క్యాష్‌ డిపాజిట్‌ చేస్తానంటూ | Vijayawada Police Arrest A Person Who Targets ATM Centers | Sakshi
Sakshi News home page

ఏటీఎం సెంటర్ల వద్ద చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

Published Fri, Jun 7 2019 2:52 PM | Last Updated on Fri, Jun 7 2019 3:17 PM

Vijayawada Police Arrest A Person Who Targets ATM Centers - Sakshi

సాక్షి, విజయవాడ : ఏటీఎం సెంటర్లలో చోరికి పాల్పడుతున్న ఇంటిపల్లి రామారావు అనే వ్యక్తిని నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. 21 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతని వద్ద నుంచి రూ. 8,32,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ రాజకుమారి మాట్లాడుతూ.. క్యాష్‌ డిపాజిట్‌, ఏటీఎం మెషిన్‌ సెంటర్లను కేంద్రంగా చేసుకుని దొంగతనానికి పాల్పడతాడు. క్యాష్‌ తీసుకుని డిపాజిట్‌ చేస్తానని చెప్పి నకిలీ మెసేజులు పంపిస్తాడు. ఆ తరువాత డబ్బు తీసుకుని ఉడాయిస్తాడని తెలిపారు. బయట ఎవరైనా క్యాష్‌ తీసుకుని డిపాజిట్‌ చేస్తామని చెప్తే నమ్మకండని ప్రజలను హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ పోలీసులు ఎంతో కష్టపడి కేసును పరిష్కరించారని ఆమె తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement