అమరావతి ల్యాండ్ మాఫియాపై సీఆర్డీఏ విచారణ చేపట్టింది. అమరావతి ల్యాండ్ మాఫియాపై ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.
గుంటూరు: అమరావతి ల్యాండ్ మాఫియాపై సీఆర్డీఏ విచారణ చేపట్టింది. అమరావతి ల్యాండ్ మాఫియాపై ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దాంతో స్పందించిన సీఆర్డీఏ సహాయ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ నకిలీ పాసుపుస్తకాల తయారీపై విచారణకు ఆదేశించారు.
ఈ విషయంపై ఆయన నిడమర్రు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో సంప్రదింపులు జరిపారు. నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో భూముల అక్రమాలపై విచారణ జరపనున్నట్టు సమాచారం.