పెట్రోల్ చల్లాడు. కుమారస్వామి అడ్డుకోబోగా అతడిపై కూడా పెట్రోల్ పడింది. వెంటనే సుమలతకు కార్తీక్ నిప్పంటించగా, మంటలార్పే ప్రయత్నంలో కుమారస్వామికి కూడా అంటుకొని సజీవ దహనమయ్యారు. అదే సమయంలో మంటల కారణంగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో కుమారస్వామి తల్లి మామిడి రాజమ్మ(70) కూడా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో కుమారస్వామి తండ్రి లింగయ్య తప్పించుకొని స్వల్పగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. కుమారస్వామి సోదరి కోమల ఫిర్యాదు మేరకు ఎస్సై మోహన్బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐసిస్పై లక్ష మిసైళ్లు
ఐసిస్.. సిరియా, ఇరాక్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు నిర్వహించి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న రాక్షసమూక. పశ్చిమాసియా దేశాలైన సిరియా, ఇరాక్లో గణనీయమైన భూభాగాన్ని అక్రమించుకుని ఖలీఫత్ పేరిట 2014లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆయిల్, ఇతర సహజవనరుల్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఆ సొమ్ముతో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద భావజాలానికి మద్దతుగా నిలిచింది. మైనారిటీ మతస్తుల్ని బందీలుగా చేసుకుని గొంతు కోసి హతమార్చడం, తమ భావజాలాన్ని వ్యతిరేకించే సొంత మతస్తుల్ని సజీవ దహనం చేయడం వంటి దారుణ చర్యలతో వణుకు పుట్టించింది. అయితే ఇదంతా గతం. 2014లో ఐసిస్ను అణచివేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున వైమానిక దాడులకు ఆదేశాలిచ్చారు. చివరికి 2017, అక్టోబర్లో ఐసిస్ ఉగ్రవాదులు నక్కిన చివరి నగరమైన రక్కాను సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకోవడంతో ఐసిస్ను ఓడించేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించారు. అయితే నిజంగానే ఐసిస్ను పూర్తిగా అణచేశారా? భవిష్యత్లో ఉగ్రదాడులు చేయడానికి వీల్లేకుండా దాన్ని ఆర్థికమూలాల్ని పూర్తిగా నాశనం చేశారా? అంటే జవాబు కాదనే వినిపిస్తోంది. ఈ విజయం తాత్కాలికమే: జమాత్–అల్–తావీద్–వల్–జీహాద్ (జేటీజే) పేరుతో 1999లో ఏర్పడ్డ ఈ సంస్థ.. క్రమక్రమంగా పశ్చిమాసియాలో పట్టు పెంచుకోవడం ప్రారంభించింది. లాడెన్ నేతృత్వంలోని అల్కాయిదాకు విధేయత ప్రకటించుకున్న జేటీజే.. 2003లో ఇరాక్పై–అమెరికా యుద్ధంలో పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా దాడులకు పాల్పడింది. 2014 నాటికి ఇరాక్, సిరియాల్లో గణనీయమైన భూభాగాన్ని స్వాధీనం చేసుకుని సంస్థ పేరును ఐసిస్గా మార్చుకుంది. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా సిరియా, ఇరాక్, ఫ్రాన్స్, బెల్జియం సహా 29 దేశాల్లో 140 ఉగ్రదాడులకు పాల్పడి వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. కశ్మీర్లోనూ అల్లరిమూకలు ఐసిస్ జెండాలు ప్రదర్శించంపై భారత నిఘా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ రక్షణ సంస్థ నివేదిక ప్రకారం సంకీర్ణ సేనలు ఐసిస్ అధీనంలోని 29,741 స్థావరాలపై ఇప్పటివరకూ 1,07,814 మిస్సైళ్లను, బాంబుల్ని ప్రయోగించాయి. ఈ దాడుల్లో 60,000 మంది ఉగ్రవాదులు, 6,321 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, మరోవైపు రష్యా, ఇరాన్, సాయంతో పోరాడుతున్న సిరియన్ బలగాలు ఐసిస్ కబంధ హస్తాల నుంచి చాలా పట్టణాలకు విముక్తి కల్పించాయి. అయితే ఈ విజయం తాత్కాలికమేననీ, ఇరుపక్షాల మధ్య దీర్ఘకాలిక పోరాటానికి ఇది ఆరంభమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకూ అఫ్గాన్లో 17 మంది అమెరికన్ కమాండర్లు మారినా పరిస్థితి మారకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. సోషల్ మీడియానే ఆయుధం: సంకీర్ణ సేనలు, రష్యా, ఇరాన్ బలగాల వరుస దాడులతో కుదేలయినప్పటికీ ఈ ప్రాంతంలో ఐసిస్ తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోలేదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్ దేశాలపై ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడాలని సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు ఉగ్రవాదులు విషాన్ని నూరిపోస్తున్నారని తెలిపారు. సరికొత్తగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా యుద్ధాలు, ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా ఉన్న యువతను భారీగా భర్తీ చేసుకుంటూ ఐసిస్, ఇతర ఉగ్రసంస్థలు శక్తిమంతంగా మారేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. ఉగ్రమూకల్ని అణచివేయడంలో సైనిక చర్య ద్వారా తాత్కాలిక ఫలితాలను మాత్రమే సాధించగలమనీ, దీర్ఘకాలంలో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాబోదన్నారు. ఈ దేశాల్లో సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారానికి యత్నించినప్పుడు సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. ► సంకీర్ణ సేనలు లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ స్థావరాలు 29,741 ► ఐసిస్పై ప్రయోగించిన మిస్సైళ్లు, బాంబులు 1,07,814 ► హతమైన ఉగ్రవాదులు 60,000 ► చనిపోయిన పౌరులు 6,321 ► ఐసిస్ పంజా విసిరిన దేశాలు 29 ► ప్రపంచవ్యాప్తంగా జరిపిన ఉగ్రదాడులు 140 ► ఐసిస్ వద్ద ఆధునిక మెషీన్గన్ల నుంచి రసాయన ఆయుధాల వరకు ► ఇటీవలే బల్గేరియా నుంచి ఓ శక్తివంతమైన మిసైల్ను కూడా ఐసిస్ సేకరించిందన్న అమెరికా -
ఎస్కేప్... ఎస్కేప్... ఎస్కేప్!
సాక్షి, సిటీబ్యూరో: కుటుంబ కలహాల నేపథ్యంలో బావమరిదిపై పగబట్టాడు... అతడితో పాటు కుటుంబాన్నీ అంతం చేస్తానని బెదిరించాడు... చివరకు ఈ నెల 4న నిద్రిస్తున్న వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు... ఇద్దరు చిన్నారుల సహా ముగ్గురిని పొట్టనపెట్టుకున్నాడు... ఇంత వరకు కథ కర్ణాటకలోని గుల్బర్గాలో (కాలబురిగి) జరిగినా ఆపై సీన్ సిటీకి మారింది... అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు అఫ్జల్గంజ్ ప్రాంతంలో తలదాచుకున్నాడు... వెతుక్కుంటూ వచ్చిన పోలీసుల నుంచి మూడుసార్లు తప్పించుకున్నాడు.. చివరకు అజ్మీర్లో చిక్కి పారిపోయే ప్రయత్నాల్లో దాదాపు రెండు కాళ్ళూ పోగొట్టుకున్నాడు. భార్యాభర్తల మధ్య రాజీ ప్రయత్నం... గుల్బర్గాలోని హుస్సేన్గార్డెన్స్ సమీపంలోని ఇక్బాల్ కాలనీలో నివసించే మహ్మద్ ముస్తాఫాకు కొన్నేళ్ల క్రితం సేదాం రోడ్కు చెందిన సయ్యద్ అక్బర్ సోదరితో వివాహమైంది. భార్యభర్తల మధ్య స్పర్థలు రావడంతో పాటు ముస్తాఫా తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడు. నేరచరితుడైన ఇతడిపై అప్పటికే గుల్బర్గాలోని పలు పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. తన సోదరికి నిత్యం నరకం చూపిస్తున్న మస్తాఫాతో మాట్లాడి, భార్యభర్తల మధ్య రాజీ చేయాలని అక్బర్ భావించాడు. దీనికోసం గత నెలలో ముస్తాఫాను పిలిచి మందలించాడు. అప్పటి నుంచి విచక్షణ కోల్పోయిన ముస్తాఫా నీతో పాటు నీ కుటుంబాన్నీ అంతం చేస్తానం టూ అక్బర్ను బెదిరిస్తూ వచ్చాడు. చివరకు ఈ నెల 4 రాత్రి అక్బర్ ఇంటికి వెళ్లిన ముస్తాఫా నిద్రిస్తున్న అతడి కుటుంబంపై పోసి కిరోసిన్ నిప్పుపెట్టాడు. దీంతో అక్బర్తో (45) పాటు అతడి భార్య షైనాజ్ (35), కుమార్తె సానియా (17), కుమారుడు యాసీన్ (19) లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్బర్, షైనాజ్ మరణించారు. సిటీకి మారిన సీన్... దాదాపు 80 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న సానియా, యాసీన్లను మెరుగైన చికిత్స నిమిత్తం గుల్బర్గా పోలీసులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ముస్తాఫా సైతం ఈ నెల 7న నగరానికి వచ్చాడు. ఇతగాడి కోసం ముమ్మరంగా గాలించిన గుల్బర్గా పోలీసులు సాంతికేతిక ఆధారాలను బట్టి అఫ్జల్గంజ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో గుల్బర్గాలోని ఆర్జీనగర్ సబ్–ఇన్స్పెక్టర్ అక్కమహాదేవి నేతృత్వంలో సిటీకి వచ్చిన ఓ ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలించింది. 9న అఫ్జల్గంజ్, 10న సికింద్రాబాద్, 13న పటాన్చెరుల్లో ముస్తాఫా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. మరోపక్క సానియా చికిత్స పొందుతూ ఈ నెల 8న కన్నుమూసింది. నగరం నుంచి రాజస్థాన్లోని అజ్మీర్కు వెళ్లిన ముస్తాఫాను గుల్బర్గా పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి శుక్రవారం గుల్బర్గా తరలించారు. దర్యాప్తులో భాగంగా సేదాం రోడ్లో ఉన్న ఘటనాస్థలికి తీసుకువెళ్ళగా... ముగ్గురు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో రెండుకాళ్లపై కాల్పులు జరిపిన పోలీసులు అతడిని నిలువరించారు. ప్రస్తుతం గుల్బర్గా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతడి కాళ్లు పని చేసే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. -
మహిళపై గ్యాంగ్ రేప్.. సజీవ దహనం
సంభాల్: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై గ్యాంగ్రేప్నకు పాల్పడ్డ దుండగులు ఆమెను సజీవ దహనం చేశారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా గున్నార్ ప్రాంతం పాతక్పూర్లో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ(30) తన కూతురితో కలిసి ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన ఆరామ్ సింగ్. మహావీర్, చరణ్ సింగ్, గుల్లూ, కుమార్పాల్ అనే వ్యక్తులు బలవంతంగా లోపలికి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు తెలిపింది. దీంతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా ఈ అఘాయిత్యాన్ని వివరించింది. ఇంతలోనే తిరిగి వచ్చిన నిందితులు ఆమెను సమీపంలో ఉండే ఆలయ ప్రాంగణంలో యజ్ఞశాలగా భావిస్తున్న గుడిసెలోకి ఈడ్చుకెళ్లి నిప్పుపెట్టారు. మంటల్లో ఆమె మృతి చెందగా నిందితులు పరారయ్యారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితులపై గ్యాంగ్రేప్, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి నేరాలకుగాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో అకీల్ అహ్మద్ తెలిపారు. మృతురాలి భర్త కూలి పనులు చేసుకుంటూ ఘజియాబాద్లో ఉంటుండగా కొంతకాలంగా నిందితులు మృతురాలిని వేధిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. అయితే, ఆమెపై గ్యాంగ్రేప్ జరిగినట్లు నిర్ధారించేందుకు పోస్ట్మార్టం నివేదిక సరిపోదనీ, అందుకే అవసరమైన నమూనాలను మొరాదాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నామని సంభాల్ ఎస్పీ భరద్వాజ్ చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
భార్య, ఆమె ప్రియుడు సజీవ దహనం
ముత్తుకూరు: ఇంట్లో తన భార్య ప్రియుడితో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టి, ఇద్దరినీ సజీవ దహనం చేశాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం పంచాయతీ కోళ్లమిట్టలో మడపాక కవిత (34), హరిబాబు దంపతులు నివాసం ఉంటున్నారు. పంటపాళెం దళితవాడకు చెందిన నన్నం శ్రీనివాసులు (36) కవితతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కాగా, బుధవారం భార్య, ఆమె ప్రియుడు లోపల ఉన్న విషయం తెలుసుకున్న హరిబాబు పూరింటి తలుపుకి గడియపెట్టి, ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఇంటి లోపల ఉన్న ఇద్దరు ఆర్తనాదాలు చేస్తుంటే హరిబాబు కర్ర చేత పట్టి ఎవరూ వారిని రక్షించకుండా భయపెట్టాడు. స్థానికులు చూస్తుండగానే ఇంట్లోని సామగ్రితోపాటు కవిత, శ్రీనివాసులు పూర్తిగా సజీవదహనమయ్యారు. ఇంతలో స్థానికులు కొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి హరిబాబును పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకుని పారిపోయాడు. -
లారీ డ్రైవర్ సజీవ దహనం
భీమవరం అర్బన్: భీమవరం మండలం లోసరి గ్రామంలో టిప్పర్ లారీకి విద్యుత్ వైరు తగిలి మంటలు చెలరేగి లారీతోపాటు డ్రైవర్ కాలిపోయిన దుర్ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లోసరి గ్రామంలో జాతీయ రహదారి 216(ఏ) విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా జి.కొండూరు నుంచి కంకర రాళ్లను సుమారు 10 టిప్పర్ లారీల ద్వారా చేరవేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం అర్ధరాత్రి ఏపీ16టీఈ 6850 లారీ నుంచి రాళ్ల అన్లోడింగ్కు హైడ్రోలిక్ సిస్టం ద్వారా ట్రక్కును పైకి లేపి రాళ్లు అన్ లోడింగ్ చేశారు. అన్ లోడింగ్ అయిన తరువాత ట్రక్కును యథాస్థానానికి దించకుండా ముందుకు లారీని పోనివ్వటంతో పైనున్న 11 కేవీ విద్యుత్ వైరు లారీ పైభాగంలో తగిలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో జి.కొండూరు గ్రామానికి చెందిన డ్రైవర్ పొజ్జూరు నరసింహరావు (45) లారీలో సజీవ దహనమైపోయాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నరసింహరావు మోకాళ్ల వరకు ఎముకలు కూడా మిగిలకుండా దహనమైన ఘటన స్థానికులను కలచి వేసింది. నరసింహరావుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తెకు ఇటీవలే వివాహం చేశాడు. అతని కుమాడు పొజ్జూరు గోపి ఫిర్యాదు మేరకు భీమవరం రూరల్ ఎస్సై శ్రీరామచంద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ సజీవ దహనం
ముత్తుకూరు: ముత్తుకూరు ఇందిరమ్మ కాలనీలో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. అందులో నిద్రపోతున్న ఓ మహిళ సజీవ దహనమైంది. ఎస్సై సాంబశివరావు కథనం మేరకు.. భర్త లేని ఉప్పల రాధమ్మ (40) ఇందిరమ్మ కాలనీలోని పూరింట్లో పోర్టులో పనిచేసే ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమెకు కొడుకు, కూతురు ఉండగా, వీరు దూరంగా ఉంటున్నారు. వరుసకు అత్త అయిన ఈశ్వరమ్మ కూడా రాధమ్మతో ఉంటుంది. ఇద్దరూ మద్యానికి అలవాటు పడ్డారు. రెండు రోజుల క్రితం వచ్చిన వితంతు పింఛన్ డబ్బుతో రాధమ్మ మద్యం తాగి, ఇంట్లో పడుకొంది. రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రేగిన మంటలు పూరింటిని పూర్తిగా దహించాయి. సామగ్రి అంతా పూర్తిగా కాలిపోయింది. నిద్రిస్తున్న రాధమ్మ కూడా సజీవ దహనం అయింది. రాధమ్మ మృతిపై అనుమానాలు? అయితే అత్త ఈశ్వరమ్మ, రాధమ్మ మధ్య గొడవలు ఉన్నాయి. మద్యం మత్తులో రాధమ్మ నిద్రిస్తుండగా, ఈశ్వరమ్మ ఇంటి తలుపులకు గొళ్లెం పెట్టి, నిప్పు అంటించినట్టు స్థానికులు కొందరు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆమెను విద్యుత్ స్తంభానికి కట్టేసి, దేహశుద్ధి చేశారు. అనంతరం పో లీసులు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా కట్టు కథ అని ఎస్సై సాంబశివరావు అన్నా రు. నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పో స్టుమార్టం నిర్వహించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. -
కత్తితో పొడిచి...నువ్వుల నూనెతో కాల్చి..
అమీర్పేట: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలోని ఓ అపార్ట్మెంట్లో సోమ వారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులో స్థిరపడిన విశాఖపట్నానికి చెందిన పున్నారావు, ర మణి దంపతుల కుమార్తె సౌమ్యకు (25) అదే ప్రాంతానికి చెందిన సీతారామారావు, రత్నమాంబ దంపతుల కుమారుడు నాగభూషణంతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది కిత్రం నాగభూషణం భార్య సౌమ్య, కుమారుడు సాయి దత్తాత్రేయతో కలిసి నగరానికి వచ్చి ఎర్రగడ్డ , నందనగర్లోని సూరజ్ ఆర్కేడ్స్ ఫ్లాట్ నెంబర్ 104లో ఉంటున్నాడు. యూసుఫ్గూడలోని హైదరాబాద్ మెట్రో కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న నాగభూషణం సోమవారం రాత్రి 8.30 ప్రాంతంలో నైట్ డ్యూటీకి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి పోయాడు. సౌమ్య తన కుమారుడితో కలిసి ఇంట్లో పడుకుంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాం తంలో ఫ్లాట్లో నుంచి దట్టమైన పొగలు వస్తుండటాన్ని గుర్తించిన పక్కింట్లో ఉండే విశాల్ అ క్కడికి వెళ్లి చూడగా తలుపులు బయ టి నుంచి గడియపెట్టి ఉన్నాయి. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా సౌమ్య మంటల్లో కాలిపోతూ కనిపించింది. కొద్ది దూరంలో ఏడుస్తూ ఉన్న ఆమె కుమారుడిని రక్షించి పోలీసులకు సమాచారం అందజేశారు. అపార్ట్మెం ట్ వాసులు అతికష్టంపై మంటలను ఆర్పివేశా రు. కాగా సౌమ్య శరీరంపై నువ్వుల నూనె పోసి నిప్పటించడమేగాక, తప్పించుకునేందుకు వీలులేకుండా బయటి నుంచి గడియ పెట్టి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృ తురాలి ఒంటిపై మూడు కత్తి పోట్లు ఉన్నాయని, అరవకుండగా గొంతు నులిమి గదిలో ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. బాత్రూం ఫ్లెష్లో పడి ఉన్న ఓ సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘ టనా స్థలాన్ని పశ్చిమ మండలం డీసీపీ, పంజగుట్ట ఏసీపీ సందర్శించారు. అల్లుడిపై అత్తామామ అనుమానం సౌమ్య హత్యపై అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి. భర్త నాగభూషణంపై సౌమ్య తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త నైట్ డ్యూటీకి వెళితే బయటి వ్యక్తులు ఇంటికి వచ్చే అవకాశం ఉండదని, లేదా తనకు తెలిసిన వ్యక్తులతో హత్య చేయించి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అపార్ట్మెంట్ పరిసరాల్లో సీసీ కెమెరాలు లేనందున వివరాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. సౌమ్య తండ్రి పున్నారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
మదనపల్లె క్రైం: పెళ్లైన ఐదు నెలలకే అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. ఆమె తీసుకురాకపోవడంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాలతో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. అంగళ్లు పంచాయతీ నందిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్బాషా తన కుమార్తె షమీనా(20)ను ఐదు నెలల క్రితం అంగళ్లుకు చెందిన ఎస్కె ఇస్మాయిల్కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఐదు నెలలకే ఆమెపై అత్తవారి వేధింపులు మొదలయ్యాయి. భర్త ఇస్మాయిల్, ఆడ బిడ్డ గుల్జార్, అత్తామామలు రెడ్డిబూ, దస్తగిరి అదనపు కట్నం తీసుకురావాలని షమీనాను వేధిస్తున్నారు. ఆమె తీసుకురాలేదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఇంటిలో గొడవ పడ్డారు. రాత్రి 7 గంటల సమయంలో భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటిం చాడు. దీంతో షమీనా తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని షమీనాను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్తతో పాటు అత్తామామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
వృద్ధురాలి సజీవ దహనం
బుచ్చిరెడ్డిపాళెం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటల కారణంగా టి.చెంచమ్మ అనే వృద్ధురాలు సజీవదహనమైన సంఘటన మండలంలోని పెనుబల్లిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామంలోని కోవూరు కాలువ పక్కనే టి.చెంచమ్మ(82) నివాసముంటోంది. కుమారుడు సుబ్బయ్య భోజన వసతి సమకూర్చుతుడంతో కాలం గడుపుతోం ది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు బయటకు వచ్చి చూడగా కళ్లముందే గుడిసె మొత్తం తగలబడిపోయింది. గుడిసెలో ఉన్న చెంచమ్మ సజీవదహనమైంది. అక్కడి పరిసరాలను పరిశీలించగా విద్యుత్ తీగలు తెగి పడి ఉన్నాయి. విద్యుత్షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. -
అజర్బైజాన్లో ఘోర అగ్ని ప్రమాదం
బాకు: అజర్బైజాన్ రాజధాని బాకులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. కలపతో నిర్మించిన పునరావాస కేంద్రంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో కదల్లేని స్థితిలో ఉన్న రోగులు సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 200 మంది రోగులను, అక్కడి సిబ్బందిని రక్షించారు. దాదాపు 10 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ప్రమాద కారణాలపై మరింత లోతుగా విచారణ సాగుతోందని అధికారులు చెప్పారు. అజర్బైజాన్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. -
‘లవ్ జిహాద్’ దారుణం!
జైపూర్: ‘లవ్ జిహాద్’కు పాల్పడ్డాడని రాజస్తాన్లో ఓ ముస్లిం కూలీని మరో వ్యక్తి అత్యంత పాశవికంగా నరికి సజీవ దహనం చేశాడు. రాజసమంద్ జిల్లాలోని రాజ్నగర్లో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితుడిని పశ్చిమబెంగాల్కు చెందిన మహమ్మద్ అఫ్రాజుల్(48)గా, హంతకుడిని స్థానికుడైన శంభులాల్ రాయ్గర్గా గుర్తించారు. పోలీసులు శంభూలాల్తో పాటు అతడి మేనల్లుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే విస్తృతంగా వ్యాపించిన ఆ వీడియోలో... హంతకుడు గొడ్డలితో బాధితుడిని నరికి, ఆ తరువాత కిరోసిన్ పోసి సజీవంగానే దహనం చేసినట్లు కనిపించింది. తనను వదిలిపెట్టాలని బాధితుడు మొరపెట్టుకుంటున్నా కనికరించలేదు. లవ్ జిహాదీలంతా దేశం విడిచిపోవాలని లేదంటే వారికీ ఇదే గతి పడుతుందన్నాడు. సగం కాలిన శరీరంతో ఉన్న వీడియో చూడటానికి కూడా జుగుప్సాకరంగా ఉంది. ఈ వీడియో మరింత మందికి చేరకుండా నిరోధించడానికి రాజసమంద్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. హత్యకు నిందితుడు వాడిన గొడ్డలి, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు అఫ్రాజుల్ బెంగాల్లోని మాల్డా నుంచి జీవనోపాధి కోసం రాజస్తాన్కు వలసవచ్చాడు. తమ కుటుంబంలో సంపాదిస్తున్నది అతనొక్కడేనని, హంతకుడిని కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
మత్తులో భార్యను సజీవ దహనం చేశాడు
సాక్షి, చెన్నై : మద్యం మత్తులో భార్య మీద పెట్రోల్ పోసి ఓ కిరాతక భర్త సజీవ దహనం చేశాడు. చెన్నై వేళచ్చేరి సమీపంలోని మేడవాక్కం రాందాసు నగర్కు చెందిన రాజేష్(35), సంధ్య(32) తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి జయ విక్రమ్(8), జయ చరణ్(4) పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా పనికి కూడా వెళ్లకుండా రాజేష్ మద్యానికి బానిస అయ్యాడు. దీంతో సంధ్య కుటుంబ పోషణ కోసం సమీపంలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. తాను పనికి వెళ్లపోగా, ఆమెను కూడా వెళ్లనీయకుండా అడ్డుకునే విధంగా భార్యతో రాజేష్ ప్రతి రోజూ గొడవ పడడంమొదలెట్టాడు. అలాగే, ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి మద్యం సేఇంచి ఇంటికి వచ్చిన రాజేష్ భార్యతో గొడవ పడ్డాడు. అదే సమయంలో రాజేష్ సోదరుడు జయగణేష్ అక్కడికి వచ్చి అన్నయ్యకు నాలుగు మంచి మాటలు ఉపదేశించి వెళ్లాడు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన రాజేష్ అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సంధ్య మీద పెట్రోల్పోసి నిప్పు పెట్టాడు. ఆమె అరుపులకు పిల్లలు ఆందోళనతో కేకులు పెట్టడం మొదలెట్టారు. దీంతో రాజేష్ ఇంటినుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించగా, అతడ్ని సంధ్య వదలి పెట్ట లేదు. అతడ్ని వాటేసుకోవడంతో మంటలు ఇద్దరినీ చుట్టుముట్టాయి. పిల్లలు పెడుతున్న కేకల్ని విన్న ఇరుగు పొరుగు వారు అక్కడికి వచ్చేలోపు సంధ్య సజీవ దహనం అయింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న రాజేష్ను కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మేడవాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని చిన్నారి సజీవదహనం
సాక్షి, బెంగళూరు(బెళగావి): తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తుందేమోనన్న అనుమానంతో ఐదేళ్ల చిన్నారిని ఓ మహిళ సజీవంగా దహనం చేసిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు...బెళగావి జిల్లాలోని హీరేబెళకట్టి గ్రామానికి చెందిన శివప్ప, రేణుకల సంతానం రాజేశ్వరి(5). వీరి ఇంటికి ఎదురుగా నిర్మల(32) అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమె రాజేశ్వరిని రెండు రోజుల క్రితం బహిర్భూమికని చెబుతూ వెంట తీసుకెళ్లింది. పొదల్లోకి వెళ్లిన తరువాత వెంట తెచ్చిన కిరోసిన్ను చిన్నారి రాజేశ్వరిపై పోసి నిప్పంటించింది. అనంతరం నిర్మల పారిపోయింది. పాప కేకలు విన్న గ్రామస్తులు చిన్నారని హుటాహుటిన సమీపంలోని ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ కేసు విచారణను ప్రారంభించిన పోలీసులు నిర్మలను విచారించగా చిన్నారి తండ్రి శివప్పతో నిర్మలకు అక్రమ సంబంధం ఉందని, ఈ విషయాన్ని రాజేశ్వరి చూసిందని, తమ అక్రమ సంబంధానికి ఆ చిన్నారి అడ్డొస్తుందేమోనన్న భయంతో ఈ పని చేశానని చెప్పినట్లు సమాచారం. -
నలుగురు సజీవ దహనం
-
నలుగురు సజీవ దహనం
కామవరపుకోట: పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం వీరిశెట్టి గూడెంలోని ఒక ఇంట్లో గురువారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో నిద్రలోనే నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో తల్లీ ఇద్దరు కూతుర్లు, మరో బాలుడు మృతి చెందగా ఇంకో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇది ప్రమాదమా.. పథకం ప్రకారం భర్త అఘాయిత్యమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులు గ్రామానికి చెందిన కేతా లక్ష్మి(35), కుమార్తెలు కాశీ అన్నపూర్ణేశ్వరి (11), లావణ్య(4), పితాని రంగమ్మ కుమారుడు పితాని మణికంఠ (12)లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో లక్ష్మి వదిన పితాని రంగమ్మ గాయపడింది. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు, కుటుంబ సభ్యులు భిన్న కథనాలు వినిపిస్తున్నారు. పథకం ప్రకారమే ఇంటికి నిప్పంటించి నిద్రిస్తున్న వారిని హతమార్చారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. లక్ష్మికి అయిదేళ్ల క్రితం ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన కేతా నాగేశ్వరరావుతో ద్వితీయ వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో నాలుగు నెలల నుంచి విడిగా ఉంటున్నారు. లక్ష్మి వీరిశెట్టిగూడెంలోని పుట్టింట్లో ఉంటుండగా, నాగేశ్వరరావు రామన్నగూడెంలో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో లక్ష్మి బుధవారం డ్వాక్రా గ్రూపునకు సంబంధించిన పనిమీద రామన్నగూడెం వెళ్లగా అక్కడ నాగేశ్వరరావు లక్ష్మితో ఘర్షణ పడినట్లు బంధువులు తెలిపారు. రాత్రికే ఇలా జరగడంతో వారు అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
మరణంలోనూ వీడని బంధం
⇒షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం ⇒వృద్ధ దంపతుల సజీవ దహనం ⇒మదనపల్లె పట్టణంలో విషాదం వారు పెళ్లినాడు చేసిన నాతిచరామి అన్న బాసను ఏనాడూ మరువలేదు. 50 ఏళ్లుగా కష్టసుఖాల్లో తోడూనీడగా ఉన్నారు. పిల్లలు రెక్కలు వచ్చి దూర ప్రాంతాలకు వెళ్లిపోయినా నీకు నేను.. నాకు నీవు.. ఒకరికొకరం నువ్వూ.. నేను.. అని అనుకున్నారు. చుట్టుపక్కల వారికి ఆదర్శంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న ఈ ఆదర్శ దంపతులు ఇద్దరూ శుక్రవారం అనుకోని విధంగా జరిగిన ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఈ హృదయ విదారకమైన సంఘటన మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. మదనపల్లె క్రైం: మదనపల్లెలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ ఏర్పడిన ప్రమాదంలో వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ విషాదకర సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం నెహ్రూ బజార్లో మాకం నిరంజన్శెట్టి(78), సరస్వతమ్మ(68) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శ్రీహర్ష, రోహిత్కుమార్ ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. శ్రీహర్ష బెంగళూరులో, రోహిత్కుమార్ లండన్లో స్థిరపడ్డారు. 20 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. నిరంజన్శెట్టికి ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు. వారు కూడా పక్కపక్క ఇళ్లలో ఉంటూ వ్యాపారులు చేస్తున్నారు. నిరంజన్శెట్టి, సరస్వతమ్మ ఇంటిలో ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి 10 గంటల సమయంలో షాపులో పనిచేసే అటెండర్ మోహన్ అంగడి మూసేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నిరంజన్ తమ్ముడు మోహన్ రోజూ మాదిరిగానే అన్న, వదిన యోగక్షేమాలను ఆరాతీసి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం 10 గంటలకు షాపు తెరిచేందుకు వచ్చిన అటెండర్ మోహన్ తలుపుతడితే యజమాని గడియతీయలేదు. దీంతో పక్కనున్న ఓనర్ తమ్ముడు నరేంద్రకు విషయం తెలిపాడు. వారు ఇంటి వద్దకు చేరుకుని తలుపులు తట్టినా గడియ తీయలేదు. అనుమానం వచ్చి నిచ్చెన సాయంతో మిద్దెపైకి చేరుకున్నారు. వెనుక మెట్ల దారిలో కిందికి దిగి పరిశీలించారు. వంట గదిలో నుంచి వస్తున్న పొగలను గుర్తించి అప్రమత్తమయ్యారు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా మంటల్లో కాలిపోయి ఉన్న వృద్ధ దంపతులను గుర్తించారు. ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ నిరంజన్కుమార్, ఎస్ఐ సుకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. సరస్వతమ్మ మృతదేహం పూర్తిగా కాలిపోయింది. నిరంజన్శెట్టి మృతదేహం తల మాత్రమే ఉంది. పోలీసులు పంచనామా చేసి కేసు నమోదు చెసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా...? అసలే వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆ వృద్ధ దంపతులు సొంత పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నారు. దీనికితోడు ఒంటరితనం. బిడ్డల యడబాటు వారిని కలచివేయడంతో వంట గదిలో నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు లేనందున ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో చనిపోయి ఉంటా రని పోలీసులు చెబుతున్నారు. మృతికిగల కారణాలు పోస్టుమార్టం నివేదికలో తెలియాల్సివుంది.