23 క్రేన్ల ఏర్పాటు | 23 cranes are organise ganesh immersion | Sakshi
Sakshi News home page

23 క్రేన్ల ఏర్పాటు

Published Fri, Sep 16 2016 12:22 AM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM

23 క్రేన్ల ఏర్పాటు - Sakshi

23 క్రేన్ల ఏర్పాటు

నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై 23 క్రేన్ల ఏర్పాటు. 
► పోలీసు నిఘా నీడలో ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు....హుస్సేన్ర్‌ పరిసర ప్రాంతాల్లో సుమారు 800 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనోత్సవాన్ని సమీక్షించడం కనిపించింది.
► షీటీమ్‌లు మఫ్టీ డ్రెస్‌లో ట్యాంక్‌బండ్‌పై సంచరించారు. 
►  ఖైరతాబాద్‌ గణనాథుడు గతంలో ఎన్నడూలేని విధంగా మధ్యాహ్నమే నిమజ్జనం కావడంతో ట్యాంక్‌బండ్‌పై జనం సందడి గతంతో పొల్చుకుంటే కొంత తగ్గింది. 
►  పలు ప్రైవేటు ఆస్పత్రులు భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.
►  పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నుంచి గాంధీనగర్‌ ఇన్స్ పె క్టర్‌ ఎ. సంజీవరావు నిమజ్జనోత్సవం సందర్భంగా ఇటు పోలీసులకు భక్తులకు పలు సూచనలు చేయడం కనిపించింది.. 
►  వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి  పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.
►  ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 వరకు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లో సుమారు 844 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.
► గణేష్‌ నిమజ్జనానికి తరలి వచ్చిన భక్తులకు  ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద నుంచి నగరం నలుమూలలకు గణేష్‌ నిమజ్జనం స్పెషల్‌ బస్సులను నడిపారు. 
►  భక్తుల కోసం జలమండలి అధికారులు ఎన్టీఆర్‌ స్టేడియం, అశోక్‌నగర్‌ మెయిన్‌ రోడ్డులో ప్రత్యేకంగా ఉచిత వాటర్‌ ప్యాకెట్లు, మంచినీరు అందించే ఏర్పాట్లు చేశారు.   బన్సీలాల్‌పేట్‌
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement