యాదగిరిగుట్టలో జరిగిన బతుకమ్మ వేడకల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట (నల్గొండ జిల్లా): యాదగిరిగుట్టలో జరిగిన బతుకమ్మ వేడకల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు తెలియజేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని ఆమె తెలిపారు. ఆత్మగౌరవం కాపాడుకునేందుకే ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించి అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్, జాగృతిసంస్థ ప్రతినిధులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.