బెజవాడ వాసులకు తీరని కరెన్సీ కష్టాలు | currency problems in vijayawada due to demonetization | Sakshi
Sakshi News home page

బెజవాడ వాసులకు తీరని కరెన్సీ కష్టాలు

Nov 20 2016 11:36 AM | Updated on Sep 27 2018 9:08 PM

బెజవాడ వాసులకు తీరని కరెన్సీ కష్టాలు - Sakshi

బెజవాడ వాసులకు తీరని కరెన్సీ కష్టాలు

నగరవాసులను కరెన్సీ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

విజయవాడ: నగరవాసులను కరెన్సీ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. రూ.1000, రూ.500 నోట్లను కేంద్రం రద్దు చేసి 11 రోజులు గడిచినా.. ఏటీఎం సెంటర్‌లలో ఇప్పటికీ కేవలం రూ. 2 వేల నోట్లు వస్తున్నాయి. దీంతో బెజవాడ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే చిల్లర లేక ఆపసోపాలు పడుతుంటే.. కొత్తగా వస్తున్న రెండు వేల నోట్లతో కరెన్సీ కష్టాలు మరింత పెరుగుతున్నాయని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement