పోస్టాఫీసుల ద్వారా భక్తులకు పుష్కర జలం | Get Pushkar water through Post | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసుల ద్వారా భక్తులకు పుష్కర జలం

Published Sat, Jul 16 2016 6:40 PM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

Get Pushkar water through Post

- పోస్టల్‌ సూపరింటెండెంట్‌  కేవీ సుబ్బారావు వెల్లడి

కర్నూలు (ఓల్డ్‌ సిటీ): కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు తపాలా శాఖ పవిత్ర కృష్ణానది జలం అందించేందుకు  రంగం సిద్ధం చేసినట్లు పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కేవీ సుబ్బారావు తెలిపారు.  ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా  ప్రకటన విడుదల చేశారు. ఒక్కో బాటిల్‌ ఖరీదు రూ. 30 ఉంటుందని, కావాల్సిన వారు ముందుగానే బుక్‌ చేసుకుని  రశీదు పొందాలని సూచించారు. డివిజన్‌ పరిధిలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ సదుపాయం కల్పించామని, ఆగస్టు 5వ  తేదీ లోపు రశీదులు పొందాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement