తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం ఉదయం వరకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఏడుకొండల వాడి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని నిన్ని(గురువారం) 53,966 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.