తమిళనాడులోని తిరుపూర్లో ఈ నెల 8వ తేదీన జరిగిన స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్లో తమ విద్యార్థులు నగీనా, ఆఫ్రీన్ ప్రతిభ కనబరిచారని విజయవాడ రవీంద్రభారతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తెలిపారు.
స్కేటింగ్లో విద్యార్థినుల ప్రతిభ
Oct 16 2016 10:30 PM | Updated on Sep 4 2017 5:25 PM
గుంటూరు స్పోర్ట్స్: తమిళనాడులోని తిరుపూర్లో ఈ నెల 8వ తేదీన జరిగిన స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్లో తమ విద్యార్థులు నగీనా, ఆఫ్రీన్ ప్రతిభ కనబరిచారని విజయవాడ రవీంద్రభారతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్లోని స్కూల్ ఆవరణలో స్కేటింగ్ క్రీడాకారిణీలను అభినందించారు. ఆయన మాట్లాడుతూ వీరిద్దరూ జాతీయ స్థాయి క్రీడాకారులతో 24 గంటలు స్కేటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పారు.
Advertisement
Advertisement