అదృశ్యమైన తల్లీ, కొడుకు
అడ్డగుట్ట: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన తల్లీకొడుకులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీను తెలిపిన మేరకు.. తుకారాంగేట్ సాయినగర్ ప్రాంతానికి చెందిన నారపాక భాగ్యశ్రీ(22) తన ఏడు నెలల బాలుడు క్రిష్తో కలిసి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త గిరిధర్ పరిసర ప్రాంతాల్లో వెతికినా, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment