విజిలెన్స్‌ అదుపులో దళారీ.. | Dalari custody in Vigllience officials | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ అదుపులో దళారీ..

Dec 26 2015 8:25 PM | Updated on Sep 3 2017 2:37 PM

తిరుమల తిరుపతిలో శనివారం ఓ దళారీని విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తిరుమల: తిరుమల తిరుపతిలో శనివారం ఓ దళారీని విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి ఫేక్‌ దర్శనాలు, వైకుంఠ ఏకాదశి టికెట్లు, తిరుప్పావడ సేవా టికెట్లను బ్లాక్‌లో విక్రయించినట్టు మల్లికార్జున్‌ అనే దళారీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యుడు సాయన్న సిఫారసు లేఖపై మల్లికార్జున్‌ టిక్కెట్లను పొందినట్టు తెలిసింది.

ఈ టిక్కెట్ల విక్రయంలో దళారీకి బోర్డు సభ్యుడు సాయన్న పీఆర్వో నాగరాజు కూడా సహాకరించినట్టు తమ విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. దాంతో దళారీ మల్లికార్జున్‌ను తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించినట్టు విజిలెన్స్‌ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement