రైల్వేచార్జీల పెంపును నిరసిస్తూ రాస్తారోకో
Published Sun, Sep 18 2016 12:05 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సప్తగిరికాలనీ : రైల్వే చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం యువజన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటరీ అధ్యక్షుడు నాగి శేఖర్ ఆధ్వర్యంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎదుట రాస్తారోకో చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే చార్జీలను పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులు ములుగు ప్రకాశ్, సునీల్, సుధీర్రెడ్డి, రహమాన్, అలీ, శ్రీనివాస్, అర్జున్రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
Advertisement
Advertisement