bathukamma
-
అబుదాబిలో బతుకమ్మ సంబరాలు
అబుదాబి, సాక్షి : తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న తెలంగాణీయులందరు దేశ రాజధాని అయిన అబుదాబి లో జత చేరి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అబుదాబి లోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో గత నెల రోజులు గా ఈ ఉత్సవాల కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత కార్యక్రమానికి అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదిక అయ్యిందియుఏఈ లో ఉన్న వందలాది తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు గత నెల రోజులు గా అవిశ్రాంతంగా వివిధ తెలంగాణ నృత్యాల ప్రదర్శనల తయారీ చేశారు. ఎడారి ప్రాంతం కావడం కారణంగా పూలు దొరకడం చాలా కష్టం తోను మరియు చాలా ఖర్చు తో కూడుకున్న వ్యవహారం కావడం తో సంఘ నాయకత్వం ఎక్కువ మోతాదు లో తెలంగాణ నుండి వందలాది కిలోల వివిధ పూలను తెప్పించి అబూ దాబి ని పూల వనంగా మార్చారు. ఇండియా నుండి తెచ్చిన తీరొక్క పూలతో ఘనంగా సామూహిక బతుకమ్మ తయారీ కార్యక్రమాన్ని నిర్వాహకులు పల్లె వాతావరణాన్ని పరిమళించే లా చేశారు. ఈ కార్యక్రమానికి వందలాది తెలంగాణ మహిళలు విచ్చేసి బతుకమ్మ తయారీ ప్రాంగణాన్ని బతుకమ్మ పాట ల తో మార్మోగించారు. శుక్రవారం సాయంత్రం కార్యక్రమ వేదిక అయిన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ కి రెండు వేల మంది మహిళలు కార్యక్రమ ఆరంభ సమయానికి ముందే చేరుకొని సందడి చేశారు. ఈ తెలంగాణ సంబరాలకు వన్నె తెచ్చేందుకు అందరిని అలరించడానికి మరియు తెలంగాణ వాతావరణానికి మరింత కల తెచ్చేందుకు ప్రముఖ కవి గాయకుడు శ్రీ అష్ట గంగాధర్ మరియు తెలంగాణ వర్ధమాన గాయని శ్రీమతి తేజు ప్రియ ప్రత్యేకంగా ఇండియా నుండి విచ్చేసారు. కార్యక్రమాన్ని తెలంగాణ సంప్రదాయానికి ప్రతిభింబించే లా డప్పు వాయిద్యం మరియు కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను బతుకమ్మ ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారుఆ తరువాత తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు తెలంగాణ సాంప్రదాయo ఉట్టి పడుతూ చేసిన నృత్య ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేశాయి. తెలంగాణ నుండి వచ్చిన ఇద్దరు కళాకారులు వివిధ రకాల తెలంగాణ ఆట పాటలతో ప్రేక్షకులను అలరించారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా జంటల (Couples) నృత్య ప్రదర్శన నిలిచింది. ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించి అందరికి పంచిన తెలంగాణ పిండి వంటలు కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ వారినందరిని విశేషంగా ఆకర్షించాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యుఏఈ భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ అఫ్ మిషన్ శ్రీ అమర్నాథ్ అశోకన్ ముఖ్య అతిధి గా మరియు కాన్సులర్ డా: ఆర్. బాలాజీ మరియు కుటుంబ సభ్యులు గౌరవ అతిధులు గా హాజరు అయ్యారు. వారు కూడా తెలంగాణ మహిళ ల తో బతుకమ్మ ఆడి పాడారు. తదనంతరం కార్య నిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 3 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు మరియు జంటలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమ ముఖ్య దాతలు టైటిల్ స్పాన్సర్ గా సంపంగి గ్రూప్ మరియు కో స్పాన్సర్ గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏ ఎక్స్ ప్రాపర్టీస్, బ్యూటీ డెంటా కేర్ వారిని నిర్వాహుకులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా అబుదాబి బాప్స్ హిందూ మందిర్ డైరెక్టర్ శ్రీ ప్రణవ్ దేశాయ్ మరియు వారి కుటుంబ సభ్యులు హాజరు అయి తెలంగాణ మహిళలందరితో బతుకమ్మ ఆడారు. చివరగా గౌరీ పూజ చేసి బతుకమ్మ నిమజ్జనం కృతిమ కొలను లో చేసి ప్రసాదాలు పంచి, విందు భోజనం ఆరగించారు ఈ కార్యక్రమాన్ని రాజశ్రీనివాస రావు, గోపాల్, వంశీ, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, పద్మజ, లక్ష్మి, నిధి తదితరులు దగ్గర ఉండి నడిపించారు. బతుకమ్మ ఉత్సవాలు విదేశాలలో కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్య నిర్వాహకులు రాజశ్రీనివాస రావు తెలియజేశారు. -
బతుకమ్మ పుట్టినిల్లు!
సాక్షి, వరంగల్: బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ పూల వేడుక. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం. ఈ మేరకు పలు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ గుర్తింపునకు చిహ్నంగానే ఆ ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో బతుకమ్మ ఆలయం నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రీశాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ గ్రామం బతుకమ్మకు పుట్టినిల్లని పలు చారిత్రక పరిశోధనల్లో తేల్చారు. అటు రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇటు కేంద్ర పర్యాటక శాఖను సమన్వయం చేసుకుంటూ, ఎన్ఆర్ఐలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించే బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతా అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించే దిశగా అడుగులు పడతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణమైతే ఓవైపు ఆధ్యాతి్మకంగా, మరోవైపు పర్యాటకంగా చౌటపల్లి విరాజిల్లనుంది. ఇప్పటికే చారిత్రక నగరంగా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో మరో చారిత్రక ప్రాంతం చేరనుంది. రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణం గ్రామంలోని పదెకరాల్లో నిర్మించే బతుకమ్మ గుడికి రూ.100 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.70 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా.. రూ.30 కోట్ల మేరకు భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే చౌటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేసిన బెంగళూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ దాఖోజు రవిశంకర్ దాదాపు రూ.15 కోట్లు బతుకమ్మ గుడి నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. బతుకునిచ్చిన అమ్మ!17వ శతాబ్దంలో తెలంగాణను నిజాం నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఓరుగల్లు పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వంగాల రామయ్య 16వ ఏటనే నిజాం ప్రభువులకు చెందిన వెండి నాణేల ముద్రణ కర్మాగారంలో పనిచేస్తూ అనతికాలంలోనే పాలకులను ఆకట్టుకొని కొంత మాన్యం పొందారు. ఆ ప్రాంతమే ఇప్పటి పర్వతగిరి మండలంలోని చౌటపల్లి. రామయ్య ఆ స్థలంలో ప్రజల సౌకర్యార్థం చెరువు తవ్వించి వసతులు కల్పించారు. సౌటమట్టి కలిగిన ప్రాంతం కనుక సౌటపల్లిగా, కాలక్రమంలో చౌటపల్లిగా మారింది. కొంత కాలానికి చౌటపల్లి గ్రామ శివారు గ్రామాల ప్రజలు కలరా సోకి చనిపోతున్నారని తెలిసి గ్రామ ప్రజలు రామయ్యను సంప్రదించారు. సమస్య పరిష్కారానికి ఆయన గాయత్రిదేవిని ఉపాసించాడు. ఆ తల్లి నామస్మరణలో మూడు రోజులు గడిపాడు. దీంతో గాయత్రీమాత ఆయనకు స్వప్నంలో కనిపించింది. అశరీర వాణిగా గ్రామ సౌభాగ్యానికి తన సంతానాన్ని ఆర్పించాలని, ప్రత్యేక పూజా విధానం, పాత్ర కాని పాత్రలో ఎంగిలిపడని పూలను పేర్చి గౌరీమాత స్వయంగా వెలుగొందిన గుమ్మడి పూలను పేర్చాలి. పేర్చిన పూలపై పెట్టి గౌరీమాతను నవదినాలు గ్రామంలో అందరూ కలిసి పూజించాలని ప్రబోధించినట్లు ప్రచారంలో ఉంది. బతుకునీయమ్మా.. బతికించమ్మా అనే పదాల నుంచే బతుకమ్మ అవిర్భవించిందని చెబుతున్నారు. దీనిపై చారిత్రక పరిశోధన చేసిన డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ వివరాలన్నీ పుస్తక రూపంలోకి తెచ్చారు. యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడి.. 40 ఏళ్ల పాటు నేను చేసిన చారిత్రక పరిశోధనలతో చౌటపల్లి బతుకమ్మ పుట్టినిల్లుగా తేలింది. అందుకే ఇక్కడా యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడిని నిర్మించాలనుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణ నమూనాకు యాదాద్రి టెంపుల్ డిజైనర్ ఆనంద్సాయి, స్థపతిగా పద్మశ్రీ వేణు ఆనందాచార్య వ్యవహరిస్తారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బైరోజు వెంకటరమణాచార్యులు (బీవీఆర్ చార్యులు) ఇప్పటికే బతుకమ్మ చిత్రపటాన్ని విడుదల చేశారు. 2019లోనే బతుకమ్మపై బృంద నృత్యం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాం. బతుకమ్మ గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు అకుంఠిత దీక్షతో పనిచేస్తా. – డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య, శ్రీ శాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు -
అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. జార్జియా, వర్జీనియా రాష్ట్రాలతోపాటు ఉత్తర కరోలినా రాష్ట్రంలోని చార్లెట్, రాలేహ్ నగరాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ వారాన్ని బతుకమ్మ పండుగ, తెలంగాణ హెరిటేజ్ వీక్గా ప్రకటించారు. బతుకమ్మ ఎంతో ప్రత్యేకమైన, ప్రాముఖ్యతగల పండుగల్లో ఒకటని.. ఈ ఉత్సవాన్ని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలే కాకుండా అమెరికాలో స్థిరపడ్డ 12 లక్షల మంది ఎన్నారైలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని జార్జియా, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లతోపాటు ఉత్తర కరోలినాలోని చార్లెట్, రాలేహ్ మేయర్లలు అభివర్ణించారు. దీంతో వారికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ ఆడపడుచులకు అభినందనలు తెలియజేశారు. కొంతకాలంగా తెలంగాణ బతుకమ్మకు ఖండాంతరాల్లో గుర్తింపు తెచ్చేందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, ఇతర సంఘాలు, ప్రవాస తెలంగాణవాసులు చేస్తున్న కృషికి ఈ గుర్తింపుతో ఫలితం దక్కినట్టయింది. గతంలోనూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు బతుకమ్మను గుర్తించాయి. -
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ సంబురాలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : రవీంద్రభారతిలో అటుకుల బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
‘తెలంగాణ’ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
పూల పండుగ వచ్చేసింది.. నేటి నుంచి బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
కూకట్పల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం (ఫొటోలు)
-
వైభవంగా బతుకమ్మ, దసరా పండగ వేడుకలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చార్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా పండగల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను చార్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తెలుగు వాళ్లంతా సందడిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మ నిమజ్జనం తర్వాత దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని షమీ స్తోత్రం చదివి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్బలయ్ చేసుకున్నారు. ఇక బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులను అందజేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
డాలస్లో బతుకమ్మ వేడుకలు, స్పెషల్ అట్రాక్షన్గా సంయుక్తా మీనన్
డాలస్ నగరంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను సంయుక్తంగా ఫ్రిస్కో పట్టణ పరిధిలోని కొమెరికా సెంటర్లో వైభవంగా జరిపించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన కార్యక్రమం ఆసాంతం జనం రాకతో సందడిగా మారింది. సుమారు 12వేల మంది ఈ వేడుకల్లో భాగస్వాములైనట్టు టీపాడ్ బృందం తెలిపింది. ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వంలో నిర్వహించిన ఈ సంబరాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ సంయుక్తామీనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మగువలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. అనంతరం దుర్గామాతను ప్రతిష్టించి నిర్వాహకులు శమీపూజలు నిర్వహించి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. దసరా పండుగ రోజు బంగారంలా భావించే శమీపత్రాలను ఒకరినొకరు పంచుకుని అలయ్బలయ్ తీసుకున్నారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన అనంతరం కళాకారుల బృందం అమ్మవారి మహాశక్తిని నృత్యరూపకంగా ప్రదర్శించి గూస్బంప్స్ తెప్పించింది. అటు డ్యాన్సర్లు, ఇటు గాయకుల అలుపెరగని ప్రదర్శనతో కార్యక్రమం మరింత కనులవిందుగా, వీనులవిందుగా మారింది. సింగర్స్ సమీర భరద్వాజ్, పృథ్వీ, ఆదిత్య, అధితీ భావరాజు.. దాదాపు 3 గంటల పాటు తమ పాటలతో మనసునిండా పండుగ తృప్తితో పాటు సాంత్వన కలిగిస్తూ కొత్త శక్తిని నింపారు. జాతరను తలపించిన కొమెరికా సెంటర్ కార్యక్రమంలో భాగంగా బైక్రాఫెల్, 10 గ్రాములు, 5 గ్రాములు, 2 గ్రాముల గోల్డ్రాఫెల్ను సినీనటి సంయుక్తామీనన్ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. జాతరకు ఏమాత్రమూ తీసిపోదన్నట్టు వెలిసిన వెండర్బూతలు ఆసాంతం రద్దీతో కనిపించాయి. కొమెరికా సెంటర్లోకి అడుగుపెట్టేందుకు తొక్కిసలాట జరగకుండా నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. -
బతుకమ్మ పండగకు అరుదైన గౌరవం,గవర్నర్ ఆదేశాలు జారీ
అట్లాంటా: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని జార్జియాలో బతుకమ్మ పండగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3వ వారాన్ని బతుకమ్మ వారంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై పలువురు తెలంగాణ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఎంతో ఘనంగా పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అక్టోబర్ 15 నుంచి ఈనెల 23 వరకు 9రోజుల పాటు బతుకమ్మ పండగను జరుపుకున్న సంగతి తెలిసిందే.తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ.బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుందని అంటారు. కాకతీయుల కాలం అంటే సుమారు 12 వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. విదేశాల్లో ఉన్నా తెలంగాణ ఆడపడుచులంతా ఒకచోట చేరి బతుకమ్మ ప్రాముఖ్యతను చాటుకుంటారు. జార్జియాలోనూ ప్రతి ఏడాది జార్జియా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. -
సింగపూర్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరం!
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరం. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఇక్కడి సంబవాంగ్ పార్క్లో అక్టోబర్ 21 న ఎంతో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా అనే లేకుండా అందరు సాంప్రదాయ పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 3 వేల నుంచి 4 వేల వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్లో నివసిస్తున్న తెలుగు వారందరు స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేసేలా విశేష ఆదరణ కలుగజేసినందుకు టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు సౌజన్య డేకోర్ వారు బహుమతులు అందజేశారు. వీరితో పాటు సింగా దాండియా వారు లక్కీ డ్రాలో 10 మంది అదృష్ట విజేతలకు చీరలు అందజేయడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగు వారు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరం అని సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు టీసీఎస్ఎస్ సభ్యులు. టీసీఎస్ఎస్ ప్రేరణతో ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందినీయం అని అన్నారు. ఈ ఏడు బతుకమ్మ సంబురాలకు టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణ గ నిలిచింది. ఈ సారి యూట్యూబ్లో విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట వేల వీక్షణాలతో దూసుకుపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల, గోనె రజిత, కాసర్ల వందన, రాధికా రెడ్డి నల్ల, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్యమాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు మొదలగు వారు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ సారి వేడుకలను సొసైటీ ఫేస్ బుక్ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. (చదవండి: సింగపూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు) -
బతుకమ్మ మీరే చేస్తారా..!? మాకు మనసుంది.. పండుగ మేము చేస్తామంటూ..
సాక్షి, కరీంనగర్: తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి వేడుకల్లో పాల్గొన్న ముస్లిం యువతి సుల్తానా బేగం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మండలంలోని బూర్గుపల్లికి చెందిన సుల్తానాబేగం ఆదివారం బతుకమ్మను పేర్చి గ్రామస్తులతో కలిసి సంబురంగా వేడుకల్లో పాల్గొంది. సుల్తానా బేగంను ఎమ్మెల్యే రవిశంకర్, సర్పంచ్ రమ్య, ఎంపీటీసీ లక్ష్మి అభినందించారు. -
కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మొద్దు
కోరుట్ల/మెట్పల్లి(కోరుట్ల): నిజాం చక్కెర ఫ్యాక్టరీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలను రైతులు నమ్మవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. స్వాతంత్య్రం రాక ముందే నిజాం చక్కెర ఫ్యాక్టరీలను నిజాం ప్రభువులు ఏర్పాటు చేస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పిందని జీవన్రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం వీటిని బీజేపీకి చెందిన మాజీ ఎంపీకి విక్రయించినప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు చోద్యం చూశా రా అని మండిపడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బతుక మ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టు కొని పండుగ చేసుకుంటామని జీవన్రెడ్డి వ్యాఖ్యా నించడం ఆయన వయసుకి, హోదాకి తగదని కవిత చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి దిగజారి పోయి బతుకమ్మను అవమానించిన ఆయనను జగిత్యాల ప్రజలు తిరస్కరించడం ఖాయమ న్నారు. నేడు మహారాష్ట్రకు కవిత సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని సోలాపూర్లో ఆదివారం జరిగే బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. అలాగే దత్తవాడ నుంచి సాయంత్రం ప్రారంభమయ్యే బతుకమ్మ శోభాయాత్రలో ఆమె పాల్గొంటారు. -
సింగపూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ2023 పండగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబవాంగ్ పార్క్లో ఈ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సింగపూర్లో తెలుగు వాళ్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సింగపూర్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారు కూడా బతుకమ్మ, బోనాలు జరుపుకోవడం ఎంతో అభినందనీయని సింగపూర్ కల్చరల్ సొసైటీ సభ్యులు అన్నారు. తెలంగాణ సాంప్రదాయ పండగలను అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అందంగా బతుకమ్మ పేర్చిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఉన్న వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
Bathukamma Celebrations: డీజీపీ కార్యాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
టెక్సాస్ లో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ
-
Dallas Bathukamma : డాలస్లో సందడి చేసిన టీపాడ్ చిన్నబతుకమ్మ
తెలంగాణ సంస్కృతిని అమెరికా గడ్డపై వికసింపజేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD).. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి డాలస్లోని ఆండ్రివ్ బ్రోన్ పార్క్ ఈస్ట్లో సందడి చేశారు. మహిళలందరూ బృందవలయాలుగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలివచ్చిందన్న చందంగా వేడుక సాగింది. పండుగ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు చిన్నబతుకమ్మ పండుగను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వం వహించారు. టీపాడ్ పూర్వ అధ్యక్షులు రమణ లష్కర్, ఉపాధ్యక్షులు అనురాధ మేకల, కార్యదర్శి రత్న ఉప్పల సూచనలు సలహాలు అందించారు. చిన్నబతుకమ్మ పండుగకు చైర్గా గాయత్రి గిరి, కో-చైర్గా అనుషా వనం, అడ్వయిజర్గా ఇంద్రాణి పంచెర్పుల తమ సేవలందించారు. హరిశంకర్రెడ్డి రేసు, ప్రశాంత్ నిమ్మని.. హాజరైన ప్రతి ఒక్కరికి పులిహోర, దద్దోజనం, మిఠాయిలు వడ్డించి తాము పుట్టిపెరిగిన ప్రాంతపు మధురజ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేయడమే కాకుండా అందరి మన్ననలు అందుకున్నారు. ఆడియో, సౌండ్ సిస్టమ్ బాధ్యతలు స్వీకరించిన బాల గణపవరపు, నరేశ లింగంపల్లి.. మూడు గంటల పాటు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు. బతుకమ్మల నిమజ్జనం కోసం శ్రావణ్ నిడిగంటి, సుచేంద్రబాబు ప్రత్యేకంగా టబ్లు ఏర్పాటు చేయడం, నీటి సదుపాయం కల్పించడం వంటి పనులు చూసుకున్నారు. రవాణా వ్యవహారాలను సంతోష్ రేగొండ, భోజన సదుపాయాలను సంతోష్, సోషల్ మీడియా వ్యవహారాలను మధుమతి వైశ్యరాజు, ఆదిత్య గాదె చూసుకున్నారు. రిసెప్షన్ బాధ్యతలు మాధవి మెంట, దీపికారెడ్డి చూసుకోగా, శశిరెడ్డి, మాధవి ఓంకార్ డెకరేషన్ దగ్గరుండి చేయించారు. అక్టోబర్ 21న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాటు అక్టోబర్ 15 ఆదివారం రోజున చిన్న బతుకమ్మ పండుగతో బతుకమ్మ-దసరా వేడుకలకు అంకురార్పణ చేసిన టీపాడ్.. అక్టోబర్ 21న మెగా వేడుకలకు సన్నద్ధమవుతున్నది. ఏటా పదివేల మందితో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన టీపాడ్.. ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్ చేస్తున్నది. ఈ వేడుకలకు డాలస్లోని కొమెరికా సెంటర్ (పెప్పర్ ఎరెనా) వేదికగా నిలుస్తున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. విశేష అతిథిగా సంయుక్తామీనన్, రాఫెల్ ప్రైజ్గా బీఎండబ్ల్యూ బైక్ సినీ కథానాయిక సంయుక్తామీనన్ విశేష అతిథిగా హాజరవనున్న ఈ పండుగలో సుప్రసిద్ధ గాయకులు తమ గాత్రంతో వీనులవిందు చేయనున్నారు. వేడుకల్లో భాగంగా రాఫెల్ ప్రైజ్లను అందజేయనున్నారు. వీటిలో బీఎండబ్ల్యు బైక్, బంగారు నాణేలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, ఆర్టిఫిషియల్ జువెల్లరీతో పాటు గిఫ్ట్ ఓచర్లు ఉన్నాయి. బీఎండబ్ల్యు బైక్ మరియు రాఫెల్ ప్రైజ్లను మాధవి లోకిరెడ్డి, హారిక పాల్వాయి అనౌన్స్ చేశారు. వేడుకల వివరాల కోసం టీపాడ్ వెబ్సైట్ టీపాడ్యూఎస్.ఓఆర్జీను బ్రౌజ్ చేయొచ్చు. -
Bathukamma Celebrations: రాజ్ భవన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై (ఫొటోలు)
-
Bathukamma: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్లో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
Bathukamma Celebrations Photos: కూకట్పల్లిలో బతుకమ్మ సందడి (ఫోటోలు)
-
Bathukamma: తెలంగాణ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
నేడు ‘బహుజన బతుకమ్మ’ పాటల ఆవిష్కరణ: విమలక్క
సాక్షి, హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్) రూపొందించిన ‘పూసే పూల కవాతు’, ‘రావె రావె బతుకమ్మ రావే’అనే పాటల వీడియోలను ఆదివారం(నేడు) ఉదయం 10 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్లో ఆవిష్కరిస్తామని ప్రజాగాయకురాలు విమలక్క తెలిపారు. 13 ఏళ్లుగా నిర్వహిస్తున్న బహుజన బతుకమ్మను ఈ ఏడాది ‘మద్యం రద్దు– మగువల రక్షణ’అనే అంశంపై ప్రకృతి పూల కవాతుగా నిర్ణయించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ ఈ నెల 13న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదలై 22న ఖమ్మం జిల్లా ముదిగొండలో ముగుస్తుందని విమలక్క వెల్లడించారు. -
పది రోజుల పాటు పది అవతారాల్లో దుర్గాదేవి
-
ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు
-
సింగపూర్ పూరమ్ ఉత్సవాల్లో బతుకమ్మ ఆట
సింగపూర్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళ త్రిసూర్ పూరమ్ వార్షిక సాంస్కృతిక ఉత్సవాలు ప్రేరణగా సింగపూర్లోని 'గార్డెన్స్ బై ది బే' లోని 'ది మీడోస్' లో ఆదివారం (28 మే) 'సింగపూర్ పూరమ్' పేరిట సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు. 2019 నుంచే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ కోవిడ్ నిబంధనల కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిర్వహించడం లేదు. కోవిడ్ నిబంధనలు తొలగించిన అనంతరం ఈ ఏడాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. సింగపూర్ లో నివసిస్తున్న వివిధ భారతీయ రాష్ట్రాలకు చెందిన వారు తమ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) మహిళా విభాగం ఈ అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గుండె చప్పుడు బతుకమ్మ ఆట పాటలను ప్రదర్శించారు. ప్రపంచంలో అందరూ పూలతో పూజిస్తే ఆ పూలనే పూజించే తెలంగాణ ప్రత్యేక సంప్రదాయానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ వేడుకల్లో బతుకమ్మ ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన సింగపూర్ పూరమ్ 2023 కార్యవర్గ సభ్యులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో బతుకమ్మ ఆటను ప్రదర్శించిన వారిలో సొసైటీ ఉపాధ్యక్షురాలు సునీతా రెడ్డి, మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనితా రెడ్డి, జూలూరి పద్మజ, రాధికా రాణి నల్ల, దీప నల్లా, కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, సృజన వెంగళ, బొందుగుల ఉమా రాణి, సౌజన్య మాదారపు, గర్రెపల్లి కస్తూరి, కల్వ కవిత, రోహిణి గజ్జల, స్వప్న కైలాసపు, కీర్తి ముగ్దసాని, నాగుబండి శ్రీలత, మంచికంటి స్వప్న, బవిరిశెట్టి కృష్ణ చైతన్య, మడిచెట్టి సరిత, సుజాత తరిగొండ, శిల్ప రాజేష్ తదితరులు ఉన్నారు. పూరమ్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సాంస్కృతిక పండుగలో పాల్గొని ఈ కొత్త సంప్రదాయాన్ని తోటి ప్రవాస భారతీయులతో పాటు, సింగపూర్ స్థానికులకు పరిచయం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులను అభినందించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథి సింగపూర్ దేశ ఆర్థిక, జాతీయ అభివృద్ధి శాఖలకు ద్వితీయ మంత్రిగా సేవలందిస్తున్న భారతీయ మూలాలున్న ఇంద్రాణి రాజా పాల్గొని కార్యక్రమ నిర్వాహకులను, కళాకారులను అభినందించారు. -
సల్మాన్ ఖాన్ సినిమాలో 'బతుకమ్మ' పాట.. క్షణాల్లోనే వైరల్
ఈమధ్య కాలంలో తెలంగాణ యాసలో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. చాలామంది హీరోలు తమ చిత్రాల్లో తెలంగాణ యాస, పాటలు ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సినిమాలోనూ తెలంగాణ సంప్రదాయానికి పెద్దపీట వేశారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పాట ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తుంది. ఈ చిత్రంలో తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా బతుకమ్మ సాంగ్ను చిత్రీకరించారు. 'ముంగిట్లో ముగ్గేసి గొబ్బిల్లే పెడదామా...గడపకు బొట్టేట్టి తోరణాలు కట్టేద్దామా' అంటూ హిందీ చిత్రంలో తెలుగు పాట రావడం తెలుగు ప్రేక్షకులనే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజానికి ఇది వెంకటేశ్ సలహా అని టాక్ వినిపిస్తుంది. ఐడియా నచ్చడంతో సల్మాన్ తన సినిమాలో పెట్టుకున్నారట. ఈ చిత్రంలో వెంకటేశ్కు చెల్లెలిగా పూజా హెగ్డే నటిస్తుంది. -
మునుగోడులో మంత్రి మల్లారెడ్డి ప్రచారం
-
మునుగోడు ఉప ఎన్నిక: మహిళలతో ఆడిపాడిన మంత్రి మల్లారెడ్డి
సాక్షి, నల్గొండ: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ తరపున నిర్వహించిన ప్రతి సభ, కార్యక్రమానికి హాజరై పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతారు. ఆటపాటలతో జనాలను హోరెత్తిస్తారు. తాజాగా మునుగోడులో ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి మల్లారెడ్డి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఊళ్లో పూజలు నిర్వహించి.. మహిళలు, మరుగుజ్జులతో కలిసి బతుకమ్మ ఆడుతూ స్థానిక ఓటర్లను ఆకట్టుకున్నారు. -
అమెరికాలో పుష్ప క్రేజ్.. అనసూయతో తగ్గేదేలే అంటున్న న్యూయార్క్ మేయర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్పకు క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. పాన్ ఇండియాలో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాలోని పాటలకు విదేశీయులు సైతం స్టెప్పులేశారు. ఈ చిత్రంలోని బన్నీ డైలాగ్ తగ్గేదేలే అంటూ చేసే యాక్షన్కు మామూలు ఫాలోయింగ్ కాదు. తాజాగా అల్లు అర్జున్ యాక్షన్కు అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సైతం ఫిదా అయిపోయారు. తగ్గేదేలే అంటూ బన్నీ స్టైల్లో యాక్షన్ చేసి చూపించారు. టాలీవుడ్ యాంకర్ అనసూయ పక్కనే ఉండగా మేయర్ అల్లు అర్జున్ యాక్షన్లో అదరగొట్టారు. (చదవండి: క్రేజీ అప్డేట్.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్ షూటింగ్!) న్యూయార్క్లో దసరా సందర్భంగా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యాంకర్ అనసూయ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్ అక్కడే ఉన్న ప్రజలతో మమేకమై వారితో కలిసి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో న్యూయార్క్ మేయర్ ఆఫీస్ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోపై పుష్ప టీం స్పందిస్తూ ' భారతీయ చిత్రంపై మీ ప్రేమను చూపినందుకు ధన్యవాదాలు. ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అనసూయ, మంగ్లీకి ప్రత్యేక కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్గా వస్తున్న పుష్ప-2 మూవీ కూడా షూటింగ్ ప్రారంభమైంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా అవార్డుల్లోనూ తగ్గేదేలె అంటోంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. తాజాగా ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప క్లీన్ స్వీప్ చేసేసింది. ఏకంగా 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది. Thank you @NYCMayor for Showing Your Love towards Our Indian Film #Pushpa ❤️ ! Special Thanks and Congratulations to our @anusuyakhasba gaaru and #mangli for making the event grand Successful Video By : @NYCMayorsOffice@alluarjun • #Anasuya • #AlluArjun • @PushpaMovie pic.twitter.com/3kAX1eRnma — PushpaTheRule ⭐ (@uicaptures) October 10, 2022 -
పోర్ట్ల్యాండ్లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబురాలు
అమెరికాలోని పోర్ట్ల్యాండ్ సిటీ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు అత్యంత అంగరంగ వైభోవోపేతంగా జరిగాయి. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత క్వాటామా ఎలిమెంటరీ స్కూల్లో (Quatama Elemantary School)లో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ పండుగలకు అమ్మాయిలు, మహిళలు తెలుగు తనం ఉట్టి పడే విధంగా సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగు రంగుల బతుకమ్మలతో వచ్చి ఆట పాటలతో హోరెత్తించారు. దసరా వేడుకని వేదం మంత్రాలని అందరితో పఠింప చేసి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజని నిర్వహిచారు. జమ్మి (బంగారయం), ఇచ్చి పుచ్చుకొని అందరు అలయ్ బలయ్ చేసికున్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల వేడుకలలో పాల్గొన్న వారందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియచేశారు. బతుకమ్మ పండుగ అత్యంత ఘనంగా జరగడానికి సహకరించిన మహిళలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ వేడుకలని వైభవోపేతంగా నిర్వహించి విజయవంతం కావడంలో కృషి చేసి ముఖ్య భూమికను పోషించిన పోర్ట్లాండ్ చాప్టర్ టీం, వలంటీర్స్ - వీరేష్, సురేష్, మధుకర్, నరేందర్, అజయ్, ప్రవీణ్ ఏ, రఘు, జయకర్, రాజ్, శ్రీపాద్, శ్రీకాంత్, వెంకట్ , అరుణ్, శ్రీని ఎం, ప్రదీప్, శ్రీని జీ, రవి, కిషన్, నవీన్, మహేష్ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ప్రశంసలు తెలియ చేశారు. -
దుబాయి లేజర్ షోకు ధీటుగా.. తెలంగాణలో కోటి చప్పట్ల బతుకమ్మ!
దుబాయిలో ప్రపంచంలోనే ఎత్తయిన భవనంగా ఉన్న బుర్జ్ ఖలీఫా నమూనాను తయారు చేసి దాని శిఖరంపై చెరుకుగడల ఆకులు, గల్ఫ్ జెఏసీ జెండా నిలిపి దాని చుట్టూ మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ వినూత్నమైన బతుకమ్మ వేడుకలు జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం బీమారం, కోరుట్ల మండలం చిన్న మెటుపల్లి గ్రామాలలో శనివారం (08.10.2022) రాత్రి మహిళలు నిర్వహించారు. మూతబడ్డ ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ తెరిపించేలా... 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు అయ్యేలా దీవించాలని బతుకమ్మను వేడుకుంటూ పాటలు పాడారు. చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికుల కుటుంబాల మహిళలతో గ్రామంలోని ఆడపడుచులు అందరూ ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. వీడియోకాల్ లో ఉయ్యాలో... ఆట చూత్తావానే ఉయ్యాలో... ఆడియోకాల్ లో ఉయ్యాలో... పాట వింటవానే ఉయ్యాలో... అంటూ ఒక చెల్లెలు... గల్ఫ్ లో ఉన్న తన అన్నను సంబోధిస్తూ పాడే పాట అందరినీ ఆకర్షించింది. దుబాయి లేజర్ షో కు దీటుగా... తెలంగాణలో కోటి చప్పట్ల బతుకమ్మ ! ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఒక ఎంపీ, ఆరుగురు ఎమ్మెల్యేల సమక్షంలో గత సంవత్సరం 2021 అక్టోబర్ 23న దుబాయి లోని బుర్జ్ ఖలీఫా వద్ద కోటి రూపాయలు ఖర్చు చేసి ఎడారి ఆకాశంలో బతుకమ్మ సంబరాల లేజర్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. బుర్జ్ ఖలీఫా స్క్రీన్ (తెర) పై లేజర్ షో ద్వారా బతుకమ్మ దృశ్య నివేదన జరిగింది. ఆకాశంలో పూల పండుగ చూసి ప్రపంచం అబ్బుర పడింది. దుబాయి లేజర్ షోకు పోటీగా తాము ఈ సంవత్సరం తెలంగాణ గడ్డపై కోటి చప్పట్ల బతుకమ్మ నిర్వహించామని బీమారం గ్రామానికి చెందిన గల్ఫ్ జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ తెలిపారు. గల్ఫ్ దేశాలలో ఉన్న 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు, గల్ఫ్ నుంచి వెనక వచ్చి గ్రామాలలో స్థిరపడ్డ 30 లక్షల మంది కార్మికులు, వీరందరి కుటుంబ సభ్యులు కలిసి 'ఒక కోటి గల్ఫ్ ఓటు బ్యాంకు' ఏర్పడిందని ఆయన అన్నారు గల్ఫ్ నిర్మాణాల పునాదులు వారి చెమటతో తడిశాయి గల్ఫ్ దేశాలలోని రంగు రంగుల ఆకాశ భవనాల నిర్మాణం వెనుక తెలంగాణ కార్మికుల కష్టం ఉంది. ఈ నిర్మాణాల పునాదులు కార్మికుల చెమటతో తడిశాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో గల్ఫ్ ప్రవాసుల పాత్ర అమోఘం. గుర్తింపుకు నోచుకోని అజ్ఞాత వీరులు, అజ్ఞాత శిల్పులైన మన ప్రవాసీ కూలీలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదంతో వలస కార్మికులు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ సాధనలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పాత్ర మరువలేనిది. తెలంగాణ ఏర్పడిన 2 జూన్ 2014 నుంచి ఈనాటి వరకు గత ఎనిమిది ఏళ్లలో గల్ఫ్ దేశాలలో సుమారు 1,600 కు పైగా తెలంగాణ కార్మికులు మరణించారు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వారు 2,000 కు పైగా మరణించారు. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రభుత్వం ప్రకటించాలని తెలంగాణ ప్రవాసీయులు కోరుకుంటున్నారు. -
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా సంబురాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఏళ్ళ తరబడి అమెరికాలో చాటుతున్న సంగతి తెలిసిందే. టీటీఏ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి అధ్యక్షతన అమెరికాలోని నలుమూలల మిన్నంటే సంబురాలతో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. న్యూయార్క్ నగరంలో.. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డి, సొంత నగరమైన న్యూయార్క్ లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. లాంగ్ ఐలాండ్లోని రాడిసన్ హోటల్ లో రెండు వేలకు పైగా అతిథులతో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికను అమ్మవారు అధిరోహించగా భక్తిశ్రద్ధలతో సాగిన లలిత పారాయణం, న్యూ యార్క్ ఆడపడుచుల ఆటపాటలు, నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఈ వేడుకలు జరిగాయి. సహచర సంఘమైన న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) తోడ్పాటు అందించాయి. ఈ వేడుకలలో అతిథులు ఉత్సాహంగా రూపొందించి తీసుకొచ్చిన బతుకమ్మలను ఒక్క చోట అలంకరించి బెస్ట్ బతుకమ్మ పోటీలు నిర్వహించారు. బాణసంచాల వెలుగులలో కోలాహలంగా బతుకమ్మ నిమజ్జనం జరిగింది. న్యూ జెర్సీ నగరంలో ..టీటీఏ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి సొంత రాష్ట్రం, అమెరికాలోనే అతి ఎక్కువ తెలంగాణ, తెలుగు వారు నివసించే న్యూ జెర్సీ నగరంలో బతుకమ్మ సంబురాలు మిన్నంటాయి. ప్రతి ఏడాది అమెరికాలోనే అతి పెద్దది, అరుదైన బంగారు బతుకమ్మను న్యూజెర్సీ టీటీఏ సభ్యులు చాలా గొప్పగా బంగారు బతుకమ్మను పేర్చారు. అంగరంగ వైభవంగా ఉడ్రో విల్సన్ మిడిల్ స్కూల్లో సుమారు రెండు వేల మంది తెలంగాణ ఆడపడుచులు జోరు వానలో సైతం బతుకమ్మలతో వేదికకు తరలి వచ్చారు. ఇండియానాపోలిసులో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వెస్ట్ఫిల్డ్ నగరంలోని కారి రిడ్జ్ ఎలిమెంటరీ స్కూల్ నందు తెలంగాణ తెలుగు మహిళలంతా షుమారు వెయ్యి మందికి పైగా బతుకమ్మలను పేర్చి తెచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఇండియానాపోలీసులో ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ జరగటం ఇదే మొధటిసారి. జనం నలుమూలల నుంచి పోటెత్తారు. డెట్రాయిట్ నగరంలో.. టీటీఏ ఆధ్వర్యంలో షుమారు అయిదు వందల మంది మహిళామణులు చేరి అమ్మవారిని గౌరి పూజ, కోలాటాలతో, బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైన ఉత్సవాలు ఎనిమిది గంటలవరకు వివిధ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు, బంగారు బతుకమ్మలను పేర్చి తెచ్చి పాల్గొన్న డెట్రాయిట్ ఆడపడుచులందరికి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. సియాటెల్ నగరంలో.. వాషింగ్టన్ లోని సియాటెల్ (పసిఫిక్ వాయవ్యం) నగరంలో టీటీఏ నిర్వహించే ప్రతి ఏటా బతుకమ్మ సంబురాలకు సియాటెల్ ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. వంద తెలంగాణా తీన్మార్ డప్పులతో బతుకమ్మ అమ్మవారిని ఊరేగిస్తూ వేదిక, నార్త్ క్రీక్ మిడిల్ స్కూల్ లో, బోతెల్ సిటీ కి తీసుకు వచ్చారు. అనంతరం దుర్గ పూజ, కోలాటాలు, బతుకమ్మ ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. షుమారు వెయ్యి మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రేటర్ ఫిలడెల్ఫియా లో.. ఆలెన్టౌన్ లో బతుకమ్మ సంబరాలు ..తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఆధ్వర్యంలో ఆలెన్ టౌన్ లోని శ్రీ వరదరాజులు స్వామి ఆలయంలో షుమారు మూడు వందల కుటుంబాలు పాల్గొని చక్కని వాతావరణంలో అమ్మవారి బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. బోస్టన్లో .. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఇంగ్లాడులోని శివ టెంపుల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగింది. షుమారు వెయ్యి మంది మహిళలు అమ్మవారిని అలంకరించి తీసుకొచ్చారు. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. కాలిఫోర్నియాలో.. కాలిఫోర్నియా లోని బే ఏరియా లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జానపద బతుకమ్మ సంబరాలు మౌంటెన్ హౌస్ హై స్కూల్ నందు ఆట పాటలతో అమ్మవారి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. హూస్టన్ నగరంలో.. ఇండియా హౌస్ లో షుమారు మూడు వేల మంది ఆహుతులతో టీటీఏ హూస్టన్ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జానపద బతుకమ్మ ఆట పాటలతో అమ్మవారి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. కన్సాస్ నగరంలో.. కన్సాస్ లోని హిందూ టెంపుల్ అఫ్ కన్సాస్ లో షుమారు వెయ్యి మంది ఆహుతులతో టీటీఏ కన్సాస్ బతుకమ్మ సంబరాలు స్థానిక సంస్థలతో కలిపి ఘనంగా నిర్వహించింది. జానపద బతుకమ్మ ఆట పాటలతో అమ్మవారి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. -
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా, బతుకుమ్మ పండుగలని ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిన్లాండ్లోని అన్ని ప్రాంతాల నుంచి నాలుగు వందల మంది హాజరయ్యారు. చిన్నారులు, పెద్దలు తమ ఆట పాటలతో, నృత్య ప్రదర్శనలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మన తెలుగు వాళ్లతో పాటు, ఫిన్లాండ్లోని ప్రజలు కూడ పాల్గొనడం గమనార్హం. గతంలో ఫిన్లాండ్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తక్కువ మంది వరకు హాజరయ్యేవారని, కాని ఈ సారి నాలుగు వందలకి పైన హాజరుకావడం ఆనందకర విషయమన్నారు. తెలుగు వారు ఫిన్లాండ్కు అధికంగా వస్తున్నారనడానికి ఈ సంఖ్య నిదర్శనమని ఫిన్లాండ్ తెలుగు సంఘం సంస్థ కార్యవర్గం రఘునాథ్ పార్లపల్లి, సుబ్రమణ్య మూర్తి, జ్యోతి స్వరూప్ అనుమాలశెట్టి, సత్యనారాయణ కంచర్ల తెలిపారు. ఇంత మందితో కలిసి పండుగ చేసుకోవడం చూస్తుంటే.. మన ఊరిలో, మన ఇంటిలో ఉన్నట్లే అనిపించిందన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి మంది పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీవల్లి అడబాల, రోజా రమణి మొలుపోజు, వినయ్ శింగపురం, స్పందన ఈచూరి, శ్రుతి కొత్రిక్, వాసు దాసరి, వెంకట్ వారణాసి చెప్పారు. -
లండన్లో ఘనంగా ‘టాక్ - చేనేత బతుకమ్మ- దసరా’ సంబురాలు
లండన్: లండన్లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలను తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యుకే నలుమూలల నుంచి రెండు వేలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం, భారత హై కమిషన్ ప్రతినిధి లక్ష్మి నారాయణన్, స్థానిక హౌన్సలౌ డిప్యూటీ మేయర్ కౌన్సిలర్ ఆదేశ్ ఫర్మాన్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా ఈసారి కూడా వేడుకలను "చేనేత బతుకమ్మ-దసరా" గా జరుపుకున్నామని సంస్థ అధ్యక్షుడు తెలిపారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ లోని ఏదో ఒక ముఖ్యమైన చారిత్రాత్మక కాట్టడాల నమూనాని ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతున్నామని, ఈసారి యాదాద్రి దేవాలయ నమూనా ప్రదర్శించామని చెప్పారు. ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. టాక్ వ్యవస్థాపకుడిగా ఒక తెలంగాణ కార్యకర్తగా దాదాపు దశాబ్ద కాలం లండన్ గడ్డ పై పని చేశానని, ప్రస్తుతం అతిథిగా అదే గడ్డపై ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా గర్వంగా ఉందన్నారు. యూకే ప్రవాస సమాజమంటే ప్రత్యేక గౌరవముందని, ఎక్కడికి వెళ్లినా ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి - సత్యమూర్తి చిలుముల, ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు మరియు టాక్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, టాక్ ప్రధాన కార్యదర్శులు సురేష్ బుడగం - జాహ్నవి దుసరి, అడ్వైసరి బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ అఫైర్స్ చైర్మన్ నవీన్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు పవిత్రా రెడ్డి, ముఖ్య సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి, మాధవ్, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, శ్రావ్య, శ్రీవిద్య, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్, రాజేష్ వర్మ, క్రాంతి రేటినేని, మమత జక్కీ, శ్వేతా మహేందర్, మధుసూదన్ రెడ్డి, శ్వేతా రెడ్డి, శశి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తేజ, నిఖిల్, సందీప్ బుక్క, అక్షయ్, మౌనిక, ప్రవీణ్ వీర, రంజిత్ , వంశీ , నరేష్ , నాగరాజు, మ్యాడి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. -
టీపాడ్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ, దసరా వేడుకలు
కళల నిలయమైన అమెరికాలోని డాలస్.. మన తెలుగువారి పండుగల అందాలనూ అద్దుకుంటోంది. తంగేడు వనాన్ని, గునుగుపూల సోయగాన్ని ఇముడ్చుకుని తెలంగాణ పండుగ బతుకమ్మకు మరింత కళను జోడించింది. చరిత్ర సంరక్షణకూ పెట్టింది పేరైన ఆ పట్టణం.. మన బతుకమ్మ, దసరా పండుగల సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అక్కడ నివసిస్తున్న తెలంగాణ ప్రజల సమూహం తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్).. ఏ విదేశాలలో నిర్వహించలేనంత వైభవంగా, ఈ పండుగలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రత్యేకతను చాటింది. దాదాపు పదిహేను వేల మంది హాజరై మహా సందడి చేసిన ఈ కార్యక్రమానికి డాలస్ పరిధిలోని ఫ్రిస్కో పట్టణంలో గల కొమెరికా సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా స్టేడియం) వేదికగా నిలిచింది. ఏటా బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి దృష్టిని టీపాడ్ ఆకర్షించి సంగతి తెలిసిందే. దీంతో టీపాడ్ ఆతిథ్యం గురించి తెలుసుకుని పొరుగు రాష్ట్రాలైన ఓక్లహామా, కాన్సాస్, ఆర్కన్సాస్లో ఉంటున్న తెలుగువారూ అక్కడికి విచ్చేసి సందడి చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సుమారు 6మంది మహిళలు, బాలికలు సామూహికంగా పాడుతూ, చప్పట్లు కొడుతూ లయబద్దంగా కదులుతుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజాము వరకు వేడుకలు కొనసాగాయి. స్థానిక డ్యాన్స్ స్కూల్స్ విద్యార్థుల నృత్యాలతో వేడుక మొదలయింది. అమ్మవార్లే కదిలివచ్చారా అన్నట్టుగా నవదుర్గ వేషధారణతో అమ్మాయిల ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. నాలుగు గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం విజయదశమి వేడుకలను నిర్వహించారు. శమీపూజ చేశారు. సినీనటి రీతూవర్మ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఆపై అందరినీ ఆహ్లాదపరుస్తూ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం తమ పాటలు, సంగీతంతో కొత్త లోకంలో విహరించేలా చేసింది. గాయకులు లిప్సికా, రోల్ లైడా, ధనుంజయ్ తదితరులు తమ పాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను తెలంగాణ పీపుల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) Telangana people’s association of Dallas (T pad) భారీ కసరత్తే చేసింది. దాదాపు నెలరోజుల క్రితమే అసోసియేషన్ బృందం కమిటీలు గా ఏర్పడి బాధ్యతలను తీసుకున్నారు. టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమం ఆసాంతం విజయవంతమయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి తనవంతు సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా, స్థానిక, జాతీయ తెలుగు సంస్థలకు, దాతలకు, మీడియా సంస్థలకు తమ కార్యక్రమాలకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న డాలస్ లోని తెలుగు వారందరికీ TPAD నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. -
బతుకమ్మ-దసరా పండగకి ఊరెళ్లిపోతా మామ...బస్టాండ్ లు,రైల్వేస్టేషన్లు కిటకిట (ఫొటోలు)
-
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
బతుకమ్మ పండగ వేళ విషాదం.. మరొకరితో సహజీవనం చేస్తోందని..
సాక్షి, సిద్దిపేట: బతుకమ్మ పండగ వేళ మండలంలోని వీరాపూర్లో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా మామిడి స్వప్న(45)ను ఆమె భర్త ఎల్లారెడ్డి రాడ్డుతో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి వీరాపూర్ గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్రెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు మంగ, స్వప్న ఉన్నారు. అదే గ్రామంలోని యాల్ల ఎల్లారెడ్డితో పెద్ద కూతురు మంగ వివాహం 20 ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లి జరిగిన నెలకే మంగ ఆత్మహత్య చేసుకుంది. తరువాత రెండో కూతురు స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆరేళ్ల వరకు వారు అనోన్యంగానే ఉన్నారు. వారికి కుమార్తె సుశ్మిత, కుమారుడు శ్రీజన్ ఉన్నారు. భార్యాభర్త తరుచు గొడవ పడేవారు. కాగా 14 ఏళ్ల నుంచి అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్వప్న సహజవనం చేస్తోంది. తనను వదిలి మరో వ్యక్తితో ఉంటోందని మనుసులో పెట్టుకున్న ఎల్లారెడ్డి బతుకమ్మ ఆడుతున్న స్వప్నను రాడ్తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కూతురును హత్య చేసిన ఎల్లారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తల్లి ఎల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు. చదవండి: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు దుర్మరణం -
కూకట్పల్లి లో బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
ఈనెల 25న ఎంగిలి పూల బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడుచులు ఎక్కడున్నా వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ ఏర్పాట్లు చేసుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిదిరోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ప్రతి రోజు ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు చేసి సాయంత్రం పూట ఆనందోత్సాహాలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడతారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం రోజున ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు! -
బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు!
సాక్షి, హైదరాబాద్: అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా సింగారించుకునే వేళ.. నిండిన చెరువులు, పండిన పంటలతో అలరారే సమయం.. కురిసే చినుకుల తాకిడితో పుడమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావిస్తున్న పూల పండుగ బతుకమ్మ ప్రారంభమవుతోంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు ఏటా పెద్ద అమవాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ అంటే.. బతుకమ్మ అనే పదానికి తెలంగాణలో విభిన్న పర్యాయ పదాల వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అంటే పూలతో కూడిన అమరిక అని అర్థం. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను కొన్ని వరుసలు పేరుస్తారు. మ«ధ్యలో పసుపుతో చేసిన స్థూపాకారావు పదార్థాన్ని లేదా గుమ్మడి పూవులో నుంచి తీసిన మధ్య భా గాన్ని ఉంచుతారు. దీన్ని బొడ్డెమ్మ అని పిలుస్తారు. కొందరు బొడ్డెమ్మను దుర్గగా కొలుస్తారు. బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. పండుగ నేపథ్యం ఇదీ.. 19వ శతాబ్దం పూర్వార్థం నిత్యం దారిద్య్రం, భయంకర అంటువ్యాధులు, ప్రకృతి బీభత్సాలతో తెలంగాణలోని గ్రామాల్లో అనేక మంది ప్రజలు చనిపోయేవారు. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టాల నుంచి గట్టెక్కేందుకు, తమకు పుట్టిన పిల్లలు అనారోగ్యం బారిన పడి చనిపోకుండా బతకటానికి బతుకమ్మ(బతుకు+అమ్మ) పండుగను సృష్టించుకున్నారు. మరో కథనం ప్రకారం.. ఒక కాపు కుటుంబంలో ఏడో సంతానంగా పుట్టిన అమ్మాయే బతుకమ్మ. అంతకుముందు పుట్టి చనిపోయిన వారిలో కలవకూడదనే భావనతో ‘బతుకమ్మ’ అని పిలుచుకుంటూ పెంచుతారు. బతుకమ్మ ఎదిగాక పెళ్లి చేస్తారు. ఓ పండుగ రోజు బతుకమ్మ పుట్టింటికి వస్తుంది. అన్న భార్యతో కలిసి చెరువుకు స్నానానికి వెళ్తుంది. అక్కడ ఒడ్డున పెట్టిన ఇద్దరి చీరలు కలిసిపోయి వదిన చీరను బతుకమ్మ కట్టుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి, వదిన బతుకమ్మ గొంతు నులిమి, చంపేసి చెరువు గట్టున పాతిపెడుతుంది. తర్వాత ఆమె తంగేడు చెట్టుగా మొలుస్తుంది. బతుకమ్మ తన భర్తకు కలలో కనిపించి, జరిగిన విషయం చెప్పి, తనను తీసుకుపొమ్మంటుంది. అలా పండుగ ప్రారంభమైందని చెబుతారు. ఎంగిలిపూల బతుకమ్మ.. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి ఎంగిలిపూలుగా పరిగణిస్తారు. పితృ అమావాస్య రోజు స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకొని, వారిని దేవతలుగా ఆరాధిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో తెచ్చిన పూలన్నీ ఎంగిలి పడ్డట్టుగా భావిస్తారు. అటుకుల బతుకమ్మ.. రెండోరోజు అటుకల బతుకమ్మగా పిలుస్తారు. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులందరూ ఆట పాటలతో సందడి చేస్తారు. బెల్లం, అటుకులు, పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ.. మూడోరోజు ముద్ద పప్పు బతుకమ్మగా జరపుకుంటారు. బెల్లం, ముద్దపప్పు, పాలతో నైవేద్యం తయారు చేస్తారు. నానబియ్యం బతుకమ్మ.. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను నాలుగు వరుసలుగా పేరుస్తారు. గౌరమ్మను పెట్టి, ఆడిపాడి, దగ్గరలోని చెరువులో నిమజ్ఞనం చేస్తారు. ఈ సందర్భంగా నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపి ముద్దలుగా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. తంగేడు, మందారం, చామంతి, గునుగు, గుమ్మడి పూలతో ఐదు వరుసలు పేర్చి, బతుకమ్మను త యారు చేస్తారు. బియ్యం పిండితో తయారు చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ.. ఆరోరోజు అలిగిన బతుకమ్మ. బతుకమ్మను పూలతో అలకరించరు. నైవేద్యం సమర్పించరు. బతుకమ్మను పేర్చి ఆడకుండా నిమజ్జనం చేస్తారు. వేపకాయల బతుకమ్మ.. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. ఈరోజు తంగేడు, చామంతి, గులాబీ, గునుగు పూలతో బతుకమ్మను ఏడు వరుసల్లో పేరుస్తారు. బియ్యం పిండిని వేప పండ్లుగా తయారు చేసి, నైవేద్యం సమర్పిస్తారు. వెన్నెముద్దల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తంగేడు, చామంతి, గునుగు, గులాబీ, గడ్డిపూలతో కలిపి ఎనిమిది వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. అమ్మవారికి ఇష్టమైన నువ్వులు, వెన్న, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో సద్దుల బతుకమ్మ చివరిది. ఈరోజు అన్ని రకాల పూలతో భారీ బతుకమ్మలను పేరుస్తారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి, ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. పెరుగు అన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రసాదాన్ని అరగిస్తారు. -
Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే
బతుకమ్మ అంటే ఒక సంబరం. ఒక సాంస్కృతిక వారసత్వం. ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. అందుకే బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రకృతిలో మమేకమై తాము పడ్డ బాధలను కష్టాలను మర్చిపోతారు పల్లె మహిళలు. తెలంగాణ జిల్లాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగే ఇది. ఏటా భాద్రపద మాసంలో బహుళ అమావాస్య నుంచి ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి వరకు జరుగుతుంది. తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో అందగా బతుకమ్మను పేరుస్తారు ఆడబిడ్డలు. బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకుల్లో భాగం. వారి జీవన విధానంలో మమేకమై ఆనాదిగా ఆచారంగా వస్తున్న పండుగే బతుకమ్మ. ఈ పండుగ వచ్చిందంటే చాలు వారం, పది రోజులు ఒక్కటే సందడిగా మారుతుంది. కొత్త బట్టలు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కష్టాసుఖాలను పాటల రూపంలో పలికే పండుగ ఇది. సిబ్బి లేదా పళ్ళెం, తాంబాలంలో అడుగున ఆకులు పరిచి, తంగేడు, గునుగు పూలతో పాటు ప్రకృతిలో దొరికే ఏ పువ్వయినా బతుకమ్మలో పేర్చుతారు. బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలకరించి పసుపు కుంకుమ అక్షింతలు వేసి, తమ ముత్తయిదువతానాన్ని నిలిపే గౌరవమ్మను భక్తిగా పూజిస్తారు. రకరకాల పువ్వులతో దేవతలను పూజించటం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయటమే ఈ పండుగ ప్రత్యేకత. బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడతూ ఉత్సాహంగా వేడుక జరుపుకుంటారు. ప్రకృతితో మమేకమై తాము పడ్డ బాధలను కష్టాలను మర్చిపోతారు మహిళలు. బతుకమ్మ వెనుక ఎన్ని కథలున్నా.. ఎంత చరిత్ర ఉన్నా బతుకమ్మ అచ్చంగా మనదైన పండుగ, మన ఆడపడుచుల పండుగ. -
విమలక్క ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘బహుజన బతుకమ్మ’
సాక్షి, హైదరాబాద్: ప్రజాగాయకురాలు అరుణోదయ విమలక్క ‘బహుజన బతుకమ్మ’వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తారు. ‘బతుకమ్మ ఉత్సవమే కాదు.. ఉద్యమమంటూ చాటుదాం’అంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘బహుజన బతుకమ్మ’ ఉత్సవాలను చేపడుతున్నారు. పదమూడేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 24న ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు గన్పార్కులో అమరులకు నివాళి అర్పించి, సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ ఆడతారు. అక్టోబర్ 3న యాదాద్రి భువనగిరిలో ముగింపు ఉత్సవాలు చేస్తారు. బహుజన బతుకమ్మ షెడ్యూల్: ►సెప్టెంబర్ 24: ఉదయం 10 గంటలకు గన్పార్కు వద్ద నివాళి, సాయంత్రం 4 గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుంచి ప్రారంభం ►సెప్టెంబర్ 25: నారాయణపేట జిల్లా పాటేపల్లి–హకీంపేట్లో ►సెప్టెంబర్ 26: సూర్యాపేట జిల్లా ఇస్తాళ్లపురంలో ►సెప్టెంబర్ 27: జనగాం జిల్లా బతుకమ్మకుంటలో ►సెప్టెంబర్ 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో ►సెప్టెంబర్ 29: సిద్దిపేట జిల్లా కాజీపురంలో ►సెప్టెంబర్ 30: యాదాద్రి భువనగిరి జిల్లా వెల్మజాల, గుండాలలో ►అక్టోబర్1: రాజన్న సిరిసిల్లజిల్లా వేములవాడలో ►అక్టోబర్ 2: హైదరాబాద్ జిల్లా మల్లాపూర్లో ►అక్టోబర్ 3: యాదాద్రి భువనగిరి జిల్లా పిల్లాయిపల్లిలో. -
Dubai: బుర్జ్ ఖలీఫాపై బంగారు ‘బతుకమ్మ’
తెలంగాణ బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. మన సాంస్కృతిక వైభవం ‘జై బతుకమ్మ’, ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’ అంటూ బుర్జ్ ఖలీఫాపై జిగేల్మని మిరుమిట్లుగొలిపింది. పూల సంబురం విశ్వవిఖ్యాతికెక్కింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ‘బతుకమ్మ’ను విశ్వ వేదికపై ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చొరవతో దుబాయిలోని అతి ఎత్తయిన కట్టడం బుర్జ్ ఖలీఫా తెరపై బతుకమ్మ విశిష్టతను చాటేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగపై రూపొందించిన మూడు నిముషాలు నిడివిగల వీడియోను శనివారం రాత్రి 9.30కు, తిరిగి 10.30కు రెండు పర్యాయాలు ప్రదర్శించారు. ‘జై తెలంగాణ’, ‘జై హింద్’నినాదాలతో పాటు బతుకమ్మ చిత్రాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని బుర్జ్ ఖలీఫా తెరపై ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫా తెరపై కనిపించగానే కార్యక్రమానికి హాజరైన తెలంగాణ వాసులు హర్షం వ్యక్తం చేశారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు బతుకమ్మ వీడియోను తిలకించారు. దేశానికే గర్వకారణం: కవిత బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం దేశానికే గర్వకారణమని, చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ పాటను రూపొందించడం పట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, జీవన్రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్ సంజయ్, బిగాల గణేష్ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, దాస్యం విజయ్ భాస్కర్, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. -
బతుకమ్మ నిమజ్జనంలో అపశ్రుతి
కల్లూరు రూరల్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథబంజర్లో శనివారంరాత్రి జరిగిన బతుకమ్మ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బతుకమ్మను నిమజ్జనం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నాగార్జునసాగర్ కాల్వనీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. వివరాలు.. నాగార్జునసాగర్ కాల్వలో బతుకమ్మను నిమజ్జనం చేసే క్రమంలో ఖమ్మంపాటి మాధవీలత(25), పసుపులేటి శివ(23) నీటమునిగి మృతిచెందారు. వివరాలు.. రఘునాథబంజర్ గ్రామంలో పేర్చిన బతకమ్మలను శనివారంరాత్రి ఊరేగించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు అర్ధరాత్రి దాటిన అనంతరం కూడా కొనసాగింది. తర్వాత గ్రామం పక్కనే ఉన్న సాగర్ ప్రధాన కాల్వనీటిలో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు భక్తులంతా అక్కడికి చేరుకున్నారు. బతుకమ్మను నిమజ్జనం చేస్తుండగా ఖమ్మంపాటిమాధవీలత(25) నీటిలోకి జారింది. అక్కడే ఉన్న పసుపులేటి శివ(23)తోపాటు మరో ఇద్దరు కాల్వలోకి దూకి ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా కాసేపటికే మాధవీలత చనిపోయింది. అయితే ఆమె మృతదేహాన్ని గాలించి ఒడ్డుకు చేర్చేక్రమంలో శివ నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు. మాధవీలత మృతదేహాన్ని కాల్వగట్టుపైకి తెచ్చిన కొద్దిసేపటికి అక్కడున్నవారు గుర్తించి శివ కోసం రాత్రంతా గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కాల్వనీటిపైన మృతదేహం తేలగా గ్రామస్తులు గమనించి ఒడ్డుకు చేర్చారు. పండుగ కోసం ఊరొచ్చి ఇలా.. ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన రాధాకృష్ణ, మాధవీలత భార్యాభర్తలు. అక్కడే నివాసముంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు రఘునాథబంజర్లో రేషన్డీలర్. పసుపులేటి శివ తండ్రి రామయ్య సామాన్య కూలీ. రామయ్యకు శివతోపాటు ఓ కుమార్తె ఉంది. శివ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అవివాహితుడు. దసరా పండుగ కోసం వచ్చిన వీరిద్దరూ ఇలా మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
Photo Story: ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం
బాసరలో ముగిసిన ఉత్సవాలు భైంసా(ముధోల్): దేవీనవరాత్రుల ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాసరలోని మహాలక్ష్మీ, మహంకాళి, వేదవ్యాసుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి శోభాయాత్ర నిర్వహించారు. హారతి ఘాట్లో గంగమ్మతల్లికి ప్రత్యేక హారతి ఇచ్చారు. ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం సాక్షి వరంగల్: అమెరికాలోని డల్లాస్లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లా‹స్ (టీప్యాడ్) ఆధ్వర్యంలో శుక్ర , శనివారం సద్దుల బతుకమ్మ, దసరా సంబురాలుఅంబరాన్నంటాయి. 14 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ మహిళలు ఆడిపాడారు. వాయినం ఇచ్చుకుని బంగారు బతుకమ్మలను నీటి కొలనులో నిమజ్జనం చేశారు. అబ్రేటీఎక్స్లోని బిగ్ రాంచ్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతిభవన్లో ఆయుధ పూజ సాక్షి, హైదరాబాద్: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం ప్రగతి భవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు జరిపారు. వాహనపూజ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. పూజల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్కుమార్రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
Bathukamma 2021: తీరొక్క పూలతో ఫారిన్ బతుకమ్మ
కూకట్పల్లి: దేశంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి తీసుకువచ్చిన తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు కూకట్పల్లికి చెందిన గుండాల అర్చన. నెల రోజులపాటు ఆమె పూలను సేకరించి బతుకమ్మను తీర్చిదిద్దారు. న్యూజిలాండ్లోని తన స్నేహితులతో పూలను పార్శిల్లో తెప్పించారు. దేశంలోని కశ్మీర్, కన్యాకుమారి, కొడైకెనాల్, ఊటీ, బెంగళూర్ తదితర ప్రాంతాల నుంచి సైతం పుష్పాలను సేకరించి దాదాపు 13 అడుగుల మేర కమలం ఆకారంలో బతుకమ్మను పేర్చారు. గతంలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ ప్రాంతాల నుంచి పూలను తీసుకురావటానికి అర్చన అత్త చంద్రమ్మ రూ.లక్షలు ఖర్చు చేసేవారు. ఈసారి ఆమె కోడలు ఏకంగా విదేశాల నుంచి పూలను తెప్పించి బతుకమ్మను పేర్చడం గమనార్హం. ఈ బతుకమ్మకు బుధవారం ప్రత్యేక పూజలు చేసి మేళతాళాలు, భారీ ర్యాలీతో ఐడీఎల్ చెరువు వద్దకు తీసుకెళ్లారు. -
న్యూజిలాండ్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటే బతుకమ్మ ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాలు ఖండాంతరాలు దాటాయి.న్యూజిలాండ్ ఆక్లాండ్ సిటీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు జ్యోతి నేతృత్వంలో తొలి రోజు జరిపే ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు అంబురాన్నంటాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడుతూ..పాడుతూ ఆక్లాండ్ల్లో సంబురాలు హోరెత్తాయి. అయితే ఈ ఏడాది కరోనా కరణంగా ఇంటి వద్దనే బతుకమ్మ ఉత్సవాల్ని జరుపుతున్నట్లు జ్యోతి తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు 9 రోజులు రోజుకో రీతిలో సాగి సద్దుల బతుకమ్మతో పరిసమాప్తమవుతాయని అన్నారు. -
నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు.. పండుగ నేపథ్యం ఇదే
సాక్షి, కరీంనగర్: అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా సింగారించుకునే వేళ.. నిండిన చెరువులు, పండిన పంటలతో అలరారే సమయం.. కురిసే చినుకుల తాకిడితో పుడమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావిస్తున్న పూల పండుగ బతుకమ్మ ప్రారంభమవుతోంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు ఏటా పెద్ద అమవాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ అంటే.. బతుకమ్మ అనే పదానికి తెలంగాణలో విభిన్న పర్యాయ పదాల వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అంటే పూలతో కూడిన అమరిక అని అర్థం. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను కొన్ని వరుసలు పేరుస్తారు. మ«ధ్యలో పసుపుతో చేసిన స్థూపాకారావు పదార్థాన్ని లేదా గుమ్మడి పూవులో నుంచి తీసిన మధ్య భా గాన్ని ఉంచుతారు. దీన్ని బొడ్డెమ్మ అని పిలుస్తారు. కొందరు బొడ్డెమ్మను దుర్గగా కొలుస్తారు. బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. పండుగ నేపథ్యం ఇదీ.. 19వ శతాబ్దం పూర్వార్థం నిత్యం దారిద్య్రం, భయంకర అంటువ్యాధులు, ప్రకృతి బీభత్సాలతో తెలంగాణలోని గ్రామాల్లో అనేక మంది ప్రజలు చనిపోయేవారు. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టాల నుంచి గట్టెక్కేందుకు, తమకు పుట్టిన పిల్లలు అనారోగ్యం బారిన పడి చనిపోకుండా బతకటానికి బతుకమ్మ(బతుకు+అమ్మ) పండుగను సృష్టించుకున్నారు. మరో కథనం ప్రకారం.. ఒక కాపు కుటుంబంలో ఏడో సంతానంగా పుట్టిన అమ్మాయే బతుకమ్మ. అంతకుముందు పుట్టి చనిపోయిన వారిలో కలవకూడదనే భావనతో ‘బతుకమ్మ’ అని పిలుచుకుంటూ పెంచుతారు. బతుకమ్మ ఎదిగాక పెళ్లి చేస్తారు. ఓ పండుగ రోజు బతుకమ్మ పుట్టింటికి వస్తుంది. అన్న భార్యతో కలిసి చెరువుకు స్నానానికి వెళ్తుంది. అక్కడ ఒడ్డున పెట్టిన ఇద్దరి చీరలు కలిసిపోయి వదిన చీరను బతుకమ్మ కట్టుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి, వదిన బతుకమ్మ గొంతు నులిమి, చంపేసి చెరువు గట్టున పాతిపెడుతుంది. తర్వాత ఆమె తంగేడు చెట్టుగా మొలుస్తుంది. బతుకమ్మ తన భర్తకు కలలో కనిపించి, జరిగిన విషయం చెప్పి, తనను తీసుకుపొమ్మంటుంది. అలా పండుగ ప్రారంభమైందని చెబుతారు. ఎంగిలిపూల బతుకమ్మ.. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి ఎంగిలిపూలుగా పరిగణిస్తారు. పితృ అమావాస్య రోజు స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకొని, వారిని దేవతలుగా ఆరాధిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో తెచ్చిన పూలన్నీ ఎంగిలి పడ్డట్టుగా భావిస్తారు. అటుకుల బతుకమ్మ.. రెండోరోజు అటుకల బతుకమ్మగా పిలుస్తారు. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులందరూ ఆట పాటలతో సందడి చేస్తారు. బెల్లం, అటుకులు, పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ.. మూడోరోజు ముద్ద పప్పు బతుకమ్మగా జరపుకుంటారు. బెల్లం, ముద్దపప్పు, పాలతో నైవేద్యం తయారు చేస్తారు. నానబియ్యం బతుకమ్మ.. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను నాలుగు వరుసలుగా పేరుస్తారు. గౌరమ్మను పెట్టి, ఆడిపాడి, దగ్గరలోని చెరువులో నిమజ్ఞనం చేస్తారు. ఈ సందర్భంగా నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపి ముద్దలుగా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. తంగేడు, మందారం, చామంతి, గునుగు, గుమ్మడి పూలతో ఐదు వరుసలు పేర్చి, బతుకమ్మను త యారు చేస్తారు. బియ్యం పిండితో తయారు చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ.. ఆరోరోజు అలిగిన బతుకమ్మ. బతుకమ్మను పూ లతో అలకరించరు. నైవేద్యం సమర్పించరు. బ తుకమ్మను పేర్చి ఆడకుండా నిమజ్జనం చేస్తారు. వేపకాయల బతుకమ్మ.. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. ఈరోజు తంగేడు, చామంతి, గులాబీ, గునుగు పూలతో బతుకమ్మను ఏడు వరుసల్లో పేరుస్తారు. బియ్యం పిండిని వేప పండ్లుగా తయారు చేసి, నైవేద్యం సమర్పిస్తారు. వెన్నెముద్దల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తంగేడు, చామంతి, గునుగు, గులాబీ, గడ్డిపూలతో కలిపి ఎనిమిది వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. అమ్మవారికి ఇష్టమైన నువ్వులు, వెన్న, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో సద్దుల బతుకమ్మ చివరిది. ఈరోజు అన్ని రకాల పూలతో భారీ బతుకమ్మలను పేరుస్తారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి, ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. పెరుగు అన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రసాదాన్ని అరగిస్తారు. పూలు ప్రియం.. బతుకమ్మ పూలకే పూజలు చేసే వేడుక కాబట్టి పండుగ జరిగే తొమ్మిది రోజులూ పూలకు భలే గిరాకీ ఉంటుంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి, కట్ల, రుద్రాక్ష, పోకబంతులు, చిట్టి చామంతులు తదితర పూల ధర ఎక్కువగా ఉంది. ఈ సీజన్లో రెండుసార్లు అధికంగా వర్షాలు కురిసి పంట చేలన్నీ నీటితో నిండిపోయాయి. సెప్టెంబర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పూల దిగుబడి గణనీయంగా పడిపోవడంతో రేట్లు అందనంత ఎత్తులో ఉంటున్నాయి. -
పుడమిపై పూల పండుగ.. మొదలైన బతుకమ్మ సంబరాలు
-
తెలంగాణ: నేటి నుంచి స్కూళ్లకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ రెండో దశతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు ఊరట కోసం పల్లెబాట పడుతున్నారు. బుధవారం నుంచి పిల్లలకు దసరా సెలవులు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నగరం నుంచి వివిధ మార్గాల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన దక్షిణమధ్య రైల్వే రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు కాచుకొని ఉన్నాయి. చదవండి: తీరొక్క పూల పండుగ.. బతుకమ్మ నేటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ► నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 4200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ► నుంచే ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ► తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ఎక్కువ మంది తరలి వెళ్లనున్న దృష్ట్యా మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ చౌరస్తా, కూకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి నేరుగా బస్సులు బయలుదేరనున్నాయి. ► ఈ బస్సుల్లో చార్జీలు రెగ్యులర్ కంటే అదనంగా ఉంటాయి. కనీసం 30 మంది ఉంటే డైరెక్ట్ బస్సు దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో ప్రత్యేక సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఏదో ఒక కాలనీ నుంచి లేదా పనిచేసే స్థలం నుంచి కనీసం 30 మంది లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణికులు ఉంటే వాళ్లు బయలుదేరే స్థలం నుంచి చేరుకోవలసిన గమ్యస్థానం వరకు డైరెక్ట్ బస్సును ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని ఆర్టీసీ సమాచార కేంద్రాలను సంప్రదిస్తే ఈ సదుపాయం లభిస్తుందన్నారు. అలాగే సమీపంలోని డిపో నుంచి కూడా బస్సును బుక్ చేసుకోవచ్చు. భవన నిర్మాణ రంగంలో, పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేసే ఒకే ప్రాంతానికి చెందిన కార్మికులు, కాంట్రాక్టర్ల వద్ద పని చేసే ఒకే ప్రాంతానికి చెందిన వలస కూలీలు, ఒకే ప్రాంతానికి వెళ్లవలసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పండుగ బస్సుల సమాచారం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల ఫోన్ నెంబర్లు ► రేతిఫైల్ బస్ స్టేషన్- 9959226154 ► కోఠి బస్ స్టేషన్-9959226160 ► ఎంజీబీఎస్-9959226257 ► జూబ్లీ బస్స్టేషన్-9959226246 -
Bathukamma: పూలకి పండగ
బతుకమ్మ పండుగ పకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. బాలారిష్టాలు, కలరా, మలేరియా, ప్లేగు వంటి మహమ్మారి రోగాల నుండి పిల్లా పాపలను, కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడి బతుకును ఈయమ్మా అని ప్రజలు ప్రకృతి గౌరీని తమ సాధారణ ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ. తెలంగాణ పల్లెల్లోని ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ బతుకమ్మ పండుగ యువతులు, ముత్తైదువులు సాంప్రదాయం ఉట్టిపడేలా తయారయ్యి ఊరంతా ఒకటయ్యి తమలో బీదా గొప్పా వర్ణం వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే పల్లె ప్రజల సాంస్కృతిక పండుగ ఇది. అయితే నేటి కాలంలో బతుకమ్మ పండుగ గొప్పతనం ఎల్లలు దాటి దేశ విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మంచి వర్షాలతో వరుణ దేవుడు అనుగ్రహించి అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతు జీవితం కళకళలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూనే యువతులు ముత్తైదువులు రంగు రంగు పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్ది అందులో గౌరమ్మను పెట్టి పూజించి ఊరంతా ఒక్క చోట గుమిగూడి పల్లె ప్రజల జీవితాలను కష్ట సుఖాలను పాటల రూపంలో ప్రకృతి గౌరికి విన్నవించుకుంటారు. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. -
బతుకమ్మ చీరల పంపిణీ ఫోటోలు
-
నేటి నుంచి మగువలకు బతుకమ్మ కానుక
సాక్షి, వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీకి ఉమ్మడి వరంగల్లో రంగం సిద్ధమైంది. సద్దుల బతుకమ్మ పండుగ పూట పేద వర్గాల మహిళలు నిరుత్సాహంగా ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. సిరిసిల్ల, షాద్నగర్, నారాయణపేట, కొత్తపల్లి, తదితర ప్రాంతాల్లో తయారైన చేనేత చీరలను అందజేయడం ద్వారా కార్మికులకు సైతం ఉపాధి కల్పిస్తోంది. చదవండి: ‘మీ కాళ్లు మొక్కుతా.. మేం దళితులం.. మా పంట పాడు చేయకండి’ ఈ నెల 6 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలై 13 వరకు జరగనున్నాయి. దీంతో అధికారులు ముందుగానే స్టాక్ తెప్పించి, గోదాముల్లో భద్రపరిచారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం మినహా, జిల్లా పరిధిలోని మిగతా ప్రాంతాల్లో చీరల పంపిణీకి ఎన్నికల కమిషన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు 13.45 లక్షల చీరలు... రూ.46.97 కోట్ల వ్యయం... దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాల్లోని 18 సంవత్సరాలు పై బడిన యువతులు, మహిళలు చీరలు పొందేందుకు అర్హులు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 12.87 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, 13,45,015 మంది అర్హతగల వారిని గుర్తించారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఇప్పటి వరకు 11.25 లక్షల చీరలు జిల్లాలకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లాలో 2,83,341, వరంగల్లో వరంగల్ 3,37,334, జనగామలో1,99,556, మహబూబాబాద్ 2,71,000, జేఎస్ భూపాలపల్లి1,43,000, ములుగులో 1,10,784 చీరలను అర్హులైన మహిళలకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. చౌక ధరల దుకాణాల డీలర్లు, గ్రామస్థాయి కమిటీల ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నారు. అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వార్డుస్థాయి కమిటీల ద్వారా పంపిణీ చేయనుండగా అధికారులు పర్యవేక్షిస్తారు. ఉమ్మడి వరంగల్లో రూ.46,96,76,000 వ్యయంతో మొత్తం 13,45,015 చీరలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆడపడుచులకు కేసీఆర్ కానుక.. బతుకమ్మ చీరలు తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పండగ కానుకగా చీరలు అందజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఉమ్మడి వరంగల్లో సుమారుగా 13.50 లక్షల చీరలు పంపిణీ చేస్తారు. బతుకమ్మ పండుగకు తీరొక్క పువ్వుతో గౌరమ్మను అలంకరించినట్లే.. బతుకమ్మ ఆడడానికి వెళ్లే మహిళలు.. తీరొక్క రంగు చీరల్లో అందంగా ముస్తాబవ్వడం కోసం ఆకర్శణీయమైన రంగులతో రూపుదిద్దుకున్న ఈ చీరల పంపిణీ శనివారం ప్రారంభమవుతుంది. – ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి -
పాఠకులు పంపిన బతుకమ్మ సెల్ఫీ ఫొటోలు
-
సెల్ఫీ విత్ బతుకమ్మ..
సహజ సౌందర్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకయైన పండుగ బతుకమ్మ. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి, రుద్రాక్ష వంటి తీరొక్కపూలను ఒక్కచోట చేర్చి గౌరమ్మను కొలిచే వేడుక. ఏడాదికి ఒకసారైనా ఊరు ఊరంతా ఒక్కచోట చేరి సంబరంగా జరుపుకునే ఉత్సవం. తెలంగాణ విలక్షణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ పూల జాతరలో సందడంతా ఆడపడుచులదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కేవలం పూల పండుగే కాదు, ఆడపిల్లల ఆటవిడుపు పండుగ కూడా. ఏడాదంతా అత్తవారింట్లో గడిపిన, ఆడపడుచులను తప్పనిసరిగా పుట్టింటికి తీసుకువచ్చే ఈ పండుగ నాడు ఆటపాటలు, కోలాటాలతో గౌరీదేవిని కొలిచే మన ఇంటి మహాలక్ష్ములను చూసేందుకు రెండుకళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. చిన్నా, పెద్దా ప్రతిఒక్కరికి సంతోషాన్ని పంచే బతుకమ్మ వేడుకలు, శరన్నవరాత్రులు ప్రారంభమైన నేపథ్యంలో.. మీ పండుగ ఫొటోలు, మధుర జ్ఞాపకాలను ప్రపంచంతో పంచుకునే అవకాశాన్ని ‘సాక్షి’మీకు కల్పిస్తోంది. సెల్ఫీ విత్ సాక్షి పేరిట sakshi.com నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే 9010533389 వాట్సాప్ నంబర్కు బతుకమ్మతో ఉన్న మీ సెల్ఫీలు పంపండి. పండుగ సంబరాన్ని మాతో షేర్ చేసుకోండి. మీరు పేరు, ఏరియా పేరు రాయడం మర్చిపోకండి. -
కూకట్పల్లిలో బతుకమ్మ వేడుకలు
-
బతుకమ్మ చీరల పంపిణీ సందడి
-
బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ‘ఆశ..ఆనందం.. ఐకమత్యం’
-
ఎడారి దేశాల్లోపూల జాతర
సాక్షి, నెట్వర్క్: ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో... నా నోము పండింది ఉయ్యాలో... నీ నోము పండిందా ఉయ్యాలో... మా వారు వచ్చిరి ఉయ్యాలో... మీ వారు వచ్చిరా ఉయ్యాలో... అంటూ గల్ఫ్ గడ్డపై తెలంగాణ ఆడపడుచులు మన సంస్కృతిని చాటుతున్నారు. బతుకమ్మ పండుగను ప్రతి ఏటా గల్ఫ్ దేశాల్లో ఎంతో వైభంగా నిర్వహిస్తున్నారు. ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసులు అక్కడ కూడా మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఎడారి దేశాల్లో బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రవాసీ సంఘాలు ఏర్పాట్లు చేశాయి. సాధారణంగా తెలంగాణలో పితృ అమావాస్యతో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే, గల్ఫ్ దేశాల్లో మాత్రం మన వాళ్లు ఒక రోజును ఎంపిక చేసుకుని ఆ రోజు బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకొంటారు. ఈసారి దాదాపు అన్ని గల్ఫ్ దేశాల్లో 4వ తేదీన (శుక్రవారం) నిర్వహిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయి, అబుదాబీలలో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహిస్తున్నారు. షార్జాలో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరుపుతున్నారు. ఖతార్లో తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి సంస్థలు వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. కువైట్లో తెలంగాణ చైతన్య స్రవంతి, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. గతంలో కువైట్ తెలంగాణ సమితి కూడా సంబరాలను నిర్వహించింది. బహ్రెయిన్లో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, తెలంగాణ జాగృతి సంస్థలు విడివిడిగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నాయి. ఒమాన్లోని మస్కట్లో ఒమాన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో సంబరాలను కొనసాగిస్తున్నారు. అలాగే ఇండియన్ సోషియల్ క్లబ్ ఆధ్వర్యంలోనూ సోహార్ ప్రాంతంలో తెలుగు కమ్యునిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. ఐదేళ్లుగా నిర్వహిస్తున్నాం ఒమాన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో మ స్కట్లో ఐదేళ్ల నుంచి బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నాం. గతేడాది ఐదు వేల మంది పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్నా మన సంస్కృతిని మరిచిపోకూడదు. సంబరాల కోసం పది రోజుల ముందు నుంచి రిహార్సల్స్ కూడా చేశాం. బతుకమ్మ రోజు న అందరికీ ప్రసాదాలు అందిస్తాం. – పన్నీరు వసుంధరా దేవి, ఒమాన్ (జగిత్యాల జిల్లా) విదేశాల్లో జరుపుకోవడం సంతోషంగా ఉంది మేము కొన్నేళ్ల నుంచి కువైట్లో నివాసం ఉంటున్నాం. విదేశంలో కూడా బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కువైట్లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ వాసులే కాకుండా మన దేశంలోని ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు కూడా పాల్గొనడం విశేషం.– అనిత గార్లపాటి,కువైట్ (మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా) బతుకమ్మను మరువలేం... పుట్టిన ఊరుకు ఉన్నా ప్రతి ఏటా బతుకమ్మ పండుగ జరుపుకొంటున్నాం. మేము మస్కట్లో పదేళ్ల నుంచి ఉం టున్నాం. మొదట రెండు, మూడు కుటుంబాలే బతుకమ్మను నిర్వహించేవి. ఇప్పుడు వేలాది మంది ఈ ఉత్సవాలకు హాజరవుతుండటం విశేషం. చిన్నారులకు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడానికి బతుకమ్మ పండుగ ఎంతో దోహదపడుతుంది.– శానగొండ పద్మజ, మస్కట్ (వరంగల్ జిల్లా) సంబరాల కోసం ఎదురుచూస్తుంటాం.. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే బతుకమ్మ సంబరాల కోసం దోహా లోని తెలంగాణ ప్రాం తానికి చెందిన వారందరం ఎదురుచూస్తుం టాం. సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటాం. విదేశంలోనూ మన సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం హర్షించదగ్గ విషయం.– మారుతి వేలూర్, దోహా,ఖతార్ (హైదరాబాద్) వేడుకల్లో..అందరూ పాల్గొంటారు ఖతార్లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ ప్రాంతం వారంతా ఎంతో సంతోషంగా పా ల్గొంటారు. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ నిర్వహణ తేదీని నిర్ణయిస్తాం. పెద్దా, చిన్న తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. బతుకమ్మకు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తాం. – అనుపమ సంగిశెట్టి, ఖతార్ (జనగామ జిల్లా) తెలంగాణ ఉద్యమంతోమొదలైన సంబరాలు కువైట్లో చాలా కాలం నుంచి నివాసం ఉంటున్నాం. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కువైట్తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో బతుకమ్మను ఎలా నిర్వహిస్తారో.. అదే తీరుగా కువైట్లోనూ నిర్వహిస్తున్నాం. నేను పలుమార్లు బతుకమ్మ పండుగ నిర్వహణకు ఆర్గనైజర్గా వ్యవహరించాను.– అభిలాష గొడిషాల, కువైట్ (వరంగల్ జిల్లా) దశాబ్ద కాలంగా జరుపుకొంటున్నాం.. దశాబ్ద కాలంగా దుబాయిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. పుట్టి పెరిగిన ఊరికి దూరంగా ఉంటున్నా మన సంస్కృతిని మరిచిపోకుండా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ ఆడబిడ్డల పండుగను ఇక్కడ ఆత్మీయుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. 12వ సారి ఇప్పుడు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం.– ఎలిశెట్టి శ్రీదేవి, మంథని. మన పండుగను మర్చిపోకుండా... మాది జగిత్యాల జిల్లా ధర్మపురి. దుబాయిలో స్థిరపడ్డాం. మన పండుగలను మర్చిపోకుండా మా పిల్లలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా బతుకమ్మ పండుగను జరుపుకొంటున్నాం. తెలంగాణ ఆడపడుచులంతా ఒక్క చోట చేరి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. – దీపిక, ధర్మపురి సొంత ఊరిలో ఉన్నట్లుంది.. అబుదాబీలో ఉంటున్నా.. ఏటా బతుకమ్మ వేడుకలు జరుపుకొంటున్నాం. దీంతో సొంత ఊరిలోనే ఉన్నట్లనిపిస్తోంది. దేశం కాని దేశం వచ్చినా సంప్రదాయాలను మరువలేం. బతుకమ్మ నిర్వహించే రోజున అందరం ఎంతో ఉత్సాహంగా ముస్తాబై బతుకమ్మలను పేర్చుతాం. అందరం ఒకే చోటకు చేరి ఆడిపాడుతాం. తెలంగాణ పల్లెల్లో బతుకమ్మకు నైవేద్యం పెట్టినట్లుగానే ఇక్కడా చేస్తున్నాం.– రోజా, అబుదాబీ (ఆర్మూర్, నిజామాబాద్) ఎక్కడ ఉన్నా మరచిపోం.. ఏ దేశంలో ఉన్నా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక గా నిలిచిన బతుకమ్మను మరచిపోం. బతుకమ్మ పండు గను అందరూ ఎంతో సంబరంగా జరు పుకొంటున్నారు. అబుదాబీలో ఇందుకోసం ఏటా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ గల్ఫ్ దేశంలోనే కాకుండా ఇతర పాశ్చాత్య దేశాల్లోను బతుకమ్మను సంబరంగా జరుపుకొంటున్నారు.– లత, అబుదాబీ(పడగల్, వేల్పూర్ మండలం, నిజామాబాద్) ఊర్లో ఆడినట్టే... మన ఊర్లో ఆడినట్టే ఇక్కడ కూడా బతుకమ్మ ఆడుతాం. దోహాలో ఉన్న తెలంగాణ మహిళలమంతా కలుస్తాం. బతుకమ్మ పేర్చేందుకు ఇండియన్ సూపర్ మార్కెట్లలో రకరకాల పూలు అందుబాటులో ఉంటాయి. వాటిని కొనుగోలు చేస్తాం. ఏటా జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు జరుగుతాయి. – గట్టుపల్లి వాసవి,సిలాల్, దోహ (నల్లగొండ జిల్లా) -
బతుకమ్మ సంబురాలు
-
కనులపండువగా బతుకమ్మ వేడుక
-
ఘనంగా బతుకమ్మ సంబురాలు
-
పుట్టింటికి పంపలేదని..
బంజారాహిల్స్: బతుకమ్మ, దసరా పండుగకు పుట్టింటికి పంపలేదని భర్తపై అలిగిన ఓ మహిళ ఇద్దరు చిన్నారులతో సహా అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా, అయాతపూర్ గ్రామానికి చెందిన రాములు–రాధ దంపతులు బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్లో అద్దెకుంటున్నారు. రాములు తాజ్మహల్ హోటల్లో పని చేస్తుండగా రాధ గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తులు. ప్రస్తుతం రాధ ఆరు నెలల గర్భవతి. దసరా నేపథ్యంలో ఈ నెల 25న తాను పుట్టింటికి వెళ్తానని రాధ భర్తను కోరింది. పండుగ ముందు రోజు వెళ్ళొచ్చనని చెప్పి రాములు డ్యూటీకి వెళ్ళిపోయాడు. దీంతో ఈ నెల 26న తెల్లవారుజామున రాధ తన ఇద్దరు పిల్లలతో సహా భర్తకు చెప్పకుండా వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాములు భార్య లేకపోవడంతో పరిసరాల్లో గాలించాడు. అత్తవారింట్లో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
28 నుంచి ‘జాగృతి’ బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలలా పూల జాతర అనే నినాదంతో ప్రతీ ఏటా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాలను ఈ నెల 28 నుంచి అక్టోబర్ ఆరో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘బతుకమ్మ సంబురాలు’పోస్టర్ను కవిత ఆవిష్కరించారు. క్షేత్ర స్థాయిలో బతుకమ్మ సంబురాలతో పాటు ఈ ఏడాది 300 మంది కవయిత్రులతో ‘మహాకవి సమ్మేళనం’నిర్వహణతో పాటు, ఆర్ట్ వర్క్షాపు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలంగాణ జాగృతి ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్, ముంబైతో పాటు పలు దేశాల్లో తెలంగాణ జాగృతి శాఖలు బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తాయని కవిత వెల్లడించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, కువైట్ తదితర దేశాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి సన్నాహాలు చేస్తోంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు డాక్టర్ ప్రీతిరెడ్డి, మంచాల వరలక్ష్మి, నవీన్ ఆచారి, రాజీవ్ సాగర్, కొరబోయిన విజయ్, విక్రాంత్రెడ్డితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
మంచి విషయం
బతుకమ్మ కొన్ని ఖర్చుల్ని లెక్క వేసుకోకూడదు. ఇంటి ఆడపడుచుకు ఇచ్చిన వాటిని అసలే లెక్క చూసుకోకూడదు. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా ఈ మూడో ఏడాది కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుంటుంబాల్లోని ఆడపడుచులకు ‘బతుకమ్మ’ చీరలు పంపిణీ చేయబోతోంది. అందుకోసం 300 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది. చీరలకు అంత భారీ మొత్తాన్ని వెచ్చించే బదులు చేతిలో ఇన్ని పైసలు పెట్టొచ్చు కదా అని విమర్శలు వస్తున్నాయి.చేతిలో పది రూపాయలు పెట్టడానికి, ఓ చీర పెట్టడానికీ తేడా లేదా?! కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం సిరిసిల్లలోని మగ్గాలకు, ఇతర ప్రాంతాలలోని చేనేతకారులకు బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇప్పటికే వెళ్లిపోయాయి. దసరాకు మన అక్కచెల్లెళ్ల మోములో చిరునవ్వులు పూయబోతున్నాయి. నాగస్వరం నెలలు నిండకుండా పుట్టిన బిడ్డల్లో తలెత్తే అవకాశం ఉన్న మస్తిష్క నాడీమండల, మానసిక సమస్యల్ని ‘నాగస్వరం’తో నయం చేయవచ్చని జెనీవా శాస్త్రవేత్తలు కనిపెట్టారు! మానసిక, శారీరక రుగ్మతలను నయం చేయడంలో సంగీతం ఒక దివ్యౌషధంగా పనిచేస్తుందన్నది పాత విషయమే అయినప్పటికీ, పుట్టగానే ఇంటెన్సివ్ కేర్లో ఉంచిన పసికందుల నాడీకణాలు ‘నాగస్వరానికి’ ఫ్రెండ్లీగా రియాక్ట్ అవుతూ ఆరోగ్యంగా తయారవడాన్ని అక్కడి వైద్య పరిశోధకుల బృందం తాజాగా గమనించింది. రకరకాల వాద్యాలతో మ్యూజిక్ ప్లే చేసి వినిపించగా, ఎక్కువ మంది శిశువుల్లోని మెదడు కణాలు నాగస్వారానికి ఉల్లాసంగా నాట్యం చేసినంత పని చేశాయట. పాముల్ని ఆడించేవాళ్ల ఫ్లూట్లో ఇంతుందా! పాముబూరను కనిపెట్టింది ఇండియా కాగా, బూరలో మెడిసిన్ ఉందని ఇప్పుడు జెనీవా కనిపెట్టింది. సీక్రెట్ ఫస్ట్ లేడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ రహస్య ప్రియసఖి అలీనా కబేవా (36) ఈ నెల మొదట్లో ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో మంచి విషయం ఏముంది, వివాహేతర సంబంధం సామాజిక విలువలకు విరుద్ధం కదా! పుతిన్ని వదిలేయండి. అతడు ఆమె కోసం ఏం చేశాడో చూడండి. ప్రసవం కోసం అలీనాను చేర్పించిన కురాకోవ్ తల్లీపిల్లల ఆసుపత్రిలోని వీఐపీ ఫ్లోర్ మొత్తాన్నీ ఒక నెలరోజుల పాటు రిజర్వు చేయించాడు. ఆమెకు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణ ఇప్పించాడు. ఇదంతా కూడా అజ్ఞాతంలో ఉండే! అటుగా వెళ్లిన జర్నలిస్టు ఒకరికి ఇక్కడేదో ‘ప్రత్యేకంగా’ కనిపిస్తోందే అని అనుమానం వచ్చి ఆరా తీస్తే లోపల ‘సీక్రెట్ ఫస్ట్ లేడీ’ ఉన్నట్లు బయటపడింది. ఇంతకీ ఇందులో మంచి విషయం ఏముంది? జననం మంచి విషయమే కదా. పైగా ట్విన్స్! అన్నట్లు అలీనా.. పుతిన్ లవర్ అని కొంత మందికి తెలియకపోవచ్చు కానీ.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టుగా ఆమె ప్రపంచానికంతటికీ పరిచయమే. ఆరుగురికి ఇద్దరు 1960లలో భారతదేశంలో ఒక తల్లికి సగటున ఆరుగురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడా సంఖ్య రెండుకి తగ్గిందన్నది తాజా వార్త. కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల మహిళల ఆరోగ్య పరిస్థితులు మెరుగవడంతో పాటు, స్త్రీ సాధికారతకు అవకాశాలు ఏర్పడుతున్నాయని భారత కుటుంబ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎగ్ బాయ్ ఈ ఏడాది మార్చి 15న న్యూజిలాండ్లోని ఒక మసీదులో మధ్యాహ్నపు ప్రార్థనలలో మునిగి ఉన్నవారిపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో యాభై మందికి పైగా దుర్మణం చెందిన ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. అయితే ఆస్ట్రేలియా ఫెడరల్ సెనెటర్ ఫ్రేజర్ ఆనింగ్కి మాత్రం ఆ ఉగ్రచర్య అత్యంత సహజమైనదిగా అనిపించింది! ‘‘ముస్లిం వలసల కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి’’ అని ఇటీవల ఆయన బహిరంగంగానే ఒక ప్రసంగంలో అన్నారు. ఆ మాటతో విభేదించిన విల్ కన్నోల్లీ అనే 17 ఏళ్ల ఆస్ట్రేలియన్ బాలుడు ఆనింగ్ తలకు తగిలేలా గురి చూసి కోడిగుడ్డును విసిరాడు. ఈ ఘటన విపరీతంగా వైరల్ అయి, కన్నోల్లీకి ‘ఎగ్ బాయ్’ అనే పేరొచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఎగ్బాయ్ 70 వేల డాలర్లను మసీదులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విరాళంగా ఇచ్చాడు. అంత డబ్బు ఆ కుర్రాడికి ఎలా వచ్చింది? కన్నోల్లీని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతడి తరఫున వాదించడానికి అవసరమైన డబ్బు కోసం సోషల్ మీడియాలో రెండు అకౌంట్లు తెరిస్తే, వాటిల్లోకి విరాళాలుగా వచ్చిపడ్డాయి. న్యాయస్థానం అతడిపై కేసు కొట్టేయడంతో ఆ డబ్బు మిగిలింది. దానికి తను కొంత కలిపి డొనేట్ చేశాడు. కన్నోల్లీది పిల్ల చేష్ట కాదన్నమాట. మరేమిటి? ధర్మాగ్రహం. -
బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో బతుకమ్మ చీరల పం పిణీ, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, జూనియర్ గ్రామకార్యదర్శుల నియామకం, పంచా యతీ ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల భూసేకరణ, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకుల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం లో భాగంగా అర్హుల ఎంపిక కోసం ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లోగా జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను తెలపాలని సీఎస్ ఆదేశిం చారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని, ఐదారు రోజుల్లోగా పంపిణీ పూర్తయ్యేలా కార్యక్రమం రూపొందించుకోవాలన్నారు. -
పోర్ట్లాండ్లో ఘనంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు
పోర్ట్లాండ్ : అమెరికాలోని ఒరేగాన్స్టేట్లో టీడీఎఫ్ (తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్) పోర్ట్లాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పోర్ట్లాండ్ చైర్మన్ శ్రీని అనుమాండ్ల విఘ్నేశ్వరుడికి పూజ, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల, అమ్మాయిలు, మహిళలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ దుస్తులను ధరించి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన తరువాత దసరా పండుగను జరుపుకున్నారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేడుకల అనంతరం పసందైన విందులను ఆరగించారు. ఈ సందర్భంగా శ్రీని అనుమాండ్ల మాట్లాడుతూ.. వేడుకలకి వచ్చిన వారందరికి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమాలను జరుపుకోవడానికి సహకరించిన మహిళలందరికి ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించుకోవడానికి సహాయం చేసిన స్పాన్సర్స్కి శ్రీని కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీఎఫ్ టీమ్ మెంబర్స్ నిరంజన్ కూర, నరేందర్ చీటి, భాను పోగుల, కొండల్ రెడ్డి పుర్మ, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, రాజ్ అందోల్, శ్రీనివాస్రెడ్డి పగిడి, రఘు శ్యామ, సురేష్ దొంతుల, జయాకర్ రెడ్డి ఆడ్ల, సత్య సింహరాజు, వీరేష్ బుక్క, అజయ్ అన్నమనేని, వెంకట్ ఇంజమ్, హరి సూదిరెడ్డి, శ్రీని గుబ్బ, వెంకట్ గోగిరెడ్డి, ఇతర వాలెంటెర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
లండన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
లండన్ : తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్లో ఘనంగా మెగా బతుకమ్మ నిర్వహించారు. యూరోప్లోనే అతిపెద్ద బతుకమ్మ పండగను లండన్లో నిర్వహించారు. దాదాపు 2500 మంది బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మొదట అమ్మవారి పూజతో ప్రారంభమైంది. యువతులు, మహిళలు బతుకమ్మ ఆట, కట్టే కోలాటం ఆడారు. సాంప్రదాయక బతుకమ్మ ఆటనే ప్రోత్సహించడానికి నూతన పోకడలకు, డీజేల జోలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో సాంప్రదాయ బద్దంగా బతుకమ్మను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత ఎన్నారైల పైన ఉందని, 6 ఏళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ యూరోప్లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహణ బాధ్యతకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. యూరోప్లోనే మొట్ట మొదటి బతుకమ్మకు పునాదులు వేసి నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాపకులు గంప వేణుగోపాల్ ను అభినందించారు. 2010లో నిర్వహణ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చాలో తెలియని సమయంలో గంప వేణుగోపాల్ చేసిన కృషి మరచిపోలేనిదని పేర్కొన్నారు. 2012లో బ్రిటన్ లో వివిధ ప్రాంతాల్లో ఊరూరా బతుకమ్మ నిర్వహించి బతుకమ్మ భావజాలాన్ని చాటుతూ ప్రతి తెలంగాణ బిడ్డ బతుకమ్మ ఆటలో పాల్గొనే స్థాయికి చేరుకుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ గత ఏడాది అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి మళ్లీ ఇప్పుడు కూడా అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత మహిళలదేనని అన్నారు. మహిళా విభాగం మీనా అంతరి, వాణి అనసూరి, శౌరి గౌడ్, సాయి లక్ష్మి, మంజుల పిట్ల, జయశ్రీ, శ్రీవాణి మార్గ్, సవిత జమ్మల, దివ్యా, అమృత, సీతాలత, నీరజ, వీణ మ్యాన, కారుణ్య, ఉష రమా లు బతుకమ్మనిర్వహణలో కీలకపాత్ర పోషించారు. వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, కోర్ సభ్యులు రంగు వెంకట్, ప్రవీణ్ రెడ్డి, నరేష్ మల్యాల, కార్యదర్శి పిట్ల భాస్కర్, అడ్వైజరి సభ్యులు డా శ్రీనివాస్, మహేష్ జమ్ముల, వెంకట్ స్వామి, బాలకృష్ణ రెడ్డి, మహేష్ చాట్ల, శేషు అల్లా, వర్మా, స్వామి ఆశా, అశోక్ మేడిశెట్టి, సాయి మార్గ్, వాసిరెడ్డి సతీష్ రాజు కొయ్యడలు బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో తమవంతు సహాయ సహకారాలు అందించారు. -
ఐర్లాండ్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
డబ్లిన్ : ఐర్లాండ్లోని తెలంగాణ ఎన్నారైలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో దాదాపు 600 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమం మొదలైంది. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. యూకే నుండి సింగర్ స్వాతి రెడ్డి విచ్చేసి బతుకమ్మ పాటలు పాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలనే లక్ష్యంతో తెలంగాణైటీస్ ఆఫ్ ఐర్లాండ్ వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ప్రతి ఆడపడుచుకు బహుమతి ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఇక్కడి ప్రాంతీయ ఎంపీలు(టీడీఎస్) రుత్ కొపింజర్, జాక్ చాంబర్స్, కౌన్సెలర్ మేరీ మెక్కామ్లే పాల్గొన్నారు. అతిథులకు ప్రసాదం, రుచికరమైన వంటలను వడ్డించారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన శ్రీనివాస కార్పే, సాగర్, ప్రబోధ్ మేకల, జగన్ రెడ్డి మేకల, కమలాకర్ కోలన్, సంతోష్ పల్లె, రవీందర్ రెడ్డి చప్పిడి, రాజేష్ అది, దయాకర్ రెడ్డి కొమురెల్లి, శ్రీనివాస్ పటేల్, సుమంత్ చావా, అల్లే శ్రీను, నగేష్ పొల్లూరు, నవీన్ రెడ్డి గడ్డం, త్రీశిర్ పెంజర్ల, ప్రదీప్ యల్క, ప్రవీణ్ లాల్, వెచ్చ శ్రీను, వెంకట్ తీరు, సునీల్ పాక, అల్లంపల్లి శ్రీనివాస్, షరీష్ బెల్లంకొండ, శ్రీకాంత్ సంగి రెడ్డి, రమణ యానాల, రామ్ రెడ్డి, వెంకట్ గాజుల, వెంకట్ జూలూరి, వెంకట్ అక్కపల్లి, నవీన్ జనగాం, రాజా రెడ్డి, రామ బొల్లగొని, కొసనం శ్రీను, రాజు తేరా, సాయినాథ్, సుచరిత్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. డబ్లిన్లో 30 మంది వాలంటీర్లు బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించడంలో తమ వంతు కృషి చేశారు. -
టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ
కాన్సాస్ : అమెరికాలోని కాన్సాస్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటి (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక బ్లూవ్యాలీ నార్త్ వెస్ట్ హైస్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు వెయ్యి మంది తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా నుండి వచ్చిన రఘు వేముల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సూపర్ సింగర్ ఫేమ్ అంజనా సౌమ్య, కాన్సాస్ సిటి స్థానిక సింగర్ శ్రియ పొందుర్తిలు తమ గాత్రంతో ఊర్రూతలూగించారు. స్థానిక దేవాలయ పూజారి నిర్వహించిన బతుకమ్మ, అమ్మ వారి పూజలతో కార్యక్రమం ప్రారంభమయింది. నగరంలోని తెలుగు వారు అందరు సాంప్రదాయ వేషధారణలో తాము చేసిన బతుకమ్మలను తీసుకోని రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సాంస్కృతిని ప్రతిభింబించే జానపద, బతుకమ్మ పాటలను మహిళలు, యువతులు ఆడిపాడారు. బతుకమ్మలన్నింటిలో మంచి బతుకమ్మలను న్యాయ నిర్ణేతలు నిర్ణయించి, వారికి స్పాన్సర్స్ ద్వారా బహుమతులు అందజేశారు. అనంతరం బతుకమ్మలను తీసుకొని వెళ్లి నిమజ్జనం చేసి, ప్రసాదాలు పంచారు. కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసిన అందరికి టీఏజీకేసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. -
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కౌలాలంపూర్ : మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మలేషియా కౌలాలంపూర్లోని పీపీపీఎమ్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు భారీగా తరలి వచ్చారు. సాంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమైన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరమళ్ళ ప్రకాష్ రావు, ఇండియన్ కౌన్సిలర్ అఫ్ మలేషియా నిషిత్ కుమార్ ఉజ్వల్తోపాటూ పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం జాతిపిత మహాత్మా గాంధీ 150వ జన్మదినం కావున భారత ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం పొడుగునా గాంధీ జన్మదిన వేడుకల్ని జరపాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్, ఇండియన్ హైకమిషన్ అఫ్ మలేషియా సంయుక్తంగా గాంధీపైన వీడియో ప్రెజెంటేషన్, పిల్లలకు వ్యాస పోటీలు, క్విజ్లలో పాల్గొన్న వారికి, విజేతలకు బహుమతులను అందజేశారు. లక్కీ డ్రా విజేతలకు, అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి ముఖ్య అతిథు చేతుల మీదుగా 6 గ్రాముల బంగారాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ప్రవాస తెలంగాణ వాసులు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా బతుకమ్మ, తెలంగాణ పండుగలు జరుపోకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ మొట్టమొదట మలేసియా వచ్చినపుడు ఏర్పాటు చేసిన మొదటి సమావేశం తరువాత మొదటి బతుకమ్మ వేడుకలతో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగానిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ను అభినందించారు. మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రారంభం కావడానికి కృషిచేసిన వ్యక్తి ప్రకాష్ అని అన్నారు. ఈ సంవత్సరం ఐదు రోజుల పాటు తెలుగు వారు ఉండే ప్రతి చోట బతుకమ్మ వేడుకలను తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వచ్చిన స్పేస్ విజన్ గ్రూప్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కో స్పాన్సర్స్ జాస్ బెలూన్ అండ్ డెకొరేటర్స్, సంక్రాంతి ఇండియన్ క్యూసిన్, ప్రబలీ రెస్టారెంట్, మై 81రెస్టారెంట్, తడ్కా, ఎమ్టీఆర్ స్పైసెస్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మసంబరాలను విజయవంతం చేయడానికి సహకరించిన మైట కోర్ కమిటీని వాలంటీర్లు గా ముందుకి వచ్చిన సభ్యులను అయన అభినందించారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ 2018-2020 కి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నికయింది. బతుకమ్మ పండుగ సందర్బంగా ప్రకాష్ రావు ప్రకటించారు. నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు ప్రెసిడెంట్ - సైదం తిరుపతి డిప్యూటీ ప్రెసిడెంట్ - చొప్పరి సత్య వైస్ ప్రెసిడెంట్ - బూరెడ్డి మోహన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ - నరేంద్రనాథ్ జనరల్ సెక్రటరీ - రవి చంద్ర జాయింట్ సెక్రటరీ - సందీప్ ట్రేసరర్- మారుతీ జాయింట్ ట్రేసరర్ - రవీందర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ -రవి వర్మ,కృష్ణ వర్మ,కిరణ్ గాజంగి,హరి ప్రసాద్,వివేక్,రాములు,సుందర్,కృష్ణ రెడ్డి ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ - కిరణ్మయి వైస్ ప్రెసిడెంట్ - స్వప్న వైస్ ప్రెసిడెంట్ - అశ్విత యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్ - కార్తీక్ యూత్ వైస్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్ యూత్ వైస్ ప్రెసిడెంట్ - రవితేజ కల్చరల్ వింగ్ మెంబర్స్ -విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్ , రంజిత్ , సంతోష్ , ఓం ప్రకాష్, అనూష ,దివ్య , సాహితి , సాయిచరని, ఇందు. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ -ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ -
‘విశ్వ’ వేడుక
-
టీపీఏడీ ఆధ్వర్యంలో కొపెల్లో ఎంగిలిపూల బతుకమ్మ
కొపెల్(డల్లాస్) : తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో ప్రతికూల వాతావరణంలో కూడా మహిళలందరూ కలిసి ఉత్సాహంగా కొపెల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం పనిదినం అయినా దాదాపు 200 మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కొపెల్లో వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు స్థానిక పోలీసులు సూచించారు. మేఘాలు కమ్ముకుని భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నా అవన్నీ లెక్క చేయకుండా ఆండ్రూ బ్రౌన్ పార్క్లో మహిళలు బతుకమ్మ ఆడారు. ఉద్యోగాల కారణంగా కలుసుకోలేని స్నేహితులు చాలా రోజుల తర్వాత ఒకేచోట చేరి బతుకమ్మపాటలతో సరదాగా గడిపారు. మహిళలు, యువతులు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మ ఆడి నిమజ్జనం చేశారు. బతుకమ్మ టీమ్ ఛైర్ మాధవి లోకిరెడ్డి, కో ఛైర్ మంజూల తోడుపునూరి, టీపీఏడీ అధ్యక్షులు శ్రీని గంగాధర, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్ శారదా సింగిరెడ్డి, ఫౌండేషన్ కమిటీ ఛైర్ రఘువీరా బండారు, టీపీఏడీ నాయకులు రమణ లష్కర్, చంద్రా పోలీస్, టీపీఏడీ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ 13న అల్లెన్ ఈవెంట్ సెంటర్లో సద్దులు బతుకమ్మ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. -
సాక్షి బతుకమ్మ పాట
-
తెలుగింటి బతుకమ్మ సంబరాల వీడియో
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండగ విశిష్టత, ప్రత్యేకతలపై బీజేపీ రూపొందించిన ‘తెలుగింటి బతుకమ్మ సంబరాలు’వీడియోను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పేరాల చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ గ్రామీణ అస్తిత్వాన్ని తెలిపే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బతుకమ్మ ఉత్సవాలను ప్రజలు చక్కగా వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్రంలోని న్యాయవాదులు తమ డిమాండ్లను బీజేపీ మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. ఈమేరకు బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మల్లారెడ్డిని పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేయగా, వారి డిమాండ్లను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని మల్లారెడ్డి తెలిపారు. -
బతుకుపై ఆశ రేపే బతుకమ్మ
బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని 9 రోజులు ప్రతి మనిషి ప్రకృతితో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ గొప్పతనం. ఎంగి లిపూల బతుకమ్మతో మొదలై, సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. ఈ 9 రోజులు తెలం గాణలో సాయంకాలం వేళ ఊరూ వాడా ఏకమై బతుకమ్మ పాటలతో పులకించిపోతుంది. తీరొక్క పువ్వులతో సింగారించుకొనే బంగరు కల్ప వల్లిగా బతుకమ్మను పూజిస్తారు. ఓ పళ్లెంలో గుమ్మడి ఆకులు పరచి, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి తంగేడు, గన్నేరు, నిత్య మల్లె, బంతి వంటి పువ్వుల్ని పేర్చుతారు. అదే పువ్వుల దొంతరపై తమలపాకులో పసుపు గౌరమ్మను అలంకరి స్తారు. సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఓ బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, తనను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా!‘ అని దీవించారంట. బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ ఇది. తెలంగాణ సమాజం అమరత్వాన్ని ఆలింగనం చేసుకుంటుంది కానీ అవమానానికి సుదూరంగా ఉంటుంది. అందుకే ఆత్మహత్యకు పాల్పడిన ఆ బాలికను కీర్తిస్తూ బతుకమ్మను ఆడుతారని బాగా వాడుకలో ఉన్న కథనం. బంగారు తెలంగాణలో ఉయ్యాలో బ్రతుకులు ఛిద్రమయ్యే ఉయ్యాలో/ రాష్ట్రం ఏర్పడితే ఉయ్యాలో ఉద్యోగాలన్నారు ఉయ్యాలో/ నౌకరి లేకే ఉయ్యాలో మరణాన్ని ముద్దాడితిమి ఉయ్యాలో అని విద్యార్ధినులు తమ ఆవేదనంతా బతుకమ్మ పాటలోకి ఒంపి నిరసన తెలిపే రోజు ల్లోనే ఇంకా బతుకమ్మ ఆడటం బాధాకరం. మల్లన్న సాగర్ భూ నిర్వాసితురాలు లక్ష్మి బతుకమ్మ పాట ద్వారా ప్రభుత్వానికి ఆవేదనను తెలిపితే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయించినోళ్లకు బతుకమ్మ ఆడే నైతికత ఎక్కడిదని తెలం గాణ మహిళా సమాజం ప్రశ్నిస్తోంది. బతుకమ్మ అంటే మహిళలంతా ఒక్కచోట కూడి రెండు చేతులతో చప్పట్లు చరుస్తూ, పాట పాడే గొప్ప సంస్కృతి అని మరిచి బతుకమ్మ అంటే డీజేలతో దుమకడమని ఓ కొత్త శైలిని నేర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, స్వపరిపాలనకు కారణమైన సోనియాగాంధీకి కాంగ్రెస్ సారథ్యంలో బతుకమ్మ చీరను కానుకగా ఇస్తారని విశ్వసిస్తూ... ఇందిరా శోభన్, టీపీసీసీ అధికార ప్రతినిధి, మేనిఫెస్టో కమిటీ మెంబర్ -
ధైర్యం చెబుతూ.. స్ఫూర్తి నింపుతూ...
సాక్షి సిటీ బ్యూరో: హైదరాబాద్ బైకర్నీ గ్రూప్.. 2013లో ప్రారంభమైన ఈ గ్రూప్ ఎన్నో సాహసోపేతమైన బైక్ యాత్రలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కర్దుంగ్లా యాత్రతో పాటు, 56 రోజుల పాటు 17వేల కిలోమీటర్ల మీకాంగ్ యాత్ర ఇలా అనేక సాహస బైక్ యాత్రలు ఈ గ్రూప్ తన ఖాతాలో జమ చేసుకుంది. తమ బైక్ యాత్రల ద్వారా అనేక మంది స్త్రీలలో ధైర్యం, స్ఫూర్తి నింపుతున్న ఈ గ్రూప్ ఈ బతుకమ్మ పండుగకు ఒక వినూత్న రైడ్ చేపట్టనుంది. జయభారతి నేతృత్వంలో 9 మందితో కూడిన బైకర్నీల బృందం 9వ తేదీన హైదరాబాద్ నుంచి తమ యాత్ర ప్రారంభించనుంది. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది జిల్లాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొననుంది. సంబరాల్లో పాల్గొనటమే కాకుండా స్త్రీల భద్రత, సాధికారికతపై రోడ్ షోలు చేపట్టి వారితో ముచ్చటించనుంది. ఈ రైడ్లో మరింత ఆసక్తికర అంశం, వీరంతా తెలంగాణా చేనేత దుస్తులను ధరించి ఈ రైడ్ నిర్వహిస్తున్నారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో నిర్వహించే ఈవెంట్లలో బైకర్నీలు పాల్గొంటారు. చైతన్యపరుస్తాం నాతో పాటు ఈ రైడ్లో శాంతి, సురేఖ, కాత్యాయినీ, సత్యవేణి, హంస, కవిత, సుష్మ, పూర్ణిమ ఉంటారు.సాయంత్రానికి మేం చేరుకున్న జిల్లాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంకోచం లేకుండా షీ టీమ్స్ని సంప్రదించ వచ్చని వారి సేవలు ఎలా పొందవచ్చనే విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లె ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రోడ్, బైక్ ద్వారా ట్రావెల్ చెయ్యడానికి సురక్షితమైంది అందుకు మా యాత్రలే ఉదాహరణ. అలాగే చేనేత వస్త్రాలు రోజువారిగా వాడుకలో భాగం చెయ్యాలని చెప్తాం. చివరి రోజు హైదరాబాద్లో ఫ్యాషన్ షో నిర్వహిస్తాం. – జయభారతి -
డల్లాస్ బతుకమ్మ వేడుకలకు అనూ ఇమ్మాన్యుయేల్
డల్లాస్ : తెలంగాణ పీపుల్స్ ఆఫ్ డల్లాస్(టీపాడ్) ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ, దసరా వేడుకలకు నటి అనూ ఇమ్మాన్యుయేల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. 2018 బతుకమ్మ-దసరా ఉత్సవాలను అక్టోబర్ 13 (శనివారం) అలెన్ ఈవెంట్ సెంటర్లో నిర్వహించనున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా విదేశాల్లోనే అతి పెద్ద బతుకమ్మ పండగను టీపాడ్ నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా 12 వేల మంది ఉత్సవాల్లో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. బతుకమ్మ-దసరా ఉత్సవాలకు ముందు ప్రతియేడు జరిగే ‘ఉత్సవ సన్నాహక, నిధుల సమీకరణ కార్యక్రమం’ ఆగస్టు 18 మినర్వా బాంకెట్ హాల్లో ఘనంగా జరిగింది. డల్లాస్తో అమెరికన్ ఇండియన్ అయిన అనూ ఇమ్మాన్యుయేల్కు అవినాభావ సంబంధం ఉందని, ఉత్సవాల్లో భాగంగా ఆమె బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొనున్నారని టీపాడ్ పేర్కొంది. గత ఏడాది జరిగిన బతుకమ్మ వేడుకలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మన సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని భారతీయులకు, భవిష్యత్ తరలా వారికి అందేలా కృషి చేస్తామని టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ రఘువీర్ బండారు, ప్రెసిడెంట్ శ్రీని గంగాధర, బోట్ ఛైర్పర్సన్ శారదా సింగిరెడ్డి తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించినందుకు అనూ ఇమ్మాన్యుయేల్కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాసులు పెద్దమొత్తంలో హాజరై ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. -
చేనేతల బతుకమ్మ
ఉద్యోగమే ఊపిరిగా పని చేసే వాళ్లు ఎలా ఉంటారంటే.. శైలజారామయ్యర్లాగ ఉంటారని చెప్పవచ్చు. చేనేత పరిరక్షణ ఆమె ఉద్యోగధర్మం. ఆ బాధ్యతను ఆఫీస్ వరకే పరిమితం చేయడంలేదామె. నెలలో ఇరవై రోజులు చేనేత చీరల్లోనే కనిపిస్తారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా కనిపిస్తారు. ఆమెను పలకరిస్తే చేనేతకారుల గురించే మాట్లాడతారు. చేనేతలో మన దగ్గర ఉన్న వైవి«ధ్యాన్ని ఆశువుగా చెప్పుకొస్తారు. రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆమె పరిచయం. శైలజారామయ్యర్.. పేరులో తమిళదనం కనిపిస్తుంది కానీ ఆమెలో మాత్రం అచ్చమైన తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఆమె తెలుగును చక్కగా ఉచ్చరిస్తారు. తెలుగు నేల మీద పుట్టిన హస్తకళలను అంతరించి పోనివ్వకుండా పరిరక్షించడానికే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్గా మచిలీపట్నం కలంకారీ కోసం ఇష్టంగా పనిచేశారు. తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ డైరెక్టర్గా.. క్రాఫ్ట్స్మన్కి, వినియోగదారులకు మధ్య ఉన్న అవరోధాలను అధిగమించడానికి అనేక ప్రయోగాలు చేశారు. తయారీదారుల చేత తరచూ ఎగ్జిబిషన్లు పెట్టిస్తూ వారి చేనేతకు గుర్తింపు తెచ్చారు. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరి దృష్టి హస్తకళల మీదకు మళ్లేటట్లు చేశారు. ఇప్పుడామె హ్యాండ్లూమ్ రంగాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేస్తున్నారు. ‘వృత్తి– ప్రవృత్తి ఒకటే అయినప్పుడు, చేస్తున్న పనిని చిత్తశుద్ధితో చేయాలనే తలంపు ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే’ అంటారామె. అంతేకాదు, ఐఏఎస్ అధికారిగా తనకు ఇష్టమైన రంగంలో పని చేసే అవకాశం రావడం తన అదృష్టమంటారు శైలజారామయ్యర్. ధర వెనుక శ్రమను చూడాలి ‘‘హ్యాండ్లూమ్ దుస్తుల పట్ల పెద్ద అపోహ ఉండిపోయింది మనలో చాలామందికి. చేనేత మగ్గాల మీద నేసే దుస్తులంటే జనతా చీరలు, ధోవతులు అనే అనిపిస్తుంది. ఆ భావనను పోగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి చేనేత చాలా నైపుణ్యంతో కూడిన కళ. మేలైన ముడిసరుకుతో కళాత్మకంగా తయారు చేసిన వస్త్రం ధర కూడా ఎక్కువే ఉంటుంది. ధర వెనుక చేనేతకారుల శ్రమను చూడగలగాలి. ఎప్పుడైనా వినియోగం ఎక్కువగా ఉంటేనే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. వినియోగం తగ్గిన తర్వాత ఉత్పత్తి చేస్తే అవి అమ్ముడు కాక అలా ఉండిపోతాయి. మరి వారి ఉపాధి జరగాలి కదా! అందుకోసం ప్రభుత్వం జనతా చీరలు, ధోవతుల ఆర్డర్ ఇచ్చేది.చేనేతకారులకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రభుత్వ ఖజానా మీద ఎక్కువ భారం పడకుండా ఉండటానికి తక్కువ ధరలో దొరికే జనతా చీరలు, ధోవతులనే ఆర్డర్ ఇవ్వడం జరిగేది. చేనేతకారుల చేత చాలా సంవత్సరాల పాటు వాటినే చేయించడంతో ఒక తరం నైపుణ్యమైన వస్త్రాన్ని నేయనేలేదు. ఇప్పుడు చేనేతరంగాన్ని ఆ పరిస్థితి నుంచి బయటకు తెస్తున్నాం. చేనేత దుస్తులంటే తక్కువ ధరకు దొరికేవి కాదు, టెక్స్టైల్ రంగంలోనే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు. ఎన్ని సంస్కృతులైనా రావచ్చు, పోవచ్చు. కానీ ఒక కళ అంతరించి పోకూడదు. మనదైన కళను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం, ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. మన తస్సర్ ఇన్నేళ్ల నా సర్వీస్లో (శైలజారామయ్యర్ 1997 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్) అత్యంత సంతోషం కలిగించిన చేనేత మహదేవ్పూర్ సిల్క్ శారీ. అది తస్సర్ సిల్క్ వంటిదే. మన దగ్గర జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ఉంది మహదేవ్పూర్. అక్కడి చేనేత కారుల దగ్గరున్న నైపుణ్యం తెలిసిన తర్వాత దానికే మరికొన్ని మెరుగులు దిద్ది కళాత్మకమైన చీరను డిజైన్ చేయించడం నాకు చాలా తృప్తినిచ్చిన విషయం. చూడడానికి తస్సర్ చీరలాగానే ఉంటుంది. భాగల్పూర్ సిల్క్ అని కూడా అంటారు. వాటిని పోలిన నేత మన దగ్గరున్న సంగతే మనకు తెలియదింతవరకు. ఇదొక్కటే కాదు, మన దగ్గర అనేక రకాల ఫ్యాబ్రిక్ తయారవుతోంది, అనేక రకాల వస్త్రాన్ని నేస్తున్నారు. ఎక్కడ, ఎలాంటి వస్త్రం తయారవుతుందో తెలుసుకోవడమే అత్యంత కష్టమైన పని, వైవిధ్యతను గుర్తించిన తరువాత వాటిని పరిరక్షించుకోవడం రెండవ దశ, వాటిని వ్యాప్తి చేయడం మూడవ దశ. తెలంగాణలో తయారవుతున్న చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడంలో భాగంగానే బీబీ రసూల్, శ్రావణ్కుమార్, ప్రసాద్ బినప్ప వంటి మోడల్స్ను అంబాసిడర్లుగా నియమించాలనే నిర్ణయం తీసుకున్నాం. మన గొల్ల భామ వస్త్రంతో ఓవర్ కోట్ వేసుకుని బీబీ రసూల్ ఫ్రాన్స్ వంటి దేశాల్లో సమావేశాలకు హాజరైనప్పుడు అక్కడికి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ల దృష్టి తప్పనిసరిగా ఆమె ధరించిన కోట్ మీద నిలుస్తుంది. ఇలాంటివే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. బతుకమ్మ చీరల కోసం తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకల సమయంలో తెల్ల రేషన్ కార్డున్న మహిళలకు చీరలిస్తోంది. ఆ చీరలు నేసే పనిని కూడా చేనేతకారులకే ఇప్పించాలంటే అసాధ్యం అనిపించింది. రాష్ట్రంలో 17, 573 చేనేత మగ్గాలున్నాయి. వాటిలో చీరలు నేసే మగ్గాలు సగానికి మించవు. అలాంటప్పుడు అంత పెద్ద ఆర్డర్ను పూర్తి చేయాలంటే మూడేళ్లు పడుతుంది. అందుకే పవర్లూమ్స్ మీద పనిచేస్తున్న సిరిసిల్ల నేతకారులకు కేటాయించాం. అవి కూడా నేత చీరలే, అయితే చేనేత కాదు. మరమగ్గాల మీద నేసిన నేత చీరలన్నమాట. కార్పొరేట్ గుప్పిట్లో చిక్కకుండా అసలైన ప్రమాద ఘంటికలు ఏమిటంటే.. చేనేతకారుల కుటుంబాల నుంచి తర్వాతి తరాలు ఆ వృత్తికి దూరంగా వచ్చేయడం. చదువుకుని ఉద్యోగాలకు వెళ్లడాన్ని స్వాగతించాల్సిందే. కానీ చేనేత పనుల్లేక రోజువారీ కూలీలుగా ఇతర పనుల్లోకి మారిపోవడం చిన్న విషయం కాదు. ఒక వృత్తి, ఒక కళ అంతరించిపోతోందనడానికి ఇంతకంటే మరొక నిదర్శనం అక్కర్లేదు. మా ప్రయత్నాలతో అలాంటి స్థితి తప్పిందనే చెప్పాలి. కిరాయి ఆటోలు నడుపుకుని రోజు గడుపుకుంటున్న వాళ్లు తిరిగి మగ్గం మీద పని చేస్తున్నారు. కొత్త తరంలో చేనేత మీద ఆసక్తి ఉన్న వాళ్లు తిరిగి మగ్గానికి దగ్గరవుతున్నారు. వాళ్లను కార్పొరేట్ రంగం గుప్పిట్లో చిక్కుకోకుండా స్వతంత్రంగా నిలబడగలగడానికి ప్రోత్సాహకాలను ఇస్తున్నాం. వస్త్రాన్ని నేసిన చెయ్యి మగ్గాన్ని వదలకూడదు. ఆ కళ అంతరించి పోకూడదు. మగ్గం అన్నం పెడుతుందనే భరోసా కల్పిస్తే వారి చేతిలోని కళ పురివిప్పుతుంది. వారిలోని కళాత్మకత ఆవిష్కారమవుతుంది. కళను ఆవిష్కరించే అవకాశాలు ఆ చేతులకు దూరం కాకూడదనేదే ఈ ప్రయత్నం’’. ఇప్పటి పిల్లలకు చెప్పే పని లేదు ‘‘మాది తమిళ కుటుంబమే. కానీ నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్లోనే. నా మెట్టినిల్లు రాజకీయ కుటుంబం. తండ్రి వారసత్వంతో మావారు (డి. శ్రీధర్బాబు) రాజకీయాలను అందిపుచ్చుకున్నారు. ఒక కప్పు కింద ఒక పొలిటీషియన్, ఒక ఐఏఎస్ అధికారి చాలా సౌకర్యవంతంగా జీవించవచ్చు. నేను మా వారి రాజకీయ చర్చలు, నిర్ణయాలలో తలదూర్చను, ఆయన నా విధులు, నిర్ణయాలు, ఆచరణల గురించి ఏ మాత్రం మాట్లాడరు. భార్యాభర్తలుగా మేము ఒకరికొకరం. వ్యక్తులుగా మాత్రం ఎవరి ఆలోచనలు వారివే, ఎవరి భావజాలం వారిదే. నిర్ణయాలెప్పుడూ పరిస్థితులు, అవసరాలు, భావజాలాలకు అనుగుణంగా ఉంటాయి. ఒకరి వృత్తిపరమైన విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉండగలిగితే ఆ ఇంటి వాతావరణం హాయిగా ఉంటుంది. మా వరకు మేము పాటిస్తున్న సూత్రమదే. మాకు ఇద్దరు పిల్లలు, అమ్మాయి ఆరవ తరగతి, అబ్బాయి మూడవ తరగతి. వాళ్ల మీద మా ఇద్దరిలో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ తరం పిల్లల కోసం ప్రపంచమే నట్టింట్లోకి వచ్చేసింది. ప్రతి విషయాన్నీ చాలా త్వరగా తెలుసుకోగలుగుతున్నారు. అమ్మానాన్నలిద్దరిలో తమకు నచ్చిన లక్షణాలను మాత్రమే తీసుకోగలిగిన నైపుణ్యం వారికి ఒకరు చెప్పకనే వచ్చేస్తోంది. పెద్దయ్యాక ఏ రంగంలో స్థిరపడతారనేది వాళ్ల ఇష్టానికి వదిలేయడమే మంచిది. పేరెంట్స్ పిల్లలకు గైడ్ చేయవచ్చు, అంతే తప్ప వాళ్ల తరఫున నిర్ణయాలు చేసేయాలనుకోకూడదు’’. – శైలజారామయ్యర్, డైరెక్టర్, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఎనభై రంగుల్లో చీరలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డులు ఉన్న మహిళలకు బతుకమ్మ పండగ కానుకగా చీరలను బహూకరిస్తోంది. ఆ చీరల తయారీ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు అప్పగించారు. రోజుకు లక్షా పది వేల చీరలు తయారవుతున్నాయి. నేతన్నలకు చేతినిండా పని ఉండటంతో సిరిసిల్ల మురిసిపోతోంది. గతంలో వారానికి రెండు వేలు సంపాదించేవాళ్లకు ఇప్పుడు వారానికి మూడున్నర నుంచి నాలుగు వేలు వస్తోంది. సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 80 రంగుల్లో చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం 90 లక్షల చీరలకు గాను ఇప్పటికి 40 లక్షలు పూర్తయ్యాయి. 15 వేల పవర్లూమ్స్ పని చేస్తున్నాయి. సెప్టెంబరు నెలాఖరు లోపే మొత్తం చీరలు సిద్ధమవుతాయి. – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ సిరిసిల్ల – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
పోర్ట్లాండ్లో బతుకమ్మ, దసరా సంబురాలు
సాక్షి, పోర్ట్లాండ్: అమెరికాలోని ఓరెగాన్ స్టేట్లోని పోర్ట్లాండ్ నగరంలో బతుకమ్మ, దసరా సంబురాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ సంబురాలను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, పోర్ట్లాండ్ చాఫ్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు పోర్ట్లాండ్ మెట్రో నగరాల నుంచి దాదాపుగా 600 మంది హాజరయ్యారు. ఈ వేడుకలను పోర్ట్లాండ్ చాఫ్టర్ చైర్మన్ అనుమాండ్ల జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ దుస్తులో మహిళలు, చిన్నారులు ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి అనుమాండ్ల బహుమతులను బహుకరించారు. అనంతరం వాలంటీర్ల సహాయంతో స్కూల్ దగ్గర్లో ఉన్న కొలనులో బతుకమ్మను నిమ్మజ్జనం చేశారు. తదనంతరం దసరా పండుగ సందర్భంగా టీడీఎఫ్ టీం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి ఇచ్చి పెద్దవారితో ఆశీర్వాదం తీసుకున్నారు. చైర్మన్ అనుమాండ్ల కార్యక్రమానికి వచ్చిన వారందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ఘనంగా జరుపుకోవటానికి సహకరించిన మహిళలందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.రఫెల్ టికెట్స్ గెలిచిన వారికి శ్రీని గిఫ్ట్ కార్డ్స్ బహుకరించారు. చివరగా అందరూ ఢీ జె మ్యాజిక్కి డాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ పోర్ట్లాండ్ చాఫ్టర్ కమిటీ మెంబర్స్, వాలంటీర్స్ టీం సభ్యులు.. కొండల్ రెడ్డి పుర్మ, రఘుస్వామి, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, నిరంజన్ కూర, నరేందర్ చీటి, జయాకర్ రెడ్డి ఆడ్ల, శివ ఆకుతోట, సత్యసింహరాజ, ప్రవీణ్ అన్నవజ్జల, రాజ్ అందోల్, వీరేష్ బుక్కా, సురేశ్ దొంతుల, ప్రవీణ్ ఎలకంటి, అజయ్ అన్నమనేని శ్రీని బొంతల, వెంకట్ ఇంజం, శ్రీనివాస్ రెడ్డి పగిడి, కృష్ణారెడ్డి అయిలూరి, శ్రీని గుబ్బ, రామ్ పప్పుల, గణేష్ ప్రభల, వెంకట్ రెడ్డి గోగిరెడ్డి, అంజి పల్లాటి, కిరీట్ పోల, వారి కుటుంబాలకు చాఫ్టర్ చైర్మన్ శ్రీని హృదయ పూర్వక అభినందలు తెలియజేశారు. -
బతుకుమ్మ పాటకు డ్యాన్స్ చేసిన చెర్రీ
-
నిబ్బరంగా సాగుదాం!
యావద్భారతం దసరా సంబరాల్లో తేలియాడుతోంది. దుష్టసంహారిణి దుర్గ తొమ్మిది రోజుల భీకర సంగ్రామం తర్వాత లోక కంటకుడైన మహిషాçసురుని కడతేర్చి నేల నాలుగు చెరగులా శాంతి సౌఖ్యాలను వెలయించిన రోజు విజయ దశమి. హిందువుల పండుగే అయినా దసరా వేడుకల అంతస్సారం, అంతర్నిహిత సందేశం మతాలకతీతం, లౌకికం, సార్వత్రికం. చెడుపై మంచి విజయం అనివార్య మనే సార్వత్రిక సత్యం ఎవరిలో మాత్రం ఆత్మవిశ్వాసాన్ని నింపదు, ఎంతటి నైరాశ్యపు ఎడారి బతుకుల్లో ఆశల పూలను పూయించదు? భిన్నత్వంలో ఏకత్వానికి మారు పేరైన భారతంలోని అత్యధిక సంఖ్యాకుల హిందూ మతంలోనే ఉన్న ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యమంతా దసరా ఉత్సవాల్లో ప్రస్ఫుటంగా కనిపి స్తుంది. అయితే ఎక్కడైనా దసరా అంటే శక్తి పూజే. శక్తి స్వరూపిణిగా మహిళ విశ్వ రూపాన్ని ఆవిష్కరించే సమయమే. ఎంతటి వారైనా ఆమె ముందు మోకరిల్లే సందర్భమే. అందుకే ఇది ‘ఆమె’కు మనం చూపుతున్న స్థానం ఏది? అని ప్రశ్నించు కోవాల్సిన సందర్భం అయింది. చెడుపై మంచి విజయం అనివార్యమేనా? అసలు సాధ్యమేనా? అని అడుగడుగునా రేగే సందేహాలకు సమాధానాలను వెతకాల్సిన సమయమూ అయింది. దేశ జనాభాలోని మహిళల సంఖ్య క్రమంగా క్షీణిస్తోందని తెలిసిందే. 1971లో 15–34 ఏళ్ల వయస్కులైన వెయ్యి మంది యువకులకు 961 మంది యువతులుగా ఉన్న నిష్పత్తి, 2011 నాటికి 939కి పడిపోయిందనీ, అది 2021 నాటికి 904కు, 2031 నాటికి 898కి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు తాజా అంచనా. ఇప్పుడు హారతులెత్తుతున్న ఆ అమ్మలగన్న అమ్మకు ప్రతిరూపమైన ఎందరు అమ్మల కడు పున ఊపిరి పోసుకుంటున్న శక్తులను చిదిమేసి, కళ్లయినా తెరవని పసి శక్తుల గొంతులు పిసికేసి ఇంతటి ఘనతను మూటగట్టుకుంటున్నాం? చెడును పరిమార్చే ఆ అమ్మ ఈ దురాగతాన్ని సహిస్తుందా? మొక్కులు చెల్లించామని మన్నిస్తుందా? విద్య, ఉద్యోగావకాశాల్లో ఆడపిల్లల పట్ల చూపుతున్న వివక్షను అధిగమించి మరీ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు 2014–15 మధ్య 51 శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఉద్యోగులుగా ఎంతటి ప్రతిభను, సమర్థతను కనబరుస్తున్నవారైనా 74 శాతం ఇలాంటి వేధింపులపై అసలు ఫిర్యాదే చేయరంటే పర్యవసానాల భయం ఎలాం టిదో ఊహించుకోవచ్చు. విద్యావంతులైన, ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితే ఇలా ఉంటే ఇళ్లలో, వీధుల్లో, విద్యాలయాల్లో మహిళలపై సాగే వేధింపులు, హింస, అత్యాచారాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చెప్పనవసరం లేదు, గణాంకాలు ఏకరు వు పెట్టాల్సిన అవసరమూ లేదు. శక్తి స్వరూపిణిగా మహిళను ఆరాధించే మనం మన సొంత కూతుళ్లు, అక్కచెల్లెళ్లు, కన్న తల్లి, కట్టుకున్న ఆలి, సహాధ్యాయిని, తోటి ఉద్యోగిని, శ్రామికురాలు, ఎవరైతేనేం మహిళను పురుషునితో సర్వ సమానమైన మనిషిగా చూడగలుగుతున్నామా? గౌరవించగలుగుతున్నామా? నునులేత మొహా లపై యాసిడ్ సీసాలు విసిరి, అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడి, ఆత్మ హత్యలకు పురిగొల్పి ఏ మొహం పెట్టుకుని అమ్మవారి దర్శనం కోసం వెళు తున్నాం? ఆ మహిషాసురమర్దని పట్ల చూపే భక్తిప్రపత్తులపై ఈ రాక్షసత్వం ఆనవాళ్లు కనిపించకుండా ఉంటాయా? ఈ పరిస్థితిని భరిస్తున్న సమాజంగా మనం ఆ శక్తి స్వరూపిణి ముందే కాదు, భారత స్త్రీ శక్తి ముందు కూడా దోషులం కాకుండా పోతామా? దేవీ నవరాత్రి ఉత్సవాల నిజ స్ఫూర్తిని గ్రహించగలిగితే, చెడుపై పోరాటం చేయడానికి వెనుకాడటం, చెడు చేయడంతో సమానమేనని గ్రహించే వాళ్లం కాదా? ‘ఈ ప్రపంచం ప్రమాదకరంగా తయారైంది దుష్టులవల్ల కాదు, వారి దుష్కృత్యాలను చూస్తూ ఏమీ చేయని వారి వల్ల (ఐన్స్టీన్).’ నేడైనా ఆ పోరుకు దిగి, విజయాన్ని కోరి ‘ఆయుధ పూజ’ చేద్దాం. శమీ వృక్షాన్ని పూజించడమైనా, రావణ దహనమైనా చెడును నిర్జించడానికి ప్రతిన బూనడానికి సంకేతాలే తప్ప అర్థ రహితమైన ఆరాధనా కాదు, వినోదం అంతకన్నా కాదు. విజయదశమితో ఆ దుర్గమ్మ తల్లి మíß షాసుర సంహారం ముగుస్తుంది. నేడు చేసే ఆయుధ పూజ విజయాన్ని సాధించగలమనే ఆత్మవిశ్వాసం నింపి, ఇనుమడిం చిన శక్తితో మనల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది. కానీ రేపటి నుంచి అడుగడుగునా చెడు ఎదురవుతూనే ఉంటుంది. మహిషారులు ప్రత్యక్షమౌతూనే ఉంటారు. అన్యా యం, అసమానత, అవినీతి, అజ్ఞానం, అసహనం అసమర్థత, అక్రమం, అధికార దుర్వినియోగం, దురాక్రమణ, దురాగతం, దురాచారం, మూఢనమ్మకం, వివక్ష, నిరక్షరాస్యత ఇలా ఎన్ని రూపాలలో చెడు విచ్చలవిడిగా చెలరేగి పోవడం లేదు? పేదరికాన్ని మించిన సామాజిక హింస మరేదీ లేదు. ఆ చిత్రహింసల కొలిమిలో, రోగాల పుట్టల్లో కునారిల్లుతున్న 30 కోట్ల అభాగ్యుల మాటేమిటి? నిరుద్యోగులు కావడం అంటే ఆచరణలో జీవించే హక్కును కోల్పోవడమే. కొత్త ఉద్యోగాలు వేలల్లో ఉంటే కొత్త నిరుద్యోగులు లక్షల్లో పెరుగుతున్నారు. ఈ భూతాలను ఎవరు పరిమార్చాలి? అవి ప్రభుత్వాలు చేయాల్సిన పనులే, 70 ఏళ్లుగా అరకొరగా చేసీ చేయకుండా వదిలేసిన బాధ్యతలే. అట్టహాసంగా దసరా ఉత్సవాలు జరుపుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపే ప్రభుత్వాలు... దాచిన ఎన్నికల ప్రణాళికలు, చేసిన వాగ్దానాల దుమ్ముదులిపి ఈ విజయదశమినాడైనా అమలు చేయడానికి పూనుకుంటాయని, ఆ కృషిలో విజయం కోసం ప్రార్థిస్తాయని ఆశిద్దాం. అయితే ఆ పాల కులను ఎన్నుకునేది మనమే. కాబట్టి ప్రభుత్వాలు నిజంగానే ప్రజల అధికారానికి ప్రాతినిధ్య సంస్థలుగా పనిచేసేలా చేయడమూ మన బాధ్యతే. ఈ పండుగ రోజున ఇన్ని చేదు వాస్తవాలను గుర్తుకు తెచ్చుకోవడం వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని సమ కూర్చుకోవడానికే. జీవితం, సమాజం సమస్యల సుడిగుండమైనప్పుడు కావా ల్సింది గుండె దిటవు. విజయదశమి రోజున ఆ ఆదిశక్తిని కోరాల్సింది అదే. విశ్వ కవీంద్రుడు అన్నట్టు ‘ఆపదల నుంచి కాపాడమని కాదు, ఆపదలను ఎదుర్కో వాల్సి వచ్చినప్పుడు నిర్భయంగా ఎదుర్కొనేలా చేయమని ప్రార్థిద్దాం’. -
గిన్నిస్ ఫీట్ విఫలం..
-
సీఎం నివాసంలో సద్దుల బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారిక నివాసం ప్రగతి భవన్లో సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం సాయంత్రం జరిగాయి. సీఎం సతీమణి శోభ, కూతురు ఎంపీ కవిత అందంగా పేర్చిన బతుకమ్మలను ఇంటి ముందు పెట్టి వారింట్లో పనిచేసే మహిళలతో కలసి బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడారు. అనంతరం సద్దుల వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. -
గిన్నిస్ ఫీట్ విఫలం..
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ వేడుకల ద్వారా గిన్నిస్ బుక్లో స్థానం దక్కించుకొనేందుకు రాష్ట్ర పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా గురువారం మూడు వేల మంది మహిళలతో రాష్ట్ర చిహ్నమైన మహా తంగేడు పువ్వు ఆకృతి రూపొందించడం, అలాగే ఒకేసారి మూడు వేల బతుకమ్మలను పేర్చడం ద్వారా గిన్నిస్ బుక్లోకి ఎక్కాలని చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. ముందస్తు రిహార్సల్ లేకుండా నేరుగా మహిళలను రంగంలో దింపడం, మరోవైపు సరిపడా సంఖ్యలో మహిళలు లేకపోవడంతో ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. తంగేడు పువ్వు ఆకృతిలో నిలబడలేక కొందరు మహిళలు సొమ్మసిల్లిపోయారు. గిన్నిస్ ప్రతినిధులు 2 అవకాశాలు కల్పించినా ప్రకృతి అనుకూలించలేదు. వరుణుడు ఆటంకంగా మారడంతో రెండో ఈవెంట్ అయిన 3 వేల బతుకమ్మలను పేర్చే ప్రయత్నం కూడా జరగలేదు. మహిళల సమీకరణలో విఫలం బతుకమ్మను గిన్నిస్ బుక్లో ఎక్కించాలన్న ప్రయత్నానికి అధికారుల మధ్య సమన్వయ లోపం దెబ్బతీసింది. స్టేడియంలో సున్నంతో మహా తంగేడు పువ్వు ఆకృతిని ఏర్పాటు చేశారు. పసుపు, ఆకుపచ్చ, గునుగు పువ్వు రంగు చీరలు ధరించిన మూడు వేల మంది మహిళలు దీనిపై నిలబడాల్సి ఉంది. మరో వైపు ఒకేసారి బతుకమ్మలను రూపొందించే ఈవెంట్కు సంబంధించి ఎడమవైపు 1,500 సున్నపు గళ్లు, కుడివైపు 1,500 సున్నపు గళ్లను 15 వరుసలతో ఏర్పాటుచేశారు. వీటి మధ్య లో సున్నంతో బతుకమ్మ ఆకృతిని ఏర్పాటు చేశారు. అందులో మూడు వేల మంది మహిళలు బతుకమ్మలు తయారు చేసి బతుకమ్మ ఆకృతిలో పేర్చాల్సి ఉంది. రికార్డుకు సరిపడా సంఖ్యలో మహిళలను సమీకరించడంలో అధికారులు విఫలమయ్యారు. సమయపాలన పాటించకే.. గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించిన అధికారులు సమయపాలన పాటించలేదు. ఉదయం 10 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావించారు. కానీ స్టేడియంలో మహా తంగేడు పువ్వు ఆకృతి, మూడు వేల బతుకమ్మల ఏర్పాట్లు, మహిళ లు మైదానానికి చేరుకోవడం ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. రెండు సార్లు వర్షం కురవటంతో మైదానంలో నీరు చేరి సున్నంతో గీచిన డయాగ్రామ్ చెరిగిపోయింది. సాయంత్రం మూడున్నర ప్రాం తంలో డయాగ్రామ్ను గీసి రికార్డ్ ప్రక్రియను ప్రారంభించినా సఫలం కాలేదు. కర్ణాటక నుంచి బంతిపూలు.. గిన్నిస్ రికార్డు కోసం కర్ణాటక నుంచి 8 టన్నుల బంతిపూలు తెప్పించి వాడారు. అలాగే బాన్సువాడ, నిజామాబాద్ నుంచి 10 డీసీఎం వ్యాన్ల గునుగు పూలు, ఖమ్మం, హైదరాబాద్ సమీప ప్రాంతాల నుంచి ఒక డీసీఎం వ్యాన్ తంగేడు పూలు తెప్పించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఎస్టీడీసీ ఎండీ క్రిస్టీనా జెడ్ ఛొంగ్తూ, టీఎస్టీడీసీ ఈడీ మనోహర్, ఆర్డీవో చంద్రకళ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మరోసారి విద్యార్థినులతో ప్రయత్నం మహిళలతో చేసిన ప్రయత్నం విఫలం కావ డంతో రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మరోమారు విద్యార్థినులతో మహా బతుకమ్మ ఫీట్ చేయాలని భావిస్తోంది. తంగేడు పువ్వు కాకుండా మరో పువ్వును ఎంపిక చేసి విద్యా సంస్థలతో కలసి ప్రయత్నించేందుకు సిద్ధమవుతోంది. గిన్నిస్ ప్రతినిధి మరోసారి అవకాశం ఇస్తామని పేర్కొనడంతో రెండు మూడు నెలల్లో తిరిగి ప్రయత్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో రికార్డు సాధిస్తాం.. మహా తంగేడు పువ్వు ఆకృతితో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నించాం. కానీ ప్రకృతి అనుకూలించలేదు. మరో రెండు, మూడు నెలల్లో మరోసారి ప్రయత్నించి రికార్డు సాధిస్తాం. – బుర్రా వెంకటేశం, రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి మరో అవకాశం ఇస్తాం మానవులతో మహాపువ్వు ఆకారంతో గిన్నిస్ రికార్డు కోసం మరోసారి అవకాశం ఇస్తాం. మహా తంగేడు పువ్వు ఆకృతి ఏర్పడలేదు. మహిళల సంఖ్య కూడా తక్కువగా ఉంది. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రకృతి సైతం అనుకూలించలేదు. – స్వప్నిల్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి బతుకమ్మ ఎంతో విశిష్టమైంది బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టమైందని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ పేర్కొన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ గిన్నిస్ రికార్డు ప్రయత్నాన్ని తిలకించేందుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ పండుగ ఇప్పుడు పండుగలన్నింటిలోకీ తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందని తెలిపారు. మహిళలే ఎక్కువ మంది ఒకచోట చేరి నిర్వహించుకునే ఏకైక పండుగ అని, ఇది మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపే పండుగ అని చెప్పారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం పెంచే బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తం కావాలని మిథాలీ ఆకాంక్షించారు. – మిథాలీరాజ్ -
పూలవనం.. ఎల్బీ స్టేడియం
-
పూలవనం.. ఎల్బీ స్టేడియం
సాక్షి, హైదరాబాద్: మంగళవారం నాడు ఉయ్యాలో.. లేచెనే గౌరమ్మ ఉయ్యాలో..చన్నీటి జలకాలు ఉయ్యాలో..ఆడెనే గౌరమ్మ ఉయ్యాలో..ముత్యమంత పసుపు ఉయ్యాలో..ముఖమంతా పూసి ఉయ్యాలో..చింతాకు పట్టుచీర ఉయ్యాలో..చింగులు మెరవంగ ఉయ్యాలో.. రంగురంగుల బతుకమ్మలు.. తీరొక్క పూల గుబాళింపు.. వినసొంపైన జానపదాలు.. కోలాటాలు.. వేలాది మంది ఆడపడుచుల ఆటపాటలు.. మంగళవా రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ముద్దబంతై మురి సింది! సాయంత్రం నిర్వహించిన మహా బతుకమ్మ వేడుక ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పడతులు తరలి వచ్చి బతుకమ్మ ఆడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ వేడుకలను ప్రారంభించారు. మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృ తిక వైభవాన్ని చాటేదే బతుకమ్మ అని చెప్పారు. ‘‘గతంలో బతుకమ్మ ఆట ఆడుకునేందుకు నగరంలో కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అదే హైదరాబాద్లో వేలాది మందితో మహా బతుకమ్మ నిర్వహించడం ఆనందంగా ఉంది. ఎల్బీ స్టేడియం పూలవనాన్ని తలపిస్తోంది. అన్ని జాతులు కలిస్తేనే మానవ జాతి. అన్ని పూలు కలిస్తేనే బతుకమ్మ’’ అని అన్నారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించేందుకు మహిళలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. బహ్మకుమారి డైరెక్టర్ బీకే కులదీప్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తోందన్నారు. అందరిదీ ఒకే కుటుంబం.. అంతా కలసి పువ్వుల్లా నవ్వులు చిందించిననప్పుడే విశ్వశాంతి పరిఢవిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందు కు దేశంలోని 15 రాష్ట్రాల నుంచి తమ ప్రతినిధులు తరలివచ్చారన్నారు. ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మందికిపైగా మహిళలు తరలివచ్చినట్టు అంచనా. రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ఎండీ క్రిస్టినా చొంగ్తు, కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా పాల్గొన్నారు. -
బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంçస్కృతి, సాంప్రదాయాల్లో భాగంగా దేవి నవరాత్రుల సందర్భంగా తెలంగాణ ప్రజలు జరుపుకునే బతుకమ్మ సంబరాలను ఇక్కడి బెంగళూరు నగరంలో తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కర్ణాటక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక్కడి సీవీ రామన్ నగర్లో ఉన్న డీఆర్డీఓ కమ్యూనిటి హాల్లో పెద్ద సంఖ్యలో తెలంగాణ మహిళలు, ప్రవాసాంధ్రులు, కర్ణాటక మహిళలు సైతం ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పుష్పాలతో చేసిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రేవతి మాట్లాడుతూ... ఏటా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామని, ఈ ఏడాది కూడా బతుకమ్మ పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నామన్నారు. – బొమ్మనహళ్లి -
బంగారు బతుకమ్మ
తే.గీ. తల్లి బతుకమ్మ పుట్టుక ధన్యమయెను పుటుక చరిత్ర యెట్లున్న ముదము గలిగె నిన్ను కొల్వగా తెలంగాణ నెలతలంత దీవెనలిడుమమ్మ చెలువల్ తేజమలర తే.గీ. రకరకాల పూవులనన్ని రమ్యముగను పేర్చి,రంగుల నద్దియు ప్రేమ తోడ పసుపు ముద్ద గౌరమ్మగ పైన పెట్టి పువ్వులను దేవతగతల్చి భువినతివలు సీ. బతుకమ్మ యాడును పడతులు తొమ్మిది రోజులు వైవిధ్య పూజ చేత తొలిరోజు బతుకమ్మ నెలతలెంగిలి పూల నుచునాడెదరువారు నుతము తోడ రెండవ రోజున మెండుగ ముదముతో అటుకుల బతుకమ్మ నాడు రంత మూడవ రోజున ముద్దపప్పు బతుక మ్మనుచు మురిపెమంత మదిని గలిగి తే.గీ. ఆడుదురు వనితలు పాట పాడుకునుచు నాల్గవ దినమునందున నానబియ్య ము బతుకమ్మనాడెదరంత మోదమొసగి పలు విధమ్ముల వేడును పడతులంత సీ. ఐదవ దినమున యట్ల పేరు యనుచు ముదిత లాడెదరంత ముదము గలిగి ఆరవ దినమందలిగిన బతుకమ్మ యనుచు నాపెదరంత యాట నెమ్మి వీడి,యేడవ రోజు వేపకాయల బతు కమ్మని కొలుతురు కమ్మగాను ఎనిమిదవ దినము నెన్నముద్దల బతు కమ్మను వేడుక గాడురంత తే.గీ. తొమ్మిదవ దినమున పరితుష్టి హెచ్చి సద్దుల బతుకమ్మాడ్దురు చక్కగాను సాగనంప్దురు పూవేల్పు సౌఖ్యమిమ్మ పంచు కొందురు వాయనాల్ పడతులంత - నల్లగొండ సురేశ్ 7893636501 -
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటున్న తెలంగాణకు చెందిన వారందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈ బతుకమ్మ సంబరాలను అబుదాబి నగరంలోని ఇండియా సోషల్ సెంటర్ ఆడిటోరియంలో దాదాపు పదిహేను వందల మంది తెలుగువారి సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శరణ్య ముఖ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డప్పు వాయిద్యాలతో అబుదాబి తెలుగింటి ఆడబిడ్డలు బతుకమ్మ సంబరాల ప్రాంగణానికి చేరుకోగా, ప్రార్ధన గీతంతో కార్యక్రమం మొదలుపెట్టారు. తర్వాత చిన్నారులు వారి ఆటపాటలతో అందరినీ అలరించారు. కార్యక్రమానికి వచ్చిన ఆడపడుచులందరూ ఎంతోభక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ అమ్మవారిని తలచుకున్నారు. కాగా, అందమైన బతుకమ్మలకు, సంప్రదాయబద్ధంగా తయారైన పిల్లలకు బాగా బతుకమ్మ ఆడినవారికి కార్యనిర్వాహకులు బహుమతులు ప్రకటించారు. బతుకమ్మకు పూజచేసిన అనంతరం, సంప్రదాయబద్దంగా బతుకమ్మను నిమజ్జనంచేసి, ప్రసాద వితరణ అనంతరం కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కార్యనిర్వాహకులు రాజశ్రీనివాస్, వంశీ, పృథ్వి, సదానంద్, గంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పావని, రోజా, అర్చన, పద్మజ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. -
సాక్షి 'బతుకమ్మ' ప్రత్యేక పాట
-
గౌతమి సందడి
-
ముఖ్యమంత్రి బతుకమ్మ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సీఎం కె.చంద్రశేఖర్రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయనపిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ జరిగే దేవాలయాలు, చెరువుల వద్ద కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
పూలకు మొక్కుత
దేవుడు, ప్రకృతి, సమాజం, మనిషి.. ప్రపంచానికున్న నాలుగు దిక్కులు. దేవుణ్ని ప్రేమించనివాడు... ప్రకృతిని కాపాడనివాడు... సమాజాన్ని గౌరవించనివాడు... సాటి మనిషిని హత్తుకోనివాడు... దైవానుగ్రహానికి అనర్హుడు. పువ్వు ఏ చెట్టుకు పూసినా దేవుని పాదాల చెంతకు చేరాలనుకుంటుంది. మనిషిలో ఏ మంచి ఆలోచన వచ్చినా సమాజానికి పాదులు తీసి నాటాలనిపిస్తుంది.బతుకమ్మ పండగ.. దేవునికి, సమాజానికి, మనిషికి ప్రకృతి పూలు అద్దే సుగంధం. అలాంటి పూలకు మొక్కుత అలాంటి గుణానికి దండం పెడత. పూలు లేని పూజ ఉండదు. పూలనే పూజించడం అంటే .. ఏమిటీ ఆంతర్యం? బతుకమ్మ అంటే వేదాంతం. ఒక జీవనప్రయాణం ఎలా ఉంటుందో ఈ బతుకమ్మ ద్వారా తెలుసుకోవచ్చు. అడవిలో పూసే గునుగు, తంగేడు.. వంటి పూల చెట్లను మనవెవ్వరమూ నాటం. నీళ్లు పోయం. దేవుడే వాటిని పుట్టించాడు. ఆ పూలను ఏరుకొచ్చి ఒద్దికగా పేర్చి, బతుకమ్మ అని కొలుస్తూ, సంబరం చేసుకుంటాం. మనిషి బతికున్నన్నాళ్లు ఇంత సంబరంగా ఉండాలని ఆడతాం, పాడతాం. తర్వాత అందంగా పేర్చిన ఆ బతుకమ్మను నీళ్లలో వదిలేస్తాం. అంటే ప్రకృతిలో కలిపేస్తాం. మనిషి కూడా చివరకు అంతేగా! ప్రకృతిలో కలిసి పోవాల్సిందే! ఇది వేదాంతం. అందుకే ఈ సందర్భంగా తొలిరోజున పెద్దలను గుర్తుచేసుకొని బతుకమ్మను పేర్చుతాం. అంటే ముందు మరణాన్ని తలుచుకుంటున్నాం. అదే బతుకమ్మ పండగలో భాగమయ్యింది. రెండవది.. ప్రకృతి ఆరాధన. గిరిపుత్రిక పార్వతీ దేవి శివపూజ కోసం పూలన్నీ ఒకచోట చేర్చి తీసుకెళ్లేది. అలా మనం పూలన్నీ తీసుకెళ్లి ఆడి పాడి శివునికి అర్పిస్తున్నాం. పార్వతీ, పరమేశ్వరులు ప్రకృతీ పురుషులు కదా! మూడవది.. పర్యావరణం. ఔషధ గుణాలున్న పూలన్నీ తీసుకెళ్లి నీళ్లలో వదిలితే నీళ్లు శుద్ధి అవుతాయి. దానివల్ల జీవులకు శుద్ధ జలం అందుతుంది. అంటే.. ఈ పండగలో అధ్యాత్మికత, ప్రకృతి, పర్యావరణం అలాగే సామాజికం... ఇవన్నీ ఒకదానికొకటి కలిపి ఉన్నాయి. దేనికీ భంగం కలగకుండా మనిషిగా మన బాధ్యతలేంటో ఈ పండగ తెలియజేస్తుంది. ప్రతీసారి బతుకమ్మ ఉత్సవాలు దేశ విదేశాలలో చేస్తుంటారు. ఈ సారి ఆ హంగామా కనిపించడం లేదు? బతుకమ్మ వేడుక దేశ విదేశాలలో వరుసగా తొమ్మిదేళ్లు చేస్తానని సంకల్పించుకున్నాను. ఇప్పటికి పూర్తయ్యింది. ఈ వేడుక మొదలుపెట్టినప్పుడు టెన్షన్గా ఉండేది. ద్వితీయ శ్రేణి వారు చేసుకునే పండగగా చాలామంది భావించేవారు. ఎన్నో అవమానాలు, అన్నీ అనుమానాలు.. అన్నింటినీ భరించాను. దృఢంగా సంకల్పించుకుంటే ఏ పని అయినా పూర్తవుతుందని నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఈ పండగలో పాల్గొనేలా చేసినందుకు ఆనందంగా, సంతృప్తిగా ఉంది. అంతేకాదు ప్రపంచదేశాలలో ఉన్న తెలుగువారూ మన సంస్కృతిని మరిచిపోకుండా ఉండేలా ఆయా దేశాలకు వెళ్లాను. వేడుకలు నిర్వహించాను. ఇన్నాళ్లూ కొనసాగించే శక్తిని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంటాను. మొదట ప్రారంభించినప్పుడు కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఈ వేడుకలో పాల్గొనేవారు. తర్వాత్తర్వాత యువతరం అంతా ఈ వేడుకను సొంతం చేసుకున్నారు. అందంగా సంప్రదాయబద్ధంగా అలంకరించుకొని, రంగు రంగుల బతుకమ్మలను తెచ్చి, చుట్టూ చేరి ఆడి పాడుతుండటం పెరిగింది. ఇంతమంది కలిసి ఆడుతూ పాడుతూ సంబురాలు చేస్తుంటే రెండు కళ్లు సరిపోవేమో అనిపిస్తుంది. ఎన్నేళ్లుగా మీరు బతుకమ్మ పూజలు చేస్తున్నారు? నవరాత్రుల సమయంలో ఈ శక్తికి కారణాలేంటి అని ఎప్పుడైనా యోచించారా? పెరిగింది హైదరాబాద్లోనే, అయినా పండగ వచ్చిందంటే చాలు నానమ్మ ఊరు వెళ్లేవాళ్లం. నా చిన్నప్పటి నుంచి బతుకమ్మల సందడి ఉంది. బతుకమ్మలను కొలవడం వల్ల ఒక దైవిక శక్తి మనలోకి చేరుతుంది అనే భావన ఉంది. బహుశా ఇది అందరితో కలిసి పాల్గొనే వేడుక వల్ల కలిగి ఉంటుంది. బతుకమ్మ నాకు ఒక క్రమశిక్షణను నేర్పింది. బతుకమ్మ తొమ్మిదిరోజులు పండ్లు తప్ప వేరే ఆహారం తీసుకోను. అయినా, ఈ తొమ్మిది రోజులు ఉత్సవాల్లో పాల్గొనడానికి కావల్సినంత శక్తి వస్తుంది. ఇది ఒక సంకల్పంగా నాకు నేనే చెప్పుకున్నాను. జీవితాంతం ఈ నియమాన్ని కొసాగిస్తాను. దేవీనవరాత్రులలో అమ్మవారిని ఎలాగైతే కొలుస్తామో, బతుకమ్మ రూపంలో శక్తిని పాటలతో పూజిస్తాం. రంగు రంగు పూలు. అవి కూడా అడవిల పూసే పూలను గుట్టగా పోసి వాటిని అమ్మగా భావిస్తాం. మన మధ్య జరిగే చిన్న చిన్న జగడాలు, ఆనందాలు, బాధలు, శ్రమను మర్చిపోవడానికి తీసే రాగాలు.. ఉయ్యాల పాటలు అయ్యాయి. గంగ గౌరి సంవాదం పాటనే తీసుకుంటే... ‘గంగ, గౌరి గవ్వలు ఆడంగ.. గవ్వలు ఆడంగ కయ్యమయ్యిండ్రి..’ అని ఉంటుంది. పార్వతీ దేవి శివయ్య పూజకు వేళయ్యింది నీళ్లు ఇవ్వమని గంగను బతిమాలుకుంటుంది. గంగేమో శివయ్యను ఇస్తే నీళ్లు ఇస్తానంటుంది గంగ. అలా తనలో సగమైన శివయ్యను ఇస్తే పార్వతికి నీళ్లు ఇచ్చింది గంగ. ఇలాగే అత్తాకోడళ్లు, తోడికోడళ్లు, అక్కచెల్లెళ్లు.. సామాజికంగా జరిగే సంఘటనలను దేవుళ్లకు ఆపాదించి పాటలుగా చెబుతుంటారు. దేవుళ్లు అంటే ఎక్కడో లేరు. మనలోనే ఉన్నారు. మన పాటల్లో ఉన్నారు. మన బతుకులో ఉన్నారు. మన శ్రమలో ఉన్నారు. తెలంగాణ అంటేనే శ్రమ జీవనం. శ్రమలోనుంచే పాట పుట్టింది. అదే బతుకమ్మ పాట అయ్యింది. మీరు ఇష్ట దైవంగా ఎవరిని కొలుస్తారు? దైవానికి సంబంధించి ఒక రూపం అంటూ ఏమీ లేదు. పిల్లలు పుట్టాక ఇలా నా ఆలోచన మారింది. దానికి ముందు అమ్మావాళ్లతో పాటు పూజల్లో పాల్గొనేదాన్ని. ఇప్పటికీ నోములు, వ్రతాలు చేస్తాను. కానీ, ఆధ్యాత్మికంగా దైవం అంటే ఏంటో తెలిసింది మా పెద్దబాబు పుట్టిన తర్వాత. వాడి పెంపకంలో చాలా భయపడిపోయేదాన్ని. పసివాడు కదా... మనం ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఏం జరుగుతుందో అనే భయం. పనిమీద బయటకు వెళ్లి వచ్చేలోపల వీడికేదైనా అయిపోతుందేమో అని భయం. అప్పడు అనుకున్నాను .. భగవంతుడా నువ్వే చూసుకోవాలి అని. భగవంతుడు ఉన్నాడు అని అప్పుడే అర్థమెంది. నా కొడుకు సురక్షితంగా ఉన్నాడంటే దేవుడి దయనే! ఒక్కడిని చూసుకోవడానికే నేనింత కష్టపడుతుంటే ఆయన ఇంతమందిని ఎలా చూసుకోవాలి? అనిపించింది. అప్పుడే ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది. మా ఇద్దరి పిల్లలచేత కూడా అలాగే ప్రార్థన చేయిస్తా. ఏదైనా సమస్య వస్తే కళ్లు మూసుకొని నీ దేవుడు ఎలా ఉండాలనుకుంటావో అలాగే ఊహించుకొని, ఏం కావాలని చెప్పమంటాను. మీ నాన్నగారు ప్రకృతిలో ఉన్న శక్తిని బాగా నమ్ముతారు. అది యాగమైనా, వాస్తు అయినా, మరైదేనా కావచ్చు. దీనిపై మీకేమనిపిస్తుంది. మనం ఎటువైపు వంట చేసుకోవాలి? ఏ వైపు పూజ చేయాలి? ఏ వైపు నిద్రించాలి.. ఈ విధి విధానాలనే వాస్తుగా భావిస్తున్నాం. దీని ప్రకారం ఇల్లు, కార్యాలయం వంటివి ఉంటే పాజిటివ్ ఎనర్జీ మనం ఉండే చోటుకి వచ్చేస్తుంది. అప్పుడు మరింత శక్తితో ఎక్కువ పని చేయగలం. యాగం అంటే హైందవ ధర్మంలో చెప్పిన అత్యున్నత కర్మ కాబట్టి చేశారు. ఇవన్నీ మన భూమిలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ సంగతి తెలుసుకోకుండా కొంతమంది విమర్శిస్తుంటారు. మీకు అమెరికాలో ప్రమాదం జరిగినప్పుడు మీ నాన్న ‘దేవుడే నా బిడ్డను చూస్తాడు’ అన్నారట. మీరు అలా అనుకున్న సందర్భాలు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కొందరు యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సమయంలో చాలా బాధపడేవాళ్లం. ఆ సమయంలో ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని. దేవుడా వీళ్లను కాపాడు అని వేడుకునేదాన్ని! ∙కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టుకోవాలా? విజయాలు కలిగినప్పుడు తలుచుకోవాలా? మన కష్టమేంటో చెప్పుకోవడం అవసరం. అంతటితో పూర్తవుతుంది. విజయం సాధించినప్పుడు దానిని నిలబెట్టుకోవాలంటే దైవశక్తి ఇంకా అవసరం. అందుకే అప్పుడా, ఇప్పుడా అని లెక్కలేమీ లేవు. ఎప్పుడూ తలుచుకోవాలి. ∙మీరు జయశంకర్ని గురువుగా భావిస్తారు. ఆయనేమో దేవుణ్ణి నమ్మేవారు కాదు. దీనిని ఎలా చూస్తారు? ఆయన పూజలు, క్రతువులు నమ్మరు. సంఘాన్ని ప్రేమించేవారిలో దైవత్వం ఉంటుంది. పక్కమనిషి ఆపదలో ఉంటే వెంటనే సహాయం చేయాలనే గుణం అలాంటి వాళ్లలోనే ఉంటుంది. జీవితంలో ఎవరిన్నీ హర్ట్ చేసి ఉండరు. అంతకుమించిన దైవత్వం ఇంకెక్కడ ఉంటుంది? ప్రజలకు అన్యాయం జరగవద్దని జీవితాంతం కష్టపడ్డారు. అంతకుమించిన దైవత్వం ఉండదు. ప్రభుత్వం యాదగిరి గుట్టను బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతోంది. ఈ ఆలయానికి మీరు తరచూ వెళ్లేవారా? ఇంకా ఏయే ఆలయాలను సందర్శించారు? వాటిలో మీకే ఆలయం బాగా నచ్చుతుంది? మా వారికి యాదగిరిగుట్ట నరసింహస్వామి అంటే గట్టి నమ్మకం. కొత్తగా ఏ వాహనం తీసుకున్నా గుట్టకు వెళ్లాల్సిందే! కుటుంబంతో కలిసి కూడా తరచూ వెళుతుంటాం. సెంటిమెంట్ కాదు కానీ, అదొక అలవాటుగా మారిపోయింది. ఈ మధ్య నా చిన్న కొడుకు పుట్టినరోజు అయితే పెద్దమ్మగుడికి వెళ్లాం. మొన్న అస్సామ్లోని కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లాం. చాలా శక్తివంతమైన ఆలయం. అద్భుతంగా ఉంటుంది. అంతకుముందు మానసాదేవి ఆలయానికి అమ్మావాళ్లతో కలిసి వెళ్లాను. ఈ గుడి ఉన్న ప్రాంతం... ఆ వాతావరణం సూపర్బ్గా ఉంటుంది. ఆలయాలకే కాకుండా మసీదు, చర్చిలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయా? నేను చదువుకున్నది స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్. ఆ విధంగా ఏసు పాటలు పాడుతుండేదాన్ని. చర్చికి వెళుతుండేదాన్ని. మా అత్తగారి ఇంట్లో మొదటి సంతానానికి దర్గాలో పుట్టెంట్రుకలు తీయాలనే మొక్కు ఉంది. ఆ విధంగా నా పెద్ద కొడుకు పుట్టు వెంట్రుకలు మా ఊరికి దగ్గరలోని పొటంగల్ దర్గాలోనే తీసాం. రాబోయే తరం దైవత్వాన్ని ఎలా అర్ధం చేసుకుంటుంది అని మీ భావన..? పూజాదికాల వంటి క్రియలు నలుగురితో కలిపి చేసుకోవాలనుకున్నా వ్యక్తిగతంగా దైవం అంటే ఏంటో తెలుసుకుంటారు. దైవశక్తిని అర్థం చేసుకునే విధానంలో మంచి మార్పులు వస్తాయనిపిస్తుంది. దేవీ నవరాత్రులలో ఒకరోజు అన్నపూర్ణ, ఒక రోజు శాకంబరి, ఇంకోరోజు సరస్వతి.. ఇలా అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కోఅవతారంగా పూజిస్తాం. ఇవన్నీ మనలో ఉండేవే. అన్నపూర్ణను ఎందుకు పూజిస్తాం... అన్నం సమృద్ధిగా లభించాలని, లక్ష్మీదేవిని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, సంతోషంగా చూడాలని..! వైదికంగా పూజించే అమ్మవారైనా, జానపదులు పూజించే బతుకమ్మయినా అభద్రతను భద్రతగా మార్చుకునే దిశగా పయనించేందుకు ఎంచుకుంటాం. ప్రాచీన ఆరాధన పద్ధతులను పరిశీలిస్తే మనకీ విషయం స్పష్టమౌతుంది. దైవం, శక్తి ఆరాధనల గురించి చెప్పుకోవాలంటే ఆఫ్రికన్ దేశాల ఆరాధన పద్ధతులే మొదట ఉన్నాయి. వాళ్లు శక్తిని మధ్యలో పెట్టి చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ కొలిచేవారట. అంతెందుకు... మానవుడు మొదటిసారి నిప్పుని తెలుసుకున్నప్పుడు మధ్యలో అగ్నిని రగిల్చి, చుట్టూ చేరి వారి వారి పద్ధతుల్లో పూజించేవారు. బతుకమ్మ కూడా అలాగే! పూలతో శక్తిని ఆరాధిస్తున్నాం. దేవుళ్లు ఎక్కడో లేరు. మనలోనే ఉన్నారు. మన పాటల్లో ఉన్నారు. మన బతుకులో ఉన్నారు. మన శ్రమలో ఉన్నారు. తెలంగాణ అంటేనే శ్రమ జీవనం. శ్రమలోనుంచే పాట పుట్టింది. అదే బతుకమ్మ పాట . ఆధ్యాత్మికంగా దైవం అంటే ఏంటో తెలిసింది మా పెద్దబాబు పుట్టిన తర్వాత. వాడి పెంపకంలో చాలా భయపడిపోయేదాన్ని. ఒక్కడిని చూసుకోవడానికే నేనింత కష్టపడుతుంటే ఆ దేవుడు ఇంతమందిని ఎలా చూసుకోవాలి? అనిపించింది. అప్పుడే దేవుడితో నాకు ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
పూల పండగ వచ్చిందోచ్..
-
చీరలను గుంజుకుని తగలబెడతారా?
-
25 లక్షల బతుకమ్మ చీరల పంపిణీ
- తొలిరోజు 8 వేల కేంద్రాల్లో.. - పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు - చీరల నాణ్యతపై పలు జిల్లాల్లో నిరసన - నాసిరకం చీరలు పంపిణీ చేయలేదన్న - చేనేత శాఖ ఎండీ శైలజా రామయ్యర్ సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని మహిళలకు చీరలు ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తొలిరోజు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల చీరలను పంపిణీ చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ 1.04 కోట్ల బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలిరోజు 25 శాతం మేర పూర్తి చేశారు. మొత్తం 8 వేల కేంద్రాల్లో చీరలు పంపిణీ చేశారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు. మంత్రి హరీశ్రావు సిద్దిపేట, హుస్నాబాద్లో పాల్గొనగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, గంభీరావుపేటలో కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పలువురు మంత్రులు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొన్నారు. మరోవైపు నాసిరకం చీరలు ఇస్తున్నారంటూ కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. జగిత్యాల, సిరిసిల్ల, నల్లగొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలో కొన్నిచోట్ల మహిళలు చీరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల చీరలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. అయితే బతుకమ్మ చీరల పంపిణీ పకడ్బందీగా చేస్తున్నామని, ఎక్కడా నాసిరకం చీరలు పంపిణీ చేయడం లేదని చేనేత శాఖ ఎండీ శైలజా రామయ్యర్ తెలిపారు. ఇదే విషయమై మంత్రి కేటీఆర్ కూడా సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, బట్ట కాల్చి మీద వేసే స్థాయికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దిగజారాయని ఆరోపించారు. -
మరో నాలుగైదు రోజులు చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మరో నాలుగైదు రోజులు పొడిగిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ ఎండీ శైలజా రామయ్యర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రకటించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గడువు పెంచాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. చీరల పంపిణీ తొలి రోజైన సోమవారం సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్లకార్డులున్న కుటుంబాల్లోని 1.04 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం తొలిరోజు సాఫీగా జరిగిందని చెప్పారు. సిరిసిల్ల చేనేత, మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించటంతోపాటు పేద మహిళలకు పండుగ కానుక అందించే సదుద్దేశంతో చేపట్టిన ఈ పథకం బృహత్తరమైందన్నారు. అక్కడక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా అవేవీ పరిగణనలోకి తీసుకునే అంశాలు కావన్నారు. ఇప్పటికే 80 శాతం చీరలు అన్ని ప్రాంతాలకు పంపిణీ కాగా.. మిగతా ఇరవై శాతం రెండ్రోజుల్లో రవాణా అవుతాయని చెప్పారు. చీరల నాణ్యత విషయంలో వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ‘‘ప్రతీ లాట్ను పక్కాగా పరిశీలించిన తర్వాతే పంపిణీకి సిద్ధం చేశాం. ఎక్కడన్నా చీరల్లో లోటుపాట్లు, డ్యామేజీ ఉంటే వెనక్కి ఇచ్చి మరొకటి తీసుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్రానికి అవసరమైన చీరలన్నీ సిరిసిల్లలోనే తయారు చేయాలంటే మూడేళ్లు పడుతుంది. కేవలం 3 నెలల ముందు రూపకల్పన చేసిన పథకం కావటంతో.. అందుబాటులో ఉన్న సమయం, వనరుల దృష్ట్యా సిరిసిల్ల మరమగ్గాలపై తయారు చేయించిన 58 లక్షల పాలిస్టర్ చీరలతో పాటు అదనంగా బయటి కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఓపెన్ టెండర్ పిలిచి సూరత్ కంపెనీలకు ఈ ఆర్డర్ ఇచ్చాం’’ అని వివరించారు. సిరిసిల్లలో ఫిలమెంట్ పాలిస్టర్ రకం వస్త్రంతో చీరలు తయారు కాగా.. సూరత్లో ట్విస్టెడ్ పాలిస్టర్ రకం అందుబాటులో ఉందని, దీంతో చీరల్లో తేడా కనిపిస్తోందని పేర్కొన్నారు. సిరిసిల్ల చీరలకు ఒక్కో దానికి రూ.224, కంపెనీల నుంచి కొన్నవాటికి రూ.200 వెచ్చించినట్లు తెలిపారు. ఒకట్రెండు చోట్ల తప్ప రాష్ట్రమంతటా చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని, అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తమకు నివేదికలు అందినట్లు జయేశ్ రంజన్ చెప్పారు. -
బట్టకాల్చి మీదేస్తారా?
- మహిళల చేతిలోంచి చీరలను గుంజుకుని తగలబెడతారా? - ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపాటు - వారం కిందే దుష్ప్రచారానికి కుట్రపన్నారు - ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరమేముంది? - ఒక్క జగిత్యాలలోనే మూడు సంఘటనలు జరగడమేంటి? - ప్రభుత్వం చేసే మంచి పనులతో ప్రతిపక్షాల గుండెలు అదురుతున్నాయి - ఆగమాగమై కుసంస్కారంతో ప్రవర్తిస్తున్నారు - కుంభకోణం ఆరోపణలపై ఆధారాలు చూపితే ఏ విచారణకైనా సిద్ధం సాక్షి, హైదరాబాద్ : ‘‘జగిత్యాలలోని ఓ ఊరిలో మహిళలు వెళ్తుంటే చీరలు గుంజుకుని తగలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు దగ్గరుండి ఈ చీరలు కాల్చారు. బట్ట కాల్చి ప్రభుత్వంపై వేయడమంటే అక్షరాల ఇదే. లేని అపవాదును మీద వేయడానికి ఇలా కుసంస్కారమైన పనులతో తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించారు..’’అని చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరమేముంది.. ఒక్క జగిత్యాలలోనే మూడు సంఘటనలు జరగడమేంటి అని ప్రశ్నించారు. ఏ మహిళల నుంచి చీరలు లాక్కున్నారో ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కాంగ్రెస్ సర్పంచ్, ఎంపీటీసీ భర్తలపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇంత నీచమైన, హీనమైన రాజకీయం చేస్తారా అంటూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. తప్పులు, లోటుపాట్లు ఉంటే తప్పకుండా సమీక్షించుకుంటామని, 25 లక్షల చీరలు ఒక్కరోజే పంపిణీ చేస్తే అందులో 250 చీరలు బాగా లేకున్నా మొత్తం చీరల్లో అవి కేవలం 0.0001 శాతమేనని అభిప్రాయపడ్డారు. దీనికే కాంగ్రెస్, టీడీపీ గొంతులు చించుకుంటున్నాయని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు లాభం చేకూర్చేలా రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల ఖర్చుతో పెట్టుబడి ఇవ్వబోతున్నాం. 34 లక్షల మంది గొర్ల, కుర్మ సోదరులకు 1.40 కోట్ల గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. 2 లక్షల బర్రెలకు సబ్సిడీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇవన్నీ చూసి విపక్షాల గుండెలు అదిరిపోయి, ఆగమాగమై పోయి కుసంస్కారంతో ప్రవర్తిస్తున్నారు. గోరంతలను కొండంతలు చేసే విపక్షాల కార్యక్రమంలో పాల్గొనవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. 8 వేలకుపైగా కేంద్రాల్లో చీరలు పంపిణీ చేస్తే ఐదారు కేంద్రాల్లో జరిగిన గొడవలను భూతద్దంలో చూపి ఆగమాగమై పోవడం ఎంత వరకు మంచిది’’ అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పంపిణీపై సోమవారం సాయంత్రం ఆయన సచి వాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వం ఏ పని చేసినా, చేయదలుచుకున్నా ఏదో ఒక విధంగా బద్నాం చేసేందుకు దిగజారుడు, చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. ఇంత నీచనికృష్ట రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాం. బతుకమ్మ అనేది ఓ సెంటిమెంట్. ప్రపంచంలో ఎక్కడా ఇంత అద్భుతమైన, అపురూపమైన పండుగ ఉండదు. బతుకమ్మ సందర్భంగా పేర్చిన పూలను సైతం చెరువులో భద్రంగా వేస్తారు. బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వమిచ్చిన చీరలు బాగా లేవని కాల్చడమేంటి? ఇంతకు మించిన దిగజారుడు రాజకీయం చూడలేదు’’అని అన్నారు. సోమవారం ఉదయం నుంచే కృత్రిమమైన నిరసనలకు శ్రీకారం చుట్టారని, ఉదయం 10 గంటలకే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైందని పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు ఇంకా స్టాక్పాయింట్లో ఉండగానే అవి నాసిరకంగా ఉన్నాయని ఓ పత్రికలో వార్త వచ్చిందని, వారం నుంచే ప్రణాళికాబద్ధంగా ఈ దుష్ప్రచారానికి ప్లాన్ వేశారన్నారు. మొదటిరోజు మొత్తం 25 లక్షలకు పైచిలుకు చీరలను పంపిణీ చేశామన్నారు. 1.04 కోట్ల చీరల పంపిణీకి లక్ష్యం పెట్టుకున్నా.. మరో 2 లక్షల చీరలను అదనంగా ఉంచుకొని మొత్తం 1.06 కోట్ల చీరల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్, గంభీరావుపేట మండల కేంద్రాల్లో 4 వేల మహిళలు, చిప్పలపల్లి గ్రామంలో ఐదారు వందల మంది మహిళలకు తానే చీరలు అందజేసి మాట్లాడానని, వారంతా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇరవై ఐదు లక్షల చీరలు పంపిణీ చేస్తే.. నాలుగైదు చోట్లే సంఘటనలు జరిగాయని కేటీఆర్ తెలిపారు. ‘‘అందులో కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో మూడు చోట్ల, సత్తుపల్లిలో ఒకచోట నిరసనలు జరగడం వెనుక అర్థమేంటి? ప్రజల కోసం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అభినందించాల్సిన సంస్కారం, సోయి ప్రతిపక్షాలకు లేదు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులకు కోటి మందికి చీరలు పంపిణీ చేయాలన్న ఆలోచన ఎప్పుడైనా పొరపాటుగానైనా వచ్చిందా? కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి చీరలు ఇచ్చారు. నచ్చకపోయినా మహిళలు చీరలు తగలబెట్టరు. ఇంటికి తీసుకెళ్లి పక్కన పెడ్తారు. లేకుంటే పని మనిషికి ఇస్తారు. ఇంకోటి చేస్తారు తప్ప తగలబెట్టే కుసంస్కారం వారికి ఉండదు.’’అని అన్నారు. చేనేత, మర నేత, సిరిసిల్ల–పోచంపల్లి చీరల మధ్య తేడా తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే సన్నాసులు ముందు విషయం తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల కార్మికుల జీతం రూ.7 వేల నుంచి రూ.20 వేల దాకా పెరిగిందని, ఇది చూసి విపక్షాల కన్ను కుడుతోందన్నారు. చేనేత కార్మికులకు రూ.1,200 కోట్ల బడ్జెట్ ఏ ప్రభుత్వం పెట్టలేదన్నారు. ఏ విచారణకైనా సిద్ధం సూరత్ చీరలు నాసిరకమైతే సిరిసిల్ల చీరలు మంచివని చెప్పవచ్చు కదా అని కేటీఆర్ విలేకరులను ప్రశ్నించారు. సమయం సరిపోకపోవడం వల్లే సూరత్ నుంచి చీరలు కొన్నామన్నారు. ‘‘ఎంతసేపు నల్ల మచ్చలు చూడటమెందుకు.. తెల్లవి కూడా చూడాలి. చీరలు గుంజుకొని కాల్చితేనే జగిత్యాలలో కేసులయ్యాయి. కాల్చినా తప్పులేదు.. గుంజుకున్నా తప్పులేదు.. గుంజినా తప్పు లేదు.. ఇలా ఏం చేసినా కేసులు పెట్టొద్దంటారా?’’ అని అన్నారు. సూరత్ చీరల కొనుగోలులో కుంభకోణం జరిగిందని టీడీపీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ఆధారాలుంటే ఏ విచారణకైనా సిద్ధమన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని మహిళలపై కేసులు పెట్టినట్టు తన వద్ద సమాచారం లేదన్నారు. -
బతుకమ్మ చీరలపై మహిళల అసంతృప్తి
-
నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
-
ప్రకృతి పండుగ పరమార్థం
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రకృతి అంతా పూలవనంగా మారిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తాయి. తెలంగాణలో పండుగల్లో పాట నేర్పింది బతుకమ్మనే. పువ్వులతో బతుకమ్మను పేర్చి పువ్వులనడుమ పుప్పొడిని, పసుపుముద్దను అలంకరిస్తారు. ఈ పండుగ జరుగుతున్నన్ని రోజులూ పల్లెలు, పట్టణాలు పూలవనాలయిపోతాయి. ఆరాధనలో పూలకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తెలంగాణలోనైతే, ఆ పూలనే పూజించడం ఒక విలక్షణ సంస్కృతిగా కనిపిస్తోంది. ప్రకృతిలో భాగమైన పూలు స్త్రీల ముత్తయిదు తనానికి ప్రతీక కావడం గొప్ప విశేషం. స్త్రీల ప్రాతినిధ్యమే ప్రధానమైనప్పటికీ సమాజంలో సమిష్టితత్వానికి దోహదపడే పండుగ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వమానవాళికి భిన్నత్వంలోని అందాన్ని అందించి ఐక్యంగా ఉండాలనే అవసరాన్ని చాటి చెప్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే సమాజానికి మేలు కూర్చే విషయాలెన్నో బతుకమ్మ కూర్పులో, ఆటలో, పాటలో ఆత్మీయత పంచుకోవడంలో కనబడతాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకునే వేడుకగా ప్రసిద్ధి పొందింది. మొదటి రోజు భాద్రపద బహుళ అమావాస్యనాడు పారంభమవుతుంది. ఈ అమావాస్యను పితృ అమావాస్య అంటారు. ఆనాడు చేసే బతుకమ్మ పేర్పును ఎంగిలిపువ్వుల బతుకమ్మగా పిలుస్తారు. ఆనాడు గౌరమ్మకు సాధారణంగా తెలంగాణ ప్రజలు తినే ఆహారాన్ని, పిండివంటలను నైవేద్యంగా సమర్పించుకొంటారు. తొలిపూజ బతుకమ్మకు కాబట్టి పల్లె ప్రజలు ఎంగిలిపూల బతుకమ్మని అంటారు, స్త్రీలు భుజించిన తర్వాత చేసుకొంటారు కాబట్టి ఎంగిలి బతుకమ్మనే పేరొచ్చింది. బతుకమ్మను పూజించిన తర్వాత పుణ్య స్త్రీలు తమ మాంగల్యాలకు తాకించుకుంటారు. ఆ పూజనే మంగళగౌరి అని మాంగల్య గౌరి అని భావిస్తారు. బతుకమ్మ కథనాలు ఎట్లా ఉన్నా ముత్తయిదుతనమనేదే అంతర్లీనంగా కనిపిస్తోంది. సాంప్రదాయంగా పçసుపు గౌరమ్మను చేస్తుంటారు. తంగేడు పూలు పసుపుతనానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ గౌరమ్మను చేయడంలో గొప్ప ఆచారం కనబడుతుంది. అర్ధనారీశ్వరునికి సంకేతంగా బతుకమ్మను నిలుపుకొంటారు. శివపార్వతులు ప్రకృతి– పురుషులు. నిజంగా గౌరమ్మ అనగానే పూలతో ఒక గోపురంలా పేర్చడం ఒకటే కాదు, ఆ గోపురం నడుమ ఒక నొక్కు (గుమ్మడి) ని పెట్టి ఒక పసుపు ముద్దను రెండు గోపురాలుగా రూపొందేటట్లు పూలను పేరుస్తారు. అంటే గౌరమ్మే అర్ధనారీశ్వర స్వరూపం అన్నమాట. ఇందులో ప్రత్యేకంగా గౌరీ ఆరాధన కనిపిస్తుంది. కొందరు గౌరమ్మను తమలపాకుల్లో పెడతారు, మరికొందరు చిక్కుడు ఆకుల్లో పెట్టి పూజ చేస్తుంటారు. ‘చిక్కుడు ఆకుల్లో ఉయ్యాలా... సద్దులు కట్టి ఉయ్యాలో... అని పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. అందుకే స్త్రీల మనోభావాలను అనుసరించే బతుకమ్మను పేర్చడం జరుగుతోంది. అందులో స్త్రీల కళాతృష్ణ ఎంత గొప్పదో విదితమవుతుంది.ఎన్ని పూలతో బతుకమ్మను పేర్చినా ప్రతి వరుసకు తంగేటిపూలు ఉండడాన్ని విస్మరించరు. తంగేడు ముతై ్తదుతనం ఇవ్వడమేగాదు, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుందని నమ్మకం. అందుకే, ‘శ్రీలక్ష్మి నీమహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ’ అని జానపదం పాడుకుంటారు. సద్దుల బతుకమ్మనాడు ఆడపడుచులకు వొడిబియ్యం పోసి సాగనంపినట్లు బతుకమ్మను సాగనంపుతారు. బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుంది. అలాగే గుమ్మడి పూలు, గునుగుపూలలో జలచరాల్లోని అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలున్నాయి. పుప్పొడి, పసుపులో గాలిలోని కాలుష్యాన్ని కడిగేసే గుణాలున్నాయి. అన్నింటికీ మించి కులమతాల కతీతంగా, పేద, గొప్ప భేదం లేకుండా బతుకమ్మ ఆటల్లో పాల్గొనడంలో సామాజిక ప్రయోజనముంది. బృహత్ శివలింగానికీ బతుకమ్మకూ సంబంధం? తెలంగాణ సంస్కృతిలో ప్రధాన భాగమైన బతుకమ్మ పండుగను పరిశీలిస్తే, ఆ సంస్కృతి విశిష్టత, చారిత్రకత విశదమౌతుంది. విశ్వవిఖ్యాతి చెందిన తంజావూరులోని రాజరాజేశ్వర ఆలయంలోని మహా శివలింగం వేములవాడకు చెందిందనడానికి ఆధారాలున్నాయి. ఈ దేవాలయాన్ని నిర్మించిన చోళరాజైన రాజరాజు, కరీంనగర్లోని వేములవాడ నుంచి బృహత్ శివలింగాన్ని అంటే మహా శివలింగాన్ని తంజావూరు తరలించి, బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠింపజేశాడు. తెలంగాణ ప్రజలు దీనికి బాధపడినా, పార్వతీ అమ్మవారిని ఊరడించే ప్రయత్నంలో పూలతో మేరుపర్వతంలా పేర్చి, దానిపై పసుపుతో గౌరీదేవిని రూపొందించి, దసరా సందర్భంలో ఆటపాటలతో తిరిగి రమ్మని ప్రార్థిస్తున్నారని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం. – డాక్టర్ అక్కెనపల్లి వెంకట్రాంరెడ్డి, (సెప్టెంబర్ 20, బుధవారం నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు మొదలు కానున్నాయి) -
బతుకమ్మ చీరలు సిద్ధం
-
బతుకమ్మ చీరలు సిద్ధం
రెండు నెలల్లో 3.75 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి సిరిసిల్ల: తెలంగాణ ఆడపడుచుల కోసం బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. బతు కమ్మ కానుకగా చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం పనిలో పనిగా రాజన్న సిరిసిల్ల జిల్లా నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ చీరల ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 15న బతుకమ్మ చీరల ఆర్డర్లను రాష్ట్ర జౌళిశాఖ అధికారులు ఇవ్వగా.. నూలు కొనుగోలు చేసి జూన్ 30న వస్త్రోత్పత్తిని ప్రారం భించారు. 52 మ్యాక్స్ సంఘాలు, మరో 312 చిన్న తరహా కుటీర పరిశ్రమలు, 10,200 మంది కార్మికులు, 1,852 మంది ఆసాములు రేయింబవళ్లు శ్రమించి 3.75 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు. ఇంకా మర మగ్గాలపై బతుకమ్మ చీరల వస్త్రం ఉంది. కానీ అధికారులు మంగళవారం వర కు బతుకమ్మ చీరల వస్త్రాన్ని సేకరించారు. దీంతో సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్ల నేతన్నల కు నేరుగా రూ.30 కోట్ల మేరకు ఉపాధి కూలీ రూపంలో లభించింది. ఒక్కో కార్మికుడికి నెలకు రూ.16,000 మేరకు లభించాయి. సాంచాల మీద ఉన్న బట్టను ఇచ్చేందుకు మరోవారం రోజుల గడువు ఇవ్వాలని సిరిసిల్ల నేతన్నలు కోరుతున్నారు. కానీ, అధికారులు వస్త్రం కొనుగోళ్లను ఆపివేశారు. -
బతుకమ్మ పండుగకు కేసీఆర్ కానుక
-
‘గ్రాండ్గా 2017 బతుకమ్మ- దసరా సంబరాలు’
డాలస్: డాలస్ తెలంగాణ ప్రజా సమితి(టీపీఏడీ), 2017 బతుకమ్మ-దసరా సంబరాలను సెప్టెంబరు 30వ తేదీన చేయనున్నట్లు తెలిపింది. ప్రతి సంవత్సరం డాలస్ తెలంగాణ ప్రజా సమితి బతుకమ్మ, దసరా సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి డాలస్ ఫోర్ట్ వర్త్(డిఎఫ్డబ్ల్యూ) కమ్యూనిటీ నాయకులు, వ్యాపారస్తులు, వివిధ ఆర్గనైజేషన్స్కు చెందిన ప్రతినిధులు హాజరవనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని టీపీఏడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పది వేల మంది హజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రోగ్రామ్కు వచ్చిన అతిధులకు, కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సెక్యూరిటీ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. టాండెడ్ డలాస్ ఫోర్ట్ వర్త్ తెలుగు సంఘం, సంస్థలు, సభ్యులు మరియు శ్రేయోభిలాషులు దాదాపుగా 300 మంది విందుకు హజరవుతారని తెలిపారు. కార్యక్రమం గాయకుల బృందం ప్రేయర్ సాంగ్తో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆటపాటలతో వచ్చిన అతిథులను, కుటుంబాలను ఎంటర్టైన్ చేస్తారని చెప్పారు. కమ్యూనిటీ నాయకుడు, మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ కొసపాటి, టాన్టెక్స్ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, డాక్టర్ నరసింహ రెడ్డి ఉరిమిండి, శ్రీకాంత్ పొలవరపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. టీపీఏడీ అధ్యక్షుడు కరణ్ రెడ్డి సమావేశానికి హజరైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ టీపీఏడీ, సెక్రటరీ రమణ లష్కర్, జాయింట్ సెక్రటరీ చంద్ర పోలీసు, ట్రెజరర్ లింగా రెడ్డి అల్వ, శ్రీని గంగాధార, సత్య పేర్ కరి, శరత్ ఎర్రం, రూప కన్నయ్యగారి, రోజా అదెపు, టీపీఏడీ కో- ఆర్డినేటర్ సతీష్ జన్ముపల్లి, మాధవి సుంకి రెడ్డి, బతుకమ్మ కమిటీలను, వివిధ కమిటీల చైర్మన్లను పరిచయం చేస్తారని చెప్పారు. చైర్మన్ అశోక్ కొండల మాట్లాడుతూ.. ధర్మకర్తలైనా వైస్-చైర్మన్ మనోహర్ కసగాని, కో-ఆర్డినేటర్ మాధవి సుంకిరెడ్డి, రామ్ ఆన్నాడి, పవన్ గంగాధార, ఇందు పంచర్పుల, ప్రవీణ్ బిల్లా, రాజేందర్ తొడిగలను పరిచయం చేస్తారు. తెలుగు ఫౌండేషన్ కమిటీ సభ్యులైన మహేంద్ర కమిరెడ్డి(వైస్ చైర్మెన్), అజయ్ రెడ్డి, రఘుబీర్ బండారు, రావ్ కాల్వలా, జానకి మందడి, రాజ్ గొందీలను ఫౌండేషన్ కమిటీ చైర్మన్ ఉపేంద్ర పరిచయం చేశారు. తెలంగాణ ప్రజా సమితి, డాలస్ సలహాదారులైనా వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగమ్, సంతోష్ కొరె, నరేశ్ సుంకిరెడ్డి, జయ తెలకపల్లి, మాధవి లోకిరెడ్డి, సతీశ్ నగిలా, గంగా దేవర, అరవింద్ రెడ్డి ముప్పిడిలను రామ్ కల్వాల పరిచయం చేస్తారు. టీపీఏడీ 2017 బతుకమ్మ- దసరా సంబరాల బ్రౌచర్స్ ను టీపీఏడీ బోర్డ్ సభ్యులు, శారద సింగిరెడ్డి, ఆత్మచరణ్ రెడ్డిలు కలిసి ఆవిష్కరించారు. సహకార సంఘం అఖిల్ చీదిరాల సభ్యులైనా సునీల్ కుమార్ ఆకుల, లక్ష్మి పొరెడ్డి, కల్యాణి తడిమెటి, మధుమతి వైషారాజు, కారుణ్య దామర్ల, క్రాంతి తేజ పండ, పల్లవి తోటకూర, రత్న ఉప్పల, రోహిత్ నరిమెటి, శంకర్ పరిమాల్, మాధవి ఓంకార్, అనూష వనం, దీప్తి సూర్యదేవర, అపర్ణ సింగిరెడ్డి, కమేశ్వరి దివకర్ల, కవిత బ్రహ్మదేవరలను మనోహర్ కసగని పరిచయం చేస్తారు. అజయ్ రెడ్డి రఘుబీర్ భంగారు, మనోహర్ కసగని, ఉపేంద్ర తెలుగు అశోక్ కొండల, రామ్ అన్నాడి తరఫున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు ముందుకొచ్చారు. 2,45 లక్షల అమెరికన్ డాలర్లు ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఆట, నోటా, టాటా, తానా, నాట్స్, ఆట(తెలంగాణ), స్ధానిక సంస్థలు టాన్టెక్స్, ఐఎఎన్టి, టీఈఏ, మనబడి వంటి సంస్ధలు బతుకమ్మ-దసరా సంబరాలు 2017కు తమ మద్దతు ప్రకటించాయి. బతుకమ్మ సంబరాలకు మద్దతు తెలిపిన సంస్థలకు టీపీఏడీ పౌండేషన్, బీఓటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ 2017 సంబరాలు ఎప్పటికి గుర్తిండిపోయేలా నిర్వహిస్తామని పేర్కొన్నాయి. బతుకమ్మ-దసరా సంబరాలు సెప్టెంబర్ 30వ తేది(శనివారం) టెక్సాస్లోని డా.పెప్పర్ అరేనా ఫ్రిస్కోలో జరగనున్నాయి. -
సాయమడిగితే ఎంపీ కవిత తక్షణమే స్పందన
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేసుకునే పండగ బతుకమ్మ. అయితే ఆ పండుగ కోసం పండుగ కోసం పూలు కోసి తెచ్చేందుకు వెళ్లిన ప్రయత్నంలో తనకు కరెంట్ షాక్ తగిలిందని.. ఈ ప్రమాదంలో తాను రెండు కాళ్లు కోల్పోయానని.. తనకు సాయం చేయాలని మంచిర్యాల, నస్పూర్ కు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఎస్ శేఖర్ ట్విట్టర్ ద్వారా టీఆర్ఎస్ ఎంపీ కవితను కోరారు. ఈ ఘటన 2014 జనవరి 10వ తేదీన జరిగిందని.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసిన ఎలాంటి సాయం అందలేదని బాధితుడు శేఖర్ ట్విట్లో పేర్కొన్నాడు. బాధితుడు శేఖర్ ట్వీట్ పై ఎంపీ కవిత వెంటనే స్పందించారు. మీకు తప్పకుండా సహాయం చేస్తామని ఆమె రీట్వీట్ చేశారు. శేఖర్ పూర్తి వివరాలను సంతోష్.జాగృతి@జీమెయిల్.కామ్ కు పంపించాలని ఆమె ట్వీట్ లో సూచించారు. గత కొన్ని రోజుల నుంచి తనకు సాయం చేయాలని శేఖర్ ట్వీట్లు చేస్తుండగా ఎట్టకేలకు అతడికి సాయం అందనుంది. రెండు కాళ్లు కోల్పోయినప్పుడు ట్రీట్ మెంట్ కోసం దాదాపు రూ.18 లక్షలు ఖర్చుపెట్టామని.. ఆర్థికంగా ఆదుకోవాలని ఇటీవల వరుస ట్వీట్లు చేశాడు. ఈసీఈ విభాగంలో బీ.టెక్ పూర్తిచేసిన తనకు వికలాంగుల కోటాలో తన చదువుకు తగ్గ జాబ్ ఇప్పించాలని ఇటీవల టీఆర్ఎస్ నేతలకు మొర పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఎంపీ కవిత బాధితుడు శేఖర్ ట్వీట్లపై స్పందించి.. తప్పకుండా సాయం చేస్తామని, వివరాలు తెలపాలని చెప్పారు. Tappakunda .. pls send me your details on santosh.jagruthi@gmail.com https://t.co/Oz9RzIeeP4 — Kavitha Kalvakuntla (@RaoKavitha) 4 April 2017 @RaoKavitha madam 10.1.14 roju bathukamma flwrs ki velli curent shock valla 2legs poyayi CM fond apply chesam raledu madam plz ippinchandi pic.twitter.com/hfvYh9W3qs — s shekhar (@shekhar436) 4 April 2017 -
రిపబ్లిక్ డే పరేడ్లో ‘బతుకమ్మ’కు నో!
తెలంగాణ శకటాన్ని తిరస్కరించిన కేంద్ర రక్షణ శాఖ సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే పరేడ్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘బతుకమ్మ’ శకటాన్ని కేంద్ర రక్షణ శాఖ తిరస్కరించినట్లు సమాచారం. గత రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ శకటానికి అవకాశం లభించని విషయం తెలిసిందే. ఈ సారి కేంద్ర రక్షణ శాఖ ‘బతుకమ్మ’ శకటాన్ని ప్రాథమికంగా ఆమోదించినా.. తుది ఎంపికలో మాత్రం తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ శకటానికి పరేడ్ అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. కాగా.. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ‘బొర్రా గుహల’ నేపథ్యంలోని శకటాన్ని కేంద్ర రక్షణ శాఖ ఇంతకు ముందే ప్రాథమిక దశలోనే తిరస్కరించింది. -
విదేశీ పోస్టల్ స్టాంపులపై బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాల్లో తెలంగాణకు మరో అరుదైన గౌరవం లభించింది. రాష్ట్ర బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే బతుకమ్మ, తెలంగాణ ప్రాశస్త్యన్ని దశ దిశలా చాటుతున్న ఎంపీ కవిత ఒకే పోస్టల్ స్టాంప్పై కనిపించనున్నారు. న్యూజి లాండ్లో డాలర్ విలువ చేసే పోస్టల్ స్టాంప్తో పాటు లండన్లో ఫస్ట్ క్లాస్ స్టాంపును ఆయా దేశాలు విడుదల చేశాయి. ఈ రెండు దేశాల్లోని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ బాధ్యులు ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి కవిత పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఆస్ట్రేలి యా టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు నాగేందర్రెడ్డి కాసర్ల, కార్యదర్శి అభినయ్ కనపర్తి, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్సాగర్, నగేశ్రెడ్డి, జమాల్, రోహిత్ రావు సోమవారం తెలంగాణ భవన్లో కవితను కలసి న్యూజిలాండ్, లండన్ పోస్టల్ స్టాంపులను అందజేశారు. వీటిపై తెలుగు లిపిలో బతుకమ్మ శుభాకాంక్షలు అని ఉండటంతోపాటు బతుకమ్మను ఎత్తుకున్న కవిత ఫొటో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. -
అత్యంత అట్టహాసంగా బతుకమ్మ ఉత్సవాలు
డల్లాస్: అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా 2016 బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. దాదాపు పది వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. వీరిలో దాదాపు 1500 మంది మహిళలు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా తెలుగు సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన ఈ సంబురాల్లోని చివరి రోజు వేడుకను ఫ్రిస్కోలోని డా. పెప్పర్ ఎరినాలో నిర్వహించారు. ఈ వేడుకలకు తెలుగు ఎన్ఆర్ఐల నుంచి మంచి స్పందన వచ్చింది. ఏటీఏ, టీఏటీఏ, ఎన్ఏటీఏ, టీఏఎన్ఏ, ఎన్ఏటీఎస్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, టీఏఎన్టీఈఎక్స్, ఐఏఎన్టీ, టీఈఏ, మనబడి లాంటి సంఘాలు ఈ వేడుకలకు పూర్తి మద్దతు తెలిపాయి. వేడుకలకు హాజరయ్యే భారీ సమూహానికి సౌకర్యంగా ఉండటం కోసం వేదిక వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 1500 మంది మహిళలు బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు చేయడం విశేషం. సంబరాలను వీక్షించడానికి భారీ తెరలను ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం నుంచి బతుకమ్మ, జమ్మిపూజ, మ్యూజిక్ బొనాంజా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికా మొత్తంలో ఇక్కడే అతిపెద్ద బతుకమ్మ ఉత్సవం జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సినీనటులు, రాజకీయ ప్రముఖులు పలువురు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుల్లితెర యాంకర్, నటీ శ్రీముఖి, అందాల తార రాశీఖన్నా, రెజీనా, ఈషా రెబ్బా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, సినీనటి ఆర్కే రోజా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, గాయనీగాయకులు గీతా మాధురీ, సతీష్, నరేంద్ర తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, కో-కన్వీనర్ సుమన్ బాసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్, ట్రెజరర్ చంద్రా పోలీస్, జాయింట్ ట్రెజరర్ లింగారెడ్డి అల్వ, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పెర్కరి, రవికాంత్ మామిడి, సురేందర్ చింతల, రోజా ఆడెపు, రూపా కన్నయ్యగరి, శరత్ యెర్రం, సతీష్ జనుం పల్లి, బీఓటీ టీం అధ్యక్షులు రామ్ అన్నాడీ(ఛైర్), పవన్ గంగాధర(కోఆర్డినేటర్), గంగదేవర(కో ఛైర్), అశోక్ కొండాల, ప్రవీణ్ బిల్ల, మనోహర్ కాసాగ్ని, రాజేందర్ తొడిగల, మాధవి సుంకిరెడ్డి, టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు, రావు కల్వల, జానకి మందాడి, ఉపెందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, రాజ్ గోంది, అడ్వైజరీ టీంసభ్యులు వేణు భాగ్యనగర్, విక్రమ్ జనగాం, నరేష్ సుంకిరెడ్డి, జయ తెలకలపల్లి, సంతోష్ కోరె, రవిశంకర్ పటేల్, ఇంద్రాణి పంచార్పుల, అరవింద్ ముప్పిడి, కొలాబ్రెషన్ కమిటీ సభ్యులు అఖిల్ చిదిరాల, సునీల్ కుమార్, ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కళ్యాణి తడిమేటి, మధుమతి వ్యాసరాజు, కారుణ్య దామెర్ల, క్రాంతి తేజ పండ, పల్లవి తోటకూర, రత్న ఉప్పాల, రోహిత్ నరిమేటి, శంకర్ పరిమళ్, అనూష వనం, మాధవి లోకి రెడ్డి, దీప్తి సూర్యదేవర, మాధవి ఓంకార్, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవిత బ్రహ్మదేవర, సతీష్ నాగెల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహణ బాధ్యతలను చూసుకున్నారు. -
అమెరికాలో బతుకమ్మ సంబురాలు
-
మాటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
హాప్కిన్స్: బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాలను మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్(మాటా) హప్కిన్స్ లో ఈ నెల 8న ఘనంగా నిర్వహించింది. ఈ మేరకు మాటా ఓ ప్రకటన విడుదల చేసింది. హాప్కిన్స్ నగరంలోని హాప్కిన్స్ హైస్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకలకు 800మందికి పైగా హాజరయైనట్లు తెలిపింది. శనివారం మధ్యాహ్నం గణపతి పూజతో ప్రారంభమైన వేడుకలు సాంస్కృతిక కార్యకమాలతో ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. 160 మంది అతిథులు భారతదేశం నుంచి ఈ వేడుకలకు హాజరైనట్లు వివరించారు. బతుకమ్మ కోలాటం, 23 గ్రూపులు ఇచ్చిన డ్యాన్స్ ప్రదర్శనలు వేడుకలకు హైలెట్ గా నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బతుకమ్మ కమిటీ, వాలంటీర్లు కవిత కపిడి, అశ్మిని గునుగంటి, మాలతి కూర, హారిక అర్ర, శివాని రాచర్ల, అనూష కదర్ల, శిరీష కాకుమాను, రజిత గీనుగలకు నిరంజన్ ధన్యవాదాలు తెలిపారు. విద్యలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన నలుగురు విద్యార్ధలకు మాటాతో కలిసి మహిపతి ఫౌండేషన్ అవార్డులు ప్రధానం చేసింది. రాకేష్ కంజుల, ఆదిత్య తుర్లపాటిలు కలిసి మాటా-2016 చారిటీ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మనమాటా-మనఊరు పేరుతో మారుమూల గ్రామాల్లో వసతులు కల్పించేందుకు మాటా నడుంబిగించింది. జీడికల్లు జెడ్ పీపీఎస్ఎస్, లింగాల ఘాన్ పూర్ మండలాల్లో స్కూళ్లకు మౌలిక వసతులను కల్పించింది. ఈ సందర్భంగా 2017 బోర్డు మెంబర్లు ప్రెసిడెంట్: నిరంజన్ అల్లంనేని, ఉపాధ్యక్షుడు: సక్రూ నాయక్, ప్రధాన కార్యదర్శి: శ్రీనివాస్ గడ్డం, జాయిట్ సెక్రటరీ: రాజా ముదిగంటి, ట్రెజరర్: రమేష్ కోమాకుల తదితరులను ప్రేక్షకులకు మాటా ప్రస్తుత చైర్మన్ మహేందర్ గింగువా పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి మహిపతి ఫౌండేషన్ చైర్మన్ నాగేందర్ మహిపతి, హిందూ టెంపుల్ ఆఫ్ మిన్నెసోటా చైర్మన్ అక్షయ పండా, తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిత చిమటలు హాజరయ్యారు. వేడుకలు విజయవంతకావడానికి కృషి చేసిన మాటా బోర్డు ఉపాధ్యక్షులు నిరంజన్ అల్లంనేని, జనరల్ సెక్రటరీ రాకేష్ కంజుల, జాయింట్ సెక్రటరీ సక్రూ నాయక్, ట్రెజరర్ బుచ్చిరెడ్డి ముదిరెడ్డి, బోర్డు మెంబర్లు రమేశ్ కోమాకుల, రాజశేఖర్ బాచిగారి, సారథి తాళ్ల, శ్రీనివాస్ గడ్డం, యుగంధర్ పట్టూరి, నాగేందర్ నెళ్లా, రాజా ముదిగంటి, భవానీ రాం చెప్పుకూరి, రాజ్ కుమార్ కౌకోటి, అశ్విని గునుగంటి, శ్రీనివాస్ బాచిగారి, శివాని రాచర్ల, మాలతి కూర, అనుష కాదర్ల, కవిత కపిడి, ఆదిత్య తుర్లపాటి, శ్రీపాద్ దేవరాజు, అమర్ చిన్నోల, రవి భీమ, మురళి లక్కరాజులను మాటా బోర్డు చైర్మన్ మహేందర్ గింగువా అభినందించారు. -
గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే
-
న్యూజిలాండ్లో బతుకమ్మ
హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగ న్యూజిలాం డ్లో ఘనంగా జరిగింది. తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ, న్యూజిలాండ్ తెలంగాణ సంఘం ఆదివారం ఆక్లాండ్ సిటీలో సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మలను పేర్చే కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కవిత పాడిన బతుకమ్మ పాటలకు వారంతా కోరస్ ఇచ్చారు. కవిత ఆక్లాండ్కు రావడం సంతోషంగా ఉందని పలువురు ప్రవాస తెలంగాణ మహిళలు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూజిలాండ్ తెలంగాణ సంఘం అధ్యక్షుడు కల్యాణ్రావు కానుగంటి, ప్రధాన కార్యదర్శి దయాకర్ బచ్చు, కోశాధికారి దయానంద్ కటకం తదితరులు పాల్గొన్నారు. -
గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే
ట్యాంక్బండ్పై మిన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురం సాక్షి, హైదరాబాద్: హుస్సేన్సాగర్ తీరాన సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్ని అంటింది. ట్యాంక్బండ్పై తెలంగాణ సంస్కృతీ వైభవం ఘనంగా ఆవిష్కృతమైంది. తీరొక్క పూల పండుగ చివరి రోజైన ఆదివా రం ఆడపడుచులు బతుకమ్మ ఆడి పులకించి పోయారు. వర్షంలోనూ ఉత్సాహంగా గౌరీదేవిని అర్చించారు. ఇరవై ఐదు వేల మందికి పైగా మహిళలు దారి పొడవునా బతుకమ్మలు చేతబట్టి ట్యాంక్బండ్పైకి వరుసకట్టగా... రహదారులు పూదారులై... సంప్రదాయ సిరి విరిసి భాగ్యనగరి పరవశించింది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గౌరీదేవిని.. సద్దులతో సాగర ఒడికి చేర్చారు. ‘మాయమ్మ.. శ్రీదేవి పోయిరావమ్మా’ అంటూ సాగనంపారు. జీహెచ్ఎంసీ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చే శారు. హుస్సేన్సాగర్లో బోట్లపై నుంచి పేలిన బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు అలరించాయి. అచ్చతెలుగు సంప్రదాయ దుస్తుల్లో విదేశీ మహిళలు బతుకమ్మ ఆడిపాడారు. నంబర్ వన్ పండుగ...: బతుకమ్మ సంబరాలకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తదితరులు హాజరయ్యారు. ప్రపంచ నంబర్ వన్ పండుగగా తెలంగాణ బతుకమ్మ ఎదుగుతోందని నాయిని అన్నారు. అమెరికా, దుబాయ్, మలేసియా, ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐలు సైతం సంబరాలను వైభవంగా నిర్వహిస్తూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారన్నారు. ప్రతిష్ట పెరిగింది: హరీశ్ మరోవైపు కూకట్పల్లిలో బతుకమ్మ వేడుక వైభవంగా జరిగింది. ఆటపాటల అనంతరం ఐడీఎల్ వద్ద నియోజకవర్గ స్థారుు బతుకమ్మ పోటీలను స్థానిక శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గుజరాతీలు, మళయాళీలు, తెలంగాణ మహిళలు దాండియా, ఓనం, బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. భారీ బతుకమ్మల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి టి.హరీశ్రావు మాట్లాడుతూ... బతుకమ్మతో తెలంగాణ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి వల్ల పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలు, పెట్టుబడిదారులు అందరూ నగరం ైవె పే మొగ్గు చూపుతున్నారన్నారు. ఇక్కడ కృత్రిమ బతుకమ్మలుంటాయనుకున్నానని.. కానీ పూర్తిగా పూలతో పేర్చిన బతుకమ్మలు ఇంతపెద్ద స్థారుులో కనిపిస్తుంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బహుజన బతుకమ్మను కాపాడుకుందాం
యాదగిరిగుట్ట : రాష్ట్రంలో పెత్తందార్ల పాలనకు స్వస్తి పలికి బహుజన బతుకమ్మను కాపాడుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆదివారం మండలంలోని చొల్లేరులో చివరి రోజు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే తీరోక్క పూల జాతర బతుకమ్మ అని అన్నారు. వలసలు ఆగి పోవాలంటే.. కరువు వెనక్కి వస్తేనే బతుకమ్మను కాపాడుకున్నట్లని తెలిపారు. శ్రమజీవుల నోటిలో నిత్యం వెలువడే ఉయ్యాల పాటలు ఉండాలంటే బహుళ జాతి పరిశ్రమలను తరిమికొట్టి బతుకమ్మ ప్రత్యేకతను ప్రజలకు లె లియపరచాలని కోరారు. బతుకమ్మ సాక్షిగా ప్రతి మహిళా అభ్యున్నతి సాధించాలన్నారు. ఏడాది ఒక్క సారి మహిళలంతా ఒకే చోట చేరి పాటలు పాడుతూ, ప్రకృతి దేవతను పూజించడం గొప్ప సంస్కృతి తెలంగాణ మహిళలకే దక్కిందన్నారు. ఈ వేడుకల్లో పీస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కొక్కలకొండ నిమ్మయ్య ఉన్నారు. -
బతుకమ్మకు గిన్నిస్ రికార్డు!
-
బతుకమ్మకు గిన్నిస్ రికార్డు!
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అంతర్జాతీయ గుర్తింపు • హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ మహా ప్రదర్శ • ఒకే సమయంలో బతుకమ్మ ఆడిన 9,292 మంది మహిళలు సాక్షి, హైదరాబాద్: వర్షం కురిసి వెలిసిన ఆహ్లాదకర వాతావరణం.. వెలుగులు విరజిమ్మే అందమైన నిలువెత్తు పూల గోపురం.. దాని చుట్టూ వేలాది మంది మహిళలు.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలతో ఆటలు. ఒకవైపు ఆనందోత్సాహాలు, మరోవైపు ఉత్కంఠ భరిత క్షణాలు.. తెలంగాణ సాంస్కృతిక వైభవమైన బతుకమ్మ మహా ప్రదర్శన దృశ్యమిది. వేలాది మంది మహిళలు పాల్గొన్న ఈ బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవం గిన్నిస్బుక్లో సగర్వంగా చోటు దక్కించుకుంది. శనివారం లాల్బహదూర్ స్టేడియంలో వేలాదిమంది మహిళలు బతుకమ్మ ఆడుతుండగానే.. ఈ ప్రదర్శన గిన్నిస్బుక్ రికార్డ్స్కు అర్హత సాధించినట్లు పరిశీలకులు కుమరన్, జయసింహా ప్రకటించారు. 12 వేల మందికిపైగా మహిళలు... రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ మహా ప్రదర్శనకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 12 వేలమంది మహిళలు హాజరయ్యారు. స్టేడియం మధ్యలో 20 అడుగుల ఎత్తయిన బతుకమ్మను తంగేడు, బంతి, గునుగు వంటి తీరొక్క పూలతో తీర్చిదిద్దారు. దానిచుట్టూ చిన్నచిన్న బతుకమ్మలను పెట్టారు. వాటి చుట్టూ 35 వరుసల్లో సుమారు 10 వేలమంది మహిళలు బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలతో ఈ వేడుకలో పాల్గొన్నారు. దీంతో స్టేడియం అంతా సందడి వాతావరణం నెలకొంది. ఒకవైపు నేలపై రంగు రంగుల పూలతో వెలసిన ఇంద్రధనస్సులు, మరోవైపు నింగిలో హరివిల్లులై విరబూసిన మతాబులు ఉత్సవాన్ని నయనానందకరం చేశాయి. సాయంత్రం నాలుగు గంటలకు పడిన వర్షం కారణంగా ఉత్సవానికి కాసేపు ఆటంకం కలిగినా.. తర్వాత మహిళలంతా మరింత ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ప్రతి దృశ్యాన్ని చిత్రీకరించేందుకు డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వేడుకలకు వచ్చిన మహిళల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్రెడ్డి, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డెరైక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రికార్డు ఇలా.... ఒకే రకమైన పాట, ఆటతో వేలాది మంది మహిళలు ఒకచోట చేరి జరుపుకొనే పండుగగా ఇప్పటివరకు కేరళలోని ఓనమ్ పండుగ ప్రపంచ రికార్డుగా ఉంది. 2015లో 5,211 మంది మహిళలు పాల్గొన్న ఓనమ్ గిన్నిస్బుక్లో నమోదైంది. బతుకమ్మకు అటువంటి రికార్డు అవసరమని భావించిన ప్రభుత్వం.. సాంస్కృతిక, పర్యాటక శాఖల సమన్వయంతో గిన్నిస్ రికార్డు కోసం ప్రణాళిక సిద్ధం చేసింది. శనివారం జరిగిన మహా ప్రదర్శనకు 12 వేల మంది హాజరుకాగా.. అందులో బతుకమ్మ ఆడేందుకు వచ్చిన 10,029 మంది మహిళలకు నిర్వాహకులు ట్యాగింగ్ చేశారు. అయితే వర్షం తదితరాలవల్ల కొంత మంది మధ్యలో బయటకు వెళ్లి రావడంతో.. బతుకమ్మ ఆడినవారు 9,292 మందిగా లెక్క తేల్చారు. దీంతో ఓనమ్ రికార్డును బతుకమ్మ అధిగమించింది. దాదాపు రెండు గంటల పాటు బతుకమ్మ ఆడినప్పటికీ ఎక్కువమంది ఆడిన సమయం 11.07 నిమిషాలను పరిగణనలోకి తీసుకున్నట్లు గిన్నిస్బుక్ పరిశీలకులు తెలిపారు. సెలబ్రిటీల తళుకులు.. వేలాది మంది మహిళలతో నిర్వహించిన బతుకమ్మ మహా ప్రదర్శనలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, క్రీడాకారిణి సానియా మీర్జా, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, మిస్ ఇండియా క్రౌన్ రష్మి ఠాకూర్, పూనమ్కౌర్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక పలు దేశాల నుంచి వచ్చిన 40 మంది మహిళలు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రయత్నం ఫలించింది బతుకమ్మ పండుగకు ఉదాత్తమమైన చరిత్ర, లక్ష్యం ఉన్నాయి. ఇటువంటి గొప్ప సంస్కృతిని ప్రపంచానికి చాటాలనే మా ప్రయత్నం ఫలించింది. - బుర్రా వెంకటేశం,సాంస్కృతికశాఖ కార్యదర్శి మహిళా శక్తికి కృతజ్ఞతలు వర్షం వచ్చినా మహిళలు వెనక్కి తగ్గకుండా ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిళా శక్తికి కృతజ్ఞతలు. - రామ్మోహన్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ మహిళలకు గర్వకారణం ప్రపంచంలో పూల(బతుకమ్మ)కు పూజచేసే సంస్కృతి తెలంగాణలో మినహా మరెక్కడా లేదు. ఈ రికార్డు తెలంగాణ మహిళలందరికీ గర్వకార ణం. - స్వామిగౌడ్, శాసన మండలి చైర్మన్ బతుకమ్మే స్ఫూర్తి నాడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి, నేడు ప్రపంచ గుర్తింపు లభించడానికీ బతుకమ్మే కారణమైంది. ప్రదర్శనలో పాల్గొన్న మహిళలందరికీ అభినందనలు. - చందూలాల్, పర్యాటకశాఖ మంత్రి చాలా సంతోషంగా ఉంది బతుకమ్మకు గిన్నిస్ బుక్లో స్థానం లభించ డం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా బతుకమ్మ ఆడాలనే ఇక్కడికి వచ్చా. - సానియా మీర్జా, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ బతుకమ్మకు మరింత కీర్తి తెలంగాణ బతుకమ్మకు గిన్నిస్బుక్లో చోటు దక్కడం మరింత కీర్తిని పెంచింది. కేరళలోని ఓనమ్ పండుగను మించి తెలంగాణలో బతుకమ్మ పండుగ జరగడం గర్వకారణం. - నాయిని నర్సింహారెడ్డి, హోంమంత్రి -
అందరి బతుకమ్మ
తెలంగాణ జనసామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతుకమ్మ. అంటే ‘జీవించు - బ్రతికించు’ అని అర్థం. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపిణిగా ఆరాధించి అటు శక్తితత్వాన్ని, ఇటు మాతృదేవతారాధనను వారు స్థిరీకరించారు. భట్టు నరసింహకవి రచించిన ఈ పాటే ఈ కథకు, బతుకమ్మ పేరుకు ఆధారంగా నిలిచింది. ‘ధరచోళదేశమున ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యరో ఉయ్యాలో అతివ సత్యవతి ఉయ్యాలో’ ధర్మాంగదుడనే చోళరాజు, సత్యవతి దంపతులు ఎన్నో నోములు నోచి కుమారులను కన్నారు. కాని యుద్ధంలో ఏదో కారణంతో వారంతా చనిపోయారు. సత్యవతి పూజలకు సంతోషించిన లక్ష్మీదేవి తానే ఆమెకు కూతురుగా పుట్టిందట. ఆ బిడ్డను ఆశీర్వదించడానికి దేవాదిదేవతలు, మహర్షులు వచ్చి ... ‘బతుకగనె ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో శ్రీలక్ష్మీదేవియు ఉయ్యాలో సృష్టి బ్రతుకమ్మాయె ఉయ్యాలో...’ అని ఆమెకు ‘బతుకమ్మ’ అనే నామకరణం చేశారని ఈ జానపద గాథ తెలుపుతుంది. ‘శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశురాణివై పరగలక్ష్మీవయ్యా గౌరమ్మ భార్యవైతివి హరికినీ గౌరమ్మ’ అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియజేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం. మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు సాగే బతుకమ్మ ఆరాధన ఎంతో విశిష్టమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చే పూలు మళ్లీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడినుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి అన్న ఆధ్యాత్మ, తాత్విక సందేశం ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకదానిపై ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అయినట్లే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసిమెలిసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం కన్పిస్తుంది. దుసరిచెట్టు తీగలతో అల్లిన శిబ్బి - శిబ్బెం లేదా తాంబాళంలో అడుగున గుమ్మడి, ఆనపు, మోదుగ వంటి పెద్ద ఆకులను ఉపయోగించి కింది పీఠంలా తయారుచేస్తారు. ఆ పీఠంపై వర్తులాకారంగా ఈ కాలంలో దొరికే గుమ్మడి, తంగెడి, గునుగు, గోరింట, గడ్డిపూలు, కలువ, కట్ల, బంతి, బీర, పొట్ల, రుద్రాక్ష, చేమంతి, నీలంకట్ల, పారిజాత, పొన్న, మందార, మల్లె, మొల్ల, గుల్మాల పూలతో మెట్లుమెట్లుగా పేర్చి అందంగా తీర్చిదిద్దుతారు. మొత్తం బతుకమ్మపైన పసుపుముద్దను గౌరీదేవిగా పై స్థానంలో నిల్పుతారు. ఈ మొత్తం దృశ్యం మేరుప్రస్థ శ్రీచక్రంలాగా ఉంటుంది. మహాలయ అమావాస్య బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’, చిన్న బతుకమ్మ అని పిలుస్తారు. చివరిరోజైన సద్దుల బతుకమ్మకు ఐదు రకాల సద్దులు పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడితో నైవేద్యం చేసి సమర్పిస్తారు. రకరకాల బతుకమ్మ పాటలతో నృత్యగీతాలాపన కొనసాగుతుంది. ఆటలు పూర్తయ్యాక కొత్త సిబ్బి పాత సిబ్బి అంటూ సద్దులను పంచుకొని తింటారు. బతుకమ్మ ఉత్సవంలో ఆటపాటలకు చాలా ప్రాధాన్యం ఉంది. ‘బతుకమ్మ ఆట’ అని ఈ నృత్యానికి పేరు. గ్రామాల్లో ఏ ఉత్సవమైనా, ఏ ఊరేగింపు అయినా ‘బతుకమ్మ ఆట’ (నృత్యం) చేస్తూ ఆ సందర్భానికి అనుగుణంగా పాడుతారు. అంతగా చొచ్చుకుపోయింది ఈ ఆట - పాట. ఈ రోజున ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని ముగిస్తారు. శ్రీ మూర్తి అయిన అమ్మవారిని సాటి స్త్రీ మూర్తులే ఆరాధించే ఈ పండుగలో స్త్రీల కళా నైపుణ్యం, సహ జీవన తత్వం, ప్రకృతి తాదాత్మ్యం కన్పిస్తాయి. అందరినీ బతుకమనీ, అందరికీ బతుకునివ్వమనీ కోరుకొనే ఈ మహోత్సవాన్ని అందరూ జరుపుకోవాలి. అప్పుడే అందరి బతుకమ్మ అవుతుంది. - డా॥పి. భాస్కరయోగి విదేశీయులనూ అలరిస్తున్న బతుకమ్మ సాంస్కృతిక వైభవం -
ప్రపంచ దేశాల్లో బతుకమ్మకు గుర్తింపు
హాలియా: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన బతుకమ్మకు నేడు ప్రపంచ దేశాల్లో గుర్తింపు లభించిందని టీఆర్ఎస్ నియాజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మయ్య అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా శనివారం హాలియా రామాలయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు బతుకమ్మను పలు దేశాల్లో నిర్వహించడమే కాకుండా బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని కొనియాడారు. బతుకమ్మకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ గుర్తింపు రావడం హర్షణీయమన్నారు. అనంతరం పలువురు విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ఆడపడుచులు బతుకమ్మలతో రామాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎం.సి కోటిరెడ్డి, మండలాధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, అల్లి పెద్దిరాజు, ఆలయ కమిటీ ఛైర్మన్ కాకునూరి నారాయణ, జాగృతి నియోజకవర్గ కన్వీనర్ జానపాటి నాగరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ పాంపాటి శ్రీనివాస్ మండలాధ్యక్షుడు రవినాయక్, తిరుమలయ్య, లలిత, కల్యాణి నాయకులు వర్రా వెంకట్రెడ్డి, కోనాల శివయ్య, సురభి రాంబాబు, పోషం శ్రీనివాస్గౌడ్, ఎన్నమల్ల సత్యం, అంజియాదవ్, గుర్రం సత్యనారాయణరెడ్డి, యడవల్లి రాములు, కంచుకొమ్ముల నర్సింహ, మధుచారి పాల్గొన్నారు. -
సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట ప్రపంచానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి సూర్యాపేట పట్టణంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో హాజరై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారన్నారు. రంగురంగుల పూలలాగా రాష్ట్రంలోని ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా ప్రతి పండుగను కూడా ఐక్యంగా ఉండి జరుపుకోవాలన్నారు. సూర్యాపేటలో ఎప్పుడైనా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని..ఈసారి అంతకంటే ఘనంగా జరుపుకున్నామన్నారు. మరో మూడు రోజుల్లో సూర్యాపేట జిల్లాగా మారనుందని తెలిపారు. ఎనిమిది రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు బతుకమ్మలను పేర్చుకొని వచ్చి ఆటలు ఆడారు. ఈ సందర్భంగా ప్రతిరోజు బతుకమ్మ ఆడేందుకు వచ్చిన వారికి ఇద్దరిని ఎంపిక చేశారు. వారికి మంత్రి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. టీఎస్యుటీఎఫ్కు ప్రథమ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాష్రెడ్డి, ఆర్డీఓ సి.నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, డీఎస్పీ సునితామోహన్, తహసీల్దార్ మహమూద్అలీ, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, నాయకులు గండూరి ప్రకాష్, నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఆకుల లవకుశ, ఉప్పల ఆనంద్, కక్కిరేణి నాగయ్యగౌడ్, షేక్ తాహేర్పాషా, మండాది గోవర్ధన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ పూల కోసం వెళ్లి..
వెంకటాపురం(వరంగల్): బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని జవహార్నగర్లో చోటు చేసుకుంది. స్థానికుడైన కుందె మల్లయ్య(42) ఇంట్లో బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకురావడం కోసం గండికుంట చెరువు వద్దకు పదకొండేళ్ల కుమారుడు నాగరాజుతో కలిసి వెళ్లాడు. చెరువులోకి దిగి పూలను కోస్తున్న క్రమంలో లోతు అంచనా వేయకపోవడం వల్ల మునిగిపోయాడు. ఆ సమయంలో కుమారుడు నాగరాజు కేకలు వేసినా సాయం చేసేందుకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో రాలేదు. దీంతో మల్లయ్య పూర్తిగా మునిగిపోయాడు. ఆయన కుమారుడు నాగరాజు ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు వెతకగా మల్లయ్య మృతదేహం లభించింది. మృతుడికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారని వెంకటాపురం ఎస్సై పోగుల శ్రీకాంత్ తెలిపారు. -
ఆడపిల్లలను రక్షించుకుందాం
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బతుకమ్మ స్ఫూర్తితో ఆడపిల్లలను రక్షించుకోవాలన్నారు. ప్రెస్క్లబ్లో బతుకమ్మ పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు. సోమాజీగూడలోని ప్రెస్క్లబ్ హైదరాబాద్లో శుక్రవారం తొలిసారిగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. సేవ్ గర్ల్ చైల్డ్( ఆడపిల్లలను రక్షిద్దాం) అనే సామాజిక అంశంతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు భావితరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మకు పూజలు చేసి, ఆడిపాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి, ఈటల జమున, సుశీల కోదండరామ్, శోభ, వెంకట్ మంతెన, భీమ్ రెడ్డి, గాయనీ మధుప్రియ, ప్రెస్క్లబ్ సెక్రటరీ శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి, ఈసీ మెంబర్స్ సరస్వతి రమ, యశోద, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు
ఎల్బీస్టేడియం, ట్యాంక్బండ్పై బతుకమ్మ వేడుకలు బతుకుమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఘాట్లు ఏర్పాట్లను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: నగరంలో మహా బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియం, ట్యాంక్ బండ్ లపై మహా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం ట్యాంక్ బండ్ పై ఉత్సవ ఏర్పాట్లను జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉత్సవ వాతావరణం కనిపించేలా విద్యుత్ దీపాలతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు. బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేకంగా కొలనులను ఏర్పాటుచేస్తున్నారు. ఈనెల 8న ఎల్బీస్టేడియంలో, 9న ట్యాంక్బండ్పై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు గాను 1060 మంది పారిశుధ్య కార్మికులు, 95 మంది ఎస్ఎఫ్ఏలతో కూడిన 11 బతుకమ్మ యాక్షన్ టీమ్లను ఏర్పాటు చేశారు. గిన్నిస్ రికార్డు సాధన లక్ష్యంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించే మహా బతుకమ్మతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. మహా బతుకమ్మకు నగరంలోని పదివేల మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరుకానున్నారు. ట్యాంక్బండ్తో పాటు సరూర్నగర్, ఐడీఎల్ చెరువు, హస్మత్పేట్ చెరువు, ప్రగతీనగర్ చెరువు, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, పల్లెచెరువు, పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహణకు విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక లైటింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని దాదాపు 100ప్రాంతాల్లో భారీ బతుకమ్మలను ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగ ఔనత్యాన్ని తెలిపే హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. నగరం వివిధ మతాలు, సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, నగర ఔనత్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కమిషనర్ నగరవాసులను సూచించారు. నిమజ్జనానికి ప్రత్యేక కొలనులు నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి గాను ప్రత్యేకంగా నిర్మించిన కొలనులను బతుకమ్మల నిమజ్జనానికి ఉపయోగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. హుస్సేన్సాగర్ జలవిహార్ సమీపంలోని నిమజ్జన కొలను వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మల నిమజ్జనానికి కొలనును స్వచ్ఛమైన నీటితో నింపాలని, కొలను చుట్టూ బతుకమ్మలు అడే విధంగా మైదానాన్ని చదును చేయడంతో పాటు లైటింగ్, మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, శంకరయ్య, చీఫ్ ఇంజనీర్ సుభాష్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు
-
KKR డిగ్రీ కాలేజ్లో బతుకమ్మ సంబరాలు
-
1500 మందితో రిహార్సల్స్
సాక్షి,సిటీబ్యూరో: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం ఎల్బీస్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. గురువారం 1500 మంది మహిళలు బతుకమ్మ ఆడి రిహార్సల్స్ నిర్వహించారు. ఓనం తరహాలో ఒకే చోట 10వేల మంది మహిళలతో బతుకమ్మ ఆడించి గిన్నీస్ బుక్లో చోటు సంపాదించాలని నిర్ణయించారు. 9న సద్దుల బతుకమ్మ సందర్భంగా 10 వేలు, అంతకంటే ఎక్కువ మంది మహిళలను ఒక్కచోట చేర్చాలని పర్యాటక, సాంస్కృతిక శాఖలు నిర్ణయించాయి. టీఎస్టీడీసీ ఎండీ క్రిస్టీనా జడ్ ఛోంగ్తూ, అధికారులు దినకరబాబు, సాంస్కృతికడైరెక్టర్ మామిడి హరికృష్ణ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మహా బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియం, ట్యాంక్ బండ్ లపై మహా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం ట్యాంక్ బండ్ పై ఉత్సవ ఏర్పాట్లను జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉత్సవ వాతావరణం కనిపించేలా విద్యుత్ దీపాలతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు. బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేకంగా కొలనులను ఏర్పాటుచేస్తున్నారు. ఈనెల 8న ఎల్బీస్టేడియంలో, 9న ట్యాంక్బండ్పై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు గాను 1060 మంది పారిశుధ్య కార్మికులు, 95 మంది ఎస్ఎఫ్ఏలతో కూడిన 11 బతుకమ్మ యాక్షన్ టీమ్లను ఏర్పాటు చేశారు. గిన్నీస్ రికార్డు సాధన లక్ష్యంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించే మహా బతుకమ్మతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. మహా బతుకమ్మకు నగరంలోని పదివేల మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరుకానున్నారు. ట్యాంక్బండ్తో పాటు సరూర్నగర్, ఐడీఎల్ చెరువు, హస్మత్పేట్ చెరువు, ప్రగతీనగర్ చెరువు, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, పల్లెచెరువు, పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక లైటింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని దాదాపు 100ప్రాంతాల్లో భారీ బతుకమ్మలను ఏర్పాటు చేశా>రు. బతుకమ్మ పండుగ ఔనత్యాన్ని తెలిపే హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. నగరం వివిధ మతాలు, సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, నగర ఔనత్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కమిషనర్ నగరవాసులను సూచించారు. నిమజ్జనానికి ప్రత్యేక కొలనులు నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి గాను ప్రత్యేకంగా నిర్మించిన కొలనులను బతుకమ్మల నిమజ్జనానికి ఉపయోగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ జలవిహార్ సమీపంలోని నిమజ్జన కొలను వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మల నిమజ్జనానికి కొలనును స్వచ్ఛమైన నీటితో నింపాలని, కొలను చుట్టూ బతుకమ్మలు అడే విధంగా మైదానాన్ని చదును చేయడంతో పాటు లైటింగ్, మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, శంకరయ్య, చీఫ్ ఇంజనీర్ సుభాష్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ కవిత సొత్తు కాదు: శారద
► సంబురాల ధనంతో ఆత్మహత్యలు నివారించవచ్చు ► మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద వనపర్తిటౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ సంబురాల నిర్వహణకు గ్రామ స్థాయిలోని సర్పంచ్లకు నిధులు కేటాయించి ఉత్సవాలు నిర్వహిస్తే బాగుటుందని, బతుకమ్మ కవిత సొత్తైనట్లు నిధులన్నీ ప్రభుత్వం తెలంగాణ జాగృతికి కేటాయించడం అనైతికమని మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద అసహనం వ్యక్తం చేశారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం మహబూబ్నగర్ జిల్లా వనపర్తికి వచ్చిన ఆమె ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ ఉత్సవాలు జాతి సంస్కృతికి నిదర్శనమని, కవితే ప్రామాణికంగా జరగడం బాధాకరమన్నారు. జిల్లాల ఏర్పాటు మంచిదైనప్పటికీ ప్రభుత్వం సంబురాలు చేయాల్సిన అవసరం లేదని, మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుంటే సంబురాలు జరుపుకునేందుకు ఖర్చుపెట్టిన ప్రజాధనం రైతుల సంక్షేమానికి వినియోగించి ఉంటే రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు. -
మిస్ ప్లానెట్ సందడి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ బతుకు పండుగ ‘బతుకమ్మ’ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జాహ్నవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ.. గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వేడుకల్లో మిస్ ప్లానెట్ ఇండియా రష్మీ ఠాగూర్ పాల్గొని బతుకమ్మ ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో జాహ్నవి విద్యాసంస్థల చైర్మన్ ఎ.పరమేశ్వర్, కార్పొరేటర్లు వి.శ్రీనివాస్రెడ్డి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
టీపీఏడీ బతుకమ్మ సంబరాలకు భారీ ఏర్పాట్లు
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో 2016 బతుకమ్మ, దసరా సంబరాల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా అక్టోబర్ 8న నిర్వహించే ఈ వేడుకలకు సుమారు 10 వేల మంది హాజరౌతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ వెలుపల నిర్వహించే అత్యంత భారీ బతుకమ్మ వేడుకలు కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్రిస్కోలోని డా. పెప్పర్ ఎరినా వేదికగా జరిగే ఈ వేడుకలకు తెలుగు ఎన్ఆర్ఐల నుంచి మంచి స్పందన వస్తోందని టీపీడీఏ వెల్లడించింది. ఏటీఏ, టీఏటీఏ, ఎన్ఏటీఏ, టీఏఎన్ఏ, ఎన్ఏటీఎస్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, టీఏఎన్టీఈఎక్స్, ఐఏఎన్టీ, టీఈఏ, మనబడి లాంటి సంఘాలు ఈ వేడుకలకు పూర్తి మద్దతు తెలిపాయి. వేడుకలకు హాజరయ్యే భారీ సమూహానికి సౌకర్యంగా ఉండటం కోసం వేదిక వద్ద భారీ ఏర్పాట్లు చేసినట్లు టీపీడీఏ తెలిపింది. ఒకేసారి 1500 మంది మహిళలు బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు చేయడం విశేషం. సంబరాలను వీక్షించడానికి భారీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం నుంచి బతుకమ్మ, జమ్మిపూజ, మ్యూజిక్ బొనాంజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రాశీఖన్నా, రెజీనా, గీతా మాధురి, సాకేత్, ఇషా రబ్బా, షామిలి, నరేంద్ర లాంటి టాలీవుడ్ ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అలాగే తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే రోజా, గరికపాటి రామ్మోహన్ రావ్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం వేడుకలకు హాజరౌతారని నిర్వాహకులు వెల్లడించారు. -
బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరణ
సిద్దిపేట జోన్: బుధవారం మంత్రి హరీశ్రావు స్వగృహంలో బుధవారం జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పాటల సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మరుపల్లి శ్రీనివాస్గౌడ్, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ శ్రీధర్రావు మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత తెలంగాణ జాగృతికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి వ్యక్తిగత సహాయకులు రాంచందర్రావు, ఎర్రవల్లి సర్పంచ్ బాల్రాజు, గుర్రాలగొంది సర్పంచ్ ఆంజనేయులు జాగృతి నాయకులు సూరి, వవన్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాంప్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో బుధవారం బతుకమ్మ ఆరో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, ఎంపీ కవిత పాల్గొన్నారు. కవిత బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఉత్తేజపరిచారు. బతుకమ్మ పాటలతో క్యాంపు ఆఫీస్ మర్మోగిపోతోంది. -
బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు
కవాడిగూడ: తెలంగాణ సంసృ్కతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ అంతర్జాతీయస్థా్ధయిలో గుర్తింపు పొందుతుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం రాత్రి ట్యాంక్బండ్పై బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలందరూ కులమతాలకు తావు లేకుండా పండుగ జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఎమ్యెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళలు సంప్రదాయాలను కొనసాగిస్తు భవిష్యత్ తరాలకు సంసృ్కతిని అందించటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప్పల శారద, నిర్మల, చాయదేవి, సరళదేవి, భారతి, కళావతి -
అమెరికాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కవిత
రాయికల్: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అమెరికా వంటి అగ్రదేశాల్లో సైతం బతుకమ్మ పండగ నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అమెరికాలోని వివిధ స్టేట్స్కు చెందిన సుమారు రెండు వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని కవితతో కలిసి కోలాటాలు ఆడారు. కార్యక్రమంలో భారత రాయబార కౌన్సిల్ జనరల్ వెంకటేశం, అశోక్, తెలంగాణ జాగృతి అమెరికా అధ్యక్షుడు బండారి శ్రీధర్, సభ్యులు సతీశ్, మురళి, సత్యపాల్, నరేశ్, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు విజయ్, భాస్కర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బతుకమ్మ సంబరాలు
చేగూరు(కొత్తూరు): మండల పరిధిలోని చేగూరులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు స్వయంగా వివిధ రకాల పూలతో అందంగా తయారు చేసిన బతుకమ్మలకు ఉపాధ్యాయులు పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను ఆట పాటల అనంతరం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బతుకమ్మ విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం కిష్టాచారి, రాజయ్య, నయూమ్, రవీందర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
చిత్రాల పువ్వమ్మ చిరకాలం బతుకమ్మ
బ్రసెల్స్, ఇంగ్లాండ్... ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే పూల పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని దేశాలకు కేవలం ఆ ఫ్లవర్ ఫెస్టివల్స్ కారణంగానే ప్రాచుర్యం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అయితే వీటన్నింటినీ మించింది మన బతుకమ్మ. ప్రకృతి సౌందర్యానికి పట్టం గట్టే అద్భుతమైన ఈ వేడుక విశిష్టతను విశ్వవ్యాప్తం చేసే కృషిలో భాగంగా తెలంగాణ చిత్రకారుల సంఘం రవీంద్రభారతిలో బతుకమ్మ చిత్రాల ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. – ఎస్.సత్యబాబు ప్రకృతిలోని ప్రతి ఆకు, పువ్వు అందమైనదేనని నిరూపిస్తూ.. మనసులను పూల వనంలా మార్చేంత చక్కని సంప్రదాయం బతుకమ్మ పండుగ. ఈ సంబరాల్లో సున్నితత్వం ఉంది. సృజనాత్మకత ఉంది. అందం ఉంది. అంతకు మించిన ఆధ్యాత్మికత ఉంది. ఒక చిత్రకారుడి మనసు స్పందించడానికి అంతకన్నా కావాల్సిన ముడిసరుకు ఏముంది? అదే విషయాన్ని ఇలా పంచుకున్నారీ చిత్రకారులు... పాటకు పట్టం కట్టా... అమ్మమ్మ, నానమ్మ, అమ్మ బతుకమ్మలు చేస్తుంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. పండుగ సెలవుల్లో ముత్యాల పూలు అవీ ఇవీ తెచ్చి కలర్స్ వేస్తూ బతుకమ్మ తయారీలో నిమగ్నమయ్యే దానిని. బతుకమ్మ పేర్చడం ఇప్పటి వారికి చాలా మందికి తెలీదు. అందుకని ఆ పేర్చడం అనేదాన్ని వివరిస్తూ కూడా ఓ చిత్రం గీశాను. అలాగే ‘ఓరుగల్లు చూసి ఉయ్యాలో..’ పాటకు తగ్గట్టుగా నా పెయింటింగ్లో తెలంగాణలోని అన్ని ముఖ్యమైన ప్లేసెస్ వచ్చేలా చిత్రం గీశాను. – సరస్వతి, చిత్రకారిణి ఢిల్లీలో ఉన్నా మరువలేకున్నా... గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాం. మా స్వస్థలం చిట్యాల. మా ఊరిలో శివుడి గుడి ఉండేది. అక్కడే బతుకమ్మ ఆడేవాళ్లం. అప్పటి జ్ఞాపకాలు, ఆ సంతోషం మరిచిపోలేం. అవే స్ఫూర్తిగా బతుకమ్మ చిత్రాలు గీస్తున్నాను. గత కొంతకాలంగా దేశ రాజధానిలో సైతం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చాక గతేడాది ఢిల్లీలో 25 మంది మహిళలతో కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేశాం. తెలంగాణ భవన్లో కూడా తరచూ జరిగే సంబరాల్లో పాల్గొంటున్నాను. – అర్పితారెడ్డి. ఢిల్లీ చిత్రకారిణి కుంచెను కదిలిస్తుంది... ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాల్సిన పండుగ ఇది. తెలంగాణ ఆర్టిస్ట్, హైదరాబాద్ ఆర్టిస్ట్ ఫోరమ్ల ఆధ్వర్యంలో ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ‘ఫ్లవర్–ఫిమైన్ అండ్ బతుకమ్మ’ అనే థీమ్ ఎంచుకున్నాం. ప్రతి చిత్రకారుడికీ మహిళ, పుష్పం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. అసలు ఫైనార్ట్స్లో మదర్ అండ్ చైల్డ్తోనే పాఠం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో 40 మంది చిత్రకారులు బతుకమ్మ స్ఫూర్తిని ఎవరికి వారే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రాలను మేం ప్రదర్శిస్తున్నాం. – ఎం.వి.రమణారెడ్డి, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ -
ఒక్కేసి.. పువ్వేసి...
పరవశించే ప్రకృతి పరిమళాలు.. బతుకమ్మ పూలల్లో ఔషధ గుణాలు అందరికీ ఆరోగ్య ఫలాలు జోగిపేట: సంప్రదాయబద్దంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మది ప్రత్యేక స్థానం. పువ్వులు.. ఆకులు.. గౌరమ్మలు.. పసుపుకుంకుమలు.. ప్రకృతి ఒడిలో విరబూసే పూలు అందాన్ని, పరిమళాలను వెదజల్లడమే కాక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రతి పువ్వులో ఔషధాలు మెండుగా ఉన్నాయి. తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూలకు ఎంతో గొప్ప విశిష్టత ఉంది. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా కూడా బోలెడు ప్రయోజనాలున్నాయి. చెరువు నీటిలో ఉన్న మలినాలు ఔషధ గుణాలు కలిగిన పూలతో మటుమాయమై నీటి శుద్ధి జరుగుతుంది. ఇలా బతుకమ్మ ఆట, పాటలకే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ దోహద పడుతోంది. ఇదిలా ఉండగా..భక్తిశ్రద్ధలతో పూలు పేర్చి.. పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ.. మహిళలు ఇళ్లల్లో.. ఆలయాల్లో.. కూడళ్లలో.. రెండో రోజైన శనివారం అటుకుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. -
అద్భుతమైన పండుగ.. బతుకమ్మ
పర్వతగిరి : తెలంగాణలో అద్భుతమైన పం డుగ బతుకమ్మ అని శాసనసభ స్పీకర్ సిరి కొండ మధుసూదనాచారి అన్నారు. మండలం లోని చౌటపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన బతుకమ్మ సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాలుగా ఆంధ్ర పాలకులు తెలంగాణ పండుగలను కనుమరుగు చేసే కుట్ర పన్నారని అన్నారు. తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన సంస్కృతిని కాపాడేందుకు ప్రభుత్వం పండుగలను అధికారికం గా నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణ ఘ ట్టానికి వేదిక వరంగల్ బతుకమ్మ అన్నారు. రాష్ట్రంలో మొదటిసారి బతుకమ్మ పండుగ జ రుపుకున్న పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామానికి రావటం పూర్వజన్మ సుకృతమని అన్నారు. సామాజికవేత్త శాంతికృష్ణ పూర్తి ఆధారాలతో నిరూపిస్తే చౌటపల్లి గ్రామాన్ని బతుకమ్మ జన్మస్థలంగా అధికారికంగా ప్రకటించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎంపీ కవిత తర్వాత బతుకమ్మ విశిష్టత కోసం కృషి చేస్తున్న శాంతికృష్ణను ఎంపీ పసునూరి దయాకర్ అభినందించారు. వర్ధన్నపేట ఎమ్మేల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ చౌటపల్లిలో బతుకమ్మ ప్రాంగణం, శివాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాలకుర్తి ఎమ్మె ల్యే ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వంతో మాట్లాడి బతుకమ్మ జన్మ స్థలం గా చౌటపల్లి గ్రామాన్ని ఎంపిక చేసేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామ సర్పంచ్ వంగాల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో తెలంగాణ తల్లి రూపకర్త బీవీఆర్ చారి, అంతర్జాతీయ వ్యాఖ్యాత మగ్దుం మోహినోద్ది¯ŒS, ఎంపీపీలు రంగు రజితకుమార్, మార్నేని రవీందర్రావు, జడ్పీటీసీ మాదాసి శైలజా సు ధాకర్, కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, టీ ఆర్ఎస్ నాయకులు ఏడుదొడ్ల జితేందర్రెడ్డి, పల్లెపాటి శాంతిరత¯ŒSరావు, మేడిశెట్టి రాము లు, గోనె సంపత్, మాధవరావు, గోపాల్రావు, ఎంపీటీసీ మిట్టపల్లి పద్మ,దూజ పాల్గొన్నారు. -
బతుకమ్మ ఉత్సవాల ఘనత ఎంపీ కవితదే!
వినాయక్నగర్ : బంగారు బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణలో క్షేత్ర స్థాయిలోకి తీసు కెళ్లడమే గాక, వివిధ దేశాలకు తీసుకెళ్లి అక్కడ నిర్వహించడంతో ఎంపీ కవిత చరిత్రలో నిలిచిపోయారని టీఆర్స్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంతో పాటు, జిల్లా వాప్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంగారు ఉబతుకమ్మ సంబరాల్లో ప్రతి ఆడ పడుచూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, పలు మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షులు లక్ష్మినారాయణ భరద్వజ్, నగర అధ్యక్షులు కొళవి అనిల్ కుమార్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నలమాస శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షపతి, రవీందర్రెడ్డి, కుల్దీప్ కుమార్, గణేశ్, క్రాంతి, సాయి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బతుకుమ్మ సంబరాలు
-
8న బతుకమ్మ మహాప్రదర్శన
భారీ ఏర్పాట్లు చేయండి గిన్నిస్బుక్ రికార్డు సాధించాలి మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సంగారెడ్డి జోన్: బతుకమ్మ సంబరాల్లో భాగంగా అక్టోబర్ 8న అన్ని జిల్లాల్లో బతుకమ్మ çమహా ప్రదర్శనను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి ఆ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్తో కలిసి కలెక్టర్లు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ సంబరాలు శుక్రవారం మొదలైనట్టు చెప్పారు. 8వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఎనిమిది వేల మంది మహిళలతో బతుకమ్మ మహా ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనకు గిన్నిస్ బుక్లో స్థానం లభించేలా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు. మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహించి అందుకోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. హైదరాబాద్ తరహాలోనే జిల్లాల్లోనూ 8వ తేదీన మహా ప్రదర్శనను వెయ్యి మంది మహిళలకు తక్కువ కాకుండా నిర్వహించాలన్నారు. తెలంగాణలో పుట్టిన పూల పండగకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాలన్న ధ్రుడ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. 9న సద్దుల బతుకమ్మ నిర్వహణకు ఊరూరా ఏర్పాట్లు చేయాలన్నారు. నీటితో చెరువులు నిండినందున భారీ క్రేన్లు, లైటింగ్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇందుకోసం పాత జిల్లాలకు రూ.10 లక్షల చొప్పున, కొత్త జిల్లాలకు రూ.5 లక్షల చొప్పున నిధులు కలెక్టర్లకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మహా ప్రదర్శన, సద్దుల బతుకమ్మ, ఇతర సంబరాలు ఘనంగా నిర్వహించటంలో విశేషంగా కృషి చేసిన జిల్లాలకు నగదు పారితోషికం అందజేస్తామని వెల్లడించారు. మొదటి బహుమతి కింద రూ. 5 లక్షలు, రెండో బహుమతి కింద రూ.3 లక్షలు, మూడో బహుమతి కింద రూ.2 లక్షలు అందజేస్తామన్నారు. జిల్లా తరఫున కలెక్టర్ రోనాల్డ్రోస్, జేసీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 8, 9వ తేదీల్లో బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కలెక్టరేట్ నుంచి డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, ఐసీడీఎస్ పీడీ మోతె, సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్తో పాటు వివిధ శాఖల అధికారలు పాల్గొన్నారు. -
నవరత్నాల బతుకమ్మ
సాక్షి, సిటీబ్యూరో: అరుదైన సూక్ష్మ కళారూపాల తయారీలో ఇప్పటికే 26 ప్రపంచ రికార్డులు, నాలుగు జాతీయ రికార్డులు సాధించిన హస్తినాపూర్కు చెందిన ముంజంపల్లి విద్యాధరాచారి తాజాగా మరో అద్భుత కళారూపాన్ని సృష్టించాడు. బతుకమ్మ నవరాత్రులను పురస్కరించుకొని 166 నవరత్నాలు (కెంపులు, ముత్యాలు, పగడాలు, పచ్చలు, పుష్యరాగములు, వజ్రాలు, నీలములు, గోమేధికాలు, వైఢూర్యాలు) ఒదిగిన అతి చిన్న బంగారు బతుకమ్మ తయారు చేశారు. నవ రత్నాలతో బతుకమ్మ తయారు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి చిన్న బతుకమ్మ ఇది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవితకు ఈ బతుకమ్మ అంకితం ఇస్తున్నట్లు విద్యాధరాచారి చెప్పారు. -
బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట (నల్గొండ జిల్లా): యాదగిరిగుట్టలో జరిగిన బతుకమ్మ వేడకల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు తెలియజేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని ఆమె తెలిపారు. ఆత్మగౌరవం కాపాడుకునేందుకే ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించి అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్, జాగృతిసంస్థ ప్రతినిధులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.