తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకోవడానికి మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అలాగే కాలినడకన వచ్చిన భక్తులకు 3 గంటలు సమయం పడుతోంది. అయితే బుధవారం శ్రీవారిని 60,502 మంది భక్తుల దర్శించుకున్నారు.