హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు, ఇతర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ కనకదుర్గ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయమే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వేకువజామునుంచే భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ రోజు లక్షన్నర వరకు భక్తులు రావచ్చని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం, అనంతపురం జిల్లా పెన్నహోబిళం, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
విజయవాడలో పోటెత్తిన భక్తులు
Published Thu, Nov 6 2014 6:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement