దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.1.28 కోట్లు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లకు భక్తులు హుండీల ద్వారా రూ.1,28,93,966లను కానుకలుగా సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం ఆలయ సిబ్బంది మహామండపంలోని ఆరో అంతస్తులో లెక్కించారు. నగదుతో పాటు 350 గ్రాముల బంగారం, 4.410 కిలోల వెండి లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం 22 రోజులకు 20 హుండీల ద్వారా లభించినట్లు చెప్పారు.