కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రాజ్కుమార్ మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని గమనించి సహచరులు వెంటనే కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రేమ విఫలం కారణంగానే రాజ్కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సహచరులు పోలీసులకు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
Published Tue, Nov 17 2015 10:53 AM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM
Advertisement
Advertisement