బావ చేతిలో బావమరిది దారుణ హత్యకు గురయ్యాడు.
తాండూరు(ఆదిలాబాద్ జిల్లా): బావ చేతిలో బావమరిది దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం లింగధరిగూడెంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కెపల్లి ప్రీతమ్, సురేష్ బావాబామ్మర్దులు. కుటుంబకలహాలతో ప్రీతమ్ను బావ సురేష్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.