కరోనా పేషెంట్‌ ఇంట్లో మటన్‌ వండుకుని.. | Thieves Eat Mutton, Stealing Cash, Jewellery In Coronavirus Patient House | Sakshi
Sakshi News home page

కరోనా పేషెంట్‌ ఇంట్లో మటన్‌ వండుకుని.. ఆపై చోరీ

Jul 21 2020 11:14 AM | Updated on Jul 21 2020 2:35 PM

Thieves Eat Mutton, Stealing Cash, Jewellery In Coronavirus Patient House - Sakshi

జంషెడ్‌పూర్‌: క‌న్నం పెట్టిన ఇంట్లో దొంగ‌లు అన్నం వండుకుని తిన్న అరుదైన ఘ‌ట‌న జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్య‌క్తికి జూలై 8న‌ క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో అత‌ను టాటా మెయిన్‌ ఆస్ప‌త్రి(టీఎమ్‌హెచ్‌)లో చికిత్స తీసుకుంటున్నాడు. ఇదే అద‌నుగా భావించిన దొంగ‌లు అత‌ని ఇంటికి క‌న్నం వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పైగా ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించడం వారికి మ‌రింత క‌లిసొచ్చింది. (మటన్‌ కొంటే హెల్మెట్‌ ఉచితం!)

ఇంకేముందీ.. చ‌డీచ‌ప్పుడు కాకుండా దొంగ‌లు గురువారం రాత్రి ఆ ఇంట్లో దూరారు. ముందుగా క‌డుపు నింపుకుందామ‌ని కిచెన్‌లోకి ప్ర‌వేశించి అన్నం, మ‌ట‌న్ కూర వండుకుని తృప్తిగా ఆర‌గించారు. అనంత‌రం ద‌ర్జాగా 50 వేల రూపాయ‌ల‌ను, మ‌రో 50 వేలు విలువ చేసే న‌గ‌ల‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. (సెల్‌ చార్జర్‌ కోసం దారుణ హత్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement