బాక్సైట్పై వెనక్కి తగ్గారు | ap cabinet go back on boxite go | Sakshi
Sakshi News home page

బాక్సైట్పై వెనక్కి తగ్గారు

Published Mon, Nov 16 2015 11:33 PM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

ap cabinet go back on boxite go

విజయవాడ: విశాఖపట్నం జిల్లాలో బాక్సైట్ తవ్వకాల జీవోపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఆ జీవోను తాత్కలికంగా పక్కకు పెడుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి తెలియకుండానే అటవీ శాఖ జీవో జారీ చేసిందని చెప్పారు.

గిరిజనులతో చర్చలు విస్తృతంగా జరిపి అనంతరం ప్రజాభిప్రాయం సేకరిస్తామని ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందని తెలిపారు. కాగా, స్వపక్షం విపక్షం నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పోర్టుఅ అభివృద్ధికి ఏపీ మరిటైన్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బావానాపాడు-కళింగపట్నం, విశాఖపట్నం-గంగవరం, కాకినాడ పరిసర ప్రాంతం, మచిలీపట్నం-ఓడరేవు, కృష్ణపట్నం-రామయపట్నం క్లస్టర్లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement