హైదరాబాద్‌లో జీల్గుపల్లి వాసి అనుమానాస్పద మృతి   | Suspicious death In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో జీల్గుపల్లి వాసి అనుమానాస్పద మృతి  

Jul 6 2018 2:02 PM | Updated on Oct 8 2018 5:07 PM

Suspicious death In Hyderabad - Sakshi

ఎల్లస్వామి (ఫైల్‌)

లింగాల: మండల పరిధిలోని జీల్గుపల్లికి చెందిన ఎల్లస్వామి(27) హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. కూకట్‌పల్లిలో ఉంటూ ప్రైవేట్‌ వాహనాల డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

స్నేహితులతో కలిసి ఉంటున్న రూంలోనే బుధవారం మరణించాడు. సమాచారం తెలుసుకున్న మృతుని బంధువులు హైదరాబాద్‌ వెళ్లి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఎల్లస్వామికి వివాహం కాలేదు. అతని మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి మణెమ్మ లింగాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement