'రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు' | Chandrababu Naidu government cheating Farmers on loan waiver | Sakshi
Sakshi News home page

'రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు'

Published Mon, Aug 17 2015 10:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని అనంతపురం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురం : రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని అనంతపురం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని, చేసిన అప్పుకు వడ్డీ సైతం కట్టలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు తెలిపారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పులివెందుల వెళుతూ అనంతపురం జిల్లాలో ఆగారు.

ఈ సందర్భంగా బీదరెడ్డిపల్లి వద్ద ఎండిపోయిన వేరుశెనగ పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు.  కాగా అనంతపురం జిల్లాలో కరువు దుస్థితిని పార్టీ నేతలు శంకర్ నారాయణ, చాంద్ బాషా, నవీన్ నిశ్చల్ తదితరులు ...వైఎస్ జగన్కు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement