కారు బోల్తా: దంపతులకు గాయాలు | couple injured of car rolls | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: దంపతులకు గాయాలు

Dec 25 2016 10:45 PM | Updated on Jul 10 2019 8:00 PM

మండలంలోని ఊబిచెర్ల శివార్లలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది.

గుత్తి రూరల్‌ : మండలంలోని ఊబిచెర్ల శివార్లలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో అనంతపురం ప్రశాంత్‌నగర్‌కు చెందిన ప్రొఫెసర్‌ అబ్దుల్‌ రహీం, ఆయన భార్య మెహజాన్‌బీ గాయపడ్డారు. అనంతపురం నుంచి వారు హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలోని ఊబిచెర్ల వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే వారిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోస వారిని కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement