
వాహనం ఢీకొని జింక మృతి
చిలమత్తూరు : యర్రకొండ నర్సరీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక గురువారం మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎఫ్బీఓ జి.అనిల్కుమార్, పశువైద్యాధికారి శివశంకర్నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఈ సందర్భంగా ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ మదన్మోహన్ మాట్లాడుతూ బ్రహ్మేశ్వరంపల్లి నుంచి కాపుచెన్నంపల్లి వరకు యర్రకొండ అటవీ ప్రాంతాల్లో వాహనాలు నిదానంగా వెళ్లాలని కోరారు. నీటి కోసం వన్యప్రాణులు రోడ్డు దాటుతుంటాయని అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.