విద్యుదాఘాతంతో కౌలురైతు మృతి
Published Fri, Aug 19 2016 9:47 PM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM
వేట్లపాలెం(సామర్లకోట):
పొలంలో పనిచేస్తున్న ఓ కౌలురైతు విద్యుదాఘాతానికి గురై శుక్రవారం మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేట్లపాలెం శివారు దోమాడపాకలులోని పొలానికి శుక్రవారం ఉదయం కౌలురైతు కరోటి దుర్గాప్రసాద్ (35) వెళ్లాడు. పొలానికి నీరు పట్టేందుకు బోరు మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి హెచ్సీ వి. నాగేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement