గండిపేట గుట్టల్లో అమెరికా సైక్లిస్ట్‌ మృతి  | US Citizen Deceased Accidentally During Cycling | Sakshi
Sakshi News home page

గండిపేట గుట్టల్లో అమెరికా సైక్లిస్ట్‌ మృతి 

Published Tue, May 19 2020 4:35 AM | Last Updated on Tue, May 19 2020 2:08 PM

US Citizen Deceased Accidentally During Cycling - Sakshi

రాబర్ట్‌ పాల్‌ మృతదేహం

రాబర్ట్‌ ఆదివారం ఉదయం ఇంటినుంచి సైక్లింగ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రాజేంద్రనగర్‌: సైక్లింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అమెరికా వాసి మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన జాన్‌ రాబర్ట్‌ పాల్‌ (38), ఆయన  భార్య అంజలీనాతో కలసి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. అంజలీనా హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. రాబర్ట్‌ ఆదివారం ఉదయం ఇంటినుంచి సైక్లింగ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు గాలించగా ఖానాపూర్‌ గండిపేట రిజర్వాయర్‌ ప్రాంతంలో ఉన్న గుట్టల మధ్య రాబర్ట్‌ పాల్‌ మృతదేహం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement