
తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం శ్రీవారి దర్శనార్థం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామిని 56,462 మంది దర్శించుకున్నారు. 24,239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం శ్రీవారి ఆదాయం రూ.2.84 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.