రాచకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలి announced rachakonda district | Sakshi
Sakshi News home page

రాచకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలి

Published Wed, Sep 14 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

రాచకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలి

సంస్థాన్‌ నారాయణపురం : మునుగోడు, దేవరకొండ, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు కలుపుతూ రాచకొండ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ ఆ«ధ్వర్యంలో బుధవారం సంస్థాన్‌ నారాయణపురంలో రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో ఉన్న నారాయణపురం మండలాన్ని రాజకీయ పార్టీల స్వార్థం కోసం యాదాద్రిలో కలపాలని చూడడం సరైంది కాదన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో కూడా తీర్మానం చేశామన్నారు. ఎంతో చారిత్రక ప్రాంతమైన రాచకొండను జిల్లాగా చేయాలని, లేకపోతే  ప్రజల అభీష్టం మేరకే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏర్పుల సుదర్శన్, బద్దుల కృష్ణయ్య, రాసమళ్ల యాదయ్య, ఎండీ.రహీంషరీఫ్, మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, జక్కిడి మేఘారెడ్డి, సూరపల్లి శివాజీ, వలిగొండ యాదయ్య, కుందారపు యాదయ్య, బైకని నరేందర్, ఉప్పల శ్రీను, చంద్రారెడ్డి, యాదయ్య, భిక్షం, యాదగిరి తదితరులున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement