దళితులపై దాడులకు నిరసనగా 27న ర్యాలీ | daliths rally | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులకు నిరసనగా 27న ర్యాలీ

Aug 22 2016 8:25 PM | Updated on Sep 4 2017 10:24 AM

దళితులపై దాడులకు నిరసనగా 27న  ర్యాలీ

దళితులపై దాడులకు నిరసనగా 27న ర్యాలీ

రాష్ట్రంలో, దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్‌ఇండియా దళితరైట్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు తెలిపారు.

గాంధీనగర్‌ : 
రాష్ట్రంలో, దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్‌ఇండియా దళితరైట్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు తెలిపారు. బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి అలంకార్‌ సెంటర్‌ వరకు మహార్యాలీ, ధర్నా నిర్వహించనున్నట్లు సోమవారం ప్రెస్‌క్లబ్‌లో తెలిపారు. హెచ్‌సీయూలో విద్యార్థి రోహిత్‌ మరణానికి కారకులైన వీసీ అప్పారావు, ఇతర నిందితుల మీద ఇంతవరకు చర్యలు లేవని విమర్శించారు. గుజరాత్, అమలాపురంలో దళితులపై జరిగిన దాడులు బీజేపీ ఎజెండాలో భాగమేనన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పేరుతో బీజేపీ వర్గాలు దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు.  దళిత బహుజన ఫ్రంట్‌ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, కెవిపీసీఎస్‌ వ్యవస్థాపకులు పరిశపోగు రాజేష్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement